Blogger Widgets

మంగళవారం, ఏప్రిల్ 24, 2012

రేడియో@మార్కొని

మంగళవారం, ఏప్రిల్ 24, 2012



Radio పితామహుడు గూగ్లీమో మార్కొని గురించి మనం చెప్పుకుందాం.  
వైర్‌లెస్‌ను మొట్ట మొదట  ఇటలీ దేశానికి చెందిన గూగ్లీమో మార్కొని కనుగొన్నాడు. మార్కొని 1874 ఏప్రిల్ 25న ఇటలీలో దేశములో జన్మించాడు. ఈయన  గొప్ప ధనవంతుల కుటుంబంలో జన్మించటం వలన ప్రవేట్‌గానే చదువు కొనసాగించాడు. ఈయనికి చిన్నతనము నుండి కొత్తవిషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా కనబరిచేవారు.  ఎప్పుడు కొత్త కొత్త వస్తువులు కనిపెట్టే ప్రయత్నం చేసేవారు.  ప్రతీ విషయాన్ని బాగా లోతుగా పరిశీలించేవారు.

వివోర్నో టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న సమయంలో ఒక వ్యాసం ఆయన దృష్టిని ఆకర్శించింది. ఆ వ్యాసం పేరు ‘వైర్లు లేకుండా రేడియో తరంగాల ప్రసారం సాధ్యమా?’ అన్నది.  అప్పట్లో 1894 నాటికి టెలిగ్రాఫ్‌ని తీగల ద్వారా పంపడమే గొప్ప. మరో రెండేళ్లలో మార్కొని ప్రయోగాలు చేసి రెండు మైళ్ల దూరం వరకూ తీగల సాయం లేకుండా రేడియో తరంగాలను ప్రసారం చేయగలిగాడు.   ఎలాంటి యానకం లేకుండా ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్ళగలిగిన తరంగాలు కాంతి (విద్యుదయస్కాంత తరంగాల ద్వారా సాధ్యమవుతుందని మార్కొని గుర్తించాడు. తక్కువ తరంగా ధైర్ఘ్యము వున్న దృశ్య కాంతి కన్నా ఎక్కువ తరంగ  ధైర్ఘ్యము వున్న రేడియో తరంగాలు ఇందుకు బాగా ఉపయోగపడతాయని మార్కొని  కనుగొన్నాడు. అందుకే ఈ సాధనాన్ని రేడియో  అని అంటారు.  తన పరిశోధనను ఇటలీ ప్రభుత్వం ఆమోదించకపోవడంతో బ్రిటిష్ వారికి ఇచ్చాడు. 1897 వ సంవత్సరములో ఇటాలియన్ వైజ్ఞానికుడు అయిన గూగ్లీమొ మార్కొని లండన్ లో రేడియో కోసం పేటెంట్ పొందాడు.  అప్పట్లో మార్కొని కనుక్కొన్న  రేడియో పరికరాన్ని కొన్ని నౌకలలో వాడేవాడు.  క్రమంగా 1899 నాటికి రేడియో సంకేతాలను 31 మైళ్ల్ల దూరానికి ప్రసారం చేయగలిగాడు. 1901లో అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటి రేడియో సంకేతాలను ప్రసారం చేశారు. దీంతో వైర్ లెస్ పరిశ్రమలో పెద్ద మార్పు వచ్చింది. ఆ తర్వాత వైర్‌లెస్ వ్యవస్థ వలన ఎన్నో ఉపయోగాలు కలిగాయి. మార్కొని 1909లో భౌతికశాస్త్రంలో కార్ల్ ఫెర్డినాండ్ అనే మరో శాస్త్రవేత్తతో కలిసి నోబెల్ బహుమతి పొందాడు. నేడు తీగ లేకుండా సంకేతాలు పంపుతున్న, అందుకుంటున్న టెక్నాలజీకి ఆద్యుడు మార్కొని.  ఆ రేడియోని మార్కొని కనుకున్నారు దీని వలన అప్పట్లో ఒకరినుండి ఒకరికి కమ్యునికేషనికి బాగాఉపయోగించారు. అప్పడు తయారు చేసిన రేడియో చాలాచాలా  మార్పులు చెంది నేటి FM  వరకు రూపు దిద్దుకుంది.  ఈరోజుల్లో టీవీ లు వున్నా  రేడియో  అంటే ప్రజలు ఎక్కువ ఉపయోగిస్తున్నారు.  మనకు ఎక్కడ బడితే అక్కడ  రేడియో వినటానికి వీలుగా వుంది.  మనకు Online Radio లు కూడా ప్రజలుకు అందుబాటులోకి వచ్చాయి.   అలాంటి రేడియోని కనుక్కొన్న మార్కొని పుట్టినదినము ను గుర్తు చేసుకున్నందుకు  నాకు చాలా సంతోషంగా వుంది.  అతనికి భౌతికశాస్త్రములో నోభుల్ బహుమతి కూడావచ్చింది.

