Blogger Widgets

గురువారం, అక్టోబర్ 31, 2013

ఒక్కొక్క బిందువు కలిస్తేనే పెద్ద మహా సముద్రం

గురువారం, అక్టోబర్ 31, 2013

'బూంద్‌ బూంద్‌ బనేగా సముందర్‌, పైసా పైసా పైదాకరేగా' అనేది హిందీ సామెతలో ఒకటి తెలుగులో ఒక్కొక్క బిందువు కలిస్తేనే పెద్ద మహా సముద్రం తయారు అవుతుంది అని .  ఒక్క రూపాయి అంటుంది నన్ను వంద వరకు పెంచు తరువాత నిన్ను నేను పెంచుతాను అని ఇవన్నీ మీకు తెలిసినవే,  ఇవన్ని పోడుపుగురించి చెప్పటానికే పుట్టినవి. కాలు వంకర పోకుండానే, కంటిచూపు తగ్గిపోకుండానే వీలైనంత కూడబెట్టు అనేదే మన పెద్దలు మనకి వుగ్గుపాలతో నేర్పే మొట్టమొదటి ప్రాథమిక ఆర్థిక సూత్రం. 'సేవ్‌ ఫర్‌ ఎ రెయినీ డే, టు మేక్‌ ఇట్‌ ఆల్‌సో ఎ సన్ని డే' అన్న ఇంగ్లిష్‌ సామెతలో కూడా, పొదుపు యొక్క  ప్రాముఖ్యత తెలుస్తోంది .  ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే  ఈరోజు ప్రపంచ పొదుపు దినోత్సవంగా జరుపుకుంటున్నాం కదా అందుకే మరి .  ఈ పొదుపు దినోత్సవం గురించి చెప్పాలనుకుంటున్నాను.  1924, అక్టోబర్‌ 31వ తేదీన, ప్రప్రథమ ‘ఇంటర్నేషల్‌ థ్రిఫ్ట్‌ కాంగ్రెస్‌’ సమావేశం ముగి సిన వెంటనే, ప్రొఫెసర్‌ ఫిలిప్పో రవిజ్జా ఆరోజుని, ‘వరల్‌‌డ థ్రిఫ్ట్‌ డే’గా సాధికారంగా ప్రకటించారు. సామాన్య పౌరులకి ‘పొదుపు’లోని ముఖ్యత్వాన్ని వివరించడం ఈ ‘వరల్‌‌డ థ్రిఫ్ట్‌ డే’ ముఖ్యోద్దేశం. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా వున్న సేవింగ్స్‌ బ్యాంక్స్‌ అన్నీ ‘వరల్డ్ సేవింగ్స్‌ డే’ని వైభవోపేతంగా జరుపుకోవడం ఆరంభించాయి. ఇప్పుడు ప్రపంచమంతటా ‘ఇంటర్నేషనల్‌ సేవింగ్స్‌ బ్యాంక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌’ కి చెందిన 940 సేవింగ్స్‌ బ్యాంక్స్‌ క్రియాశీల కంగా,నిర్మాణాత్మకంగా పని చేస్తున్నాయి.ఏటేటా, అక్టోబర్‌ 31వ తేదీనాడు, ‘వరల్‌‌డ సే వింగ్స్‌ డే’ / ‘వరల్డ్‌ థ్రిఫ్ట్‌ డే’ జరుపుకునే సందర్భంలో, ప్రపంచమంతటా కొన్ని రిటేల్‌ బ్యాంక్స్‌ వారం రోజుల పాటు, వైభవంగా వు త్సవాలు నిర్వహిస్తూ, ‘పొదుపు’ ప్రాముఖ్య త విషయంలో, ప్రజలలో చైతన్య స్ఫూర్తి కలిగిం చడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అలా, చిన్న చిన్న మొత్తాలతో ‘పొదుపు’ చేసుకోవడ మనే అలవాటుని ప్రజలలో కలిగించాలనే సదాశయం ఈనాటికి ఒక మహోద్యమంగా రూపొంది, ప్రపంచ వ్యాప్తమైపోయింది.  అయితే పొదుపు అనేది అన్ని విషయాలకు వర్తిస్తుంది. విధ్యుత్ ను పోదుపు చేయటం, నీటిని, ఆహారాన్ని,  అనావసరంగా వృదా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. చిన్న పిల్లలకు  పొదుపు యొక్క విశిష్టత చిన్న తనము నుండే అలవారచాలి . ప్రతిమనిషి తను సంపాదించిన దానిలో పూర్తిగా 20% పొదుపు చేసుకోవాలిట.  మరి మీరుకూడా పోడుపుచేయటం మొదలుపెట్టండి మరి .  అందరికి ప్రపంచ పొదుపు దినోత్సవము సందర్భముగా శుభాకాంక్షలు

