Blogger Widgets

శనివారం, డిసెంబర్ 31, 2011

2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శనివారం, డిసెంబర్ 31, 2011

_clr case letter h _clr case letter a _clr case letter p _clr case letter p_clr case letter y           _clr case letter n _clr case letter e _clr case letter w            _clr case letter y_clr case letter e_clr case letter a_clr case letter r 
symbol two symbol zero symbol one symbol two 
short pink satin bar with roses animated gif 
2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ సంవత్సరము మీకు అన్నివిధములా అనుకూలముగా వుండి.
మీకోరికలు, కలలు మీకు తీరాలని
మీరు తలపట్టిన కార్యక్రమాలన్నీ విజవంతముగా పూర్తి చేసుకోవాలని
బందుమిత్రులతో ఆనందముతో, సుఖసంతోషాలతో గడపాలని
ఆయురారోగ్యముతో, అష్ట ఐశ్వర్యములతో తులతూగాలని
మీ జీవితము లో మీకు  కొత్త ఉషస్సు నింపాలని 
నేను మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను

 

తిరుప్పావై సప్తదసమ పాశురము

గోపికలు , పదిమంది గోపికలను మేల్కొలిపికొని నందగోపభావనమును చేరినారు. భావనపాలకుని ద్వారపాలకుని. ప్రార్ధించి వారి యనుమతిని పొందినారు. ద్వారపాలకుడు తలుపు తెరచి వాడలేను. గోపికలందరూ ను నందగోపభావనములోకి ప్రవేశించినారు.నందగోపుడు , యశోద, శ్రీ కృష్ణుడు, బలరాముడు వరసగా మంచాలపై సయనించినారు. వారిని ఈ రోజు మేలుకోల్పుతున్నారు. రాక్షసులు వచ్చి కృష్ణునికి ఏమి కీడు చెయునో అని ! లేక గోపికలు ఎత్తుకుపొతారెమో ! అని భయముతో జాగరుడై ముందు మంచము మీద నందుడు శయనించియుండెను. లేక లేక లభించిన కృష్ణుని వీడ లేక ఒక ప్రక్క కృష్ణుని మరో పక్క బలరాముని మద్యలొ యశొద శయనించి యుండెను. వారిని ఒక్కొక్కరిని ఇందులొ మెలుకొల్పుతున్నారు.  మరి ఎలా లేపుచున్నారో చూడండి.
పాశురం :
  అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం 
అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్

శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్




తాత్పర్యము
వస్త్రములు కావలసినవారికి వస్త్రములు, మంచి నీరు , అన్నము కావసినవారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మ బుద్ధితో దానము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము , ప్రబ్బలి చెట్ల వంటి సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురువంటిదానా! మా వంశమునకు మంగలదీపము వంటిదానా! మా స్వామినీ ! యశోదా! మేలుకొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చు కొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా ! నిత్యసురులకు నాయకుడా! నిద్ర పోకూడదు. మేల్కొనుము. స్వచ్ఛమైన ఎర్రని బంగారుముతో చేయబడిన కడియము కాలిని దాల్చిన బలరామా! నీవును, నీ తమ్ముడును మేల్కొనవలెను.
అని గోపికలు ప్రార్ధించిరి.

