Blogger Widgets

గురువారం, నవంబర్ 15, 2012

కార్తిక పురాణం 2వ రోజు

గురువారం, నవంబర్ 15, 2012

 
బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు.
''రాజాఈ కార్తీకమాసంలో స్నాన దాన జపాల్లో దేనినైనాకొద్దిపాటిగా ఆచరించినా సరే.. అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుందిఎవరైతే,సుఖలాలసులై శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరిన్చారో అలాంటివాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు.
పౌర్ణమ్యాం కార్తీకమాశ స్నానాందీస్తు నాచారాన్|
కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతే నృప||
క్రమాద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః|
అత్రై వోదాహరంతీ మ మితిహాసం పురాతనం||
భావం:
కార్తీక పౌర్ణమినాడుస్నాన దాన జపోపవాసాల్లో ఏ ఒక్కటీ కూడా ఆచరించనివాళ్ళు కోటి పర్యాయాలు చండాల జన్మలు ఎత్తిచివరికి బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారుఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెప్తాను వినండి..
తత్వనిష్ఠోపాఖ్యానం

పూర్వం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడుసకల శాస్త్ర పారంగతుడుఅసత్యాలను పలకనివాడుభూతదయ గల దయాళువూతీర్థాటనప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకసారి తీర్ధయాత్ర గురించి ప్రయాణిస్తూ దారిలో గోదావరీ తీరాన ఉన్న ఒకానొక ఎత్తయిన మర్రిచెట్టు మీద కారునలుపు శరీర ఛాయ గలవారుఎండిన డొక్కలుఎర్రని కళ్ళుపెరిగిన గడ్డాలతో జుట్టు ఇనుప తీగల్లా పైకి పొడుచుకు నిటారుగా నిలబడిఉన్న తల వెంట్రుకలతో వికృత వదనాలతో కత్తులుకపాలాలూ ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు.  ఆ రాక్షసులవల్ల భయంచేత మర్రిచెట్టు నాలుగువైపులా కూడా పన్నెండు మైళ్ళదూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేది ఉండేది కాదుఅటువంటి భయకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుండి చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడుదాంతోబాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడి శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు.
తత్వనిష్ఠుడి శరణాగతి

త్రాహి దేవేశ లోకేష త్రాహి నారాయణావ్యయ సమస్త భయవిధ్వంసిన్|
త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశత్వట్టోహం జగదీశ్వర||
భావం:  
''దేవతలకూలోకాలకూ కూడా యజమానివి అయినవాడానారాయణాఅవ్యయానన్ను కాపాడుఅన్నిరకాల భయాలనూ అంతం చేసేవాడానిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించుఓ జగదీశ్వరానువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడనునన్ను అన్నివిధాలా కాపాడు'' అని ఎలుగెత్తి స్మరిస్తూ రాక్షస భయంతో అక్కడినుంచి పారిపోసాగాడుఅతన్ని పట్టుకుని చంపాలనే ఆలోచనతో ఆ రాక్షసత్రయం అతని వెనుకే పరిగెత్తసాగిందిరాక్షసులు దగ్గరౌతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు ద్యోతకం అవడంవల్ల తెరిపి లేకుండా అతను హరినామాన్ని స్మరించడంవల్ల వెంటనే వారికి జ్ఞానోదయం అయిందిఅదే తడవుగా బ్రాహ్మణునికి ఎదురుగా వెళ్ళి దండప్రణామం చేసిఅతనికి తాము ఎలాంటి కీడు తలపెట్టామని నమ్మబలికి ''ఓ బ్రాహ్మణుడానీ దర్శనంతో మా పాపాలు నసిమ్చిపోయాయి'' అని మళ్ళీ నమస్కరించారు.  వారి నమ్రతకు కుదుటపడిణ హృదయంతో తత్వనిష్ఠుడు ''మీరెవరుచేయరాని పనులు ఏం చేసి ఇలా అయ్యారుమీ మాటలు వింటే బుద్దిమంతుల్లా ఉన్నారుమరి ఈ వికృత రూపాలేమిటినాకు వివరంగా చెప్పండి.. మీ భయాలుబాధలు తొలిగే దారి చెప్తాను'' అన్నాడు.
 ద్రావిదుని కథ