ఉక్కుమనిషి పటేల్

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేడే 
ఉక్కుమనిషిగా మనకు బాగా తెలిసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875, అక్టోబరు 31న గుజరాత్ రాష్ట్రంలోని నదియాద్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి జవేరిభాయ్ పటేల్ వ్యసాయం చేసేవాడు. తల్లి లాద్ బాయ్. వారికి ఆరుగురు సంతానంలో పటేల్ నాల్గవవాడు. వారిది చాలా పేదకుటుంబం అవ్వటం వలన  పిల్లల్ని చదివించటం చాలా కష్టంగా వుండేది.  వల్లభాయ్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో స్కూల్ చదువు వరకు చదవగలిగాడు. పటేల్ స్కూలులో చదువుతున్నప్పుడు పుస్తకాలు కొనుక్కొనే పరిస్థితి  లేకపోవటం వలన తన  స్నేహితుల దగ్గర పుస్తకాలు తీసుకొని వాటిని పూర్తిగా బట్టి పట్టేవాడు.  ఒక రోజు తన ఉపాధ్యాయుడు నీ పుస్తకం ఏది?" అని అడిగినప్పుడు, ఎంతో ధైర్యంతో "నాకు పుస్తకాలు కొనుక్కొనే స్తోమత లేదు కాబట్టి నోట్సు మాత్రమే రాస్తున్నాను. కానీ టెక్స్ట్ పుస్తకాల్లో ఇంత వరకు జరిగిన పాఠాలు అన్ని నాకు అక్షరం తప్పకుండా గుర్తున్నాయి అని చెప్పాడు. ఆ సమాధానం విన్న ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయి "ఏదీ ఆహార నియమాలు పాఠం చెప్పు చూద్దాం" అని అడిగాడు. అంతే పటేల్ అక్షరం పొల్లు పోకుండా పాఠాన్ని గడగడా అప్పజేప్పేసాడు . అది విని ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు. మెట్రిక్యులేషన్ తరువాత, కాలేజీ చదువులకు స్తోమతలేకపోవటం వల్ల ప్లీడరు పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యి, గోధ్రా అనే చిన్న పట్టణంలో ప్రాక్టీసు ప్రారంబించాడు. ప్రారంభించిన కొద్దిరోజులకే పటేల్ ప్రతిభను అందరూ గుర్తించసాగారు. అతను పట్టిన కేసులు ఓడిపోవటం అంటూ ఎప్పుడూ జరగలేదు. చివరకు ఆంగ్లేయులైన జడ్జీలు కూడా అతని వాదనను విని ముచ్చట పడేవారు.  ఇంగ్లాండులో బారిష్టరు పరీక్ష చదివేనిమిత్తం తనకు ప్రయాణంలో సహాయం చేయమని అర్ధిస్తూ వల్లభాయ్ పటేల్ ఒక ట్రావెల్ ఏజన్సీకి లేఖ రాశాడు. అది చదివిన ఏజన్సీవారు వెంటనే సహాయం చేయటానికి అంగీకరించి లేఖరాశారు. 1913లో బారిష్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై భారతదేశం తిరిగి వచ్చి తన ప్రాక్టీసును మరింత వృద్ది చేసుకున్నాడు. ఆ సమయంలో బొంబాయి చీఫ్ జస్టిస్, సర్ బాసిన్ స్కాట్ పటేల్ ని ప్రభుత్వ సర్వీసులో చేరమని ఆహ్వానించాడు. అయితే దేశాభిమానం మెండుగాగల పటేల్ ఆ ఉద్యోగాన్ని తిరస్కరించి క్రిమినల్ లాయరుగా పేరు ప్రఖ్యాతలు పొందసాగాడు. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోధ్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగామహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. 1917లో మొదటిసారిగా పటేల్ కు గాంధీలోని నిర్మలత్వం, నిరాడంబరత్వం, స్వార్ధరహిత ప్రేమ, దేశాభిమానం పటేల్ ను విశేషంగా ఆకర్షించాయి. భారతదేశంలో వ్యాపారం చేయటానికి వచ్చి, విభజించిపాలిస్తున్న ఆంగ్లేయులను తరిమి కొట్టాలనే ధృఢ నిశ్చయం ఆక్షణంలోనే తీసుకున్నాడు. ప్రజలలోకి చొచ్చుకొనిపోయి, వారి అవసరాలను తీర్చి, సహాయ సహకారాలు అందజేసి, వారిసహాయంతోనే విదేశీయుల్ని వెళ్ళగొట్టవచ్చుననే అభిప్రాయం కలిగి అహమ్మదాబాదు మున్సిపల్ ఎన్నికలలో పోటీచేసి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అనంతరం అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. పటేల్ అధ్యక్షుడిగా నిర్వహణా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన చేసిన సేవల వర్ణనాతీతం. నగరంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించటం జరిగింది అప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలూ వ్యాపారసంస్థలూ అన్నీ మూసేసి ప్రజలు భయబ్రాంతులై ఉన్న సమయంలో పటేల్ ఆరోగ్య అధికారులతో నగరంలోని ప్రతి మారుమూల ప్రాంతంలోనూ తిరిగి ఒక్కరినీ వదలకుండా అందరికీ వైద్యం అందించాడు. రోగుల దగ్గర నిర్విరామంగా గడపటం వలన ఆయనకు కూడా దురదృష్టవశాత్తు ఆ వ్యాధి సోకింది. కొద్ది రోజుల్లోనే ఆయనకు వ్యాధి తగ్గింది.ప్లేగు వ్యాప్తి చెందినప్పుడే కాకుండా, వరదల్లోనూ, కరువుకాటకాల్లోనూ ప్రజలకు అండగానిలిచి వారి అభిమానం చూరగొన్నాడు.  ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధుడు మాత్రమే కాడు, స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సపలుడైన ప్రముఖుడు. 
గాంధీజీతో పాటు అనేక సత్యాగ్రహాలు చేసి సహాయ నిరాకరణోధ్యమాలు నిర్వహించి కారాగారాలు అనుభవించి బ్రిటీషు వారి గుండెల్లో గుబులు కలిగించాడు పటేల్. సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఉధ్యమంలోనూ పాల్గొన్నాడు.  1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్రానంతరం జవహార్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రి గాను, ఉప ప్రధానమంత్రి గాను బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేధించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్దతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది.

బుధవారం, అక్టోబర్ 30, 2013

వారెన్ బఫ్ఫెట్ జన్మదిన శుభాకాంక్షలు.

బుధవారం, అక్టోబర్ 30, 2013

వారెన్ బఫ్ఫెట్  జన్మదిన శుభాకాంక్షలు.
వారెన్ బఫ్ఫెట్  ఒక యు.ఎస్ ముదుపరి, వ్యాపారవేత్త, మరియు లోకోపకారి.  చరిత్రలో విజయవంతమైన ముదుపరులలో ఒకరు, బెర్కషైర్ హాత్అవే కి C.E.O మరియు దానిలో అతిపెద్ద వాటాదారుడు,మరియు సుమారు $62 లక్షల కోట్ల నికర ఆదాయము కలిగి ప్రపంచములోనే అధిక ధనవంతుడిగా 2008 లో ఫోర్బ్స్ పత్రిక చేత పరిగణించబడ్డాడు.
బఫ్ఫెట్ "ఒమాహా సర్వజ్ఞుడు" గా తరుచుగ పిలవబడ్డాడు.లేదా "ఒమాహా రిషి"  గా పిలవబడ్డాడు మరియు విలువైన ముదుపు సిద్దాంతము నకు అంటిపెట్టుకొని ఉండటము మరియు అధిక సంపద ఉండి కూడా పొదుపరిగా ఉండటానికి ప్రసిద్ది చెందాడు. 