శుక్రవారం, ఏప్రిల్ 20, 2012

భూలోక స్వర్గం

శుక్రవారం, ఏప్రిల్ 20, 2012

దివాన్-ఎ-ఖాస్
"భూమి మీద ఎక్కడైనా స్వర్ఘము అంటూ వుంటే అది ఇదే" అని మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ ద్వారా నిర్మించబడినది  ఈ భవనము.  ఈ భవనం ఢిల్లీ లో వుంది మరి ఆభవనం పేరు ఏమిటో తెలుసా  దివాన్-ఎ-ఖాస్.  ఇది రెడ్ ఫోర్ట్ లోని ఒక భాగము.  ఇది అద్భుతమైన కట్టడము. చక్రవర్తి గారి ప్రవేట్ విషయాలు చర్చించుకోవటానికి నిర్మించారు.  మొత్తం పాలరాయితో నిర్మించబడింది.  అక్కడ విలువైన నెమలి సింహాసనం మీద కూర్చొని విషయాలు చర్చించటానికి నిర్మించారు.  ఈ హాల్ నిర్మాణానికి పాలరాయి నవరత్నాలను ఉపయోగించి బంగారంతో నిర్మించారు.  నెమలి రూపంలో నిర్మించారు.  ఇలా తీర్చి దిద్దటానికి ఏడు సంవత్సరాలు కాలం పట్టిందిట. ఇలా చెప్తూ వుంటే ఈ నిర్మాణాన్ని చూడాలి అనిపిస్తోంది.  షాజహాన్ అన్నట్టు నిజంగా భూలోక స్వర్గంగా అనిపిస్తోంది కదండి. 

గురువారం, ఏప్రిల్ 19, 2012

ఛార్లెస్ డార్విన్

గురువారం, ఏప్రిల్ 19, 2012

మహావిశ్వాన్నీ, భూగోళం మీద కోటాను కోట్ల జీవరాశుల్ని ఎవరూ సృష్టించలేదనీ, వాటి కవే ఏర్పడ్డాయనీ, డార్విన్  చెప్పారు.  మన పాఠాల్లో చదువుకుంటున్నాం కదా!.  మరి ఈ డార్విన్ ఎవరు ఆయన సంగతి తెలుసుకోవాలని వుంది కదా!  చాలా క్లుప్తముగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  ఛార్లెస్ డార్విన్ ష్రుబర్రీ లో ఫిబ్రవరి 12, 1809  జన్మించాడు. వీరి తండ్రిగారు తాతగారు డాక్టర్లు. డార్విన్ తన చిన్నతనము లోనుండి ప్రకృతిని చాలా బాగా పరిశీలనా తత్వం కలవారు.  అదే ప్రకృతి పరిశీలనాశక్తి వారసత్వంగా సంక్రమించిందని మనకు తెలుస్తున్నది.  ప్రకృతి పరిశీలనపట్ల డార్విన్ కున్న ఇష్టం వల్లన డాక్టర్ కాలేకపోయాడుతన తండ్రి కోరిక మేరకు మతాచార్యుడిగా మారాడుతన పరిశీలనలకు ఎక్కువ సమయం దొరకడమే దీనికి కారణం.  175 ఏళ్ల క్రితమే భూమ్మీదే లేవంటే చాలా ఆశర్యంగా ఉంటుంది.  చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త జీవ జాతుల పుట్టుక అనే తన గ్రంథంలో జీవులన్నీ తమ కంటే సరళమైన ప్రాథమిక జీవుల నుండి ఆవిర్భవించాయని ప్రకటించి మత వాదుల సృష్టి వాద సిద్ధాంతాన్ని దెబ్బతీశారు. అప్పట్లో డార్విన్ చెప్పిన సిద్దాంతాలు ఎవరు నమ్మలేదు.   అప్పట్లో డార్విన్ పై అనేకమైన వ్యతిరేక ప్రచారాలు వుండేవి.  మనుషులు కోతులునుండి పరిణామం చెందాడు అని డార్విన్ అన్నదానికి.  డార్విన్  గేలిచేస్తూ ఇలా అనేవారు "మనుషులంతా కోతుల నుండి పరిణామం చెందలేదు డార్విన్ మాత్రమే కోతి నుండి వచ్చాడని"
NewsListandDetails
లండన్ కు చెందిన నావికాదళం దక్షిణ అమెరికా సముద్ర తీరాన్ని సర్వే చేయడానికి బీగల్ అనే ఓడలో బయలుదేరింది.  ప్రకృతి శాస్త్రజ్ఞుడైన డార్విన్ కు బృందంతో ప్రయాణించే అవకాశం దొరికింది. డార్విన్ డిసెంబర్ 27,1831 బీగల్ ఓడలో బయలుదేరి నాలుగు సంవత్సరాల పాటు ప్రకృతి పరిశీలనలో గడిపాడు.  అప్పుడు ఆ  యాత్రలో డార్విన్ అనేక జీవ జాతులను, శిలాజాలాలను నిశితంగా పరిశీలించాడు. ప్రతి జీవజాతి వేరువేరుగా సృష్టించబడినదా అవి ఒకదానినొకటి ఒకానొక సామాన్య జీవజాతితో సంబంధం కలిగే వున్నాయా. అనే ప్రశ్నలకు సమాధానాలు వెదకసాగాడు. 1859 లో జాతుల పుట్టుక అనే గ్రంథాన్ని రచించాడు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని మొదట కొద్ది మంది శాస్త్రవేత్తలు మాత్రమే అంగీకరించారు. క్రమక్రమంగా తర్వాత వచ్చిన ఉత్పరివర్తన సిద్దాంతాలు కూడా పరిణామ వాదాన్నే బలపరిచాయి. దీంతో అన్ని చోట్ల డార్వాన్ సిద్దాంతానికి బలం వచ్చింది.  ఆరోగ్యం క్షీణించడంతో 1881 ఏప్రిల్ 19 డార్విన్ మరణించాడు. ప్రపంచ ప్రజలలో ఆలోచనలకు శాస్త్రీయత వైపు మళ్ళించిన మహా గొప్పమేథావిగా జీవశాస్త్ర చరిత్రలో నిలిపోయాడు.  

