Blogger Widgets

శుక్రవారం, అక్టోబర్ 31, 2008

అమ్మమ్మ ప్రశ్నలు -మనవరాలి జవాబులు. (జ)

శుక్రవారం, అక్టోబర్ 31, 2008


1. తల వున్నా కళ్లు లేనిధి ఏది ?
జ. గుండుసూది .
2. కన్ను ఉన్నా తల లేనిది ఏది ?
జ. సూది.
3. కాళ్ళు ఉన్నా పాదాలు లేనిది ఏది ?
జ. కుర్చీ.
4. అడుగులు ఉన్నా కాళ్ళు లేనిది ఏది ?
జ. గజం బద్ధ.
5. పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది ఏది ?
జ. పుస్తకం .
6. ఒక పిల్లి తన జీవితంలో విసిగివేసారి కుటుంబ బారం మోయలేక , చనిపోవాలని నిర్ణయించుకొని , కృష్ణా బ్యారేజిపైన నిలబడి , దేవుడిని ప్రార్దించింది . ఐతే అది ఏమని ప్రార్ధించింది ?
జ. మియ్యాం, మియ్యాం.
7. తొమ్మిది లో నుండి ఐదు తీసేస్తే ఎంత ?
జ. తొమ్మిది లో నుండి ఐదు తీసి - వేస్తే తొమ్మిదే కదా.
8. 1 నుండి 100 అంకెలలో ఎన్ని వొకట్లు వున్నాయి ?
జ. 21 ఒకట్లు వున్నాయి.
9. 1 నుండి 100 అంకెలలో మొత్తము 11 అంకెలు ఏమిటి?
జ. 1 నుండి 100 అంకెలలో మొత్తం 11 సున్నాలు ,( జీరోలు ) వున్నాయి.
10. తోటమాలి తోటవద్ద కు వెళ్లి ముందుగా ఏమి చేస్తాడు ?
జ. తోటమాలి తోటవద్దకు వెళ్లి ముందుగా లోపలికి పాదం మోపుతాడు. అదే కదాచేసేది .

" చెడపకురా చెడెదవు "

ఘోరి మహమద్ అనీక్ పర్యాయములు దేశముపై దండెత్తి ప్రజలకు హాని కలిగించేవాడు. ఒకసారి పృధ్వీరాజు పై దండెత్తగా అతడు ఘోరిని పట్టివేసాడు. కాని, అతని ప్రార్ధనను మన్నించి తిరిగి వదిలిపెట్టాడు. ఈ ఘోరీ తిరిగి ఆరు పర్యాయాలు పృద్వీరాజుపై దండెత్తి ఓడిపోయాడు. ఈ ఆరు పర్యాయములు పృధ్వీరాజు అతనిని క్షమించి వదిలాడు. కాని , ఏఢవసారి పృధ్వీరాజు యొక్క మామ సహాయంతో ఘోరీ తిరిగి దండెత్తి వచ్చాడు. ఈ సారి మాత్రం పృధ్వీరాజు ఓడిపోయాడు. ఆరు పర్యాయములు అతనిని క్షమించి వదిలి పెట్టిన పృధ్వీరాజు పై ఎంత కృతజ్ఞత ఉండాలి? కాని , కఠిన హృధయుడైన ఘోరీ కృతఘ్నతుడుగా మారిపోయాడు. ఏమిచేసాడో తెలుసా ................ ! పృధ్వీరాజు కళ్లు పొడిపించేసాడు ఘోరీ .
అసలు చాలాబాద కలిగించే విషయమే ................... ! కదండి.
సరే ఇక తరువాత ఏమైందంటే...................
ఒకనాడు పృధ్వీరాజు యొక్క మంత్రి ఘోరీ దగ్గరకు వచ్చి ఈ పృధ్వీరాజు సామాన్యుడు కాదు , అతడు శబ్దభేది బాగా తెలిసినవాడు. శబ్ధమునుబట్టి అంబును వదలగలడు. అతనికి కన్నులు లేవని అనుకుంటున్నావు. ఇది చాలా పొరపాటు. చర్మచక్షువులు లేవు కాని , అతనికి జ్ఞాన చక్షువులున్నవి . కావాలంటే ఋజువు చేయగలను" , అని చెప్పి చివరకు ఘోరీ మహమ్మదును ఒప్పించాడు . మరునాడు ఘోరీ మహమ్మదు దగ్గర ఒక గంటను పెట్టాడు. నూరు అడుగుల దూరంలో ప్రుద్వీరాజును కుర్చోపెట్టాడు . ఆ గంట కొట్టేటప్పటికి దాని శబ్ధమును బట్టి గ్రుడ్డివాడైన ప్రుద్వీరాజు అంభును వడిచాడు. ఆ గంట ముక్కలు ముక్కలైంది. ఆశ్చర్యకరంగా చూసాడు ఘోరీ . కాని , పృద్వీరాజుకు అతను మంత్రి ఏమైనా గుర్తులు చెప్పి ఉండవచ్చునని అనుమానించాడు. ఘోరీ మహమ్మదు మరొకసారి పెట్టాడు గంటను. పృద్వీరాజు తిరిగి దాన్నీముక్కలు చేసాడు. ఈ రకంగా చేస్తూ రాగా ఘోరీ కి అహంకారం ఎక్కువైపోయి. " కనులు మాత్రమే తీసి పోరపాటి చేశాను. ఇంక అతని ప్రాణమే తీయాలి " , అనుకున్నాడు. మరొకసారి పర్యాయం గంటకు ముందు తెచ్చి పెట్టాడు. పృద్వీరాజు భగవంతుని స్మరించాడు. ఉపకారికి అపకారం చేసే ఈ కృతఘ్నన్ని శిక్షించాలనే ఉద్దేశ్యముతో భగవంతుడు పృద్వీరాజు చేతిలో చేరాడు. అతడు బాణము విడిచేసరికి అది నేరుగా ఘోరీ కంఠములో గ్రుచ్చుకోన్నది. వెనువెంటనే ఘోరీ ప్రాణము విడిచాడు.
దైవ చింతన ఎంత సహాయ పడుతుందో చూసారా..................... ! ఆ సభలోనే పృద్వీరాజును చంపడానికి సిద్ధమైయుమ్దినాడు. ఘోరిమహమ్మదు. " చెడపకురా చెడెదవు " అన్నట్లు గా ఇతరులను చెడపటానికి మనం ప్రయత్నించి నప్పుడు దైవం మనలనే చెడుపుతాడు.

