Blogger Widgets

గురువారం, డిసెంబర్ 13, 2012

కార్తీక పురాణం 30వ రోజు

గురువారం, డిసెంబర్ 13, 2012

కార్తికవ్రత మహిమ ఫలశ్రుతి నైమిశారణ్య ఆశ్రమములో శౌనికాది మహామునులకందరకు సుతమహాముని తెలియజేసిన విష్ణు మహిమలను , విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయి నోళ్ళకొనియాడిరి. శౌనికాది మునులకు ఇంకను సంశయములు తిరనందున, సుతునిగాంచి "ఓముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గ ములకు దాసులై, అత్యాచారపరులై జీవి౦చుచు సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైన కలదా?ధర్మములన్నిటిలో మోక్షసాధన కుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొంసంగు వుత్తమ దైవమెవరు?మానవుని అవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగలవుపాయమేమి? హరి నమస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈసంశాయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియజేయు" మని కోరిరి. అంత సుతుడా ప్రశ్న నాలకించి" ఓమునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకోనవలసినవి. కలియుగమందలి మానవులు మంద బుద్దులు క్షణికసుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము వలన యాగాదిక్రతువు లోనర్చిన పుణ్యము, దానధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీ మన్నారాణునకు ప్రీతీకరమైన వ్రతము ఇది అన్నివ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వర్ణించియున్నాడు. ఆవ్రత మహిమ వర్ణించుట నాకు శక్తిచాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆబ్రహ్మదేవునికి కూడా శత్యముగాదు. అయినను సుక్ష్మముగా వివరించెదను. కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్దతులనుజెప్పు చున్నాను. శ్రద్దగా అలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పని సరిగ నది స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరి హరదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చెయవలయును . ఈనెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని, శివాలయమున గాని ఆవునేతిలో దీపారాధన చెయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపటణము చెయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులరాశి యందున్న నెలరోజులు యీవిధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి వుండి కూడా ఆచరించక గాని, లేక, ఆచరించువారలను జూచియెగతాళి చేసిన గాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడినవారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతరమందు నరకములోపడి యమకింకరులచేత నానా హింసలపాలుకాగలరు. అంతియే గాక అట్టివారు నూరుజన్మల వరకు ఛ౦డాలాది హీనజన్మలెత్తుదురు.
కార్తీకమాసములో కావేరి, నదిలోగాని, గంగానదిలో గాని, అఖండ గౌతమీ నదిలో గాని స్నానమాచరించి ముందుచెప్పిన విధముగా నిష్టతో ఆచరించినవారు యిహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది. అధికఫలదాయకయైనది. హరిహరాదులకు ప్రితికరమైనది. కనుక కార్తీకమాసవ్రతము వలన జన్మజన్మలను౦డి వారలకున్న సకలపాపములుహరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీవ్రత మాచరించవలెననెది కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యేవగింపు అసహ్యము కలుగును. కాన, ప్రతిమానవుడు ఈపరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యకాలమును చెతులారావిడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారలు కార్తీక శుద్దపౌర్ణమినాడు అయినను తమ శక్తీకొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజన మిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు, చేసినచొ యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెలరోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరి నామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్ధములను సేవిస్తూ, దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈకథను చదివినవారికిని శ్రీ మన్నారాయుణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠప్రాప్తి కలుగచేయును.
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు
ఓం సర్వేషాం పూర్ణ౦భవతు ఓం శ్శాంతి శ్శాంతి::||

1 కామెంట్‌:

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)