జై శ్రీమన్నారాయణ్

శుక్రవారం, డిసెంబర్ 30, 2011

గ్రీటింగ్స గురుంచి తెలిసుకుందాం

శుక్రవారం, డిసెంబర్ 30, 2011


 ఈరోజు మనం గ్రీటింగ్స గురుంచి తెలిసుకుందాం. గ్రీటింగ్స్  అసలు ఎలా తయారు అయ్యిందో అని తెలుసుకుందాం .  మా అమ్మగారి చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ వుండేవిట న్యూ ఇయర్ వస్తోంది అంటే వారం రోజులు ముందుగా నే షాప్ కి వెళ్లి ఆ గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కొని వచ్చి వాటికి పేర్లు రాసి దూరంగా ఉండేవారికి పోస్ట్ చేసేవారుట.  స్కూల్ ఫ్రెండ్స్, టీచర్స్  కి న్యూ ఇయర్ రోజు వారి ఇంటికి వెళ్లి వారికి wish  చేసి వారికి chocolates  ఇచ్చి ఆరోజు అంతా హ్యాపీ గా గడిపేవారట.  కొన్ని రోజులు అయిన తరువాత ఎవరి కార్డులు వారే సొంతంగా తయారుచేసుకొని ఇచ్చేవారట.  అప్పట్లో వారికి cakes cut చేయంటము అవి తెలియదుట.  ఇప్పుడు మనము న్యూ ఇయర్ జరుపుకోవటం లో చాలా మార్పులు వచ్చేసాయి.  ఈ సందర్బంగా అసలు ఈ కార్డులు గొడవ ఏమిటో చూద్దాం.
పూర్వం గ్రీటింగ్ ను మొదట ఉత్తరాల ద్వారా తెలుపుకునేవారు.  ఇప్పుడు అయితే అలాంటి ఉత్తరాలే లేవులేండి.  తరువాత గ్రీటింగ్స్ ను షాప్కి వెళ్ళి ఎవరికినచ్చిన  గ్రీటింగు కార్డులు వారు కొనటం వాటిని పోస్టాఫీసుకువెళ్ళి పోస్టు చేసే ఓపికగా ,తీరికగా పంపేవారు.ఇప్పుడు మనకు అంతా నెట్ ప్రపంచంలోనే జరిగిపోతున్నాయి.  షాప్కి వెళ్లక్కరలేదు నచ్చింది ఎతుక్కోనక్కరలేదు. అన్ని నిమిషాలలో చాలామందికి పంపెయవచ్చు.  
అయినా సరే మనం చరిత్రలోకి ఒక్కసారి వేల్లివద్దాం.  మొట్టమొదటిగ్రీటింగ్ కార్డుల చరిత్రను మనం ఓ సారి చెప్పుకుందాం, వాటిని ఎవరు తయారుచేసారు అన్న డౌట్ వచ్చిందామీకు అయితే అది 1842 డిసెంబర్ 9వ తేదీన విలియం మా ఈగ్లే మొట్టమొదటి క్రిస్మస్ కార్డును తయారుచేసాడట!.
విలియం తయారుచేసిన కార్డు పై భాగాన To  అని తరువాత అడుగుబాగాన From  అని వుంచి వాటిని ప్రింట్ తీసుకొని వాటికి మద్యలో మెసేజ్ కి ఖాళీ వుంచి అడుగుని కొంత ప్లేస్ ఉంచేవారు అక్కడ అడ్రస్ రాయటానికి.  తరువాత అమెరికన్ క్రిస్మస్ కార్డు(1824-1909) లో లిధోగ్రాఫర్ లూయిస్ ప్రాంగ్ తయారిచేసాడుట.  ఆ తరువాత 1873 లో ప్రాంగ్ చార్లెస్ డికెన్స్ ఆటొగ్రాఫ్ తో గ్రీటింగ్ కార్డును దిజైన్ చేసి తన మితృలకు,కుటుంబ సభ్యులకు పంపించాడట.1900 సంవత్సరం  వరకు మత సంభందమైన విషయాలకే శుభాకాంక్క్షల కార్డులను పంపించే అలవాటు వుండేవారు తరువాత పుట్టిన రోజులు మొదలుగు  వాటికి కూడా గ్రీటింగ్స్ పంపటం మొదలయింది.
అయితే ఆ గ్రీటింగ్స్ కార్డులు పంపటంలో మెల్ల మెల్లగా చాలా మార్పులు చేర్పులుతో మరి మారి మనకు ఈ కార్డులుగా వచ్చాయి. 
Standard Greeting Cards:కార్డు షీట్ పరిమాణాలు వివిధ రకాలుగా చేతితో తయారు చేసినట్లు. కార్డులు మరియు ఆహ్వానాలను పంపేవిదంగా వుంటాయి. ఒక పెద్ద కార్డు లేదా వివిధచిన్న కార్డులు గా తయారుచేయచ్చు. ఇటువంటి కార్డు అతి తక్కువ ఖర్చు పద్ధతిలో తయారు అవుతుంది.
Photo Greeting Cards: మనకు నచ్చిన ఫోటోమీద విషెస్ తెలియచేసి. మనకు నచినవారికి ఇవ్వంటం.
Personalized Greeting Cards: ఇవి ప్రత్యేకంగా మనకు నచ్చినవిధంగా తయారుచేసి మనకునచ్చిన మెసేజ్ రాసి ఇచ్చే కార్డు.
Musical Greeting Cards: ఈ మ్యూజికల్ కార్డ్స్ కార్డ్ కే మ్యూజిక్ ఏర్పాటు చేసి పంపే కార్డు ఇది కార్డు 3d  ఎఫ్ఫెక్ట్స్ తో తయారు చేస్తారు.
తరువాత చాలా మార్పులు చేర్పులు చేసి వచ్చినవే E-Cards .  వీటిలో కూడా చాలా రకాలువున్నాయి.
Electronic Greeting Cards : E-card టెక్నాలజీ  సుమారు 1984  సంవత్సరములో వచ్చాయి.  వీటిలో కుడా చాలా రకాలు వున్నాయి.

Printed e-Cards : ఈ కార్డు మనకు నచ్చినది సెలెక్ట్ చేసుకొని ప్రింట్ చేసి పంపేవి.

Postcards and Greeting Cards : ఈ కార్డ్స్ పోస్ట్ కార్డ్స్ లానే వుంటాయి online లో ఈమెయిలు ద్వారా పంపేవి. 