గురువారం, అక్టోబర్ 30, 2008

అమ్మమ్మ ప్రశ్నలు -మనవరాలి జవాబులు.

గురువారం, అక్టోబర్ 30, 2008

1. తల వున్నా కళ్లు లేనిధి ఏది ?
2. కన్ను ఉన్నా తల లేనిది ఏది ?
3. కాళ్ళు ఉన్నా పాదాలు లేనిది ఏది ?
4. అడుగులు ఉన్నా కాళ్ళు లేనిది ఏది ?
5. పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది ఏది ?
6. ఒక పిల్లి తన జీవితంలో విసిగివేసారి కుటుంబ బారం మోయలేక , చనిపోవాలని నిర్ణయించుకొని , కృష్ణా బ్యారేజిపైన నిలబడి , దేవుడిని ప్రార్దించింది . ఐతే అది ఏమని ప్రార్ధించింది ?
7. తొమ్మిది లో నుండి ఐదు తీసేస్తే ఎంత ?
8. 1 నుండి 100 అంకెలలో ఎన్ని వొకట్లు వున్నాయి ?
9. 1 నుండి 100 అంకెలలో మొత్తము 11 అంకెలు ఏమిటి?
10. తోటమాలి తోటవద్ద కు వెళ్లి ముందుగా ఏమి చేస్తాడు ?
ఇవి మా అమ్మమ్మ నన్ను అడిగిన ప్రశ్నలు . కానీ సమాదానాలు ఇప్పుడు చెప్పను తరువాత చెప్తా ముందు మీరుకూడా ట్రై చెయ్యండి.

మంగళవారం, అక్టోబర్ 28, 2008

.....డం......డాం....... డాం ...................డం .........

మంగళవారం, అక్టోబర్ 28, 2008

WISH YOU HAPPY DIWAALI . దీపావళి బాగా జరుపుకోండి. ఎంత సరదాగా ఉంటుందో అంటే ప్రమాదం గా వుంటుంది. చాలా జాగ్రతాగావుండాలి. నిప్పుతో చాలగాటాలు వద్దు. పెద్దలు మాటలు వినండి. పెద్దగా శబ్దం వచ్చేవి దయచేసి వాడవద్దు. అవి చెవులకు హాని చేస్తాయి. పిల్లలూ తొందరపడి మీరు టపాసులు పేల్చకండి పెద్దవాళ్ళు వచ్చి మీద్దర వున్నకా మీరు కాల్చండి.. టపాసులు దూరంగా . పెట్టుకొని వెలిగించండి. మీ పెద్దవాళ్ళు చెప్పిన విధం గా విని టపాసు పెలుకోంది. సంతోషంగా దీపావళి . జరుకోండి. ఓకే నా........................ WISH YOU HAPPY DIWAALI .
డాం.......డాం.......భూఉం ..................... భూఊఊఊఊఊఊఊమ్ ....................దాఆఆఆఆఆఆఆఆఆఅమ్ .

మీ ఇంట్లో దీపకాంతి తో .............??????

మీ ఇంట్లో కి ఏవైపు నుండైనా దీప కాంతి ప్రవేశిస్తూ వుంటుంది.ఎదురింటి దీపాల కాంతి, మీ ఇంటిలోకి ప్రక్కనో,వేనుకనో ఒక దేవాలయం గాని, మాట సంబందమైన మందిరారాలుకాని సహజంగానే వుంటాయి. వాటిలోని వెలిగించిన దీప కాంతి మీ ఇంట్లోకి ప్రవేశించ వచ్చు. ఎదురు గానో , వెనుకవైపున వీది లైట్లు సర్వసాదారణంగా నేడు ప్రతీ పట్నాలలోని పల్లెల్లోని ఉంటున్నాయి. ఆ లైట్లు కాంతి మీ ఇంట్లో కి ఏ దిశగా ప్రవేశిస్తే ఫలితాలు ఎలా వుంటాయో తెలుసుకోండి.
1. దేవుని గుడి, ప్రార్ధన మందిరాలలో నుండి వెలువడే దీప కాంతులు మీ ఇంట్లోకి ఏ వైపు నుండి ప్రవేశించినా కాస్త నష్టాలు వుంటాయి. వీధి వాకిలిలో నుండి మీ ఇంట్లోకి ప్రవేశిస్తే మరింత హాని. సాద్యమైనంత వరకు ఆ వెలుగు ఇంట్లోకి ప్రవేసించకుండా చూసుకోండి.
2. మీ చుట్టు ప్రక్కల ఏ దిసలోనైనా బ్రాహ్మణు ఇల్లు వుండి మీ ఇంటి దీపకాంతి వారి ఇంటిలోనికి ప్రవేసిన్చినట్లయితే మీ సిరి సంపదలు క్రమంగా వారి ఇంటికి చేరుతాయి.
౩. మీ ఇంట్లో వెలిగించిన దీపాలు తుర్పుముఖంగాను, ఉత్తరం దిసగాను ఉంచినా మీ ఇంట్లో శ్రీ లక్ష్మి దేవి సదా కాపురం ఉంటుంది.
4. ఇంట్లో పడమర దిశలో దీపం వెలిగించి వుంచిన , దక్షిణ డిస గా వుంచిన క్రమంగా సంపద క్షినించి పోతుంది.
5. మీ ఇంట్లో దీప కాంతి నాలుగు దిశలా ప్రవేశిస్తే మీ ఇల్లుసిరి తాండవిస్తుంది.
6. సంద్యా దీపం మొదలు ఉషోదయం వరకు ఏ ఇంట దీపం వెలుగుతుందో ఆ అష్ట ఐశ్వర్యములు పుష్కలంగా వుంటాయి.
7.సాయం సంద్యా సమయాలలో ఇంటి వెనుక గుమ్మనికెదురుగా వుండే తులసి కోట ముందు ప్రతీ రోజు దీపం వెలిగించి పెట్టినచో ఇంట్లో లక్ష్మి కాపురం ఉంటుంది.
8. ప్రతీ ఇంటా పూజా మందిరం ఉంటుంది. ఆ మంది రామ్ లో ఉదయం, సాయంత్రం దీపం వెలిగిస్తే . ఆ ఇంట సిరి సంపదలు వుంటాయి.
ఇవ్వన్నీ నాకు ఎలా తెలిసాయనుకుంటూన్నారా ? మా అమ్మ తో మా అమ్మమ్మ చెప్తే నేను విన్నా అవి మీకు చెప్పాలని పించి వెంటనే మీకు అందిస్తున్నాను. సింపుల్. .

