Blogger Widgets

ఆదివారం, డిసెంబర్ 31, 2017

నిత్యసురులకు నాయకుడా! నిద్ర పోకూడదు. మేల్కొనుము.

ఆదివారం, డిసెంబర్ 31, 2017

గోపికలు , పదిమంది గోపికలను మేల్కొలిపికొని నందగోపభావనమును చేరినారు. భావనపాలకుని ద్వారపాలకుని. ప్రార్ధించి వారి యనుమతిని పొందినారు. ద్వారపాలకుడు తలుపు తెరచి వాడలేను. గోపికలందరూ ను నందగోపభావనములోకి ప్రవేశించినారు.నందగోపుడు , యశోద, శ్రీ కృష్ణుడు, బలరాముడు వరసగా మంచాలపై సయనించినారు. వారిని ఈ రోజు మేలుకోల్పుతున్నారు. రాక్షసులు వచ్చి కృష్ణునికి ఏమి కీడు చెయునో అని ! లేక గోపికలు ఎత్తుకుపొతారెమో ! అని భయముతో జాగరుడై ముందు మంచము మీద నందుడు శయనించియుండెను. లేక లేక లభించిన కృష్ణుని వీడ లేక ఒక ప్రక్క కృష్ణుని మరో పక్క బలరాముని మద్యలొ యశొద శయనించి యుండెను. వారిని ఒక్కొక్కరిని ఇందులొ మెలుకొల్పుతున్నారు.  మరి ఎలా లేపుచున్నారో చూడండి.

పాశురం : 
  
అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము
వస్త్రములు కావలసినవారికి వస్త్రములు, మంచి నీరు , అన్నము కావసినవారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మ బుద్ధితో దానము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము , ప్రబ్బలి చెట్ల వంటి సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురువంటిదానా! మా వంశమునకు మంగలదీపము వంటిదానా! మా స్వామినీ ! యశోదా! మేలుకొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చు కొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా ! నిత్యసురులకు నాయకుడా! నిద్ర పోకూడదు. మేల్కొనుము. స్వచ్ఛమైన ఎర్రని బంగారుముతో చేయబడిన కడియము కాలిని దాల్చిన బలరామా! నీవును, నీ తమ్ముడును మేల్కొనవలెను.   అని గోపికలు ప్రార్ధించిరి. 


శనివారం, డిసెంబర్ 30, 2017

శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చినాము .

శనివారం, డిసెంబర్ 30, 2017

గోపికలు నిద్ర పోతున్న పదిమంది గోపికలను మేల్కొల్పి న తరువాత నంద గోప భవనమునకు చేరినారు. పదిమంది గోపికలును మాత్రమే కాదు . ఆనందముతో శ్రీ కృష్ణుని పొందే యోగ్యత కల గోపికలను అందరను మేలు కొలిపి నంద గోప భావనమునకు వచ్చిరి. నందగోపుని ద్వారమునకు వచ్చి ద్వార పాలకుని అర్ధించి లోనికి  ప్రవేశింతురు .
 


పాశురము:
నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ 
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై 
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము:
అందరకు నాయకునాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భావనపాలకా లోనికివిడువుము . తోరనములతో శోభిస్తున్న ద్వారమును కాపాడుతున్న ద్వారపాలకా మణులచేఅందముగా వున్నా గడియలను తెరువుము . గోపబాలికలగు మాకు మాయావి అయినమణివర్ణుడగు శ్రీ కృష్ణ పరమాత్మ ద్వని చేయ "పఱ " అను వాయిద్యము ను ఇచ్చెదనని నిన్న నేనుమాట ఇచ్చాను . మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదు. పవిత్రమైన భావముతో వచ్చాము. శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చినాము .  స్వామీ ముందుగానే నీవు కాదనకు. దగ్గరగా ప్రేమతో ఒకదానినిఒకటి చేరి బిగువుగా పట్టుకొని వున్న తలుపులను నీవే తెరచిమమ్ములను లోనకు పోనిమ్ము . అని భావనద్వార పాలకులను గోపికలు వేడుకొన్నారు.  