ఆదివారం, అక్టోబర్ 27, 2013

సింగర్ కుట్టు మిషను

ఆదివారం, అక్టోబర్ 27, 2013


                          ఐజాక్ మెరిట్ సింగర్ (అక్టోబరు 27 , 1811 - జూలై 23 , 1875మొదటి అమెరికన్ multinational company స్థాపకుడు కుట్టు యంత్రం రూపకర్త ,  నటుడు మరియు పారిశ్రామికవేత్త. ఆయన మనం ప్రస్తుతం ధరిస్తున్న దుస్తులు కుట్టుకొనేందుకు అవసరమైన విశిష్ట ఆవిష్కరన అయిన కుట్టు మిషను ను ఆవిష్కరించాడు. ఈయన సింగర్ కుట్టుమిషన్ల కంపెనీ యొక్క స్థాపకుడు. అనేకమంది సింగర్ మిషను కన్నా ముందుగానే పేటెంట్ హక్కులు పొందారు.   అతను 1811 లో అప్ స్టేట్ న్యూయార్క్లోని జన్మించారు , మరియు యంత్రాలు , థియేటర్ , మరియు మహిళలు ఆసక్తి అభివృద్ధి చేయబడింది - బహుశా ఆ క్రమంలో . అతను , 12 ఏళ్ళ వయసులో ఇల్లు వదిలి బేసి ఉద్యోగాలు పట్టింది , మరియు నాటక నటుల ప్రయాణిస్తున్న బృందంలో ఏర్పాటు . అతను కూడా మహిళల స్ట్రింగ్ తో సంబంధాలు ప్రారంభించారు .
బోస్టన్ లో 1850 లో పెద్ద మనిషి అతనికి కొద్దిగా విజయవంతమైన Lerow మరియు Blodgett కంపెనీ చేసిన ఒక కుట్టు యంత్రం మెరుగుపరిచేందుకు, ఒక సృష్టికర్త వలె తనను తాను  సింగర్ కోరారు. బదులుగా యంత్రం మరమ్మతు , సింగర్ ఫాబ్రిక్ ఆహారంగా అద్దకం అడుగుల ఇన్స్టాల్ ద్వారా పునఃరూపకల్పన . ముఖ్యంగా , కొత్త డిజైన్ దాని చివర సూది పట్టుకొని , worktable విస్తరించి ఒక ఆర్మ్ వంటి ఉపకరణం ఆవిష్కరణతో తక్కువ పోగులు తెగిపోవటం వలన . ఇది చేతితో కుట్టు మొట్టమొదటి ఆచరణాత్మక స్థానంలో , మరియు అది , 40 కుట్లు పడ్డాయి సాధారణ పని ఒక నిమిషం యొక్క ఒక నిష్ణాత కుట్టేది యొక్క ఓవర్ రేటు నాటకీయమైన అభివృద్ధి నిమిషానికి 900 కుట్లు సూది దారం ఉపయోగించు కాలేదు .
మొదటి సింగర్ యంత్రాలు చాలా ఖరీదైన మరియు స్థూలమైన ఉన్నప్పుడు , ఆవిష్కర్త వెంటనే మార్చుకోవటానికి వీలున్న భాగాలుగా యొక్క సామూహిక ఉత్పత్తి వ్యవస్థను తీసుకుంది మరియు పరిమాణం మరియు బరువు యంత్రాలు తగ్గించేందుకు పని . ప్రారంభం నుండి , అతను గృహిణులు అమ్మే లక్ష్యంతో గృహాలు లోకి వాణిజ్య మార్కెట్ గత చూసారు . శుద్ధి తర్వాత , సింగర్ వాటిని సగటు అమెరికన్ కుటుంబం స్థితి మరియు స్వావలంబన యొక్క అందుబాటులో చిహ్నాలు మేకింగ్ , $ 10 ప్రతి తన యంత్రాలు అమ్మగలిగింది . తన భాగస్వామి , ఎడ్వర్డ్ క్లార్క్ , అమ్మకాలు పెరగడానికి దీనివల్ల , వాయిదా కొనుగోలు ప్రణాళికలు మరియు వ్యాపార ఇన్ ముందున్నారు .
సింగర్ దేశవ్యాప్తంగా సేవ నెట్వర్క్ సృష్టించడం , అందమైన దుకాణములు , మరమ్మత్తు మెకానిక్స్ , కుట్టు బోధనా సిబ్బంది, మరియు వేగవంతమైన భాగాలు పంపిణీ అమ్మకాలు మద్దతు . మరియు దాని ఉత్పత్తులను విదేశీ తయారీ విస్తరించింది . 1863 ద్వారా , ఎబెనేజేర్ Butterick అనే దర్జీ దుస్తులు నమూనాలను అమ్మడం ప్రారంభించారు ఉన్నప్పుడు , సింగర్ అమెరికా యొక్క అత్యంత ప్రజాదరణ కుట్టు యంత్రం మారింది . సింగర్ మిషను ప్రయోగాత్మకంగా విజయం సాధించింది. ఈ కుట్టు మిషను ఇంటిలోని కుట్టుకొనుటకు వాడతారు.  SINGER brand has earned the 2013 Women's Choice Award® for America's Best for Home Sewing Machine

శుక్రవారం, అక్టోబర్ 25, 2013

పాబ్లో పికాసో స్పానిష్ శిల్పి

శుక్రవారం, అక్టోబర్ 25, 2013

పాబ్లో పికాసో స్పానిష్ శిల్పి, చిత్రకారుడు. చిత్రలేఖనంలో క్యూబిజం (cubism)ను ప్రోత్సహించిన కళాకారుడు. ఇతడు1881లో జన్మించాడు. 20వ శతాబ్ధంలో వచ్చిన చిత్రకారులలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాడు . అతని పరిశోధక మేధస్సు చిత్రకళలో అనేక శైలులను, మాధ్యమాలను అనుసరించినది. పికాసో చిత్రించిన చిత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందినవి. 1973లో మరణించాడు.
1901 లో చిత్రించిన "తల్లిప్రేమ'.  1937 ఏప్రియల్లో ప్రాంకో, జర్మన్ మిత్రపక్షాల పురాతన గుయోర్నికో రాజధాని బాస్క్ ను బాంబులతో నేలమట్టం చేసిన సంఘటనకు ప్రతిస్పందిస్తూ పికాసో వేసిన చిత్రం- గుయెర్నికా(Guernica) ఓ గొప్పకళాఖండం. దీనిలో ఎద్దులను కిరాతక సైనికులకు, దౌర్జన్యానికి చిహ్నంగా, గుర్రాలను ఎదురు తిరిగిన ప్రజానీకానికి, సాత్వికత్వానికి చిహ్నంగా పికాసో చిత్రించాడు. ఈ చిత్ర ఇతివృత్తం ఎద్దుల కుమ్ములాట, అమాయకుల ఊచకోతగా అభివర్ణించి, ఈ చిత్రాన్ని చిత్రించి ప్రపంచానికి అందించాడు పికాసో.
లే డెమొసెల్లిస్ డి అవినాన్(Les Demoiselles d" Avignon) కూడా గొప్ప కళాఖండమే.  1962 లో అతడు ఇంటర్నేషనల్ లెనిన్ పీస్ ప్రైజ్(International Lenin Peace Prize)ను అందుకొన్నాడు.

గురువారం, అక్టోబర్ 24, 2013

ఐక్యరాజ్య సమితి దినోత్సవం

గురువారం, అక్టోబర్ 24, 2013

ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ.మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్నినివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికారష్యాబ్రిటన్చైనా మరియు ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు.  
ఐక్యరాజ్య సమితి  ఆశయాలు:

  1. యుద్ధాలు జరగకుండా చూడటం,
  2. అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం,
  3. దేశాల మధ్య స్నేహసంబంధాలను పెంపొందించడం,
  4. అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం,
  5. సాంఘిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖమయం చేయడం.
 ఐక్యరాజ్య సమితికి 6 ప్రధానాంగాలు కలవు.
  1. సర్వ ప్రతినిధి సభ
  2. భద్రతా మండలి
  3. సచివాలయం
  4. ధర్మ కర్తృత్వ మండలి
  5. ఆర్థిక, సాంఘిక మండలి 
  6. అంతర్జాతీయ న్యాయస్థానం

సోమవారం, అక్టోబర్ 21, 2013

నోబెల్

సోమవారం, అక్టోబర్ 21, 2013

ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ (21 అక్టోబర్ 1833, స్టాక్‌హోంస్వీడన్ – 10 డిసెంబర్ 1896, సన్రీమోఇటలీ
ఆల్‌ఫ్రెడ్ నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ (1801-1872)మరియు ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ (1805-1889) మూడవ సంతానం. ఈయన స్వీడన్ దేశంలోని స్టాక్‌హోంలో అక్టోబర్ 21 1833 లో జన్మించాడు.ఆల్ఫ్రెడ్‌ తండ్రి ఇమాన్యుయెల్‌ ప్రముఖ ఇంజనీరు. తరువాత ఇతని కుటుంబంతో 1842లో సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు.ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల తయారీదారు మరియు డైనమైట్ఆవిష్కారకుడు. ఒక పాత ఇనుము మరియు స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ప్రతి సంవత్సరం జాతి మత ప్రాంత వివక్ష లేకుండా ‘మానవజాతి మేలుకోసం’ మహత్తరమైన కృషి చేసిన వారికి ఇవ్వబడతాయి. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ తన వీలునామాలో తనకు గల యావదాస్తి 90 లక్షల డాలర్ల విలువైన ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం నుంచి ప్రతి సంవత్సరం అయిదు రంగాలలో బహుమతులను ఏర్పాటు చేయాలని నిర్దేశించాడు. భౌతిక, రసాయానిక, శరీర నిర్మాణ లేక వైద్య శాస్త్రాలలోను ఆదర్శవంతమైన, అత్యున్నత ప్రమాణాలు కలిగిన గ్రంధానికిగాను సాహిత్యంలోనూ, అంతర్జాతీయ రంగంలో శాంతికిగాను విశిష్ట సేవ చేసినందుకు ఈ బహుమతులు ఇవ్వాలని ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ తన విల్లులో ప్రతిపాదన చేసాడు.కృత్రిమ మూలకము నోబెలియం ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.  
నేడు భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాలలోనే కాకుండా... సాహిత్యం, శాంతి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం ఈయన పేరుమీదన స్థాపించబడింది. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ 1895 నాటి వీలునామా ప్రకారం 1901 లో ఈ పురస్కారం ప్రారంభించబడింది (నోబెల్‌ మరణించిన 5 సంవత్సరాల తరువాత). ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ గౌరవార్ధం శాంతి బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్‌ ఆఫ్‌ స్వీడన్‌ ద్వారా ఇవ్వడం జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్‌ వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్‌హోంలో ఇవ్వబడతాయి. వివిధ రంగాలలో విశేషమైన కృషి / పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు / పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.