Flash animation: ఈ కార్డ్స్ మ్యూజిక్ తో కూడి ప్లే చేస్తే మంచి గా movements తో వుంటాయి.  

Video E-Cards : ఈ కార్డ్స్ వీడియో తరహాలో విషెస్ చెప్పేవిధంగా వుంటాయి.

Mobile E-Cards: ఈ కార్డ్స్ యూజర్లు ఒక వెబ్సైట్ ఆన్లైన్ వెళ్లి చేయవచ్చు, ఒక కార్డ్ గ్రహీత యొక్క మొబైల్ సంఖ్యను టైప్ఎంచుకుని,  కార్డు ఒక ఎంఎంఎస్ గా గ్రహీత యొక్క మొబైల్ ఫోన్ పంపబడుతుంది.
Web based multi-media E-Cards :ఈ కార్డ్స్ slide show  లాగ వుంటాయి. ఇవిమనకు నచ్చినవి అన్ని slide చేసి కావాలంటే మ్యూజిక్ పెట్టి పంపేవి.
Face Upload E-Cards :  ఈ కార్డ్స్ లో మనకు నచ్చిన ఫస్ ఫోటోను అప్లోడ్ చేసి పంపే కార్డు ఇది. ఇది funny  గా కూడా తయారు చేయాచ్చు.
E-cards games:  ఈ కార్డులో మంచి సరదా అయిన ఆటలును కార్డు రూపంలో పంపచ్చు.
Pop up Cards: పాప్ అప్ లేదా యాంత్రిక గ్రీటింగ్లు కార్డులు బాగా ప్రాచుర్యం పొందాయి. కింది షీట్లను మాములుగా అనిపించేవి. ఓపెన్ చెసాగా చాలా బాగుంటాయి. ఇవి మాలాంటి పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు.  
ఇది గ్రీటింగ్ కార్డ్స్ గురించి.  ఇవి మంచిగా మనకు మన ఫ్రెండ్స్ మద్య మరియు కుటుంబసబ్యుల మద్య మంచి relationship  ను పెంచుతాయి అంతమలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు అంటే నమ్మండి.
మీరు కూడా మీకు నచ్చినవారికి నచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ పంపి విషెస్ చెప్పేయండి ఇంకెందుకు ఆలస్యం.
ok  మరి ఇక.  నా తరపున విషెస్ అందుకోండి.
Wish You Happy New Year 2012

తిరుప్పావై షష్టాదస పాశురము

గోపికలు నిద్ర పోతున్న పదిమంది గోపికలను మేల్కొల్పి న తరువాత నంద గోప భవనమునకు చేరినారు. పదిమంది గోపికలును మాత్రమే కాదు . ఆనందముతో శ్రీ కృష్ణుని పొందే యోగ్యత కల గోపికలను అందరను మేలు కొలిపి నంద గోప భావనమునకు వచ్చిరి. నందగోపుని ద్వారమునకు వచ్చి ద్వార పాలకుని అర్ధించి లోనికి  ప్రవేశింతురు .
పాశురము:
  నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ 
నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ 
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై 
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్

వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము:
అందరకు నాయకునాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భావనపాలకా లోనికివిడువుము . తోరనములతో శోభిస్తున్న ద్వారమును కాపాడుతున్న ద్వారపాలకా మణులచేఅందముగా వున్నా గడియలను తెరువుము . గోపబాలికలగు మాకు మాయావి అయినమణివర్ణుడగు శ్రీ కృష్ణ పరమాత్మ ద్వని చేయ "పఱ " అను వాయిద్యము ను ఇచ్చెదనని నిన్న నేనుమాట ఇచ్చాను . మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదు. పవిత్రమైన భావముతో వచ్చాము. శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చినాము . స్వామీ ముందుగానే నీవు కాదనకు. దగ్గరగా ప్రేమతో ఒకదానినిఒకటి చేరి బిగువుగా పట్టుకొని వున్న తలుపులను నీవే తెరచిమమ్ములను లోనకు పోనిమ్ము . అని భావనద్వార పాలకులను గోపికలు వేడుకొన్నారు.  