శుక్రవారం, డిసెంబర్ 29, 2017

ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ?

శుక్రవారం, డిసెంబర్ 29, 2017

ఇంతవరకు తొమ్మిదిమంది గోపికలని మేల్కొల్పినారు. పదవ గోపికను ఈ పాశురములో మేల్కొల్పుతున్నారు.  దీనిలో ముందుగా భాగావ్ద్భాక్తులను మేల్కొల్పుతారు. తరువాత భగవానుని మేల్కొల్పుతారు. మొదటి పదిహేనవ పాశురాలలో మొదటి ఐదు పాశురాలుచే  ఈ వ్రతము నాకు పుర్వరంగామును తెలిపి తరువాత పది పాశురాలలో పది మంది గోపికలను మేల్కొల్పినారు . దీనితో భగవద్ ఆలయములో చేరుకొనుటకు అర్హత కలిగెను. ఇంతవరకు భగవద్భాక్తుల విషయమున ప్రవర్తింపవలసిన విధనములు నిరూపించి ఈ పాశురములో దాని ఫలమును నిరుపించబడుచున్నది. ఇంతవరకు భాగాత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరిచారు గోదామాత. అట్టి సాధన చేయుటచే ఏర్పదవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలగుట. అది పుర్ణంగా తొలగినాడు గాని ఆచార్య సమాస్రయనముస్ మంత్రము లభించి భగవదనుభావము కలుగదు . ఇట్టి పరిపూర్ణ స్తితినంది యున్న గోపిక ఈనాడు మేల్కొల్ప బడుచున్నది.   ఈమెను ఏవిదంగా లేపుచున్నారో కదా! ఈ పాశురమున లోపల ఉన్నా గోపిక కుబయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది. వారి మద్య సంబాషణ ఎలావుందంటే.
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో కోసం చిత్ర ఫలితం

పాశురము:
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్ 


తాత్పర్యము:

బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ?
లోని గోపిక: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి. నేను ఇదే చెప్పుచున్నాను.
బయటి గోపుకలు: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము కాఠిణ్యము మాకు ముందే తెలియును.
లోని గోపిక : మీరే నేర్పు కలవారు. పోనిండు ! నేనే కఠినురాలను.
బయటి గోపిక : నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా !
లోని గోపిక: అందరు గోపికలు వచ్చినారా. 
బయటి గోపికలు: వచ్చిరి , నీవు వచ్చి లెక్కించుకో .
లోని గోపిక: సరే , నేను వచ్చి నేను ఏమి చెయ్యాలి ?
బయటి గోపికలు: బలిష్టమగు కువయాపీడము అను ఏనుగును చంపినవాడను శతృవుల దర్పమును అణచినవాడను , మాయావి అగు శ్రీ కృష్ణుని కీర్తిని గానము చెయుటకు రమ్ము.   లెమ్ము మాతో వచ్చి చేరుము అని లోపలి గోపికను లేపినారు.

గురువారం, డిసెంబర్ 28, 2017

నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపెడియట్లు మాట ఇచ్చినావు మరచిపోయావా?

గురువారం, డిసెంబర్ 28, 2017

ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపుతానని చెప్పినది  ఆ గోపిక ఈనాడు  మేల్కొల్పబడుచున్నది . ఈమె వీరి సంఘమున కంతకూ నాయకురాలై నడిపించగల శ క్తిగాలది .
తన పూర్వ అనుభావముచే ఒడలు మరచి తానూ చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరిచి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తానూ ఉండిపొయినది .
ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట గలదు . పెరటివైపున వున్నా ఆ తోటలో దిగుడు బావికలదు. ఆ దిగుడు బావిలో తామర పూలు , కాలువలు , ఉన్నవి ఆమె తన్మయత్వముతో అనుభావిచుచు ఇతర విషయాలనే  మరచిఉన్నది. అట్టి స్థితిలో ఉన్నా గోపికను నేడు మేల్కొల్పుతున్నారు .