శనివారం, అక్టోబర్ 25, 2008

శ్రీ లక్ష్మీ కటాక్ష రహస్యం !

శనివారం, అక్టోబర్ 25, 2008

అన్దరూ కోరుకొనే లక్ష్మి కొందరికే ఎందుకు దక్కుతుంది ? కొందరికి దక్కినట్టే దక్కి ఎందుకు జారిపోతుంది ? దీనికి అదృష్టదురద్రుస్తాలేనా కారణం లేదా వేరే కారణాలు వున్నాయా ?
శ్రీ మహాలక్ష్మి చూపులు ఎలావుంటాయంటే , దుర్మార్గుల విషయంలో అవి పరమ క్రూరంగా ఉంటాయట. అవే చూపులు తన భక్తులైన దీనులపై దయను కురిపిస్తాయట . దారిద్ర్యమనే అరణ్యాన్ని ఇట్టే దహించివేసి ఏంటో ఉదారంగా సంపదను అనుగాహిస్తాయట . ఓ తల్లీ, అలాంటి నీ చల్లనిచుపులతో నా దురద్రుస్టాన్ని పోగుట్టు అని ప్రార్ధిస్తాడు జగన్నాధ పండితరాయలు తన `లక్ష్మి కరునాలహరి'లో.
దీపావళి రోజు సముజ్వల దిపతోరనామద్య వైభవలక్ష్మిని నిలుపుకొని భక్తి శ్రద్దలతో పూజిమ్చుకొనె రోజు . అసలు దీపమే లక్ష్మి. చీకటినుంచి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం , అదే సంపద, జ్ఞానము సంపదా బిన్నమైనవి కావు. ఒకటి వుంటే రెండోది ఉన్నట్టే. ఇతరులను వంచించినచో, అవినీతి మార్గాలలోనో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే చాలను కుంటారు చాలామంది. అలాంటివారిని లక్ష్మి వరిమ్చిన్నట్టు కనిపించినా అది చంచలం . దయా, సేవాబావం, శ్రమ, వినయం, వివేకం ఉన్నచ్తే లక్ష్మి స్థిరంగా ఉంటంది. లక్ష్మీ కతాక్షసిద్ధిలోని అసలు రహస్యం ఇదే. లక్ష్మీదేవి-----ఆదిలక్ష్మీ, దైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అనే అష్టరుపాలలో ఉంటుందని మనకు తెలుసు. వీటిలో `విద్యాలక్ష్మి' అంటే, జ్ఞానం వివేకం వంటి సద్గునసంపద అని కుడా అర్ధం చేసుకోవాలి. అటువంటి లక్ష్మితత్వాన్ని అందరుసంపాదించాలి.మంచి మనసే లక్ష్మికి సేఫ్టీ లాకరు ! .
లక్ష్మి ఎక్కడవుంతుందని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా....................
శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే ................................
`అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నీనేమో నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి మొండు నీను చెప్పబోయే మాటలు వినండి - అమ్తూ.......... లక్ష్మి ఎవరెవరివద్ద ఉంటుందో, ఎవరివద్దవుండదో , వివరించాడు. లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలివి.
భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండదు. శంఖద్వని వినిపించని చోటా, తులసిని పూజించని చోట, శంఖరుని అర్చించని చోట , బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజనసత్కారాలు జరగని చోట , లక్ష్మి నివసించదు. ఇల్లు కలకలాడుతు లేని చోట , ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట , విష్ణువును ఆరాధించకుండా ఏకాదశి , జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.

హృదయోమ్లో పవిత్రత లోపించినా, ఇతరులను హింసింస్తున్నా. ఉత్తములను నిమ్దిస్తున్నా లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది. అనవసరం గా గడ్డిపరకలను తెమ్చినా, చట్లను కులగోట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది. నిరాసావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులు గా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెనుఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు..
శ్రీ హరి దివ్యచరిత్ర, గుణ గానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి వోరాజిల్లుతుంది.
ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలాకలగాదో చెప్పారు.
సంపద మన ఆదీనం లో ఉండాలి కాని, మనం సంపద ఆదీనం లో ఉండకుడదు . ఏకాస్త గర్వించిన, అహంకరిమ్చినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్ధము. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే లక్ష్మి కటాక్ష రహస్యం.....