బుధవారం, ఏప్రిల్ 18, 2012

చూడచిన్నదానవింతే సుద్దులు

బుధవారం, ఏప్రిల్ 18, 2012

అన్నమాచార్యులు వారు రచించిన  మంచి పాట .  ఈ పాటను మనం గొప్ప సంగీత విద్వాంసులు అయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అద్బుత గళం నుండి మనం విందాం.

చూడచిన్నదానవింతే సుద్దులు కోటానఁగోటి

యేడేడ నేరుచుకొంటివే వో కలికి


కిన్నెరమీటులలోని గిలిగింతలు , నీ 
వన్నెల కనుచూపుల వలవంతలు
యెన్నరాని యిచ్చకపు టెలయింతలు
యెన్నడు నేరుచుకొంటివే వో కలికి

సారెకు నెడవాయని సరసములు , నీ
తారుకాణ సన్నల తమకములు
గారవించి బుజ్జగించే గమకములు
యేరీతి నేరుచుకొంటివే వో కలికి

కందువ శ్రీవేంకటేశు కలయికలు , నీ
యందమైన సమరతి యలయికలు
పొందుల మునుముంగిలి పొలయికలు
యెందెందు నేరుచుకొంటివే వో కలికి

మంగళవారం, ఏప్రిల్ 17, 2012

బెంజమిన్ ఫ్రాంక్లిన్

మంగళవారం, ఏప్రిల్ 17, 2012

బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక ప్రముఖ  అమెరికా శాస్త్రవేత్త.  ఈయన  శాస్త్రవేత్త మాత్రమె కాదు రచయిత, గొప్ప చిత్రకారుడు,  రాజకీయ నాయకుడు మరియు గొప్ప మేధావి.  ఈయన అనేక కళలలో ప్రావీణ్యుడు, ప్రాంక్లిన్ కు మొదటి అమెరికన్" అనె బిరుదు కూడా కలిగివున్నాడు.
బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేక ఆవిష్కరణలు చేసారు.  బెన్ ఫ్రాంక్లిన్  కీర్తి ప్రధానంగా విద్యుత్ తో కూడిన  ప్రయోగాలు చేసారు.  ఈయన  ఆవిష్కరణలు చాలా రూపొందించినవారు. మీరు క్రింద ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆవిష్కరణలు క్రింద పొందుపరచాను.
Bifocals అను ఛత్వారపు కళ్ళద్దాలు కనుక్కొన్నారు.  అనారోగ్యము తో కదలలేని వారికి సౌకర్యవంతముగా మూత్ర కాథెటర్ ను ఫ్రాంక్లిన్ తన రోజు ఒక కాథెటర్ వలె ఉపయోగించిన హార్డ్ ట్యూబ్ స్థానంలో ఒక సౌకర్యవంతమైన కాథెటర్ రూపొందించినవారు.  దీనివల్ల  బెడ్  మీద  వుండే మూత్రం విసర్జించి రోగి ఉపశమనం పొందుతారు.  ఫ్రాంక్లిన్ పొయ్యి అనునది 1742 లో సంప్రదాయ పొయ్యి గా అభివృద్ధి రూపొందించినవారు, అది మరింత వేడి కలిగించేవిధంగా  రూపొందించినవారు మరియు దీనికి అతి తక్కువ కట్టెలు ఉపయోగించారు, నీటికి కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అత్యంత నిప్పు గూళ్లు ఫ్రాంక్లిన్ డిజైన్ పైనే ఆధారపడి ఉంటాయి.  మెరుపు రాడ్ - విద్యుత్ ప్రవర్తనకు సంబంధించి బెన్ ఫ్రాంక్లిన్ యొక్క ఆవిష్కరణలు అతనికి 1752 లో మెరుపు రాడ్ సృష్టించటం జరిగింది.  
ఫెర్గూసన్ యొక్క క్లాక్ - ఫ్రాంక్లిన్ మూడు చక్రాలు మరియు రోజు చాలా గడియారములు కంటే మరింత సమర్ధవంతంగా అని రెండు pinions ఉపయోగించి గంటలు, నిమిషాలు మరియు సెకన్లు చెప్పారు ఒక గడియారం రూపొందించినవారు.  Streetlights - ఫ్రాంక్లిన్ ప్రజా లైటింగ్ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి అమెరికా అంతటా కనిపిస్తుంది ఆ సాధారణంగా ఉపయోగించే నాలుగు పలకను వీధి కాంతి రూపొందించినవారు.మునుపటి డిజైన్ ఇన్ గ్లోబ్ ఆకారంలో మ్యాచ్లను బర్నింగ్ చమురు నుండి మసి వృద్ధి వలన కొన్ని గంటల్లో కృష్ణ పెరిగింది. ఫ్రాంక్లిన్ యొక్క డిజైన్ మసి తో నల్లబడిన నుండి చూపు నిరోధించే మరియు ప్రకాశవంతమైన అన్ని రాత్రి మిణుగురు లు కూడా కలిగేలా చేసారు.  కరేజ్ ఒడోమేటర్ను ముఖ్యంగా అతను మొదటి మాస్టర్ జనరల్ గా ప్రయాణిస్తున్నప్పుడు ఎన్ని మైళ్ళ తెలుసుకోవడం ఆసక్తి కలిగి odometers వివిధ రకాల పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్నాయి, కానీ ఫ్రాంక్లిన్ ఒక రవాణా లో ప్రయాణించారు మైళ్ళ ట్రాక్ చేయడానికి 1763 చుట్టూ ఒక కొత్త వెర్షన్ రూపొందించినవారు యునైటెడ్ స్టేట్స్ మరియు వివిధ పోస్టల్ మార్గాలను దూరం కొలిచటానికి ఉపయోగిస్తున్నారు.  లైబ్రరీ కుర్చీ - శ్రద్ధగా చదువుకోవటాని వీలుగా ఈ  కూర్చి తయారు చేసారు.  ఎక్స్టెన్షన్ ఆర్మ్ - ఫ్రాంక్లిన్ అధిక చాలా అని ఫలకాలు మీద పుస్తకాలు చేరుకోవడానికి ఉపయోగించే దీర్ఘ స్టిక్ రూపొందించినవారు. పుస్తకాలు అందుకొని గట్టిగా పట్టుకొను చేయడానికి, ఆర్మ్ దిగువన చివరిలో ఒక తాడు ఈర్పాటు చేసారు, 1785 న లాగటం ద్వారా మూసుకుపోయి ఇది చివర రెండు వేళ్లు వచ్చింది.   నాకు పుస్తకాల అర అయితే బాగా నచ్చింది.స్విమ్ రెక్కల ను కూడా తయారు చేసారు.  అతను తన చేతుల్లో తగిన రెక్కలను పెట్టుకొని ఒక కలువలో ఈ  ప్యాడ్ వంటి ఆకారంతో ఈది బెన్ వేగంగా గమ్యాన్ని చేరుకున్నారు !, 1717 లో ఈతకు  సహాయపడింది.
బెంజమిన్ ఫ్రాంక్లిన్ మనకు కొన్ని మంచి మాటలు కూడా చెప్పారు వాటిలో కొన్ని ఇవిగో.
పొదుపు చేయటం కూడా ఒక సంపాదన.
ఎక్కువ అభిరుచులు కలవారు ఎక్కువ సంతోషంగా వుంటారు.
ఖాళీ సమయం దొరకాలి అనుకుంటే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి.