 పాశురము: 

ఉంగళ్ పుళ్ళైక్కడై తోట్టత్తు వావియుళ్
శెంగళ్లునీర్ వాయ్ నెగిళ్ న్దు ఆమ్బల్ వాయ్ కుమ్బినగాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:  
స్నానము చేయుటకు గోపికల నేల్లరను మేల్కొల్పుతాను అని చెప్పి నిద్రపోవుచున్న ఒక గోపికను ఈ పాసురములో లేపుచున్నారు.  ఈ బాలికకు ఊరివారినందరాను ఒకతాటిపై నడుపగల శక్తి కలది.  ఓ పరిపూర్ణురాలా! నీ పెరటిలో నున్న  గుండుబావిలో ఎరుపుతామర పూలు వికసించినవి. తెల్లకాలువలు ముడుచుకుంటున్నాయి. అంటే తెల్లవారుచున్నాడని భావము.  లెమ్ము ఎర్రని కాషాయ వస్త్రములు దరించి తెల్లని పలువరుసలు గలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమతమ నివాసములలో ఆరాధనము చేయుటకు వేల్లుచున్నారు లెమ్ము.  నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపెడియట్లు మాట ఇచ్చినావు మరచిపోయావా? ఓ లజ్జలేనిదానా! లెమ్ము.  ఓ మాట నేర్పు గలదానా! శంఖమును చక్రమును ధరించినట్టి ఆజాను బాహుడగు పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము. అని ఈనాటి గోపికను మేల్కొల్పినారు.

బుధవారం, డిసెంబర్ 27, 2017

నీకపటమును వీడిచి మాతో కలసి ఆనందము అనుభవింపుము.

బుధవారం, డిసెంబర్ 27, 2017

వెనుకటి పాశురమున గోపికలును మేల్కొలుపుచు కృష్ణ సంకీర్తనం మాని శ్రీ రామ చంద్రుని గుణగణాలను సంకీర్తనం చేస్తూ శ్రీరాముడు మనోభిరాముడని గోపికలు అంటున్నారు.  దానిని విని నందవ్రాజమున సంచలనం ఏర్పడింది.  మధురలో పుట్టి శ్రీకృష్ణుడు గోపవంసమున చేరి తాను కూడా గోపాలుడే అనునట్లు కలసిమెలసి ఉంది వారిని కాపాడుచుండగా అలాంటి కృష్ణుని విడిచి రాముని కీర్తించుట ఏమి అన్యాయము? అప్పుడు అయోధ్యలో ప్రజలు రాముడు, రాముడు, రాముడని యనుచుండెడి వారు.  కానీ ఇతర ప్రస్తావనే లేదు కదా ! నందవ్రజమున మాత్రం కృష్ణుని తప్ప అన్యుని కీర్తించుట ఏమి హేతువు? శ్రీ రాముడా! మనోభిరాముడా.  రామునికంటే కృష్ణుడే సౌందర్యవంతుడు గదా అని ఇలా అనవద్దని కోపికలు వివాదంలో పడిరి.  రాముని కీర్తిమ్చినవారు రాముడుకు కృష్ణునికి పోలికలు చెప్పి ఇద్దరు ఒక్కరే అని నిరూపించి గెలిచినారు.  అప్పుడు ఇద్దరినీ కీర్తించుదుము అనుకొన్నారు.  ఈ పాసురములో మేల్కొల్పబడుచున్న గోపిక నేత్ర సౌందర్యమున విశిష్టస్థానం కలది.  తన నేత్ర సౌందర్యము వుండటం వల్ల ఆ కృష్ణుడు వేదక్కొని రాక ఎలా వుందగలడు అని భావించి ఆమె దైర్యముగా ఇంటిలోనే పరుండివున్నది.  ఇక్క నేత్రము అనగా ఙ్ఞానము.  ఙ్ఞానము కల చోటకు కృష్ణుడు తప్పక వచ్చును కదా అది ఆమె భావం.  అలాంటి గోపికను నేడు ఎలా మేల్కొల్పుచున్నారో చూద్దాం.   
పాశురము:


పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్




తాత్పర్యము :
పక్షి శరీరమున ఆవేశించిన బకాసురుని నోరుచీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీ కృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని పది తలలను హేలగా చిగుళ్ళు త్రుపినట్లు త్రుంపి పారవేసిన శ్రీ రాముని గానముచేయుచూ  పోయి మనతోడి పిల్లలందరును వ్రత క్షేత్రమును చేరినారు. లోపల ఉన్న తుమ్మెదగల తామరపూలను పోలిన కన్నులు కలదానా !
లేడిచూపులు వంటి చూపులు కలదానా ! శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు . పక్షులు కిలకిల కూయుచున్నవి . కృష్ణ విరహ తాపము తీరునట్లు చల్లగా అవగాహన మొనర్చి స్నాన మోనర్పక పాన్పుపై ఏల పడుకున్నావు. ఓ సుకుమార స్వభావురాలా! ఈ మంచి రోజున నీవు నీకపటమును వీడిచి మాతో కలసి ఆనందము అనుభవింపుము.


విశేషార్ధం:
పుళ్ళిన్ వాయ్ కీండానై:
అసురావేశము కలిగిన కొంగనోటిని చీల్చిన వానిని ముందుగా గోపికలు శ్రీ కృష్ణుని కీర్తించుచున్నారు.  భాగవత్ప్రాప్తికి భగవంతుడే ఉపాయం అని నిశ్చయము కల్గుటకు దంభము, అహంకారము, ప్రదానమైన శత్రువులు.  ఆ రెండిటిని తొలగించి తానే ఉపాయం అని చెప్పుటకు బకాసుర వధ వృత్తాంతము కీర్తిస్తున్నారు. తరువాత రావణవధ వృత్తాంతం ప్రస్తావిస్తునారు.  వారు అంతకుముందే రాముడు కృష్ణుడు ఒకటే అని వారి కీర్తిని కీర్తిస్తున్నారు. ముందుగా కృష్ణుని తరువాత రాముని వృత్తాంతమును కీర్తింస్తున్నారు.
ప్పొల్లావరక్కనై  కిళ్ళి క్కళైందానై :
దుష్ఠరాక్షసుని గిల్లి పారవేసిన వానిని కీర్తించుచున్నారు. తమకు పరిచయమున్న కృష్ణుని వృత్తాంతము కీర్తిచి తరువాత తమతో సజాతీయయగు సీతాదేవిని విడచియుండలేక ఎంతో వ్యధ చెందిన సౌజన్యమూర్తి యని శ్రీ రాముని కీర్తిస్తున్నారు. శరీరమును ఆత్మను విడదీసినట్లు తల్లిని తండ్రిని ఒకచోట వుండనీక వారికి ఎడబాటు కల్గించిన నిక్రుష్టుడు  రావణుడు.  సర్వేశ్వరుని నుండి లక్ష్మిని విడదీయగాలిగిన రాక్షసుడు వేరొకడు లేదు అందుచే దుష్టరాక్షసుడు అంటున్నారు.  అలా అనగానే దుష్టరాక్షసుడు అనగానే స్పురించేది రావణునిపీరు మాత్రమె.  వారు పేరు కూడా చెప్పటంలేదు. అలాంటి వారిద్దరిని కీర్తిస్తున్నారు గోపికలు.
కీర్-త్తిమై పాడి ప్పోయ్:
కీర్తినిపాడి కొనుచూపోయి,  గోపికలు వ్రతము చేసే స్థలమునకు చేరిరి.  కీర్తనే ఆధారంగా చేసుకొని వ్రాతముచేయుతకు గోపికలు ముందుకు సాగుతున్నారు.
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్:
పిల్లలందరును వ్రతముచేయు క్షేత్రమునకు చేరినారు.  కృష్ణుని పొందుటకు నిర్ణయించబడిన స్థలమునకు ముందుగానే పోయిరి.  నీవును మేల్కొని రమ్ము అని లోనున్న గోపికను ఆహ్వానించిరి.  ఆమె యొక్క కృష్ణ సమాగామునందు ఆతురత గల గోపికలు ఆగలేక ముందుగానే వెళ్ళిపోయారు.  కానీ వారు వెళ్ళుట తెల్లవారుటకు గుర్తు అవునా! కావునా వేరే గుర్తు చెప్పండి అనగా తెల్లవారినది అనుటకు వేరే గుర్తు చెప్తున్నారు. 
