Blogger Widgets

ఆదివారం, డిసెంబర్ 02, 2012

కార్తీక పురాణం 19వ రోజు

ఆదివారం, డిసెంబర్ 02, 2012

చతుర్మా స్య వ్రత ప్రభావ నిరూపణ 
ఈ విధముగా నైమిశారణ్య మందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞాన సిద్దుడను ఒక మహా యోగి " ఓ దీనబాంధవా! వేదవేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వి తీయుడవని, సూర్య చంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, సర్వ౦తర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రులచే సర్వదా పూజింప బడు వాడవని, నిత్యుదవని, నిరాకారుడవని సర్వజనుల చే స్తుతింపబడుచున్న ఓ మాధవా! నికివేమా హృదయ పూర్వక నమస్కారములు సకల ప్రాణి కోటికి ఆధారభూతుడవగు ఓ నంద నందా! మా స్వాగతమును స్వికరింపుము. నీ దర్శన బాగ్యమువలన మేము మాఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైన వి. ఓ దయామయా! మే మి సంసారబందము నుండి బైటపడలే కుంటి మి, మమ్ముద్దరింపుము. మానవుడెన్నిపురాణములు చదివినా, యెన్ని శాస్త్రములు విన్న నీ దివ్య దర్శనముబడ యజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుడువు. ఓ గజేంద్రరక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషికేశా!నన్ను కాపాడుము" అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీ హరి చిరునవ్వు నవ్వి " జ్ఞాన సిద్దా! నీసోత్ర వచనమునకు నేనెంత యు సంత సించితిని. నీకిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము" అని పలికెను. అంత జ్ఞాన సిద్దుడు " ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన యీగ వలె కొట్టుకోనుచున్నాను. కనుక, నీపాద పద్మముల పైనా ధ్యానముండుట నటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కర లేదు " అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు " ఓ జ్ఞాన సిద్దుడా! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక, మరొకవారము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈలోక మందు అనేక మంది దురాచారులై, బుద్దిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. అ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాడ శుద్ద దశమిరోజున లక్ష్మి దేవి సహితముగా పాలసముద్ర మున శేషశయ్య పై పవళింతును.  తిరిగి కార్తీక మాసమున శుద్ద ద్వాద శివరకు చాతుర్మాస్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రితికరము. ఈ వ్రతముచేయు వారాలకు సకల పాపములు నశించి, నా సన్నీధకి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చెయనివారు నరకకూపమునుబడుదురు. ఇతరులచేత కూడా ఆచరింపచేయవలయును. దీని మహాత్యమును తెలిసియుండియు, వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును. వ్రతము చేసిన వారి కి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు భాధలుండవు. దినికి నియమితముగా ఆషాడశుద్ద దశమి మొదలు శాకములును, శ్రవణ శుద్ద దశమి మొదలు పప్పుదినుసులను విసర్జిoచవలయును. నాయందు భక్తీ గలవారిని పరీక్షించుటకై నే నిట్లు నిద్రవ్యజమున శయనింతును. ఇప్పుడు నీవోసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్త శ్రద్దలతో పరించిన వారు నాసన్నీధకి నిశ్చయముగా వత్తురు." అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధంచి శ్రీమహాలక్ష్మితో గూడి పాలాసముద్రమును కేగి శేషపానుపు మీద పవ్వళిoచెను. వశిష్టుడు జనక మహారాజుతో " రాజా! ఈ విధముగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్దా మొదలగు మునులకు చాతుర్యస్యవ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వ్రత్తంతమును అంగీరసుడు ధనలోభనకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుషభేదముల లేదు, అన్ని జాతులవరును చేయవచ్చును. శ్రీ మన్నారయునని ఉపదేశము ప్రకారము ముని పుంగవు లందరూ యీ చాతుర్యాస్యవ్రత ఆచరించి దన్యులై వైకుంఠమున కరిగిరి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)