శనివారం, ఏప్రిల్ 14, 2012

Visual 3d Eye Illusion - Moving Circle

శనివారం, ఏప్రిల్ 14, 2012

PLEASE  WAIT FOR IT TO FULLY LOAD & START TURNING (MOVING)

శుక్రవారం, ఏప్రిల్ 13, 2012

Twinkle, twinkle, little star (Story)

శుక్రవారం, ఏప్రిల్ 13, 2012



Twinkle, twinkle, little star Story

"Twinkle, Twinkle, Little Star" is a popular English nursery rhyme. The lyrics are from an early nineteenth-century English poem, "The Star" by Jane Taylor. The poem, which is in couplet form, was first published in 1806 in Rhymes for the Nursery, a collection of poems by Taylor and her sister Ann. It is sung to the tune of the French melody Ah! vous dirai-je, Maman (oldest known publication 1761). The English lyrics have five stanzas, although only the first is widely known. It has a Roud Folk Song Index number of 7666.

The English lyrics were first published as a poem with the title "The Star" by sisters Ann and Jane Taylor (1783–1824) in Rhymes for the Nursery in London in 1806. The poem was written by Jane.
Twinkle, twinkle, little star,
How I wonder what you are.
Up above the world so high,
Like a diamond in the sky.

     When the blazing sun is gone,
     When he nothing shines upon,
     Then you show your little light,
     Twinkle, twinkle, all the night.

Then the traveller in the dark,
Thanks you for your tiny spark,
He could not see which way to go,
If you did not twinkle so.

     In the dark blue sky you keep,
     And often through my curtains peep,
     For you never shut your eye,
     Till the sun is in the sky.

As your bright and tiny spark,
Lights the traveller in the dark.
Though I know not what you are,
Twinkle, twinkle, little star.

     Twinkle, twinkle, little star.
     How I wonder what you are.
     Up above the world so high,
     Like a diamond in the sky.

Twinkle, twinkle, little star.
How I wonder what you are.
How I wonder what you are.

బుధవారం, ఏప్రిల్ 11, 2012

పుట్టినరోజు శుభాశిస్సులు .

బుధవారం, ఏప్రిల్ 11, 2012


ఈ రోజు నా పుట్టినరోజు అందుకు నా బ్లాగ్ మిత్రులు, బందు మిత్రులు నుండి శుభాశిస్సులు కోరుకుంటున్నాను.  నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ  నా నమస్సులు తో కూడిన ధన్యవాదములు.