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు:
శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు. గొల్లవారుఅగుటచే వీరు నక్షత్రములను బట్టియే వారికి తెల్లవారుట గుర్తిస్తారు.  శుక్రుడు ను ఙ్ఞానాముగా, గురుడును అఙ్ఞానముగా వీరు తలంతురు. అదే చెప్పిరి లోన వున్నా కోపిక మీరు సంతతము కృష్ణ పరమాత్మ సంస్లేషమునే కోరినవారాగుటచే మీకు తెల్లారినట్టు అనిపిస్తోంది. నక్షిత్రాలన్ని మీకు శుక్రుడుగా, గురుడుగానే కన్పిస్తున్నాయి.  అందుచే నమ్మదగిన ప్రాభాతిక చిహ్నము కాదు అని లేవకుడా పడుకున్నది.  అప్పుడు వేరొక గుర్తులు చెప్పుచున్నారు గోపికలు.
 పుళ్ళుం శిలమ్బిన కాణ్ :
పక్షులు ధ్వని చేయుచున్నవి.  వెనుక 6 , 7  పాసురములో పక్షులుగురిమ్చి వచ్చింది మళ్లీ ఇక్కడ కూడా పక్షుల కిలకిల రవములు పేర్కొనబడినది.  పక్షులు అనగా ఆచార్యులని మనం ఇదివరకే అనుకున్నాం.  భగవంతుని అనుభవించమని నిస్తులగు ఙ్ఞానులు మేల్కొల్పును అవి వేల్లుబుచ్చే పలుకులే మొదటి కాలం.  ఆ భగవద్ అనుభవం నీవు ఒకదానివె అనుభవించుట తగదు అంటున్నారు.  కానీ ఈమె వీరి మాటలును లెక్కచేయక మాటాడక పడుకుమ్డెను.  అలా పడుకోనుటకు ఆమె నేత్ర సౌందర్య గర్వమే అని ఆమె నేత్ర సౌందర్యమును ప్రసంసిస్తున్నారు.
పోదరి క్కణ్ణినాయ్:
తామరపూలు మద్య తుమ్మెద ఉన్నట్లు ఒప్ప్చున్న కన్నులున్నదానా!  తామరపువ్వుతో పోటీపడు కనులుకలదానా! ఇటు అటు సంచరించు లేడి కళ్ళను పోలు కనులు కలది అనుతచే మౌనము స్పురించును.  ఇలా పరిపూర్ణ బ్రహ్మనుభావమున మునిగియున్న ఈమెను నేడు మేల్కొల్పుచున్నారు.
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే పళ్ళి క్కిడత్తియో:
చల్లగా చల్ల్బడునట్లు మునిగి స్నానము చేయక పానుపు పై పడుకొని ఉంటావా? భక్తులగు మాతో భాగావదనుభావం పొందుటకు మాతో రావా?  మాతో కలిసి గుణానుభవ మొనర్చి భాగవత్సార శ్లేష మొనర్చాలి అని అర్ధిస్తున్నారు.
పావాయ్!:
సుకుమారమైన స్త్రీ త్వము కలదానా నీవు కృష్ణుని తో కూడి ఉండి మమ్ములను అనుగ్రహించు.
నీ నన్నాళాల్:
మంచి రోజులు కదా.  ఈ గోపికలు లోపలున్న గోపిక యోగ్యతా గుర్తించి భగవదనుభవ యోగ్యతా కలిగి ఏకాంతముగా నీవిట్లుండుట.  ఆ కృష్ణుని మనసునకు కూడా భాద కలిగించును మాతో వచ్చి వానిని అనుభవించు.
కళ్ళమ్ తవిరుందు కలన్దు:
కపటమును వీడి కలువు. కృష్ణుని అనుభావస్తున్నట్టు భావించి వీరు నీవు ఆడుతున్న నాటకాలు చాలు ఇక రా అని అంటున్నారు.  ఇలా ఈ పాసురమున గల అన్ని సన్నివేసమును బట్టి, సంబోధనమును బట్టి పెరియాళ్వారు ఈ పాసురమున ప్రబోధించినట్టు తెలుస్తోంది.