విక్రం సారాభాయ్

విక్రం అంబాలాల్ సారాభాయి
ఈ రోజు విక్రమ్ సారాభాయ్ మరణించిన రోజు డిసెంబర్ 31న ఈయన గురించి కొంచెము తెలుసుకుందాం. 
విక్రం అంబాలాల్ సారాభాయి (ఆగస్టు 12, 1919 – డిసెంబరు 31, 1971) భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ కు ఆద్యుడు.
​విక్రం సారాభాయ్ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో జన్మించాడు. వారి కుటుంబం ధనవంతులైన వ్యాపారస్తుల కుటుంబం. ఆయన తండ్రి అంబాలాల్ సారాభాయ్ అక్కడ పేరు పొందిన పారిశ్రామికవేత్త. ఆయనకు అక్కడ ఎన్నో మిల్లులు ఉండేవి. అంబాలాల్ , సరళా దేవి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతానంలో విక్రం సారాభాయ్ ఒకడు.  తన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి విక్రం సారాభాయి తల్లి మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది.
వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, మరియు జవహర్‌లాల్ నెహ్రూ మొదలైన ఎంతో మంది ప్రముఖులు తరచూ వస్తూ ఉండేవారు. వీరు విక్రం సారాభాయ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. 
అహ్మదాబాదులోని గుజరాత్ కళాశాల నుంచి మెట్రిక్ పాసయ్యాడు. తరువాతి చదువుల కోసం ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. 1940లో అక్కడ నుంచి నాచురల్ సైన్సెస్ లో ట్రిపోస్ లో ఉత్తీర్ణుడయ్యాడు. 
ఎప్పుడు ఐతే రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యిందో అప్పుడు అతను ఇంటికి తిరిగి వచ్చారు మరియు ఈఈశ్c, బెంగుళూర్వద్ద సర్ సీ .వ్ .  రామన్ కింద ఒక పరిశోధన పండితుడు గా చేరాడు. అతను విశ్వ (కాస్‌మిక్ రేస్ ) కిరణాల లపై తను చేసిన కృషి పనిచేసింది. అతను బెంగుళూర్, పూనా మరియు హిమాలయాలు వద్ద కొలతలు కొలిచే అవసరమైన పరికరాలు నిర్మించారు. అతను తిరిగి 1945 లో కేంబ్రిడ్జ్  వచ్చాడు. 1947 లో అతను పీయెచ్ .డ్ పట్టా లభించింది. ​
ఇతని భార్య మృణాలిని సారాభాయ్. అప్పట్లో వీరి పెళ్ళి చెన్నై లో జరిగింది. అయితే వీరి పెళ్ళికి విక్రం సారాభాయ్ తరపు బంధువులు అందరూ క్విట్ ఇండియా ఉద్యమంలో బిజీగా ఉండటంతో ఎవరూ హాజరుకాలేకపోయారు.   విక్రమ్ సారాబాయ్ గురించి చెప్పాలంటె చాలా ఉంది.  మనము వీలు చూసుకొని చెప్పుకుందాం.

జై హింద్

గురువారం, డిసెంబర్ 29, 2011

ఉరిమై ఉరిమెను పిడుగై సాగెను

గురువారం, డిసెంబర్ 29, 2011

ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి
ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి

తెల్లవారిపై నల్లత్రాచులా బుసలుకొట్టెను ఝాన్సీరాణి
నల్లమనసుల తెల్ల మనుషుల భరతంపట్టే ఝాన్సీరాణి
మీపాలిట యమదూతగమారి పాశంవిసెరెను లక్ష్మిబాయి
సాగదురాఇక మీపెత్తనము తప్పదురా మీ తిరుగుప్రయాణము

ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి
ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి

ఆత్మగౌరవము వెల్లువలాగా పెల్లుబికిన ఈఝాన్సీరాణి 
దౌర్జన్యాలకు దుర్మార్గాలకు మహిషాసుర మర్ధినిలాగ  
ఆటకట్టునీ ఆటకట్టునీ నీకపటాలన్ని కట్టిపెట్టు 
ఆంగ్లేయుడా ముటలుకట్టు నయవంచకుడా పయనంకట్టు

ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి

దుర్గాదేవి ఝాన్సీరాణి వీరనారి ఈనారీమణి 
నీపాలిట మృత్యువురా పారిపోండిరా ఆంగ్లేయులు 
పారిపోండిర పారిపోండిర నల్లమనసుల తెల్లమనుషులు
పారిపోండిర పారిపోండిర నల్లమనసుల తెల్లమనుషులు 
నల్లమనసుల తెల్లమనుషులు   

వీరనారీ ఈఝాన్సిరాణీ    ఝాన్సిరాణీ లక్ష్మిబాయి
ఉరిమైఉరిమెను పిడుగైసాగెను వీరనారి ఝన్సీరాణి 
ఆటకట్టు నీఆటకట్టు ఇకఆంగ్లేయుడా మూటకట్టు
వీరనారీ ఈఝాన్సిరాణీ    ఝాన్సిరాణీ లక్ష్మిబాయి 

ఝాన్సీ లక్ష్మిబాయ్ జీ-తెలుగు సీరియల్ లోని టైటిల్ పాట నాకు  బాగా నచ్చినది. చాలా inspirational song .  ఆ సీరియల్ చూస్తూ వుంటే నాకు కళ్ళు చమరస్తున్నాయి.  పాటలో కూడా అంతే పవర్ ఉంది.    మీరు కూడా వినండి. 
Thank  you . 