మంగళవారం, ఏప్రిల్ 10, 2012

Father of Homeopathy

మంగళవారం, ఏప్రిల్ 10, 2012

Father  of  Homeopathy Samuel Hahnemann 1755 - 1843

హోమియోపతీ మందులు అనగానే మాలాంటి పిల్లలకి చాలా ఇష్టం కదా!  హోమియోపతి  మెడిసిన్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతి.  అతిముఖ్యంగా భారత దేశంలో అత్యంత ఎక్కువగా  ప్రజలు వాడుతున్నట్టు ప్రపంచంలో ఇంకెక్కడా వాడటంలేదు.  ఈ హోమియోపతి మందును దరిదాపు రెండు వందల ఏళ్ళబట్టీ వాడుకలో ఉన్నప్పటికీ దీనికి ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయమైన ఆదారం  లేదట .  హోమియోపతీ అనగా  హోమోయిస్ ఒకే రకమైన బాధ, మరియు ఒక  రోగ లక్షణం.  ఇది  రెండు గ్రీకు మాటలని కలపగా వచ్చిన పదము. దీనిని పుట్టుకగురింఛిన విషయాలు తెలుసుకుందాం.  మనకు అతి సుపరిచితమైన సామెతలు వున్నాయి  ముల్లును ముల్లుతోనే తీయాలి మరియు  ఉష్ణం ఉష్ణేత శీతలే అన్నట్లు, వజ్రం వజ్రేనభిద్యతే అన్నట్లు ఒక పదార్ధం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతీ యొక్క  మూల సూత్రం. ఈ వైద్యపద్ధతిని, ఈ మాటని కనిపెట్టినది సేమ్యూల్ హానిమాన్.  ఈరోజు  సేమ్యూల్ హానిమాన్ పుట్టిన రోజు అందుకే ఈ హోమియోపతి మందు గురించి  చెప్తున్నాను.  సేమ్యూల్ హానిమాన్  1755-1843 అనే జెర్మనీ దేశపు వైద్యుడు. ఈయన వైద్య కళాశాలకి వెళ్ళి  వైద్యశాస్త్రం అధ్యయనం చేసేడు. ఆ రోజులలో వైద్యం అంటే నాటు వైద్యమే. రోగానికి కారణం మలినపు రక్తం అనే నమ్మకంతో రోగి రక్తనాళాలని కోసి రక్తం తెసేసేవారు. దేహనిర్మాణశాస్త్రం (ఎనాటమీ), రోగనిర్ణయశాస్త్రం, రసాయనశాస్త్రం అప్పటికి అంతగా తెలియదనే చెప్పుకోవచ్చు . కనుక అప్పటి వైద్య విధానాలలో హానిమాన్ కి తప్పులుగా అనిపించింది . ఈ తప్పులను మార్చటానికి ఈయన  కొత్త  పద్దతిని కనిపెట్టాడు. ఆ కొత్త పద్దతే హోమియోపతీ.  హోమియోపతీ వాడుకలోకి వచ్చిన తరువాత హోమియోపతీ మందులు నమ్మకము వున్నవారు  "ఇంగ్లీషు వైద్యాన్ని" ఎల్లోపతీ (allopathy) అనటం మొదలు పెట్టేరు.   పూర్వం నుండి హోమియోపతి మందులు వాడినంత కాలం ఆహారనియమాలు పాటించాలి అని చెప్పేవారు.  ex : onion వాడకూడదు అని ఇంకా అలాంటివి వుండేవి.  మారుతున్న కాలానికి అనుగుణంగా మందులు కూడా చాలా అభివృద్ధి చెందింది.  ఇప్పుడుఇప్పుడు ఆహారనియమాలు లేకుండా వాడుకునే విదంగా తయారు చేస్తున్నారు.  హోమియోపతి మందులు వాడితే ఎటువంటి అనారోగ్యమైనా శాశ్వితముగా తగ్గుతుంది అంటారు.  సేమ్యూల్ హానిమాన్ పుట్టిన రోజు సందర్భముగా హోమియోపతి గురించి కొంచెం తెలుసుకున్నాం.  ఇంకో సందర్భములో మిగిలిన విషయాలు తెలుసుకుందాం.  హోమియోపతి వాడకమువల్ల  ప్రతికూల లేదా దుష్ప్రభావాలు లేకుండా నిశ్చయముగా నయంఅవ్వటం అనది విశేషముగా వుంది.

సోమవారం, ఏప్రిల్ 09, 2012

PC @ వైరస్ ఎలా వస్తుంది?