శుక్రవారం, అక్టోబర్ 24, 2008

దీపావళి రోజు చేయవలసినవి .......!

శుక్రవారం, అక్టోబర్ 24, 2008

దీపావళి అంటే మన అందరికి చాలా ఇష్టం . ఐతే చాలామంది లో దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!
అని కాని దీపావళి కి చాలా విశిష్టత వుంది . దీపావళి పండుగ చేసుకునే విధానం కుడా వుంది . ఇవి చాలా మందికి తెలిదు. పూర్వపు పద్ధతులు మరచి పోయారు. రోజుకి స్వీట్స్ కొనుక్కొని వచ్చి వెరైటి వంటలు చేసుకొని , రాత్రి దీపాలు వెలిగించి టపాసు కాల్చుకొని ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నారు మనలో చాలామంది.
ఐతే మా అమ్మమ్మ పూర్వపు పద్దతు లు చెప్పింది అవి ఏమిటంటే :
నరకచతుర్దసిని ప్రేతచతుర్దసి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించే రోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తుదిజాములో నువ్వులనూనెతో తలంతుపోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలో నువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. . అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్ని జలవనరులలోకి గంగాదేవి రోజుల్లో
ప్రవేశిస్తుంది . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్ర్యం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట . నరక బాధలు తప్పుతాయ . చివరకు సన్యాసులు కుడా చేస్తారుట.
స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలం అరుణోదయం అంటారు . లోగా చెయ్యాలి.
స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ శ్లోకం పాటించాలి .
శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునః
అపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. నువ్వులనునే , ఉత్తరేను మొదలైనవి ప్రకృతితో మనకు ఎంత ముడిపది వున్నామో తెలుస్తుంది. ప్రక్రుతిసామరస్యంలో మనం జేవించాలని ఇందులో సందేశం. ఇందు వల్ల నరకంబయం అన్నది ఉంటే అది మన భావన ద్వారా ఆ స్థితికి చేరుకున్తామన్నామాట. స్వర్గనరకాలు మనస్సు నందు కల్గేవే. ఇది అంతా మనసుకి శిక్షణ ఇవ్వటమే.
స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తరపనాలు ఇవ్వాలి.
ఆ తరువాత ఈ శ్లోకం చదవాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ
ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే
మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః
దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట.
దీపదానం:
సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట .
దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
1) ఇంటిధ్వారం.
2) ధాన్యపుకొట్టు.
౩) బావి.
4) రావిచెట్టు.
5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.
ఉల్కాదానం:
యముడు దక్షినదిసగా ఉంటాడు. మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్ధాలు తినాలి.
లక్ష్మి పూజ :
దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్రాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడం ను "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పెల్చడంలోని అర్ధం ఇదే.
ఈ టపాసుల వల్ల వర్షాకాలంలో పుట్టిన ఎన్నో క్రిములు కీటకాలు ముక్తి ని పొందుతాయి. కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించేది అందుకే.
రోజూ సాయంకాల దీపం వెలిగించిశ్లొకం చదివి తే చాలామంచిధీ.
దీపం జ్యొతిః పరబ్రహ్మ,
దీపం జ్యోతి జనార్దనః
దీపేన హరతే పాపం
సంద్యాదీపం నమోస్తుతే,
సాయంత్రం సంద్యాదీపం వెలిగించీ ధానికి నమస్కారిచుట చాలాపున్యము. దీపం అంటే పరమాత్మ . దీపంకు నమస్కరించుట పరమాత్మకు నమస్కరించుటే అని అమ్మమ్మ చెప్పింది. సరే అమ్మమ్మ చెప్పినవి దీపావళి రోజు పాటిస్తారు కధూ ! మరి నేను ఉంటా మరి బాయ్ ................................
.

బుధవారం, అక్టోబర్ 22, 2008

జై జవాన్ ............జై కిసాన్...........!