తిరుప్పావై పంచదస పాశురము

ఇంతవరకు తొమ్మిదిమంది గోపికలని మేల్కొల్పినారు. పదవ గోపికను ఈ పాశురములో మేల్కొల్పుతున్నారు.  దీనిలో ముందుగా భాగావ్ద్భాక్తులను మేల్కొల్పుతారు. తరువాత భగవానుని మేల్కొల్పుతారు. మొదటి పదిహేనవ పాశురాలలో మొదటి ఐదు పాశురాలుచే  ఈ వ్రతము నాకు పుర్వరంగామును తెలిపి తరువాత పది పాశురాలలో పది మంది గోపికలను మేల్కొల్పినారు . దీనితో భగవద్ ఆలయములో చేరుకొనుటకు అర్హత కలిగెను. ఇంతవరకు భగవద్భాక్తుల విషయమున ప్రవర్తింపవలసిన విధనములు నిరూపించి ఈ పాశురములో దాని ఫలమును నిరుపించబడుచున్నది. ఇంతవరకు భాగాత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరిచారు గోదామాత. అట్టి సాధన చేయుటచే ఏర్పదవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలగుట. అది పుర్ణంగా తొలగినాడు గాని ఆచార్య సమాస్రయనముస్ మంత్రము లభించి భగవదనుభావము కలుగదు . ఇట్టి పరిపూర్ణ స్తితినంది యున్న గోపిక ఈనాడు మేల్కొల్ప బడుచున్నది.   ఈమెను ఏవిదంగా లేపుచున్నారో కదా! ఈ పాశురము న లోపల ఉన్నా గోపిక కుబయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది. వారి మద్య సంబాషణ ఎలావుందంటే.
పాశురము:
  ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో  
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్



తాత్పర్యము:
బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ?
లోని గోపిక: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి. నేను ఇదే చెప్పుచున్నాను.
బయటి గోపుకలు: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము కాఠిణ్యము మాకు ముందే తెలియును.
లోని గోపిక : మీరే నేర్పు కలవారు. పోనిండు ! నేనే కఠినురాలను.
బయటి గోపిక : నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా !
లోని గోపిక: అందరు గోపికలు వచ్చినారా. 
బయటి గోపికలు: వచ్చిరి , నీవు వచ్చి లెక్కించుకో .
లోని గోపిక: సరే , నేను వచ్చి నేను ఏమి చెయ్యాలి ?
బయటి గోపికలు: బలిష్టమగు కువయాపీడము అను ఏనుగును చంపినవాడను శతృవుల దర్పమును అణచినవాడను , మాయావి అగు శ్రీ కృష్ణుని కీర్తిని గానము చెయుటకు రమ్ము.   లెమ్ము మాతో వచ్చి చేరుము అని లోపలి గోపికను లేపినారు.
జై శ్రీ మన్నారాయణ్ 

బుధవారం, డిసెంబర్ 28, 2011

కోర్టున గెలిచినా గీత

బుధవారం, డిసెంబర్ 28, 2011

కోర్టున గెలిచినా గీత
ఇప్పుడే అందిన వార్త రష్యన్ కోర్టు పరీక్షలో గెలిచినా మన భగవానుడు  శ్రీ కృష్ణులవారు చెప్పిన భగవద్గీత.

భగవద్గీత అనువాదంపై రష్యా కోర్టు నిషేధం విధిస్తుందా? కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకుంటుందా? అనేక రకాల doubts తో మన దేశంలోనూ వారు విదేశాలలో వున్నా మన బారతీయులు టెన్షన్లో వున్నారు.  ఇప్పుడే ఆ టెన్షన్ నుండి విముక్తి లభించింది. రష్యన్  కోర్ట్‌లో భగవద్గీతలో తీవ్రవాద భావజాలం ఉందంటూ. రష్యాకు చెందిన ఓ సంస్థ అక్కడి కోర్ట్‌ను ఆశ్రయించింది. 

దీనిపై రెండు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తుదితీర్పును  విడుదల చేసింది.  ఆ కేసును రష్యన్ కోర్టు కొట్టివేసింది.  మన గీతను రక్షించింది.  
భారత ప్రభుత్వం దౌత్యపరంగా ఒత్తిడి తేవాలని కోరినా.. సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా మనకు న్యాయమే జరిగింది. చివరికి శ్రీ కృష్ణ తత్వము గెలిచింది. ఇది చాలా సంతోషంగా వుంది నాకు, మీకు కూడా సంతోషంగా వుంటుంది అనుకుంటున్నాను.
ఇందుకు గాను నా తరపునా, నా మిత్రులతరుపునా, నా బ్లాగ్ మిత్రుల తరుపునా, బ్లాగ్ ద్వారా రష్యన్ కోర్టుకు అభినందన పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.  
                           జై శ్రీమన్నారాయణ్ 