మంగళవారం, డిసెంబర్ 26, 2017

ఇకనైనను మేల్కొని లేచి రావమ్మా! పోరిగిళ్ళవాళ్ళు వచ్చి నీ గాఢ నిద్ర చూచుచున్నారు.

మంగళవారం, డిసెంబర్ 26, 2017

ఇది వెనుక మనము చూచినా స్థితప్రఙ్ఞానావస్థలలో నాల్గోదీయినది యాతనామావస్థ.  ఈ అవస్థలో తాబేలు తన అవయవాలను వెనుకగు లాక్కొన్నట్లు భగవదనుభవమున్నవారు ఇంద్రియ విషయములందు ఇంద్రియములు ప్రవర్తింపకుండ భగవానునియందే సర్వావస్థలువుండును.  ఇది ఒక నిద్ర వంటిదే.  ఇంతవరకు నాల్గు పాశురములలో  నలుగురు గొపికలను నిద్రించుట తగదు అని చెప్పి మెల్కొలుపుతలో ఈ స్థిత ప్రఙ్ఞావస్థలోని దశలనే వివరించినట్లు తెలుసుకున్నాం.  ఈ అవస్థని భగవద్గీతలొ ఇలా వర్ణించారు.
"యదా సంహారతేచాయం కూర్మోంగానీవ సర్వశః 
ఇంద్రియాణీంద్రి యార్ధేభ్యః తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా ll "
తాబేలు తన అవయవాలను బాగుగా వెనుకకు లాగినట్లు ఇంద్రియములు  ఇంద్రియ విషయములనుండి పూర్తిగా ఉపసంహరించుకొనినా అతని ప్రఙ్ఞ ప్రతిస్ట్టతమైనది.  ఈ విధంగా భగవత్కైంకర్యనిష్ట గల, ఇంద్రియ ప్రవృత్తి విరోధముగల గోపాలుని సోదరిని ఇందు మేల్కొల్పుతున్నారు.  మరి ఈ పాసురములో ఏవిధంగా ఈమెను మేల్కొల్ప్తున్నారో కదా. 
పాశురము
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము: 
యస్సునందున్న గేదెలు తమ దూడలు పాలుత్రాగుటకు రాకపోవట వలన పొదుగుల భాధచే అరచుచు దూడలు వచ్చి త్రాగబోవుచున్నట్లు తలచి ఏకధారగా పాలుకార్చుచూ నీ ఇంటను అంతా బురద చేయుచున్నవి.  ఇట్టి అధిక సంపద కలిగియుండి కృష్ణుని విడువక ఎప్పుడూ కలసివుండె గోపవీరుని చెల్లెలా! క్రింది నెల అంతా  బురదతో నిండి ఉండగా మా తలలయండు పైనుండి పాడెడు మంచు శరీరమునంతను తడిపివేయుచున్నా నిన్ను విడిచి వెళ్ళలేక నీ ఇంటి ముంగిట నిలిచి ఉన్నాం.  అంటే కాదు తన బార్యను దొంగిలించినందున కోపించి సుందరమైన బంగారు లంకాపట్టణంనకు రాజైన రావణాసురుని వధించిన మునిజనమనోభిరాముడకు శ్రీ రాముని గురించి పాటలు పాడుతున్నాము.  అయినాను నీవు పెదవి విప్పలేదు.  ఇకనైనను మేల్కొని లేచి రావమ్మా!  పోరిగిళ్ళవాళ్ళు వచ్చి నీ గాఢ నిద్ర చూచుచున్నారు. 