బుధవారం, అక్టోబర్ 22, 2008

అరే ! ఏమిటిది అనుకుంటున్నారా ? ఏమి లేదండి ఈ రోజు మనం అందరు గుర్తు పెట్టుకోవలసిన రోజు.
అయ్యో ఏమిటి ఆలోచిస్తున్నారు ? ఈ రోజు మనం హాయిగా తింటున్నాము అతను లేకపొతే మనకు చాలాకష్టం. ఎవరనుకుంటున్నారా? మీరు ఎక్కవ ఆలోచించవద్దు . అతను ఎవరోకాదు దుక్కు దున్నీ, నీరు పెట్టి , నారు నాటి, పంటలు పండించే రైతు.
ఈ రోజు" రైతు దినోత్సవం "
భారతీయ రైతులకు అగ్రనాయకులల్లో ఒకరైన శ్రీ చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవం ను పురస్కరించుకొని ప్రతీ సవత్సరం అక్టోబర్ ఇరవైరెండున రైతు దినోత్సవం ను జరుపుకుంటున్నారు.
రైతులనేవారు సమాజానికి రైతు వెన్నెముక్కలాంటివారు . రైతు పండించే పంటలమీదే మొత్తం సమాజం అంతా ఆదారపడి వుంది అంటే మనం ఆశ్చర్య పడనక్కరలేదు. రకరకాలైన పంటలను పండించే రైతులు, రాత్రి లేదు, పగలు లేదు ,ఎండనకా, వాననకా కష్టపడతారు.
ఈ దేశానికైనా సామాజిక, ఆర్ధిక వ్యవస్థ ఎక్కువ శాతం ఆధారిపడి వుంది. ఇంత కష్టపడే రైతుకు జీవన పరిస్థితి అంత బాగోలేదు . ఇది చాలా బాధాకరమైన విషయం.
ప్రభుత్వం వీరికి సరైన సహకారం అందిస్తే బాగుంటుంది . వారి కి వారి కుటుంబానికి విద్యకు, ఆరోగ్యానికి , ఆధునిక వ్యవసాయ పద్దతులు లో శిక్షణ ఇచ్చి విత్తనాలు , ఎరువులు, వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు ఇప్పించాలి. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ విషయాలలో సరైన రేటు ఇవ్వాలి. ఈ వస్తువు కొన్న అమ్మినా రైతులు మోసపోకుండా జాగ్రత్త లు తీసుకోవాలి. రైతు కస్టపడి పండిస్తే మధ్యలో దారాలు లాభం పొందుతున్నారు. ఇలాజరగకుండా చూడాలి.
రాష్ట్రంలో సగటున ఒక్కో రైతుకు ఉన్న భూమి.. 3 ఎకరాలు.
ఒకటింపావు ఎకరా కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు… 45.70 లక్షలు.
రెండున్నర ఎకరాల కన్నా తక్కువ ఉన్నవారు… 28.47 లక్షల మంది. ఐదెకరాల లోపు భూమి కలిగినవారు 26.39 లక్షల మంది.
50 ఎకరాలకు మించిన భూమి ఉన్నవారు… కేవలం 6920 మంది.
ఈ రకం గా వున్నా వారు అంత కాస్త పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం దొరకటం లేధు. రైతులకి తగిన కష్టఫలం దొరకకపోతే రైతుకి వ్యవసాయం మీద విరక్తి కలిగి వారు కుడా ఉద్యోగాలకోసం వెళ్ళిపోతున్నారు.
ప్రభుత్వం వారి కష్టాన్ని గుర్తించి వారి అవసరాలు తీర్చి వారిని ఉత్సాహపరచి , వారిని సత్కరించాలి.
లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ .........జై కిసాన్ .........అన్నారు . ఇది నిజం దేశాన్ని బోర్డర్ దగ్గర వున్నా జవాను, బోర్డరు లోపల వున్నా కిసాను మనకి చాలా అవసరం. వారి విలువలు మనం కాపాడాలి . రైతే రాజు అన్న నానుడి నిజం చెయ్యాలి. విష్ యు హ్యాపీ కిసాన్ డే.

మంగళవారం, అక్టోబర్ 21, 2008

చందమామ రావే.................జాబిల్లి రావే..............

మంగళవారం, అక్టోబర్ 21, 2008

ఇప్పటిదాక్యా రాత్రి వేళ్ళ మనం భోజనం చెయ్యక మనం మారాం చేస్తే.............. మన అమ్మలు చందమామ రావే జాబిల్లి రావే ......... అనే పాటలు పాడుతూ మనలను మైమరిపించి మనకు భోజనం తినిపించేవారు. మీకుకూడా గుర్తు వుండేవుంటుంది. మనం ఈచంధమామ కధలు విన్నాం కదా. ఎన్నో కధలు ఎన్నెన్నో............... పూర్వం నుండి రాముని ధగ్గర నుండి చంద్రుడిగురించి వాళ్ళ అమ్మలు కధలు చెప్పడం మనకు కూడా మన అమ్మలు చెప్పారు కధండి. అయితే కధలే మనవారికి స్పూర్తి అయ్యింది. కాభోలు. ఆనాటి పిల్లలు చంద్రుడు దిగి వస్తాడు అన్కొని పెద్దయ్యాకా రాడని గ్రహించి అప్పటి చంద్రుడిని చేరాలన్న ఆశతో ప్రయత్నించి ఈనాటి కి ప్రయత్నాన్ని సఫలి కృతం చేసుకోబోతున్నాడు. ఇది నిజంగా సంతోషించవలసిన విషయం . రేపు చంద్రయ్యాన్ ప్రోయోగం చెయ్యబోతున్నారు .ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. చంధమామయ్య రాడు మనమే వెళ్ళాలి . బాగుంది కదా..

భారత దేశం చంద్రుడిపైకి ప్రయోగించనున్న తోలి మానవరహిత అంతరిక్షనౌక చంద్రయాన్ కౌంట్ డౌన్ పూర్తి కావస్తోంది . నెల్లూరు జిల్లా లోని శ్రీహరికోటలోని సతీస్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఉదయం .౨౦ గంటలకు జరిగే ప్రయోగం సర్వం సిద్దం అయ్యింది.చంద్రుడికి వంద కిలోమీటర్ల కక్షలోకి చేరుకొనేందుకు చంద్రయాన్ భూమి చుట్టూ రెండు దసలల్లో బ్రమనాలు జరుపుతుంది. వచ్చెనేల ఎనిమిది తేదీకల్లా ఇది నిర్దిష్ట కక్షలోకి చేరుతుంది .చంద్రయాన్ ప్రయోగం కోసం భారతీయ శాత్రవేత్తలే కాకుండా విదేసియులు కుడా పాలుపంచుకున్నారు. చిత్రాలుతో చంద్రుడి ఉపరితలం కళ్ళకు కన్బదేటట్టు వుండతానికి దానికి కెమెరా కుడా వుంచారు.

ప్రయోగం వెనకాల చాలాకారనాలు కనబడుతున్నాయి.
భవిషత్తులో మనిషి అవసరాలు ను భూమి తీర్చలేని పరిస్థితి వస్తే.......... చంద్రుడి పై శాస్వత నివాసాలు ఏర్పరచుకోవచ్చు.
భూమి , సౌరకుటుంబం , విశ్వం , సంబంధించిన చరిత్ర ను ఆవిర్ చంద్రుడిపై ప్రయోగాలు వుపకరిస్తాయి. మనిషి నివసించే అవకాసం ఉందని అనుకుంటున్నా అంగారకుడి తో పాటు మిగతా గ్రహాలపైనా ప్రయోగించటానికి వీలుగా వుంటుంది.