తిరుప్పావై చతుర్దస పాశురము


ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపుతానని చెప్పినది  ఆ గోపిక ఈనాడు  మేల్కొల్పబడుచున్నది . ఈమె వీరి సంఘమున కంతకూ నాయకురాలై నడిపించగల శ క్తిగాలది .
తన పూర్వ అనుభావముచే ఒడలు మరచి తానూ చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరిచి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తానూ ఉండిపొయినది .
ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట గలదు . పెరటివైపున వున్నా ఆ తోటలో దిగుడు బావికలదు. ఆ దిగుడు బావిలో తామర పూలు , కాలువలు , ఉన్నవి ఆమె తన్మయత్వముతో అనుభావిచుచు ఇతర విషయాలనే  మరచిఉన్నది. అట్టి స్థితిలో ఉన్నా గోపికను నేడు మేల్కొల్పుతున్నారు .


పాశురము:


ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము:  స్నానము చేయుటకు గోపికల నేల్లరను మేల్కొల్పుతాను అని చెప్పి నిద్రపోవుచున్న ఒక గోపికను ఈ పాసురములో లేపుచున్నారు.  ఈ బాలికకు ఊరివారినందరాను ఒకతాటిపై నడుపగల శక్తి కలది.  ఓ పరిపూర్ణురాలా! నీ పెరటిలో నున్న  గుడుబావిలో ఎరుపుతామర పూలు వికసించినవి. తెల్లకాలువలు ముడుచుకుంటున్నాయి. అంటే తెల్లవారుచున్నాడని భావము.  లెమ్ము ఎర్రని కాషాయ వస్త్రములు దరించి తెల్లని పలువరుసలు గలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమతమ నివాసములలో ఆరాధనము చేయుటకు వేల్లుచున్నారు లెమ్ము.  నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపెడియట్లు మాట ఇచ్చినావు మరచిపోయావా? ఓ లజ్జలేనిదానా! లెమ్ము.  ఓ మాతనేర్పు గలదానా! శంఖమును చక్రమును ధరించినట్టి ఆజాను బాహుడగు పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము. అని ఈనాటి గోపికను మేల్కొల్పినారు.
జై శ్రీమన్నారయణ్  

మంగళవారం, డిసెంబర్ 27, 2011

వందేమాతరం గీతం కి 90

మంగళవారం, డిసెంబర్ 27, 2011

మొదటిసారి 1921 వ సంవత్సరం డిసెంబర్ 28  న వందేమాతరం గీతాన్ని కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు. నేటికి 90  సంవత్సరములు నిండినది. బంకించంద్ర ఛటర్జీ రచించిన బెంగాలీ గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.  ఛటోపాధ్యాయ్' కు బ్రిటిష్ వారు పలకలేక 'ఛటర్జీ' అని పిలువసాగారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచంకూడా 'ఛటర్జీ' అని పిలవడం ప్రారంభించింది. ఇతను బెంగాలీ కవి, వ్యాసరచయిత మరియు సంపాదకుడు. ఇతని రచన వందేమాతరం ఇతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇతను వ్రాసిన ఆనంద్ మఠ్ అనే నవలనుండి ఈ గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది.

వందేమాతరం
వందేమాతరం




సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం

కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం

తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం

త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, మాతరం వందేమాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం


జై హింద్ 

తిరుప్పావై త్రయోదస పాశురము

వెనుకటి పాశురమున గోపికలును మేల్కొలుపుచు కృష్ణ సంకీర్తనం మాని శ్రీ రామ చంద్రుని గుణగణాలను సంకీర్తనం చేస్తూ శ్రీరాముడు మనోభిరాముడని గోపికలు అంటున్నారు.  దానిని విని నందవ్రాజమున సంచలనం ఏర్పడింది.  మధురలో పుట్టి శ్రీకృష్ణుడు గోపవంసమున చేరి తాను కూడా గోపాలుడే అనునట్లు కలసిమెలసి ఉంది వారిని కాపాడుచుండగా అలాంటి కృష్ణుని విడిచి రాముని కీర్తించుట ఏమి అన్యాయము? అప్పుడు అయోధ్యలో ప్రజలు రాముడు, రాముడు, రాముడని యనుచుండెడి వారు.  కానీ ఇతర ప్రస్తావనే లేదు కదా ! నందవ్రజమున మాత్రం కృష్ణుని తప్ప అన్యుని కీర్తించుట ఏమి హేతువు? శ్రీ రాముడా! మనోభిరాముడా.  రామునికంటే కృష్ణుడే సౌందర్యవంతుడు గదా అని ఇలా అనవద్దని కోపికలు వివాదంలో పడిరి.  రాముని కీర్తిమ్చినవారు రాముడుకు కృష్ణునికి పోలికలు చెప్పి ఇద్దరు ఒక్కరే అని నిరూపించి గెలిచినారు.  అప్పుడు ఇద్దరినీ కీర్తించుదుము అనుకొన్నారు.  ఈ పాసురములో మేల్కొల్పబడుచున్న గోపిక నేత్ర సౌందర్యమున విశిష్టస్థానం కలది.  తన నేత్ర సౌందర్యము వుండటం వల్ల ఆ కృష్ణుడు వేదక్కొని రాక ఎలా వుందగలడు అని భావించి ఆమె దైర్యముగా ఇంటిలోనే పరుండివున్నది.  ఇక్క నేత్రము అనగా ఙ్ఞానము.  ఙ్ఞానము కల చోటకు కృష్ణుడు తప్పక వచ్చును కదా అది ఆమె భావం.  అలాంటి గోపికను నేడు ఎలా మేల్కొల్పుచున్నారో చూద్దాం.   
పాశురము:
  పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై 
పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్