అట్ల తద్దోయ్




అట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్
చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు
అయ్యో మీకు చెప్పడం మరచిపోయా ఈ పాట ఏమిటను కుంటున్నారా ? ఏమి లేదండి నేను చెప్తున్నది అట్ల తదియ పండుగ గురుంచి. అట్ల తదియ ఈ పండుగ ప్రతి సవత్సరం ఆశ్విజ బహుళ తదియ రోజు వస్తుంది. ఈ తదియ రోజు తెలవారుజామునే ఆడవారు చిన్న పెద్ద అన్దరూ నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని , గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పులుసు, పెరుగు వేసుకొని తెల్ల వారుజామునే భోజనం చేస్తారు.ఆ తరువాత ఆటలే ఆటలు, చెమ్మచెక్కలు, ఉయ్యాలు అడతారు. అన్నట్టు ముందురోజే చేతుల నిండా గోరింట పెట్టుకుంటారు. తదియ రోజు చాలా సంతోషం గా ఆడుకుంటారు. ఉయ్యాల పోటీలు పెట్టుకుంటారు. పల్లెల్లో చాలా బాగా జరుపుకుంటారు. పొద్దు ఎక్కాగా తల స్నానం చేసి దేవుడుకి దణ్ణం పెట్టుకొని రోజు అంతా ఉపవాసం వుంటారు. సాయంత్రం చంద్రోదయం అయ్యాక స్నానం చేసి పార్వతి దేవికి పూజచేస్తారు. పూజచేసి చంద్రుడిని దర్శించుకుంటారు .
అట్ల తదియకు ఒక కదా వుంది ఆకధ
ఒక వూర్లో రాజుగారమ్మాయి, వెలమవారి పిల్ల, బ్రాహ్మ్నవారి పిల్లా, కోమటిపిల్ల,నలుగురు వివాహం కాకముందు చిన్నతనంలో నే అట్లాతదియనోము చీద్దమనుకున్నారు తదియనాడు వుపవాసం వున్నారు.రాజుగారంమయి అతిసుకుమారి కనుక సాయింత్రం కాగానే ముఖము వాడి ముఉర్చపోయినది. వీదిలూనుంది అన్నగారు వచ్చి అమ్మా చెల్లెమ్మ ఏది అని అడుగుగా నాయనా అట్లతదియ నోము చేద్దమనుకుని వుపవాసముంది . చంద్రోదయం వరకు వుండలేక మూర్చపొయినధి అని చెప్పింది. అప్పుడు అన్నయ్య ఏమి దారని అలోచించి వెంటనే దురంగావున్న చింత చెట్టుకు అద్దం పెట్టి దానికి ఎదురుగా అగ్గిపెట్టి చెల్లిలిని లేపి అదిగో చంద్రుడు ఉదయించాడు అనిచెప్పగా నిద్రకలనవున్న నిజంగా చెంద్రుదని బావించి ,రాకుమారి ఫలహారంలు చేసెను. కొన్నాళ్ళకు వివాహం చేయగా వయసు మీద పడిన వాడు భర్తగా సంప్రప్తంయ్యేను. నీను అట్లతదియ నోము నోచినా నాకు ఇదేమీ ప్రారబ్దం అని భాద పడుతూ ఒకనాడు రాత్రి అడవికి వెళ్ళిపొయినది.
ఓ అమ్మాయి ఒంటరిగా ఈ అడవిలో ఎక్కడికి పూతున్నావని పార్వతి పరమేస్వరులు మారు వేషములో వచ్చీ అడుగగా నాయనా మీరేమైనా అర్చేవార తీర్చేవారా మీకెందుకు అని చెప్పి నడుస్తోంది. మీము ఆర్చేదము తీర్చేదము నీ సంగతి చెప్పు అని అడిగిరి . ఆచిన్నది వారికి నమస్కరించి వారి స్నేహితులుతో చేసిన నోము గురించి తనకు మాత్రమె ముసలి భర్త లబించాడని నాకు మాత్రమె ముసలి భర్త సంభవించటం నాకు కారణం ఏమి , నా పాపమా? అని తన భాదను వివరించింది.
వారు దానికి చిన్నదానా నీవ్రతం భంగమైనది నీ అన్నగారి వలన జరిగిన చర్య సవివరంగా చెప్పారు. జరిగినదాని నేను ఇప్పుడు ఏమి చేయ్యన్లని వారి అడుగగా మరలా ఆ వ్రతం నిస్తగా చేయ్య్మన్న్నారు. ఆమె తిరిగి రాజ్యాని కి చేరి తదియరోజు ఆ వ్రతం చేసినది. ముసలి భర్త మంచి అందమైన యువకుని గా మారెను. అది చుసి అన్ధరూ కారణమడుగగా జరిగిన వృతాంతం చెప్పెను . ఇది అట్ల తదియ నోము కదా…
ఈ కధ విని అక్షిమ్థలు తలమీద వేసుకొని చంద్రుని చూసి పదకొండు అట్లు వీసి ఒక ముత్తయ్దువకు ఇచ్చి తను నేయివధ్యం పెట్టుకున్న పదకొండు అట్లు తిన్నాలి .
ఇదండి అట్ల తద్ది నోము గురించి.

మంగళవారం, అక్టోబర్ 15, 2013

శ్రీ షిర్డీ సాయిబాబా గారు పరమపదించిన రోజు

మంగళవారం, అక్టోబర్ 15, 2013

 ఈరోజు అక్టోబర్ 151918   శ్రీ  షిర్డీ సాయిబాబా గారు పరమపదించిన రోజు.  భారతీయ గురువు మరియు సాధువు, ఫకీరు శ్రీ  షిర్డీ సాయిబాబా ఇతని అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలుహిందువులూ సాధువుగా నమ్ముతారు. ఇతని జీవిత నడవడిలో, భోధనలలో రెండు మతాలను అవలంభించి, సహయోగము కుదర్చడానికి ప్రయత్నించాడు. సాయిబాబా మసీదులో నివసించాడు, గుడిలో సమాధి అయ్యాడు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించాడు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించాడు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివునిదత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.
బాబా చెప్పిన వాటిలో మరి కొన్ని ప్రసిద్ధ వాక్యాలు – “నేనుండగా భయమెందులకు?"అతనికి మొదలు లేదు... తుది లేదు ". తన భక్తులకు బాబా పదకొండు వాగ్దానాలు చేశాడు.:

షిరిడీలో అడుగు పెట్టినవారి కష్టాలు తీరినట్లే.
మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుంది.
నేనీ భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను.
నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవుసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
నాసమాధినుండే నేను మీకు దర్శనమిస్తాను.
నా సమాధినుండి నేను మాట్లాడుతాను.
నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ ఉంటాను.
మీరు నావంక చూడండి. నేను మీవంక చూస్తాను.
మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను.
నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి.
నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.