భూమి నుండి చన్ధ్రుదుఇ మద్య దూరం మూడు లక్షల ఏనాబైనాలుగు వేల నాలుగు వందల మూడు కిలోమీటర్లు.

చంద్రుడు భూమి తో పోలిస్తే నాలుగో వంతు ఉంటుంది.

భూమి నుండి చూస్తే చంద్రుడు ఒక వైపే కనిపిస్తుంది. రెండోవైపు తెలుసుకున్దురు.

ఒకే మరి రేపు జరిగే చంద్రయాన్ ప్రయోగం తో భారతీయ తివర్ణ పతాకం ను ఎగరవస్తారు. మన జెండా చంద్రుడిమీద సగర్వంగా రెపరెపలాడుతూ ఎగురుతుంది. అది తలచుకుంటేనే నా వొళ్ళు గగుర్పొడుస్తోంది. నాకు చాలా గర్వంగాకుడా వుంది.

ఐతే ఇక పై చంద్రుడి గురించి అమ్మలు కొత్త కధలు తయారు చేసుకోవాలి మరి.

ఈ చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావాలని మనస్పూర్తి గా కోరుకుంటూ.

విష్ ఆల్ ది బెస్ట్ .

శుక్రవారం, అక్టోబర్ 17, 2008

నొప్పించక తానొప్పక

శుక్రవారం, అక్టోబర్ 17, 2008

ఒక వూరిలో ఒక ధనవంతుడుండేవాడు. అతనిని పరీక్షించాలని శ్రీ లక్ష్మి ,దరిద్ర లక్ష్మి ఇద్దరు వచ్చారు. అతని వద్దకు వచ్చి అతనితో "మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పగలవా "? అని అడిగారు. ధనవంతుడు గొప్ప చిక్కులో పడ్డాడు. శ్రీ లక్ష్మి అందంగా ఉన్నదంటే దరిద్రదేవత తనను పట్టుకొని పీడించవచ్చు. దరిద్ర లక్ష్మి అందంగా ఉన్నదంటే శ్రీ లక్ష్మి కోపంవచ్చి వెళ్లి పోతుందేమో! అని మానసిక ఆందోల్లనపడుతూ ఆలోచించాడు.అతనికి ఒక గోప్పయుక్తి స్ఫురించింది. వారితో" అమ్మలారా..........! మీరు అటు ఇటు నడవండమ్మా ! మీలో ఎవరు అందంగా ఉంటారో చెప్తాను" అన్నాడు. మరల " ఒకరు రండి. మరొకరు పొడి . ఆవిధంగా నడవండి" అన్నాడు. వారట్లే చేసారు. ధనవంతుడు చిరునవ్వుతో గంభీరంగా "అమ్మా! లక్ష్మిదేవి ! నీవు వస్తున్నప్పుడు చాలా అందంగా వుంటావమ్మా ".
"అమ్మా ! దరిద్ర లక్ష్మీ ! నీవు పోతున్నప్పుడు చాలా అందంగా వుతావంమా ".అన్నాడు.ఈ విధంగా యుక్తిగా ఇద్దరినీ తృప్తి పరచాడు. ప్రతీవారికి యుక్తి అవసరం . యుక్తి వలన శక్తీ సంపాదించవచ్చు. ఉపాయం తో అపాయాన్నుంది తప్పించుకోవచ్చు .

గురువారం, అక్టోబర్ 16, 2008

తిట్టినవారే...........!

గురువారం, అక్టోబర్ 16, 2008

" నన్ను అనవసరంగా ప్రతీవారు తిడుతున్నారు స్వామీ"! అన్నాడు ఒక భక్తుడు. రమణమహర్షితో,
రమణమహర్షి ఏమి మాటలాడలేదు.
`అన్యాయముగా తిట్టడం వల్లనా నాకు చాలా కోపం వస్తోంది, ఏమి చేయమంటారు?' అని అడిగాడు ఆ భక్తుడు.
`ఏముంది ? నువ్వు కుడా వాళ్ళతో చేరి నిన్ను నువ్వే తిట్టేసుకో , సరిపోతుంది' అన్నారు మహర్షి.
`అదేంటి స్వామీ అలా అన్నారు ?' అని తెల్ల మొహం వేసాడు భక్తుడు.
`వాళ్లు తిట్టేది నీ శరీరాన్నే కదయ్యా !
కోపతాపాలతో నిండిన ఈ శరీరం కన్నా నీకు శత్రువెవరు ? కనుక తిట్టేవల్లంతా నీకు మేలే చేస్తూన్నారు. పోగిడేవాల్లకన్నా వాళ్ళే నీకు నిజమైన మిత్రులు' అన్నారు మహర్షి.
"శరీరమే నేను" అనుకోవద్దని రమణ మహర్షి భోధ.

మంగళవారం, అక్టోబర్ 14, 2008

ప్రశ్నకు ప్రశ్న ! ..........

మంగళవారం, అక్టోబర్ 14, 2008

మనలో చాలా మంది ప్రతీ దానికి ప్రశ్నిస్తూ వుంటారు. వాటికి సమాదానం చెప్పలేనివి కొన్ని వుంటాయి. అల్లాంటిదాని గురించే మీకు చెప్తాను. నేను అస్తమాను అందరినీ ప్రతీ దాని గురించి ప్రశ్నలు అడుగుతాను . ఐతే ఈ రోజు కూడా రోజులాగే మా అమ్మమ్మని కనిపించిన ప్రతీదాని గురించి అడుగుతున్నాను. అప్పుడు మా అమ్మమ్మ ఈ కద చెప్పింది. ఆ కద మీకు నేను అందిస్తున్నాను. ఓకే నా.