పారుని పలుకులపైఆ రాక్షసుల్లో ఒకడు తన కథను ఇలా వినిపించాడు.
''విప్రోత్తమానేను ద్రావిడినిద్రవిడ దేశంలోని మంధర అనే గ్రామాదికారినికావడానికి బ్రాహ్మణుడినే అయినా గుణానికి కుటిలుడిని,వంచించే చమత్కారిగా ఉండేవాణ్ణిణా కుటుంబ శ్రేయస్సుకై అనేకమంది విప్రుల విత్తాన్ని హరించానుబంధువులకు గానీ,బ్రాహ్మణులకు గానీ ఏనాడూ పట్టెడు అన్నం పెట్టలేదునయ వంచానలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడంవల్ల ణా కుటుంబం నాతొ సహా ఏడు తరాలవాళ్ళు అథోగతి పాలయ్యారు.
మరణానంతరం దుస్సహమైన నరకయాతనలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడినయ్యానుకృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు'' అన్నాడు. 
ఆంధ్రదేశీయుని గాథ

రెండవ రాక్షుసుడు ఇలా విన్నవించుకున్నాడు.
''ఓ బ్రాహ్మణోత్తమానేను ఆంధ్రుడినినిత్యం ణా తల్లిదండ్రులతో కలహిస్తూ వారిని దూషిస్తూ ఉండేవాడినినేను ణా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్ది అన్నం పెట్టేవాడినిబాంధవ బ్రాహ్మణకోటికి ఎన్నడూ ఒక పూటయినా భోజనం పెట్టక విపరీతంగా ధనార్జన చేసి గర్వంగా ఉండేవాడినిచనిపోయిన తర్వాత నరకం చేరి ఘోరాతిఘోరమైన భాధలు అనుభవించి చివరికి ఇలా పరిణమించానుఆ ద్రావిడునికి మల్లేనే నాక్కూడా ముక్తి కలిగే మార్గం బోధించు''
పూజారి కథ
మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ''ఓ సదాచార సంపన్నుడానేను ఆంధ్రదెస బ్రాహ్మణుడినివిష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడినికాముకుడనుఅహంభావిని అయి పరుషంగా మాట్లాడేవాడినిభక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలను వేశ్యలకు ఇచ్చివిష్ణు సేవలను సక్రమమంగా చేయక గర్వంతో తిరిగేవాడినిచివరికి గుడి దీపాల్లో నూనెను కూడా దొంగిలించివేశ్యలకు ధారపోసి వారితో సుఖంగా గడిపేవాణ్ణిపాపపుణ్య విచక్షణ తెలిసేది కాదునా దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన జన్మలూ ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసుని అయ్యానుఓ విప్రుడానన్ను మన్నించి మళ్ళీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు'' అని ప్రార్ధించాడు.
 బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట

తమ పూర్వ భవకృత అపరాధానికి ఎంతో పశ్చాత్తాపం చెందుతున్న రాక్షసులను చూసి విప్రుడు ''భయపడకండినాతొ కలిసి కార్తీక స్నానానికి రండిమీ సమస్త దోషాలూ నశించిపోతాయి'' అని చెప్పి వారిని తన వెంట తీసికెళ్ళాడు.  అందరూ కలిసి కావేరీనది చేరారుఅక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తం సంకల్పం చేసి తాను స్వయంగా మున్ డు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడుతర్వాత
అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్ధం |
అస్యాం కావేర్యాం ప్రాతః స్నానమహం కరిష్యే | |
అనే సంకల్పంతో అతడు విధివిధానంగా స్నానం చేసితత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులూ,దివ్యరూపులూ అయితక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు.
విదేహరాజాఅజ్ఞానం వల్ల కానీమోహప్రలోభాల వల్ల కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీకమాస సూర్యోదయ వేళ కావేరీనదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వారికి నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుందిఅందువల్ల ఏదో ఒక ఉపాయం చేసి కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలికావేరిలో వీలు కాకపోతే గోదావరిలో లేదా మరెక్కడైనా సరే ప్రాతఃకాల స్నానం చేయాలిఅలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానం చేయరో వాళ్ళు పది జన్మలు చండాలపు జన్మలు ఎత్తి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు.
కనుక ఎటువంటి మీమాంసలూ లేకుండా స్త్రీలు గానీపురుషులు గానీ కార్తీకమాసంలో తప్పక ప్రాతఃస్నానం చేయాలి.  అప్పుడు జనకుడు ''హే బ్రహ్మర్షీనువ్వు ఇంతవరకూ కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావుఅయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరిన్చాలోఏయే దానాలు చేయాలో కూడా తెలియజేయి'' అనడిగాడు.
వశిష్ట ఉవాచ: 

అన్ని పాపాలనూ హరించేదిపుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదం అయిన విషయంకార్తీక వ్రతం ఆచరించడం వల్ల నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదుఅంత మహత్తరమైన ఈ వ్రత ధర్మాలనుతత్ఫలితాలను చెప్తాను విను.
 కార్తీకమాస సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము లభిస్తుందిశివాలయ గోపురద్వారా,శిఖరాలయందు గానీ శివలింగ సన్నిధిలో గానీ దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలూ అంతరించిపోతాయిఎవరయితే కార్తీకంలో శివాలయంలో ఆవునేతితో కానీ విప్ప నారింజ నూనెలతో గానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలౌతారుఆఖరికి ఆముదపు దీపాన్ని అయినా సమర్పించినవాళ్ళు అత్యంత పుణ్యవంతులౌతారుకాంక్షతో గానీ కనీసం నలుగురి నడుమా బడాయి కోసం గానీ దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులౌటారుఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను.
కార్తీక 
దీపారాధన మహిమ