తాత్పర్యము :


పక్షి శరీరమున ఆవేశించిన బకాసురుని నోరుచీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీ కృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని పది తలలను హేలగా చిగుళ్ళు త్రుపినట్లు త్రుంపి పారవేసిన శ్రీ రాముని గానముచేయుచూ  పోయి మనతోడి పిల్లలందరును వ్రత క్షేత్రమును చేరినారు. లోపల ఉన్న తుమ్మెదగల తామరపూలను పోలిన కన్నులు కలదానా !
లేడిచూపులు వంటి చూపులు కలదానా ! శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు . పక్షులు కిలకిల కూయుచున్నవి . కృష్ణ విరహ తాపము తీరునట్లు చల్లగా అవగాహన మొనర్చి స్నాన మోనర్పక పాన్పుపై ఏల పడుకున్నావు. ఓ సుకుమార స్వభావురాలా! ఈ మంచి రోజున నీవు నీకపటమును వీడిచి మాతో కలసి ఆనందము అనుభవింపుము.


విశేషార్ధం:
పుళ్ళిన్ వాయ్ కీండానై:
అసురావేశము కలిగిన కొంగనోటిని చీల్చిన వానిని ముందుగా గోపికలు శ్రీ కృష్ణుని కీర్తించుచున్నారు.  భాగవత్ప్రాప్తికి భగవంతుడే ఉపాయం అని నిశ్చయము కల్గుటకు దంభము, అహంకారము, ప్రదానమైన శత్రువులు.  ఆ రెండిటిని తొలగించి తానే ఉపాయం అని చెప్పుటకు బకాసుర వధ వృత్తాంతము కీర్తిస్తున్నారు. తరువాత రావణవధ వృత్తాంతం ప్రస్తావిస్తునారు.  వారు అంతకుముందే రాముడు కృష్ణుడు ఒకటే అని వారి కీర్తిని కీర్తిస్తున్నారు. ముందుగా కృష్ణుని తరువాత రాముని వృత్తాంతమును కీర్తింస్తున్నారు.
ప్పొల్లావరక్కనై  కిళ్ళి క్కళైందానై :
దుష్ఠరాక్షసుని గిల్లి పారవేసిన వానిని కీర్తించుచున్నారు. తమకు పరిచయమున్న కృష్ణుని వృత్తాంతము కీర్తిచి తరువాత తమతో సజాతీయయగు సీతాదేవిని విడచియుండలేక ఎంతో వ్యధ చెందిన సౌజన్యమూర్తి యని శ్రీ రాముని కీర్తిస్తున్నారు. శరీరమును ఆత్మను విడదీసినట్లు తల్లిని తండ్రిని ఒకచోట వుండనీక వారికి ఎడబాటు కల్గించిన నిక్రుష్టుడు  రావణుడు.  సర్వేశ్వరుని నుండి లక్ష్మిని విడదీయగాలిగిన రాక్షసుడు వేరొకడు లేదు అందుచే దుష్టరాక్షసుడు అంటున్నారు.  అలా అనగానే దుష్టరాక్షసుడు అనగానే స్పురించేది రావణునిపీరు మాత్రమె.  వారు పేరు కూడా చెప్పటంలేదు. అలాంటి వారిద్దరిని కీర్తిస్తున్నారు గోపికలు.
కీర్-త్తిమై పాడి ప్పోయ్:
కీర్తినిపాడి కొనుచూపోయి,  గోపికలు వ్రతము చేసే స్థలమునకు చేరిరి.  కీర్తనే ఆధారంగా చేసుకొని వ్రాతముచేయుతకు గోపికలు ముందుకు సాగుతున్నారు.
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్:
పిల్లలందరును వ్రతముచేయు క్షేత్రమునకు చేరినారు.  కృష్ణుని పొందుటకు నిర్ణయించబడిన స్థలమునకు ముందుగానే పోయిరి.  నీవును మేల్కొని రమ్ము అని లోనున్న గోపికను ఆహ్వానించిరి.  ఆమె యొక్క కృష్ణ సమాగామునందు ఆతురత గల గోపికలు ఆగలేక ముందుగానే వెళ్ళిపోయారు.  కానీ వారు వెళ్ళుట తెల్లవారుటకు గుర్తు అవునా! కావునా వేరే గుర్తు చెప్పండి అనగా తెల్లవారినది అనుటకు వేరే గుర్తు చెప్తున్నారు. 