సోమవారం, అక్టోబర్ 14, 2013

దసరా శుభాకాంక్షలు.

సోమవారం, అక్టోబర్ 14, 2013

దసరా పండుగను మనము విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ జరుపుకున్నాము. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య కి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం ఆనవాయితీ గా వస్తున్నది . 
విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజుగా వస్తున్నది. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనేరాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. ప్రజలందరూ ఆనందంగా ఈపండుగ జరుపుకుంటున్నారు.  రావణాసురుని దహనం కూడా జరుపుతారు, మరియు దండియా నృత్యం చేస్తారు.  ఈ దసరా బాగా జరుపుకొండి. ఈ దసరా సందర్బముగా అందరికి నా తరుపునా దసరా శుభాకాంక్షలు. 

అమ్మవారు శ్రీ రాజ రాజేశ్వరీ దేవిగా.

శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది.
ఆమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది. ఈమె స్వప్రాకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము. ఇఛ్ఛా, ఙ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. ఆమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దెపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అథిష్టాన దేవత. 
శ్రీ రాజ రాజేశ్వరీ దేవి స్తోత్రము. 
శ్రీ రాజ రాజేశ్వరీ దండకము.  
శ్రీ మన్మహా దేవురాణీ నతేంద్రాణి రుద్రాణి శర్వాణి కళ్యాణి దాక్షాయణీ శూలపాణీ పృధుశ్రోణి ధూమ్రాక్ష సంహరిణీ పారిజాతాంచిత స్నిగ్దవేనీ లసత్కీర వాణీ భవాటనీ శివా శాంకరీ రాజరాజేశ్వరీ గౌరి శాకంభరీ కాళికం కాళి రాజీవనేత్రీ సుచారిత్రి కళ్యాణగాత్రీ మహాదైత్య జైత్రీనగాధీ శపుత్రీ జగన్మాత లోకైక విఖ్యాత గంధర్వ విద్యాధ రాదిత్య కోటీ ర కోటి స్ఫురద్ద వ్యమాణిక్య దీప ప్రభాత్యుల్ల సత్పాదకంజాత కేయూర హరాంగ దాది జ్వలధ్భూ షణవ్రాత కౌమారి మహేశ్వరీ నరాసింహీ రమా వైష్ణవీ భైరవీ దుర్గ కాత్యాయనీ పార్వతీ నీదు సామర్ధ్య మెన్నంగ బ్రహ్మదులున్ శేషభాషాదులున్ జాల రేనెంత వాడన్ ప్రశంసింపనే తజ్జ గజ్జాల సంరక్షణారంభ సంరంభ కేళీ వినోదంబులన్ గల్గి వర్తింతు వెల్లప్పుడో యాది శక్తీ పరంజ్యోతి నారాయణీ భద్రకాళీ శుక శ్యామలా భ్రామరీ చండికా లక్ష్మి విశ్వేశ్వరీ రాజరాజేశ్వరీ శాశ్వతైశ్వర్య సంధాయినీ యంచు నిన్నెంత యస్సన్నుతుల్సేయు లోకాళికి న్సంత తాఖండ దీర్ఘాయురారోగ్య సౌభాగ్య సంసిద్ద గావింతు వశ్రాంతమున్ రక్తబీజాది దైతేయులన్ ద్రుంచి బృందారక శ్రేణి రక్షింత్షు ఇవీ వెప్పుడున్ నార దాగస్త్య శాండిల్య మాండవ్య మైత్రేయ జాబాలి కణ్వాది మౌనీంద్రు లత్యంత నిష్ఠాగరిష్టాత్ములై హృత్స రోజంబులన్ ధ్యానముల్ సేయుచున్ జంద్ర ఖండావతం సాభ వద్దవ్య రూపంబు బ్రహ్మాండ భాండంబులన్నిండి వల్గొందు నేతత్ప్ర పంచంబు నీ వైవ్ర వర్తింతువీ సూర్యచంద్రాదులున్ భుజలాకాశ వాతాగ్ని జీవాత్మలున్నీవ నీకంటె వేరైన దింతైనయున్ లేదు యుష్మత్కటాక్షార్షు లైనట్టి వారల్కడున్ ధన్యులై మాన్యులై పూజ్యులై గుణ్యు లైయందురీ ధాత్రిలో నేను మూడుండ గర్వాధ రూడుండ దుశ్చిత్తుడన్ మత్తుడన్ జ్ఞాన హీనుండ దీనుండనే జేయు నేరంబుల న్గాచి రక్షింపగా భారమే తల్లి సద్భక్త మందార వల్లీ నమశ్చంద్ర బింబాననోత్కుండలా త్రాత భూమండలా సూచ్య చంద్రోజ్జ్వలా కామదా చండికా నమస్తే నమస్తే నమస్తే.

ఆదివారం, అక్టోబర్ 13, 2013

Catch me live @ 5:00 pm to 6:00 pm

ఆదివారం, అక్టోబర్ 13, 2013


అమ్మవారు మహిషాసుర మర్ధినిగా

మహిషాసుర మర్ధిని అమ్మవారు నవరాత్రులు తొమ్మిది అవతారాలలో ధర్శనము ఇచ్చారు. అమ్మ దుష్ట శిక్షణకు త్రిమూర్తుల శక్తీ తో సహస్ర బాహువులతో సకలాభారనాలతో మహిషాసురుని వధించుటకు అమ్మ ఉగ్ర రూపము ధరించారు. అప్పుడు మహిశాసురుడును చంపివేసినది.  అప్పుడు ఆమె రౌద్ర రూపాన్ని చూసి దేవతలు అందరు అమెను స్తుతించారు. అలానే శంకారాచార్యులవారు మహిషాసుర మర్ధిని స్తోత్రాన్ని పాడారు అది మంచిగా గుర్తింపు ఉన్న పాట.నవరాత్రుల తరువాత ఈరొజు మహిషాసుర మర్ధిని స్తోత్రము చదువుతారు.
ఇది అమ్మవారి అతి ఉగ్రమైన రూపం. అశ్వయుజశుద్ధనవమి నాడు అమ్మవారు మహిషాసురమర్ధినిగా అవతరించి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా అశ్వయుజ శుద్ధనవమినే "మహార్నవమి"గా భక్తులు ఉత్సవం జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించి, అమ్మ సకల దేవతల అంశలతో మహా శక్తిగాఈ రొజు దర్శనం ఇస్తుంది.
మహిషాసురుడనే రాక్షసుడిను వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి హోమం చెయ్యాలి. అమ్మవారికి "ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహినైస్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.
పూజానంతరం చిత్రాన్నం (పులిహోర), గారెలు, వడపప్పు, పానకం నివేదనం చెయ్యాలి.
అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే
గిరివర వింధ్య శిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే
దనుజ నిరోషిణి దితిసుత రోషిణి దుర్మద శోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి జగదంబ మదంబ కదంబ వనప్రియ వాసిని హాసరతే
శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే
మధు మధురే మధు కైటభ భంజిని కైటభ భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శతఖండ విఖండిత రుండ వితుండిత శుండ గజాధిపతే
రిపు గజ గండ విదారణ చండ పరాక్రమ శుండ మృగాధిపతే
నిజ భుజ దండ నిపాతిత ఖండ విపాతిత ముండ భటాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి రణ దుర్మద శత్రు వధోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే
చతుర విచార ధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే
దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శరణాగత వైరి వధూవర వీర వరాభయ దాయకరే
త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే
దుమిదుమి తామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి నిజ హుంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్ర శతే
సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజ లతే
శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