ఓ సంపన్నురాలా ! నీ నిద్ర కి కారణం ఏమిటో తెలియచేయుము.

ఈనాటి పాశురములో లేపబడుచున్న గోపిక , కులముచేతను, రూపముచేతను, గుణముచేతను అందమైనది. కృష్ణుడు ఊరుకంతకు ఆదరణీయుడై యున్నట్లే.యీమె కూడా ఊరులోని అందరి మన్ననలను అందిన పిల్ల. ఈ పాశురములోని నిద్ర పోతున్న గోపిక వంశము వారు భరతుని వంశము చెందినవారు. వీరు అభిజాత్యము -సౌందర్యము - ఐశ్వర్యము కల గోపిక ను ఇందు లెపబడుచున్నది. ఈమె సౌందర్యము ను స్త్రీలే పృశంచించుట విశేషము.  గోపికలందురు కృష్ణతత్వమూ నేరిగినవారు.  నాకు అయితే వారు చాలా అదృష్టవంతులుగా తోచుతున్నది.  అయ్యో అప్పుడు నేను లేనే అని వుండివుంటే చాలా బాగుండును కదా, నేను ఒక గోపికగా వుండేదానను అనిపిస్తుంది.  సరే ఈనాటి పాశురము గురుంచి ఎలా ఈ గోపికను నిదుర లేపుతున్నారో చూద్దాం.

 పాశురము:

కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:  లేగ దూడలు కల ఆవులే అయినను దూడవలేనే లేత వయస్సులో ఉన్న ఆవుమందలను పాలు పితుకగలవారును శత్రువునుఎదుర్కొని బలము చూసి యుద్దము చేయగలవారు ఏ విధమగు దోషములు లేనివారును అయిన గోపాలకుల వంశములో జనించిన బంగారుతీగా! పుట్టలో పాము యోక్క పడగవలేనున్న నితంబ ప్రదేశము కలదానా! అడవిలోని నెమలితోకవంటి అందమైన కేశపాశము కలదానా?  రమ్ము చుట్టములు చెలికత్తెలు అందరును వచ్చినారు.  నీ వాకిలి ముందు చేరియున్నారు.  నీలమేఘమువంటి వర్ణముగల శ్రీ కృష్ణుని నామమును కీర్తించుచున్నారు.  ఆ విధముగా నందరు భగవంనామమును కీర్తించుచున్నాను కదలక మెదలక ఉన్నావేమి?  ఓ సంపన్నురాలా ! నీ నిద్ర కి కారణం ఏమిటో   తెలియచేయుము.