ఒక పిల్లవాడు నడచుకుంటూ వెళ్తున్నాడు . అతని చేతిలో వెలుగుతున్న క్రొవ్వొత్తి ని చూసి ఒక పెద్ద మనిషి అడిగాడు " ఓ అబ్బాయీ ఆవెలుగు ఎక్కడనుండి వస్త్తోంది "అని.
ఆ పిల్లవాడు చాలా గడుగ్గాయి వెంటనే ఆ క్రొవ్వొత్తి ఆర్పివేసి , "ముందు ఆ వెలుగు ఎక్కడకు వెళ్లిందో చెప్పండి, " ఆ తరువాత ఆ వెలుగు ఎక్కడనుండి వస్తోందో చెప్తాను అన్నాడు". ఆ పిల్లవాడు.

కొన్ని ప్రశ్నలు పైకి చిన్నవి గానే కనిపస్తాయి . సమాదానం వెతకబోయినప్పుడు తెలుస్తుంది అవి ఎంత కష్టమైనవో అని .
మా అమ్మమ్మ ఇంకా చెప్పిందీ ........... ఏదైనా ప్రశ్నలు అడిగేముందు దాని గురించి ఆలోచించి , పరిశిలించి , పరిశోధించి అడగాలని చెప్పింది. దాని వల్ల మనకు మంచి ఆలోచనాశక్తి వస్తుందని చెప్పింది. అంతేకాకుండా తెలివితేటలు పెరుగుతుందని చెప్పింది. అమ్మమ్మ బాగా చెప్పింది కదండీ.

శనివారం, అక్టోబర్ 11, 2008

నేనే ...........

శనివారం, అక్టోబర్ 11, 2008

నేనే శ్రీ వైష్ణవినండి. నేను దసరా రోజు గుడికి వేల్తున్నప్పటి ఫోటో ఇది . మా అమ్మమ్మ రావటం లేదు నేను ఒక్కదాన్నే గుడికి వెళ్తున్నాను. అవతల చాలా పని వుంది. పండగ కదండి. వెరైటి వంటలు చెయ్యమంటున్నారు. నేనేమో పట్టు చీర కట్టు కొని వున్నా మళ్ళి చీర మార్చాలంటే ఎంత చికాకో. మా వాళ్లు వంటల గురించి నన్ను అల్లరి పెట్టటం ఎమైనా భాగుందా ......... మీరే చెప్పండి . ఫస్ట్ ఐతే గుడికి వెళ్లాను లేండి . మొత్తానికి దసరా బాగానే జరుపుకున్నాం లేండి. మీరు కుడా బాగా జరుపుకున్నారా. సరే మరి వుంటానండి. నాకు చాలా పని వుంది మరి. బాయ్ బాయ్.

సూక్తండీ ........... !!!!

ఆశావాది మరచిపోయేందుకు నవ్వుతాడు.
నిరాశావాది నవ్వటమే మరచిపోతాడు.

లోక సహజం!

చందనతరుషు భుజంగా
జలేషు కమలాని తత్ర చ గ్రాహాః !
గుణఘాతినశ్చ భోగే
ఖలా న చ సుఖాన్యవిఘ్నాని !!
పరిమళం వెదజల్లే గంధంపు చెట్లలో పాములు ; కమలాలు ఉండే నీళ్ళలో మొసళ్ళు ; భోగాల్లో గుణహీనులైన నీచులు ఉండడం లోక సహజం. విఘ్నాలు లేకుండా సుఖాలు కలుగవు.


శుక్రవారం, అక్టోబర్ 10, 2008

అట్ల తద్దోయ్......