ధనురను సంగ రణక్షణసంగ పరిస్ఫుర దంగ నటత్కటకే
కనక పిశంగ పృషత్క నిషంగ రసద్భట శృంగ హతావటుకే
కృత చతురంగ బలక్షితి రంగ ఘటద్బహురంగ రటద్బటుకే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

జయ జయ జప్య జయేజయ శబ్ద పరస్తుతి తత్పర విశ్వనుతే
ఝణ ఝణ ఝింజిమి ఝింకృత నూపుర సింజిత మోహిత భూతపతే
నటిత నటార్ధ నటీనట నాయక నాటిత నాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్రవృతే
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లిక పల్లిక మల్లిక ఝిల్లిక భిల్లిక వర్గ వృతే
సితకృత పుల్లసముల్ల సితారుణ తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అవిరళ గండ గళన్మద మేదుర మత్త మతంగజ రాజపతే
త్రిభువన భూషణ భూత కళానిధి రూప పయోనిధి రాజసుతే
అయి సుద తీజన లాలసమానస మోహన మన్మథ రాజసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కమల దళామల కోమల కాంతి కళాకలితామల భాలలతే
సకల విలాస కళానిలయక్రమ కేళి చలత్కల హంస కులే
అలికుల సంకుల కువలయ మండల మౌళిమిలద్భకులాలి కులే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కర మురళీ రవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతే
మిళిత పుళింద మనోహర గుంజిత రంజితశైల నికుంజగతే
నిజగుణ భూత మహాశబరీగణ సద్గుణ సంభృత కేలితలే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కటితట పీత దుకూల విచిత్ర మయూఖతిరస్కృత చంద్ర రుచే
ప్రణత సురాసుర మౌలిమణిస్ఫుర దంశుల సన్నఖ చంద్ర రుచే
జిత కనకాచల మౌళిపదోర్జిత నిర్భర కుంజర కుంభకుచే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే
కృత సురతారక సంగరతారక సంగరతారక సూనుసుతే
సురథ సమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం స శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్
తవ పదమేవ పరంపదమిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కనకలసత్కల సింధు జలైరను సించినుతేగుణ రంగభువం
భజతి స కిం న శచీకుచ కుంభ తటీ పరిరంభ సుఖానుభవమ్
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత పురీందుముఖీ సుముఖీభిరసౌ విముఖీక్రియతే
మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుమితాసిరతే
యదుచితమత్ర భవత్యురరీ కురుతాదురుతాపమపాకురుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సిద్ధిధాత్రి :

నవదుర్గలలో అమ్మవారు సిద్దదాత్రిగా దర్సనం ఇస్తారు.
సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడినది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.
ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథములన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును.

శనివారం, అక్టోబర్ 12, 2013

అమ్మవారు దుర్గతినివారిణిగా

శనివారం, అక్టోబర్ 12, 2013

ఈరోజు బాలా త్రిపురసుందరిగా కూడా పూజిస్తారు.  చిన్న చిన్న పిల్లలకు పూజలు చేయటం విశేషముగా కనిపిస్తుంది.
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రుల్లో  అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. అమ్మ నామాన్ని జపిస్తే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఆరాధకులకు దుర్గాదేవి శీఘ్ర అనుగ్రహకారిణి. ఎర్రని బట్టలు పెట్టి ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణ చేయాలి. "ఓం దుం దుర్గాయైనమ:" అనే మంత్రం పఠించాలి. 

నవరాత్రులలోనవ దుర్గ లలో అమ్మ మహాగౌరి దేవిగా దర్శనము ఇస్తారు.  
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్య్రంబికే గౌరి నారాయణి నమోస్తుతే;
అనగా అన్ని శుభములను ప్రసాదించే పరమేశ్వరుని సతీ. సకల కోర్కెలను తీర్చే తల్లి.. ముగురమ్మల మూలపుటమ్మ అయిన ఓ గౌరీదేవీ.. నిన్ను శరణు కోరి ప్రార్థిస్తున్నానమ్మా! ఈ స్తుతి చేస్తూ గౌరీదేవిని ప్రార్థించుట వలన సకల సౌభాగ్యాలు లభిస్తాయని భావిస్తారు. 

శుక్రవారం, అక్టోబర్ 11, 2013

అమ్మవారు సరస్వతి గా

శుక్రవారం, అక్టోబర్ 11, 2013

మూలా నక్షిత్రము కదా సరస్వతి పూజ ఈ రోజు చేస్తారు. పిల్లలు కు మంచి చదువులు రావాలని కోరిన విద్యలు వారికి రావాలంటే సరస్వతి మాత కరుణకావాలి ,ఈ మాతను కొలచిన సకల విద్యలు ప్రసాధిస్తుంది. ఈమె తెల్లని వస్త్రదారిని అయ్యి. ఒక చేతితో వీణను మీటుతూ పుస్తకదారియై మనకు దర్శనము ఇస్తుంది .ఈమెకి హంసవాహనము. ఈమాత త్రిమూర్తులలో బ్రహ్మదేవుని అర్ద్దంగి. పరాశక్తి మొదట దరించిన ఐదు అవతారలలో సరస్వతి మాత అవతారము ఒకటి. సరస్వతి మాత కేవలం చదువులు ప్రసాధించేది మాత్రమే కాదు సర్వశక్తులు యుక్తులు ప్రసాధిస్తుంది.
సరస్వతీ వందన మంత్రం అధిక జ్ఞానం మరియు విజ్ఞత కోసం వల్లించే ముఖ్యమైన హిందూ మంత్రం.సరస్వతీ దేవి చదువులకి మరియు కళలకి అధిదేవత. భారతదేశంలో సంగీతకారులు నుంచి శాస్త్రవేత్తల వరకు అందరూ మార్గదర్శకత్వం మరియు జ్ఞానం కోసం ఆమెని పూజిస్తారు. సరస్వతీ వందన మంత్రాన్ని ఆమె భక్తులు ప్రతి ఉదయం శుభంకోసం వల్లిస్తారు.కేవలం పాట అనే అర్థం గల వందనానికి ప్రతి ఒక్కరు భిన్న విధాలను పాటిస్తారు. కనుక విద్యార్థిగా నువ్వు భౌతిక జ్ఞానాన్ని కోరుకుంటే, సంగీతకారుడు సరైన తాళాలని మొదలైన వాటిని కోరుకుంటాడు. 
వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా,వీణాపాణిగాపుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి".



    కాళరాత్రి
నవ దుర్గాలలో ఏడవ రోజు "కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను "శుభంకరి" అనియు అందురు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు. కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.  


కాళరాత్రి :
'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ
వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా
  వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ' 



ఈమెకి నివేదనగా కదంబం అర్పిస్తారు.

