Blogger Widgets

శనివారం, ఏప్రిల్ 18, 2015

వటపత్ర శాయి కధ

శనివారం, ఏప్రిల్ 18, 2015

కరార విందేన పదార విందం
ముఖార విందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటే శయంతం
బాలం ముకుందం మనసా స్మరామి

పద్మం వంటి తన పదాన్ని,పద్మంవంటి చేతితో, పద్మంవంటి నోటిలో చోప్పిస్తూ మర్రి ఆకుదొన్నెలో శయనించియున్న బాలముకుందునికి మనసా నమస్కరిస్తున్నాను.   
మర్రి ఆకు మీద శయినించిన  భగవానుడు శ్రీ కృష్ణులు.   పద్మము వంటి పదాన్ని పద్మం వంటి చేతితో నోటిలో పెట్టుకొని మధువును చప్పరిస్తూ కనిపిస్తారు.  ఈ వృత్తాంతం మనకు మార్కండేయ మహర్షి చరిత్ర లో కనిపిస్తుంది.  మార్కండేయుడు 6 మన్వంతరములు మహా విష్ణువుకోరకు ఘోరమైన తపస్సు చేస్తాడు.  మార్కండేయుని తపస్సు తన ఉనికికే సమస్యగా మారుతుందనుకొని మహేంద్రుడు అప్సరసలును  పంపి తపస్సు భగ్నం చెయ్యటానికి ప్రయత్నించాడు.  కానీ ప్రయత్నాలన్నీ వృదాయ్యాయి.  మార్కండేయుడు ఈ మాత్రం చలించకుండా తపస్సు చేస్తూనే వున్నాడు.  మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యి మార్కండేయ నీ తపస్సుకు కారణం ఏమిటి. నీకు ఏమి వరం కావాలి అని ప్రశ్నించాడు మహా విష్ణువు.  అప్పుడు మార్కండేయుడు దేవా నీ మాయని చూడాలని వుంది అన్నాడు.  కొన్నాళ్ళకు మహా ప్రళయం వచ్చింది.  ప్రచండమైన గాలి, వర్షం.  నదులు, సముద్రాలు పొంగి పొర్లుతున్నాయి.  భూమితో పాటు సమస్తం నీటిలో మునిగిపోయాయి.  మార్కండేయుడు విష్ణుమాయవల్ల నీటిలో తేలియాడుతూ తిరుగుతుండగా ఒకప్రదేశంలో మర్రి ఆకుమీద శయనించి వున్న చిన్న శిశువు  నోటిలో కాలివేలు పెట్టుకొని చీకుతూ  కనిపించాడు.  అతనే వటపత్ర శాయి. 
మహా విష్ణువు ఆదేశంతో మర్రి ఆకు పై వున్నా  వటపత్ర శాయి కడుపులోకి వెళ్లి చూస్తాడు.  నీట మునిగిన సమస్త భూమి, ప్రాణి కోటి కానిపిస్తుంది.  మహావిష్ణువు మరలా ఇంకొకచోట సమస్త ప్రాణులను సృస్తిస్తాడని మార్కండేయుడు తెలుసుకుంటాడు.  ఈ విధంగా మహా విష్ణువు మాయను తెలుసుకున్నాడు మార్కండేయుడు.    

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)