శుక్రవారం, అక్టోబర్ 10, 2008

అట్ల తద్దోయ్ - ఆరట్లోయ్
ముద్దపప్పోయ్ -మూడట్లోయ్
అయ్యో మీకు చెప్పడం మరచిపోయా ఈ పాట ఏమిటను కుంటున్నారా ? ఏమి లేదండి నేను చెప్తున్నది అట్ల తదియ పండుగ గురుంచి. అట్ల తదియ ఈ పండుగ ప్రతి సవత్సరం ఆశ్విజ బహుళ తదియ రోజు వస్తుంది. ఈ తదియ రోజు తెలవారుజామునే ఆడవారు చిన్న పెద్ద అన్దరూ నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని , గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పులుసు, పెరుగు వేసుకొని తెల్ల వారుజామునే భోజనం చేస్తారు.ఆ తరువాత ఆటలే ఆటలు, చెమ్మచెక్కలు, ఉయ్యాలు అడతారు. అన్నట్టు ముందురోజే చేతుల నిండా గోరింట పెట్టుకుంటారు. తదియ రోజు చాలా సంతోషం గా ఆడుకుంటారు. ఉయ్యాల పోటీలు పెట్టుకుంటారు. పల్లెల్లో చాలా బాగా జరుపుకుంటారు. పొద్దు ఎక్కాగా తల స్నానం చేసి దేవుడుకి దణ్ణం పెట్టుకొని రోజు అంతా ఉపవాసం వుంటారు. సాయంత్రం చంద్రోదయం అయ్యాక స్నానం చేసి పార్వతి దేవికి పూజచేస్తారు. పూజచేసి చంద్రుడిని దర్శించుకుంటారు .
అట్ల తదియకు ఒక కదా వుంది ఆకధ
ఒక వూర్లో రాజు గారమ్మాయి, వెలమవారి పిల్ల, బ్రాహ్మ్నవారి పిల్లా, కోమటిపిల్ల,నలుగురు వివాహం కాకముందు చిన్నతనంలో నే అట్లాతదియనోము చీద్దమనుకున్నారు తదియనాడు వుపవాసం వున్నారు.రాజుగారంమయి అతిసుకుమారి కనుక సాయింత్రం కాగానే ముఖము వాడి ముఉర్చపోయినది. వీదిలూనుంది అన్నగారు వచ్చి అమ్మా చెల్లెమ్మ ఏది అని అడుగుగా నాయనా అట్లతదియ నోము చేద్దమనుకుని వుపవాసముంది . చంద్రోదయం వరకు వుండలేక మూర్చపొయినధి అని చెప్పింది. అప్పుడు అన్నయ్య ఏమి దారని అలోచించి వెంటనే దురంగావున్న చింత చెట్టుకు అద్దం పెట్టి దానికి ఎదురుగా అగ్గిపెట్టి చెల్లిలిని లేపి అదిగో చంద్రుడు ఉదయించాడు అనిచెప్పగా నిద్రకలనవున్న నిజంగా చెంద్రుదని బావించి ,రాకుమారి ఫలహారంలు చేసెను. కొన్నాళ్ళకు వివాహం చేయగా వయసు మీద పడిన వాడు భర్తగా సంప్రప్తంయ్యేను. నీను అట్లతదియ నోము నోచినా నాకు ఇదేమీ ప్రారబ్దం అని భాద పడుతూ ఒకనాడు రాత్రి అడవికి వెళ్ళిపొయినది.
ఓ అమ్మాయి ఒంటరిగా ఈ అడవిలో ఎక్కడికి పూతున్నావని పార్వతి పరమేస్వరులు మారు వేషములో వచ్చీ అడుగగా నాయనా మీరేమైనా అర్చేవార తీర్చేవారా మీకెందుకు అని చెప్పి నడుస్తోంది. మీము ఆర్చేదము తీర్చేదము నీ సంగతి చెప్పు అని అడిగిరి . ఆచిన్నది వారికి నమస్కరించి వారి స్నేహితులుతో చేసిన నోము గురించి తనకు మాత్రమె ముసలి భర్త లబించాడని నాకు మాత్రమె ముసలి భర్త సంభవించటం నాకు కారణం ఏమి , నా పాపమా? అని తన భాదను వివరించింది.
వారు దానికి చిన్నదానా నీవ్రతం భంగమైనది నీ అన్నగారి వలన జరిగిన చర్య సవివరంగా చెప్పారు. జరిగినదాని నేను ఇప్పుడు ఏమి చేయ్యన్లని వారి అడుగగా మరలా ఆ వ్రతం నిస్తగా చేయ్య్మన్న్నారు. ఆమె తిరిగి రాజ్యాని కి చేరి తదియరోజు ఆ వ్రతం చేసినది. ముసలి భర్త మంచి అందమైన యువకుని గా మారెను. అది చుసి అన్ధరూ కారణమడుగగా జరిగిన వృతాంతం చెప్పెను . ఇది అట్ల తదియ నోము కదా...
ఈ కధ విని అక్షిమ్థలు తలమీద వేసుకొని చంద్రుని చూసి పదకొండు అట్లు వీసి ఒక ముత్తయ్దువకు ఇచ్చి తను నేయివధ్యం పెట్టుకున్న పదకొండు అట్లు తిన్నాలి . ఈ నోము వివాహమైన నవ వధువులు పదకొండు సవత్సరాలు చేసి వుధ్యాపన చేసుకోవాలి.
ఇదండి అట్ల తద్ది నోము గురించి.

హల్లో ..........

హలో అన్దరూ బాగున్నారా. దసరా బాగాజరుపుకున్నారా. అందరికి విజయదసమి శుభాకాంక్షలు .

శుక్రవారం, అక్టోబర్ 03, 2008

భగవంతుని విలువ

శుక్రవారం, అక్టోబర్ 03, 2008

ఒక పెద్ద మనిషి తన వద్ద పని చేసే సేవకుని పిలిచి అతని చేతికి ఒక వజ్రం ఇచ్చి మార్కెట్లో దాని విలువ ఎంతో తెలుసుకొని రమ్మన్నాడు . సేవకుడు మొదట ఒక వంకాయల వ్యాపారి దగ్గరకు తీసునుకొనివెళ్ళాడు. ఆ వర్తకుడు దానిని కాస్సేపు పరీక్షించి "ఇది తొమ్మిది సేర్ల వంకాయల విలువ చెయ్యదు. అని తేల్చి చెప్పాడు.
సేవకుడు అక్కడ నుండి వస్త్రాల వ్యాపారి దగ్గరకు వెళ్లి అతనిని కుడా దాని విలువ కట్టమన్నాడు. ఆ వ్యాపారి రాయి మంచిదే కాని తొమ్మిది వందల రూపాయలు కంటే ఎక్కువ వుండదు . ఆ పైన ఒక్క రూపాయి అయినా దండగే అన్నాడు.
బంగారం వర్తకుని దగ్గర అడిగినా ఆ రాయి విలువ లక్ష రూపాయలు అన్నాడు. వజ్రాల వ్యాపారి ని అడగగా చూసి చూడగానే కోటి రుపాయులువుంటుది అన్నాడు.
ఈ వర్తకులు వారి వారి పెట్టుబడి స్థాయి ని బట్టి , గుణగ్రహణ శక్తిని బట్టి వజ్రం విలువను ఎలా నిర్ణయించారో అలాగే వ్యక్తులు కుడా తమ తమ గ్రహిపుసక్తిని బట్టి, సంస్కారాన్ని బట్టి భగవంతుడి విలువను నిర్ణయించ గలుగుతారంటారు రామ కృష్ణ పరమహంస.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)