సోమవారం, ఏప్రిల్ 09, 2012

వైరస్ ఎలా కనిపెట్టవలసి వచ్చిందో ముందు తెలుసుకోవాలి. 19వ శతాబ్దాంతంలో చార్లెస్ చాంబర్లాండ్ పోర్సలీన్ ఫిల్టర్ని కనుగొన్నాడు, దీని ద్వారా అన్ని బాక్టీరియాలను జల్లించడానికి వీలయ్యేది కాని వైరస్‌లు మాత్రం వేరుచేయబడేవి కాదు. దిమిత్రి ఇవనోవ్‌స్కీ ఈ ఫిల్టర్ సహాయంతో పొగాకు మొజాయిక్ వైరస్‌ (Tobacco Mosaic Virus) ను అధ్యయనం చేసాడు. పొగాకుల సారాన్ని (extract) వడపోసిన తర్వాత కూడా ఆ ఎక్స్‌ట్రాక్టుకు వ్యాధిని ప్రబలింపజేసే గుణం ఉన్నదని ఆయన తన పరిశోధనల ద్వారా తెలియజేసాడు. అదే సమయంలో, వడపోసినా చిక్కని వ్యాధి కారకాలు కొన్ని ఉంటాయని, ఇతర ప్రయోగాల వల్ల బాక్టీరియాలు, వైరస్‌లు వేర్వేరని ఇతర శాస్త్రవేత్తలు నిర్దారించారు. అంతేకాక వైరస్‌లు కూడా బాక్టీరియాల వలె వ్యాధులను కలగజేస్తాయని కనుగొన్నారు. మరికొన్ని ప్రయోగాల తర్వాత వైరస్‌లు బాక్టీరియాల కంటే సూక్ష్మమైనవని నిర్ధారించబడినది. వైరస్ అనే పదాన్ని డచ్ సూక్ష్మజీవ శాస్త్రవేత్త (microbiologist) మార్టినస్ బీజెరింక్ ప్రతిపాదించాడు.  అయితే వైరస్ వల్ల వ్యాధులు వస్తాయని తెలిసింది.  అది జీవం వున్న జీవులుమీద పనిచేసాయంటే అర్ధం వుంది.  నాకు ఆ విషయంలో కొంచెం క్లారిటీ వుంది.  ఇప్పుడు నాకు ఒక డౌట్ వుంది.  మొబైల్స్ మరియు కంప్యూటర్ లు జీవం లేని (నిర్జీవమైన) వస్తువులు కదా మరి వాటికి వైరస్ రావటం ఏమిటి?  అలా వచ్చిన వైరస్ వల్ల అవి పనిచేయకపోవటం ఏమిటి నాకు అస్సలు ఆవిషయం మాత్రం నాకు అర్ధం కాలేదు.  మీకు తెలిస్తే దయచేసి నాకు తొందరగా చెప్పేయండి .  నాకు జవాబు చెప్పినవారికి ముందుగానే ధన్యవాదములు.

శుక్రవారం, ఏప్రిల్ 06, 2012

జయ హనుమాన్.

శుక్రవారం, ఏప్రిల్ 06, 2012

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.  

గురువారం, ఏప్రిల్ 05, 2012

Which syllabus is best? SSC, or CBSE?

గురువారం, ఏప్రిల్ 05, 2012

My mom is planing to change me a school.   You know at present I am studying  5th Class with SSC syllabus. My mom planning to join me in 6th in one of the good school, but the thing is we are in confusion about to join me  in SSC or CBSE? Our actual requirement is I  should be well and good in communication and also everything should be very good in presenting the information? Could you please suggest which is the good SSC syllabus  or CBSE syllabus ? Please suggest us.

ఉప్పుపై పన్ను


 మహాత్మా గాంధీగారు  బ్రిటిష్ వారు మన భారతదేశంలో ఉప్పు పన్నువిధించినందుకు సవాలు చేస్తూ61సంవత్సరాల వయస్సులో  మహాత్మా గాంధీగారుతో పాటు 78 అనుచరులు తో కలసి 23 రోజుల్లో 240 మైళ్ళ దూరం దండి మార్చ్ చేసారు.  ఈ దండి యాత్ర ముఖ్య ఉద్దేశము మనము ఎంతైనా తెలుసుకోవాలి. ఈ ఉప్పు సత్యాగ్రహము మొదట గాంధి గారిచే ప్రారంభించబడిన అహింసా ప్రచార ఉద్యమంగా మన చెప్పుకోవచ్చు.  ఇది బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా జరిగింది.  ఉప్పుపై పన్ను కట్టుటకు నిరసనగా మార్చ్ 12 ,1930  న  మొదలు పెట్టారు ఈ దండి యాత్ర .  ఈ దండి యాత్రనే ఉప్పు సత్యాగ్రహముగా చెప్తారు. ఈ ఉద్యమము వెనకాల ప్రధానమైన  ఉద్దేశము వుంది బ్రిటిష్ వారిని మనదేశము నుండి తరిమి కొట్టి మనదేశానికి సంపూర్ణ స్వాతంత్రము సాధించుట  అనేది ముఖ్యమైన ఉద్దేశము.  ఈ  దండి యాత్ర సబర్మతి ఆశ్రమము నుండి ప్రారంభించి దండి వరకు కొనసాగించారు.  ఈ యాత్రలో కొన్ని వేలమంది భారతీయులు పాల్గొన్నారు.  ఈ దండి యాత్ర  పూర్తిగా విజయవంతము అయినట్టుగా చెప్పచ్చు.  ఈ దండి యాత్ర  5 వ ఏప్రిల్ 1930 న దండి ప్రదేశానికి  చేరుకుంది.  లక్షలకొద్దీ భారతీయులు స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.కోట్ల భారతీయులపై బ్రిటిష్ వారు  వేసేన  ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా మౌనముగానే  (సత్యాగ్రముతో) ప్రారంభించి చిట్టచివరికి ఆ మౌనముతోనే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రము సాధించారు . ఇది చాలా గర్వించదగ్గ సంగతిగా చెప్పచ్చు.  హింసతో సాధించలేనిది ఆహింసతో సాధించవచ్చు అని గాంధిగారు నిరూపించారు.