పూర్వం పాంచాలదేశాన్ని పరిపాలించే మహారాజు కుబేరుని మించిన సంపదలు ఉన్నప్పటికీకుమారులు లేని కారణంగా కుంగిపోయికురంగపాణికై తపస్సు చేశాడుమధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడు అనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకుని ''ఓ రాజాఈ మాత్రం కోరికకు తపస్సుతో పనిలేదుకార్తీకమాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించిబ్రాహ్మణులను దీప దాన దక్షిణలతో సంతోషపెట్టుఅలా చేస్తే నీకు తప్పక సంతానం కలుగుతుంది'' అని చెప్పాడుఋషి వాక్యం శిరోధార్యంగా భావించి ఆ పాన్చాలుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతం ఆచరించిశివప్రీతికై బ్రాహ్మణులకు దీప దానములు చేశాడుతత్ఫలితంగా మహారాణి నెల తప్పియుక్తకాలంలో మగ శిశువును ప్రసవించిందిరాజా దంపతులు ఆ శిశువుకు ''శత్రుజిత్తు'' అని పేరు పెట్టారు.
శత్రుజిత్తు చరిత్ర
శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానంగా పెరిగియువకుడైవీరుడై వేశ్యాంగనా లోలుడై ఇంకా తృప్తి చెందక పర స్త్రీ అనురక్తితో యుక్తాయుక్త విచక్షణ లేక విచ్చలవిడిగా ప్రవర్తించసాగాడుహితవు చెప్పేవారిని చంపుతానని బెదిరిస్తూ పరమ హీనంగా జీవిస్తున్నాడుఇలా ఉండగా ఒక మహా సౌందర్యరాశి అయిన విప్రుని భార్యను చూసి మోహితుడయ్యాడుఆమె కూడా ఈ యువరాజు పట్ల మోజుపడింది.  భర్త నిద్రించగానే ఆమె రాజు రమ్మన్న సంకేత స్థలానికి వచ్చేదిఇద్దరూ ఆనందించేవారుఒకరోజు భర్తకు విషయం తెలిసిపోయింది.కానీఆ విప్రుడు పైకి ఏమీ తెలీనట్లు ఉన్నాడుఇద్దరూ కలిసుండగా చూసి చంపాలి అనుకుని కత్తి చేతబట్టి తిరుగుతున్నాడువారికి ఈ సంగతి తెలీదుఒక కార్తీక పౌర్ణమినాడు సోమవారం కలిసివచ్చిందిఆవేళ కాముకులిద్దరూ సురత క్రీడలకై పాడుపడ్డ శివాలయాన్ని సంకేత స్థలంగా ఎంచుకున్నారుఅపరాత్రి వేళ ఇద్దరూ అక్కడ కలుసుకున్నారుఆలయంలో చీకటిని పోగొట్టేందుకు విప్ర స్త్రీ తన చీర కొంగును చింపిఒత్తిని చేసిందిరాజు ఆముదం తెచ్చి అక్కడున్న ఖాళీ ప్రమిదలో పోశాడుమొత్తానికి దీపం వెలిగించారుఇక ఇద్దరూ ఏకమయ్యారు.
విప్రుడు అక్కడికొచ్చివారిద్దర్నీ చంపేసితాను కూడా కత్తితో పొడుచుకుని చనిపోయాడుఅటు యమదూతలుఇటు శివ దూతలూ కూడా వచ్చారుశివదూతలు విప్ర స్త్రీనిరాజును కైలాసానికి తీసికెళ్ళారుయమదూతలు విప్రుని నరకానికి లాక్కేళుతుంటే అతను ఆక్రందన చేస్తూ ''పాపం చేసినవారికి కైలాసంనాకేమో నరకమా?'' అన్నాడుఅందుకు యమదూతలు''వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమిపైగా సోమవారంఏ కారణం అయితేనేం దీపం వెలిగించారుఅందునా ఆలయంలో వెలిగించారుకనుక పుణ్యాత్ములయ్యారుఅలాంటివారిని చంపి నువ్వు పాపాత్ముడివి అయ్యావుఅందుకే వారికి కైలాసంనీకు నరకం'' అన్నారు.
బ్రాహ్మణుడికీశివదూతలకు జరిగిన సంభాషణ విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని ''అయ్యాదోషం చేసింది మేముమాకు కైవల్యం ఇచ్చిఈ పుణ్యదినాన మమ్మల్ని చంపిమాకు స్వర్గప్రాప్తి కలగాజేస్తున్న అతన్ని నరకానికి పంపడం భావ్యం కాదు.
కార్తీకమాసం గొప్పది అయితేసోమవారం ఇంకా పుణ్యమైంది అయితేదీపారాధన మరీ పుణ్యప్రదమైంది అయితే మాతోబాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణునికి కూడా కైలాసం ఇవ్వక తప్పదు'' అని వాదించాడుఫలితంగా శత్రుజిత్తు తానూతన ప్రేయసి చేసిన ఒత్తులుఆముదం పుణ్యం తాము ఉంచుకునిదీపం వెలిగించిన పుణ్యాన్ని విప్రునికి ధారపోయగా అతన్ని కూడా దూతలు కైలాసానికి తీసికెళ్ళారు.  కనుకఓ మిధిల నగరాధీశ్వరాకార్తీకమాసంలో తప్పనిసరిగా శివాలయంలో గానీవిష్ణుఆలయంలో గానీ దీపారాధన చేసి తీరాలి.నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులైతద్వారా మోక్షాన్ని పొందగల్గుటారుఅందునా శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించునా మాట విని కార్తీకమాసం నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి''

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)