Blogger Widgets

శుక్రవారం, ఫిబ్రవరి 17, 2012

శ్రీ రామకృష్ణ పరమహంస

శుక్రవారం, ఫిబ్రవరి 17, 2012

శ్రీ రామకృష్ణ పరమహంస ఫిబ్రవరి 18, 1836 న జన్మించారు.  ఈయన హిందూ మత గురువు. 19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం" లో ఈయన ప్రభావము చాలా ఉంది. భారత దేశములో మతగురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని  ఇస్తారు. కాని రామకృష్ణుని జీవితములోని చాలా విషయములకు ఎన్నో ఆధారములు కలవు. చాలా మంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు, అధారములు దొరకనిదే విషయములు ప్రకటించకుండా ఉండడము దీనికి కారణము. అతని శిష్యుడు స్వామీ శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ ఆతని జీవితచరిత్రను రచించెను.

రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. గదాధర్ క్రీ.శ 1836, ఫిబ్రవరి 18 న పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్, చంద్రమణిదేవి. వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు. గదాధరుడు అందగాడు, బాల్యం నుండే ఇతనికి లలితకళలు, చిత్రలేఖనము లో గల ప్రవేశము వలన వారి గ్రామములో ఇతనికి మంచిపేరు ఉండేది. అయితే చదువు మీద కానీ, ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించకుండెను. ప్రకృతిని ప్రేమిస్తూ గ్రామము బైట పండ్ల తోటలలో స్నేహితులతో కలసి సమయాన్ని గడిపేవాడు.  అతను సాధువులు చెప్పే ఉపన్యాసములు చాలా శ్రద్ధగా వినేవారు. అప్పటినుండి ఆయనలో ఆద్యాత్మిక భావన ఎక్కువ అయ్యింది అనుటలో సందేహం లేదు.
గుడిలో విగ్రహం లో ఆయినా సజీవ దేవుడును చూసారు. కాళీ మాతను పూజించేవారు.  ఎక్కువ అద్యాత్మికత కలిగివుండటం వాళ్ళ రాత్రి పగలు తేడాలేకుండా ఎప్పుడు ద్యానంలోనే వుండేవారు.  అది చూచి అందరు రామకృష్ణ కు వివాహం చేయమని అందరు సూచించారు.  అప్పుడు ఐదు సంవత్సరాల శారదామాత తో వివాహం జరిపించారు.  ఈ శారదా మాతే శ్రీ రామకృష్ణ పరమహంస వారి ప్రధమ శిష్యురాలు గా వుంది.  ఆమె రామకృష్ణ పరమహంస గారి అడుగు జాడలలోనే నడిచింది.  ఆమె కూడా ఆద్యాత్మికత అలవర్చుకున్నది. 
రామకృష్ణ పరమహంస శారదామాతను దేవత పూజించుట 
 ఆమెను రామకృష్ణులవారు కాళీమాతగా కొలచి పూజించేవారు.   రామకృష్ణ పరమహంస అనేకమంది శిష్యులను మనకు అందించారు అందులో ముఖ్యడు వివేకానంద స్వామి.
రామకృషుని బోధనల లో ముఖ్యాంశములు. భగవద్ తత్వం గురించి చెప్పారు.
  1. సృష్టి లో ఏకత్వము
  2. అన్ని జీవులలో దైవత్వము
  3. ఒక్కడే భగవంతుడు, సర్వమత ఐకమత్యము. అన్నిమతాల సారాంశం ఒక్కటే.
  4. మానవ జీవిత ము లో దాస్య కారకాలు కామము, స్వార్థము. కామకాంచనాలనుండి విడివడితే భగవంతున్ని పొందవచ్చు.
  5. మానవసేవే మాధవసేవ
  6. ఒక గమ్యానికి ఎన్నోమార్గాలున్నట్లే భగవంతున్ని చేరడానికి మతాలు కూడా మార్గాలే.
  7. జ్ఞానము ఐకమత్యానికి, అజ్ఞానము కలహాలకి దారి తీస్తాయి.
  8. మానవుడు ఆలోచనతోనే మనిషిగా మారతాడు
  9. భగవంతుని దర్శించడము అందరికీ సాధ్యమే. గృహస్తులు ప్రపంచాన్ని వదిలి చేయనక్కర లేదు కాని వారు శ్రద్దగా ప్రార్థించాలి. శాశ్వతమైన వస్తువులకు క్షణికమైన వస్తువులకు తేడా గమనించే వివేకము కావాలి.
  10. బంధాలను తగ్గించుకోవాలి. దేవుడు శ్రద్దగా చేసే ప్రార్థనలను వింటాడు. భగవంతుని గురించి తీవ్ర వ్యాకులత ఆధ్యాత్మిక జీవితానికి రహస్యము.
  11. కామము, అసూయ దేవుని దర్శనానికి రెండు ముఖ్య శత్రువులు.
 కొన్నాళ్ళకు క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు.తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశిపూర్ కు మార్చారు. అప్పుడు శిష్యులు అందరూ ఎంతో సేవచేశారు.చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ స్వామి వివేకానందునికి ధారపోసారు. 16 ఆగష్టు, 1886న మహాసమాధిని పొందెను. అయన వదిలి వెళ్ళిన పదహారు మంది శిష్య సమ్మేళనమునకు స్వామీ వివేకానంద సారధ్యము వహించెను. వివేకానంద ఆ తరువాత మత తత్త్వవేత్త, ఉపన్యాసకుడుగా ప్రసిద్ది చెందారు.

2 కామెంట్‌లు:

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)