బుధవారం, ఏప్రిల్ 04, 2012

మొట్టమొదటి మొత్తం కృత్రిమ గుండె మార్పిడి

బుధవారం, ఏప్రిల్ 04, 2012

image

డాక్టర్ డెంటన్ A  కూలే ఒక మానవ శరీరములో మొట్టమొదటగా ఒక కృత్రిమ గుండె ఇంప్లాంట్ చేసిన  మొదటి అమెరికన్ సర్జన్ మరియు గుండె-మార్పిడి అను దానికి మార్గదర్శకుడు గా వున్నవాడు. మొట్ట మొదట 1960 లో ఆయన పుట్టుకతో వచ్చిన గుండె వ్యాధి తో శిశువుల హృదయాలలో న సున్నితమైన శస్త్రచికిత్స చేసారు  తరువాత విజయవంతంగా pulmonary embolism (ఒక గడ్డకట్టిన రక్తము యొక్క భాగము ద్వారా పుపుస ధమని యొక్క ప్రతిష్టంభన) ను తొలగించటము చేసిన  మొదటి సర్జన్ ఈయన. 3 మే 1968, కూలీ తన మొదటి మానవ గుండె మార్పిడి ప్రదర్శించారు.   

మానవవుని లో అమర్చిన మొదటి మొత్తం కృత్రిమ గుండెను, ఈ పరికరం Liotta చాలా కృషి చేసి అభివృద్ధి చేశారు మరియు హౌస్టన్ లోని సెయింట్ లూకా యొక్క ఎపిస్కోపల్ హాస్పిటల్ వద్ద, ఏప్రిల్ 4, 1969 న సర్జన్ డెంటన్ కూలే ద్వారా అమర్చారు. కార్ప్ అను రోగికి ఈ కృత్రిమ గుండెను ఏర్పాటు చేసారు.  

సంఖ్య దాత గుండె వ్యాధి గుండె కండరాల తో మరణిస్తున్న 47 ఏళ్ల రోగి అందుబాటులో ఎందుకంటే 4 న April 1969,, అతను ఒక తాత్కాలిక చర్యగా సిలికాన్ తయారు చేసిన యాంత్రిక గుండె అమర్చిన. ప్రయోగాత్మక కృత్రిమ గుండె 65 గంటల ఉపయోగించారు, ఈయనకు ఒక దాత గుండె దొరికేవరకు తాత్కాలికంగా వుంచుటకు ఉపయోగించారు. మరియు ఒక మానవ గుండె అందుబాటులోకి వచ్చినపుడు తొలగించారు..  
కార్ప్ నిజమైన గుండె పొందిన తరువాత వెంటనే మరణించారు అయినప్పటికీ ఈ విధానం ద్వారా గుండె రోగులలో కృత్రిమ గుండె మార్చవచ్చు అని ప్రయోగాత్మకంగా చూపించి. గుండెమీద కొత్త ప్రయోగాలు చేయటానికి నాంది వేసారు.  చాలా మంది ఈ శాస్త్ర చికిత్సని  అనైతిక శస్త్రచికిత్స  గా విమర్శించారు.  నేటి రోజున కృత్రిమ హృదయ మార్పిడికి పునాది వేసినది  కూలే. 