గురువారం, అక్టోబర్ 10, 2013

అమ్మవారు ఆరవరోజు వీణాపాణిగా

గురువారం, అక్టోబర్ 10, 2013

ఆరవరోజు న మూలా నక్షిత్రము కదా సరస్వతి పూజ ఈ రోజు చేస్తారు. పిల్లలు కు మంచి చదువులు రావాలని కోరిన విద్యలు వారికి రావాలంటే సరస్వతి మాత కరుణకావాలి ,ఈ మాతను కొలచిన సకల విద్యలు ప్రసాధిస్తుంది. ఈమె తెల్లని వస్త్రదారిని అయ్యి. ఒక చేతితో వీణను మీటుతూ పుస్తకదారియై మనకు దర్శనము ఇస్తుంది .ఈమెకి హంసవాహనము. ఈమాత త్రిమూర్తులలో బ్రహ్మదేవుని అర్ద్దంగి. పరాశక్తి మొదట దరించిన ఐదు అవతారలలో సరస్వతి మాత అవతారము ఒకటి. సరస్వతి మాత కేవలం చదువులు ప్రసాధించేది మాత్రమే కాదు సర్వశక్తులు యుక్తులు ప్రసాధిస్తుంది.
సరస్వతీ వందన మంత్రం అధిక జ్ఞానం మరియు విజ్ఞత కోసం వల్లించే ముఖ్యమైన హిందూ మంత్రం.సరస్వతీ దేవి చదువులకి మరియు కళలకి అధిదేవత. భారతదేశంలో సంగీతకారులు నుంచి శాస్త్రవేత్తల వరకు అందరూ మార్గదర్శకత్వం మరియు జ్ఞానం కోసం ఆమెని పూజిస్తారు. సరస్వతీ వందన మంత్రాన్ని ఆమె భక్తులు ప్రతి ఉదయం శుభంకోసం వల్లిస్తారు.కేవలం పాట అనే అర్థం గల వందనానికి ప్రతి ఒక్కరు భిన్న విధాలను పాటిస్తారు. కనుక విద్యార్థిగా నువ్వు భౌతిక జ్ఞానాన్ని కోరుకుంటే, సంగీతకారుడు సరైన తాళాలని మొదలైన వాటిని కోరుకుంటాడు. 
వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా,వీణాపాణిగాపుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి".



సరస్వతీ వందన మంత్రం:
యా కుందేందు తుషార హార-ధవళా,
యా శుభ్ర-వస్త్రా'వ్రిత
యా వీణా-వర-దండ-మండితకర,
యా శ్వేత పద్మా'సన
యా బ్రహ్మా'చ్యుత శంకరః ప్రభ్రితిభిర్ దేవై-సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిఃశేష జాడ్యా-పహా.

తెలుగు లో అనువాదం: 
పద్మము, చంద్రుడు, ఉదయపు పుష్పాల వంటి తెలుపుదనం కలిగినది;
వీణని చేత ధరించి, తెల్లని పద్మాసనం మీద కూర్చున్నది;
బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులతోపాటు దేవతలందరితోను నిత్యం పూజించబడేది;
ఓ తల్లి నా మానసిక జడత్వాన్ని తొలగించు

శుక్లాం బ్రహ్మ విచార సార పరమ మద్యం జగద్వ్యాపిని,
హస్తే స్ఫతిక్ మాలికం కమలం పద్మాసనే సంస్తితం .
వందేతం పరమేశ్వరీ భగవతీ.....
సా మాం పాతు సరస్వతీ భగవతీ బుద్ధి ప్రదం శరదాం.

నవదుర్గలలో ఆరవరోజు  కాత్యాయిని మాత. "కాత్యాయనీ మాత" భాద్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించినది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.
కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులమునందలి గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.  ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును. 
కాత్యాయని దేవి మంత్రం:
చంద్రహాసోజ్వలకరా శార్దులపర వాహనా l 
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినిll 
ఈనాడు ఈమెకు కేసరి బాత్ నివేదన అర్పిస్తారు .

బుధవారం, అక్టోబర్ 09, 2013

అంతర్జాతీయ తపాలా దినోత్సవం

బుధవారం, అక్టోబర్ 09, 2013

పూర్వము ఒక ప్రదేశములోవార్తలు ఇంకో ప్రదేశానికి చేర్చటానికి గుర్రాలు మీద వార్తాహరుడు గమ్యానికి చేర్చి వార్తలు చేర్చేవారు.  కొంతకాలం తరువాత పావురాలును పెంచుకొని వాటి ద్వారా వార్తలు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వార్తలు చేర్చేవారు.  ఈజిప్ట్ లో  మొట్టమొదటి పోస్టల్ పత్రం255 BC నుండిమొదలు అయ్యింది. అయితే ఆసమయంలో ముందు పోస్టల్ సేవలు రాజులు మరియుచక్రవర్తులు అందిస్తున్న దూతలు రూపంలో దాదాపు ప్రతి ఖండంలోని ఉనికిలోకాలక్రమేణా, మతపరమైన ఆజ్ఞలను మరియువిశ్వవిద్యాలయాలు వార్తలు మార్పిడి మరియు సమాచారం వారి స్వంత సందేశం పంపిణీ వ్యవస్థలును చేర్చారురిలే కేంద్రాలు ఎక్కువ దూరాలకు  వేగవంతంగా వార్తలు చేర్చటానికి దూతలును  'మార్గాల్లో ఏర్పాటు చేశారుచివరికి, ప్రైవేటువ్యక్తులు మరొక సంభాషించడానికిదూతలు ఉపయోగించడానికి అనుమతి లభించింది. ఆ తరువాత మెల్లి మెల్లిగా తపాల వ్యవస్థ వచ్చింది. 