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు:
శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు. గొల్లవారుఅగుటచే వీరు నక్షత్రములను బట్టియే వారికి తెల్లవారుట గుర్తిస్తారు.  శుక్రుడు ను ఙ్ఞానాముగా, గురుడును అఙ్ఞానముగా వీరు తలంతురు. అదే చెప్పిరి లోన వున్నా కోపిక మీరు సంతతము కృష్ణ పరమాత్మ సంస్లేషమునే కోరినవారాగుటచే మీకు తెల్లారినట్టు అనిపిస్తోంది. నక్షిత్రాలన్ని మీకు శుక్రుడుగా, గురుడుగానే కన్పిస్తున్నాయి.  అందుచే నమ్మదగిన ప్రాభాతిక చిహ్నము కాదు అని లేవకుడా పడుకున్నది.  అప్పుడు వేరొక గుర్తులు చెప్పుచున్నారు గోపికలు.
 పుళ్ళుం శిలమ్బిన కాణ్ :
పక్షులు ధ్వని చేయుచున్నవి.  వెనుక 6 , 7  పాసురములో పక్షులుగురిమ్చి వచ్చింది మళ్లీ ఇక్కడ కూడా పక్షుల కిలకిల రవములు పేర్కొనబడినది.  పక్షులు అనగా ఆచార్యులని మనం ఇదివరకే అనుకున్నాం.  భగవంతుని అనుభవించమని నిస్తులగు ఙ్ఞానులు మేల్కొల్పును అవి వేల్లుబుచ్చే పలుకులే మొదటి కాలం.  ఆ భగవద్ అనుభవం నీవు ఒకదానివె అనుభవించుట తగదు అంటున్నారు.  కానీ ఈమె వీరి మాటలును లెక్కచేయక మాటాడక పడుకుమ్డెను.  అలా పడుకోనుటకు ఆమె నేత్ర సౌందర్య గర్వమే అని ఆమె నేత్ర సౌందర్యమును ప్రసంసిస్తున్నారు.
పోదరి క్కణ్ణినాయ్:
తామరపూలు మద్య తుమ్మెద ఉన్నట్లు ఒప్ప్చున్న కన్నులున్నదానా!  తామరపువ్వుతో పోటీపడు కనులుకలదానా! ఇటు అటు సంచరించు లేడి కళ్ళను పోలు కనులు కలది అనుతచే మౌనము స్పురించును.  ఇలా పరిపూర్ణ బ్రహ్మనుభావమున మునిగియున్న ఈమెను నేడు మేల్కొల్పుచున్నారు.
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే పళ్ళి క్కిడత్తియో:
చల్లగా చల్ల్బడునట్లు మునిగి స్నానము చేయక పానుపు పై పడుకొని ఉంటావా? భక్తులగు మాతో భాగావదనుభావం పొందుటకు మాతో రావా?  మాతో కలిసి గుణానుభవ మొనర్చి భాగవత్సార శ్లేష మొనర్చాలి అని అర్ధిస్తున్నారు.
పావాయ్!:
సుకుమారమైన స్త్రీ త్వము కలదానా నీవు కృష్ణుని తో కూడి ఉండి మమ్ములను అనుగ్రహించు.
నీ నన్నాళాల్:
మంచి రోజులు కదా.  ఈ గోపికలు లోపలున్న గోపిక యోగ్యతా గుర్తించి భగవదనుభవ యోగ్యతా కలిగి ఏకాంతముగా నీవిట్లుండుట.  ఆ కృష్ణుని మనసునకు కూడా భాద కలిగించును మాతో వచ్చి వానిని అనుభవించు.
కళ్ళమ్ తవిరుందు కలన్దు:
కపటమును వీడి కలువు. కృష్ణుని అనుభావస్తున్నట్టు భావించి వీరు నీవు ఆడుతున్న నాటకాలు చాలు ఇక రా అని అంటున్నారు.  ఇలా ఈ పాసురమున గల అన్ని సన్నివేసమును బట్టి, సంబోధనమును బట్టి పెరియాళ్వారు ఈ పాసురమున ప్రబోధించినట్టు తెలుస్తోంది.
జై శ్రీమన్నారాయణ్

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)