మంగళవారం, ఏప్రిల్ 03, 2012

ఛత్రపతి

మంగళవారం, ఏప్రిల్ 03, 2012


షాహాజీ-జిజాబాయ్ దంపతులకు పూణేకు దగ్గర ఉన్న జున్నార్ పట్టణమందు శివాజీ ఫిబ్రవరి 19, 1627 న జన్మించాడు. జిజాబాయ్‌కి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ చనిపోతూవుండగా జిజాబాయ్ ఎప్పుడూ పూజించే దేవత అయిన పార్వతిదేవి పేరును శివై పేరు శివాజీకు పెట్టింది.  శివాజిని పార్వతిదేవి ప్రసాదంగా భావించింది. 
షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యఅయిన జిజాబాయ్ కి  అప్పగించి యువకుడయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్దులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలు కలిగేలా చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు శివాజి. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ద తంత్రాలలో గొప్ప నేర్పరిగా మారాడు. సకల విద్యలు నేరుచుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే తన ప్రధాన కర్తవ్యముగా అనుకోని  ఆ దిశగానే తన ప్రయత్నము మొదలు పెట్టాడు . మరాఠా  సామ్రాజ్య స్థాపనకు చాలా కృషి చేసాడు శివాజి.చిన్నవయసులోనే అంటే 17 సవత్సరాల వయసులోనే శివాజీ మొట్టమొదటి యుద్దం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన తన ఆధీనములో తెచ్చుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేసాడు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజి అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. తరువాత వారు చాలా యుద్ధాలు చేసారు.  వాటిలో ప్రధానముగా ప్రతాప్‌ఘడ్ యుద్దం, కొల్హాపూర్ యుద్దం,  పవన్‌ఖిండ్ యుద్దం, షైస్తా ఖాన్ తో యుద్దం, సూరత్ యుద్దం మొదలగున్నవి.  తరువాత 1666లో ఔరంగజేబు తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని ఆరేళ్ళ కొడుకు శంభాజీని ఆగ్రాకు పుట్టినరోజు వేడుకలకు అహ్వానించాడు. ఇది శివాజీని అలా ఆహ్వానించటం వెనుక  మోసపూరితమైన ఆలోచన ఔరంగజేబు కలిగివుండటమే.  మొదట శివాజీని చంపాలనుకున్నాడు దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగయినా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలలపాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు. శివాజీ, శంభాజీ ఇద్దరూ పళ్ళబుట్టల్లో దాక్కుని తప్పించుకొన్నారని అంటారు. అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల, మొఘలులు మరిన్ని యుద్దాలలో పాల్గొంటూ ఉండడంవల్ల ఔరంగజేబు శివాజీ నుండి ముప్పు ఉండదని భావించినా సరే పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ ఎక్కువ ప్రాచుర్యంపోందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1674 నాటికి లక్ష మంది సుశిక్షితులయిన సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటల పైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. అలుపెరగని యుద్దాలతో అలసిపోవడం, సరి అయిన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది.  తరువాత కొన్నాళ్ళకు సింహగఢ్ యుద్ధం చేసి తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్దిరోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమయిన సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ 'యశ్వంతి ' అనే పేరుకల ఉడుముకు తాడు కట్టి కొండ పైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళినవారు అందించిన తాళ్ళను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకొంది. చరిత్రలో యుద్దంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ఫస్ట్  కావచ్చు అని చారిత్రకుల విశ్లేషణ ప్రకారం తెలుస్తోంది .
యుద్దతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం,పటిష్టమయిన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేసాడు. ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డాడు. జూన్ 6, 1674న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి ' అని బిరుదును ప్రదానం చేసారు.కొన్నాళ్ళకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రచేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు.27 ఏళ్ళపాటు యుద్దాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజి మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680  రాయఘడ్ కోటలో మరణించాడు.  మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి.


సోమవారం, ఏప్రిల్ 02, 2012

అంతర్జాతీయ బాలల బుక్ డే

సోమవారం, ఏప్రిల్ 02, 2012


ఏప్రిల్, 2012  అనగా ఈరోజు  అంతర్జాతీయ బాలల పుస్తకాల రోజు గా జరుపుకుంటున్నాం.  పుస్తకం తీయటానికి అంతర్జాతీయ బాలల బుక్ డే స్పూర్తినిస్తూ, పిల్లలుకు బుక్స్ చదవాలని వారికి తెలియచేయటం ముఖ్యఉద్దేసముగా ఉంది.

ఏప్రిల్ 2 న హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ యొక్క పుట్టినరోజుకు గుర్తుగా International childrens books day గా జరుపుకుంటున్నాము.  
The Little Mermaid Story.The Ugly Duckling  , The Nightingale  వంటి అనేక ప్రముఖ పిల్లల కథల రచయిత హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ పుట్టిన  రోజు యువ సాహిత్యంప్రేమికులకు గుర్తించడానికి ఎంచుకున్నారు.


యంగ్ పీపుల్, లేదా IBBY (
IBBY stands for International Board On Books for Young People.)కోసం పుస్తకాలు అంతర్జాతీయ బోర్డ్ ఆర్గనైజ్ చేయటం జరిగింది. దీని లక్ష్యం పుస్తకాలు మరియు యువ ప్రజలకు చదివేతందుకు  ప్రోత్సహించడము అనే ఉద్దేశము కలిగివుంది. IBBY 1953 లో జురిచ్, స్విట్జర్లాండ్ లో స్థాపించబడింది. నేడు ప్రపంచం లోని అన్ని ప్రాంతాల నుండి 70 నేషనల్ సెక్షన్లు జరిగినది.


అంతర్జాతీయ బాలల బుక్ డే సందర్భంగా రచన పోటీల్లో మరియు ప్రసిద్ధ రచయితలు మరియు విశదీకరింపులు నుండి చర్చలు సహా ప్రపంచవ్యాప్తంగా events నిర్వహించారు , నేను కూడా ఆపోటి లో పాల్గొన్నాను కూడా.

అందరికీ  వండర్ల్యాండ్, హ్యారీ పాటర్, అండ్ ది ఆలిస్ వంటి రచనలు బాగా తెలిసిన పరిచయం ఉండగా మనకు  అద్భుతమైన పిల్లల పుస్తకాలు మనకు లభిస్తున్నాయి.  ఈ పిల్లల పుస్తకాలు, పిల్లలే కాకుండా పెద్దలు కూడా చదువుకునే టట్టు వున్నాయి.

మనం రోజు స్కూల్ బుక్స్ చదువుతాం అవి కాకుండా మంచి పుస్తకాలు కనుగొనుటకు ప్రయత్నించండి, అంతర్జాతీయ బాలల బుక్ డే  సందర్భముగా ఈరోజు నుండి మంచి పుస్తకాన్ని చదవటానికి అలవాతుచేసుకోండి. 




Get ready for reading on International Childrens Book Day! so Happy International Children 's  Book Day . 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)