ఐక్యరాజ్య సమితి చేపట్టిన తీర్మానాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం అక్టోబర్ 9వ తేదీని అంతర్జాతీయ తపాలా దినోత్సవంగా జరుపుకుంటున్నాము.  "తోకలేని పిట్ట తొంభై ఆమడలు దూరం పోతుంది" అన్న పోడుపుకధకు నిజం చేస్తూన్నది కేవలము ఒక ఉత్తరము మాత్రమె అనటంలో ఎటువంటి సందేహము అక్కరలేదు. అందుబాటు ధరకే సేవలందిస్తున్న తపాలాకు, గ్రామీణ ప్రజల మధ్య ఆత్మీయానుబంధం ను పెంచుతూ వుండేది.  
భారతీయ తపాలా లేదా భారతీయ తపాలా వ్యవస్థ ఒక భారత ప్రభుత్వ సంస్థ. ఇది 155,333 పోస్టాఫీసులతో ప్రపంచంలో కెల్లా అతి పెద్ద తపాలా వ్యవస్థ చైనా 57,000 రెండవ స్థానం. దీని విస్తృతమైన శాఖలతో తపాలా సర్వీసులే కాకుండా బ్యాంకుల మాదిరి సర్వీసులు కూడా అందిస్తుంది.  ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మొదటగా ముంబై, చెన్నై మరియు కలకత్తా  1764-1766 మధ్య పోస్టాఫీసులు ప్రారంభించింది. వారెన్ హేస్టింగ్స్ గవర్నరుగా ఈ తపాలా సర్వీసులను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు. 1839లో, North West Province సర్కిల్ ఏర్పాటయింది. 1860లో పంజాబ్ సర్కిల్, 1861లో బర్మా సర్కిల్, 1866లో సెంట్రల్ సర్కిల్ మరియు 1869లో సింద్ సర్కిల్ ఏర్పాటయినవి. తరువాత సర్కిల్స్ అవధ్ (1870), రాజ్ పుట్ (1871), అస్సాం (1873), బీహార్ (1877), తూర్పు బెంబాల్ (1878) and Central India (1879)లో ఏర్పడ్డాయి. 1914 సంవత్సరం కల్లా మొత్తం పోస్టల్ సర్కిల్స్ ఉన్నాయి.
తపాలా బిళ్ళలు (Postal stamps) తపాలా వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగము.   తపాలా బిళ్ళను మొట్టమొదటి సారిగా గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్ లలో మొట్టమొదటి సారిగా వాడినట్లు తెలుస్తోంది. 
తపాలా బిళ్ళలు 1 జూలై 1852లో సింధ్ జిల్లాలో మొదలయ్యాయి. వీటిని ఈస్ట్ ఇండియా కంపెనీ ముద్రించేది; కానీ అమ్మేవారు కాదు. అన్ని తపాలా బిళ్ళలుకలకత్తాలో ముద్రించబడేవి; అన్నీ కూడా విక్టోరియా మహారాణి బొమ్మతోనే విడుదల అయేవి.   తపాలా వ్యవస్థభారత ప్రభుత్వంలో సమాచార మంత్రిత్వ శాఖలోని భాగము. దీని నియంత్రణ' తపాలా సర్వీస్ బోర్డు' అధినంలో ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 22 తపాలా సర్కిల్స్ ఉన్నాయి. ప్రతీ సర్కిల్ కు ప్రధాన తపాలా జనరల్ అధికారి. ఇవి కాకుండా భారత రక్షణ వ్యవస్థకోసం ప్రత్యేకమైన సర్కిల్ ఏర్పాటు చేయబడింది.   ఇప్పటికి పెద్దవాళ్ళు ఉత్తరంలు  రాయటానికి వాటిని వాటిని చదవటానికి ఇష్టపడతారు. నాకు తెలుగు పాటము లో చదువురాని ఒక ముసలి తండ్రి తన పిల్లలుకు ఎంతో ఆప్యాయంగా ఉత్తరం రాయిస్తాడు.   భారతీయ తపాలా వ్యవస్థలో అతి ముఖ్యమైన విభాగము. ప్రజలకు సంబంధించిన సర్వీసులు అన్నీ వీటి ద్వారానే నడుస్తున్నాయి.  ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంది ఈ తపాల గురించి.  ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. ప్రతీ సంవత్సరం అక్టోబర్ 9 న  ప్రపంచ పోస్ట్ డే గా  ప్రపంచవ్యాప్తంగాజరుపుకునే రోజు గా  బెర్న్ ఒప్పందం, జనరల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటుసంతకం చేశారు. యూనియన్ లో సభ్యత్వం దాని పేరు1878లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ మార్చబడింది.  బెర్న్ 1874 ఒప్పందం అక్షరాల పరస్పర మార్పిడి కోసం ఒక తపాలభూభాగంలో పోస్టల్ సేవలు నిబంధనల సంఘటిత ఒక గందరగోళ అంతర్జాతీయ మేజ్ విజయం సాధించింది. అంతర్జాతీయ మెయిల్నిరంతరాయంగా మరియు అభివృద్ధి సంకటంలో అడ్డంకులను మరియు సరిహద్దుల చివరకు కొల్లగొట్టాడు జరిగింది.  అప్పటినుండి ఈ రోజు నాడు మనం ప్రపంచ తపాల దినోత్సవంగా జరుపుకుంటున్నాము.

అమ్మవారు ఐదవరోజు శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి గా

అమ్మవారు ఐదవరోజు లలితా త్రిపురసుందరి దేవి గా మనకు దర్శనము ఇస్తారు.ఈమెకి అల్లంగారెలు నెవేద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరినకోరికలు తీర్చేమాత. ఈ రోజు అమ్మవారు లలితా త్రిపురసుందరి అలకారంలో దర్శనమిస్తోంది.

శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీ మత్సింహాసనేశ్వరి

చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత  
అంటూ మొదలవుతుంది శ్రీ లలితా సహస్రనామం.సర్వలోకాలకు అమ్మ అయిన ఆ జగన్మాత,అన్ని లోకాలకు అధికారిణి అయిన లలిత అమ్మవారి అవతారం గురించి బ్రహ్మాండపూరాణంలో కనిపిస్తుంది.భండాసురడనే రాక్షసుడు దేవతలను వేధించే సమయంలో వాడిని అంతం చేయడానికి ఆ ఆదిపరాశక్తి అవతారించవలసిన పరిస్థితి ఏర్పడింది."అమ్మ" అవతారించాలని శివుడు యజ్ఞం ఆరంభించాడు.అందులో సమస్త విశ్వాన్ని,14 భువనాలను,7సముద్రాలను అన్నిటిని ఆహుతులుగా వేశాడు.తరువాత దేవతలందరూ తమను తాము ఆ యజ్ఞంలో అర్పించుకున్నారు.అప్పుడు ఆ చిదగ్నికుండంలో నుండి అమ్మ దేవతల రక్షణకు అవతరించిందని,దేవతా స్త్రీ సైన్యాన్ని వెంటపెట్టుకొని వెళ్ళి వాడిని సంహరించిందని తెలుస్తొంది.  మన నిత్య జీవితంలో ప్రతి ఆటంకానికి ఈ లలితా సహస్రనామ స్తొత్రంలో నామాలు పరిష్కారాలగా చెప్పబడ్డాయి.  లలితా సహస్రనామ స్తోత్రం లో వర్ణించినట్లుగా సచామర రమావాణీ విరాజితా అన్నట్లు లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటు ఇటు నిలుచుని, లలితా పరాభట్టారికని వింజామరలతో సేవిస్తున్నట్లుగా అలం కరిస్తారు. మధ్యలోనున్న లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ, చేతిలో చెరకుగడను ధరించి, శివుడి వక్షస్థలం మీద కూర్చుని, అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది.
 శ్రీ లలితా త్రిపురసుందరీదేవిని ఈ క్రింది శ్లోకంతో ధ్యానించాలి.

ప్రాత:స్మరామి లలితా వదనారావిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసమ్‌
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యాం 
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌
ఓం శ్రీ లలితా త్రిపురసుందరీ దేవతాయైనమ: 



శ్రీ లలితా హారతి

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా, శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

జగముల చిరు నగముల పరిపాలించే జననీ,
అనయము మము కనికరమున కాపాడే జననీ,మనసే నీ వసమై, స్మరణే జీవనమై,
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ హారతి. 
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

అందరికన్నా చక్కని తల్లికి --- సూర్యహారతి,అందలేలే చల్లని తల్లికి --- చంద్రహారతి,
రవ్వల తళుకుల కలలా జ్యోతుల --- కర్పూరహారతి,
సకల నిగమ వినుత చరణ --- శాశ్వత మంగళ హారతి. 

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద.

'స్కందమాత 

కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత నవ దుర్గ లో ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. మూడు కనులు కలిగి వుంటుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.
'స్కందమాత స్తుతి



'సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా
శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ
'

ఈ చరాచర జగత్తుకే మూలపుటమ్మ . శక్తిధరుడైన స్కందదేవుని జనని కావడంవల్ల దుర్గామాత స్కందమాతగా పిలవబడింది. సుబ్రహ్మణ్యోం అని కుమారస్వామిని స్మరిస్తే ఆయన తల్లి అయిన స్కందమాత హృదయం నిండా ఆనందజ్యోతులు ప్రకాశిస్తాయి. ఈమెని ఆరాధించేవారు దివ్యతేజస్సుతో స్వచ్చ కాంతులతో విరాజిల్లుతారు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)