Blogger Widgets

మంగళవారం, నవంబర్ 27, 2012

వైకుంఠ చతుర్ధశి

మంగళవారం, నవంబర్ 27, 2012

కార్తీక మాసం లో శుక్ల చతుర్దశి రోజు  వైకుంఠ చతుర్ధశి అని కూడా అంటారు. 
వైకుంఠ చతుర్ధశి కి ఒక మంచి కధ వుంది.
ఒకసారి ఒకానొక సమయం లో నారద మహాముని భూమిపై సంచరించిన తర్వాత వైకుంఠ ధామ్ చేరుకుంన్నాడు. విష్ణువు  నారద మహా ముని పర్యటన వెనుక వున్నకారణం అడిగారు.  నారదుడు సాధారణముగా  ప్రజలుకు  విష్ణువు యొక్క దీవెనలు ఎలా లభిస్తాయి అని అడుగగా.  విష్ణువు వైకుంఠ చతుర్ధశి రోజున అతనికి పూజించే వారికి దీవెనలు తప్పక  చేరుతాయి.  వారికి స్వర్గానికి దారి ఏర్పడుతుంది అని సమాధానమిచ్చారు.
విష్ణువు అప్పుడు జై-విజయ్ లకు వైకుంఠ చతుర్ధశి రోజున స్వర్గ ద్వారాలు తెరవమని కోరాడు. విష్ణు ఈ రోజు పూజించేవారు స్వర్గానికి వెళ్ళండి అని చెప్పారు.  
కార్తీక వైకుంఠ చతుర్ధశి యొక్క ప్రాముఖ్యత:
ఈరోజు పరమశివుడు విష్ణువు ఒకటే అని గుర్తించిన రోజు.  విష్ణువు కాశీలో శివుని వేయి తామర పుష్పాలు తో పూజించుతున్నారు.  అప్పుడు శివుడు విష్ణువుని పరిక్షించాలి అనుకోని ఒక పువ్వును తగ్గించారు.  విష్ణువు 1000 పువ్వులు పూజ చేస్తూవుంటే అందులో ఒక  పువ్వు తగ్గుతుంది.  అప్పుడు విష్ణువు ఆ ఒక్క పువ్వు స్థానంలో ఏమి ఉంచాలా అని ఆలోచించి.  విష్ణువుని భక్తులు కమలనయనుడు అంటారు కదా అని ఆ పువ్వు స్థానంలో తన ఒక కంటిని అందించడానికి సిద్ధం అయ్యి. తన కంటిని తీసి శివుడుకు అర్పించారు.  అప్పుడు శివుడు ఆనందం తో విష్ణువు దగ్గరకు చేరి తను చాలా ప్రసన్నుడు అయ్యానని చెప్పి.  ఆ పరమేశ్వరుడు ఈ రోజున  విష్ణు కు సుదర్శన చక్రమును ఇచ్చాడు. ఈ రోజు, విష్ణువు మరియు శివుని ద్వారా  స్వర్గం యొక్క తలుపులు తెరవడం జరిగింది . ఈ రోజు ఉపవాసం వున్నవ్యక్తికి  స్వర్గంలో అతని స్థానాన్ని సుస్థిరంగా వుంటుంది. 
భీష్మ పితమః  కు  కూడా ఈ రోజు శ్రీ కృష్ణుడు ఉపదేశించినట్లు చెప్తారు. విష్ణువు కార్తీక శుక్ల చతుర్ధశి రోజున మత్స్య అవతారంగా అవతరించారు. 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)