విశేషార్ధాము:
కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు:
లేగదూడలు కల చాలా ఆవుల మందలకు పాలుపితికి.  దూడలుగా గల ఆవులే ఐనను శ్రీ కృష్ణస్పర్శ, వేణుగానాము. వేణుగానమును విని కృష్ణ స్పర్శచే బలసి సమృద్దిగా పాలిచ్చుచ్చున్న ఆవులవి.   ఆవుల పాలు పిండు నేర్పునఉనంత మాత్రమున లాభములేదు.  పొంచియుండి  ఆ ఆవుల కాపదలు కల్గించెడి విరోధుల నెదిరించెడి బలము కూడా గలదీ గోపాలురకు అని చేబుచున్నారు.
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం:
శత్రువుల బలము నశించునట్లు ఎదురించి యుద్ధము చేయువంశము.  శ్రీ కృష్ణ పరమాత్మ అతిశయమును ఓర్వలేనివారే గోపాలురకు శత్రువులు.  భగవద్సంభంధము కలిగి భగవంతుని ప్రేమించియున్న వారికి భగవద్వేషులుగా కన్పెట్టుచుందురు.  అటువంటి బలప్రతాపము తమపై కూడా చూపునో ఏమో అని " అమ్మా! అలా బలమును చూపి త్రోసిపుచ్చుట శత్రువులనే కాని ఆశ్రయించిన వారిని కాదమ్మా! దిక్కు లేనివారిని కాదమ్మా!" అది మీ గోపాలురకు లక్షణము కాదని,
కుత్తం ఒన్ఱిల్లాద:
ఏ దోషమునులేని గోపాలవంశమున పిట్టినదాన వనుచున్నారు. శత్రువు ఎదిరించివచ్చిన ఉపేక్షించినవారను దోషములేదు. శత్రువైనను చేతిలో ఏమియు సాధనములేనిచో హింసించరాదు.  "ఎంత చెడ్డవాడైనను సరే! నన్ను ఆశ్రయించి సేవించినచో అతడు మంచి వాడే! అతడు గౌరవించదగినవాడే" అని భగవద్గీత లో శ్రీ క్రుష్ణులవారు అన్నారు కదా!  ఆ వంశములో పుట్టిననీకు ఆ లక్షణములు వుండాలి కదా!
కోవలర్-దం పొఱ్కొడియే:
గోపవంశము నందలి బంగారుతీగా! అని సంబోధించుచు మేల్కొల్పుతున్నారు. తీగ అనుటచే ఒకదాని చేరికలేనిదే నిలువనిది అని తెలుయుచున్నది.  బంగారు తీగెఅనుటచే విశదం, దృడమైనది అని అర్ధం అగుచున్నది. స్త్రీలకూ కూడా మోహము కల్గించు సౌందర్యవతి అని ఆమె సౌందర్యమును వర్ణిస్తున్నారు.  అది సౌందర్యమునకు అతిశయం అని ఆమె ను వర్ణిస్తున్నారు.
పుత్తరవల్ గుల్ పునమయిలే:
పుట్టలోని  సర్పము వంటి నితంబము కలదానా! అడవిలోని నెమలి వంటిదానా!. పుట్టలోని శరీరమునంతటను ముడుచుకొని దానిపై పడగవిప్పి పరున్న పామువలె నితంబమున్నదని ఇక్కడ వర్ణిస్తున్నారు.  ఈ వర్ణన కొత్తగా వున్నది.  అలా వుండగా ఈమెకి పునమయిలే అని అడవి నెమలివంటి జుట్టు కలది అంటున్నారు.  ఆ జుట్టు కూడా నెమలి పురివిప్పినట్టు వుందిట.  అంటే నెమలి మేఘాలను చూచి ఎలా నృత్యము చేయునో అలా జుట్టు వికసించి వుందిట.  బంగారుతీగ అనుట కూడా ఆమె అందాన్ని వర్ణిస్తున్నారు.  జుట్టు అనగా వ్యామోహం, ఆమెకి పరమభక్తి, భక్తి, పర భక్తి అను భక్తి వ్యామోహాలు కలిగివుంది.  "నీ అందము చూచి పరమపురుషుడే వచ్చునని నిర్బరంగా పడుకోటం కాదమ్మా!  మమ్ములను కలుసుకొని పరమాత్మకు చేర్చాలి అని లేపుచున్నారు.
పోదరాయ్: 
లేచి రావమ్మా!  నీ అందముచే నీ వద్దకు పరమపురుషున్ని ఆకర్షించుట కాదు.  నీ అందము తో అతని ఆకర్షించి వసపరచుకొని మమ్ములను అతని చేర్చాలని.  నీవే మాకు ఆదారం కావునా నీవు నడచి రమ్ము. అలా నడచివచ్చి తమ బృందములో చేరుమని కోరగానే, ఆమె లోపలినుండి అందరూ వచ్చినారా? అని ప్రశ్నించగా
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు:
చుట్టరికముగల చేలికత్తేలందరును వచ్చిరి అని సమాదానము చెప్పుచున్నారు.  ఈ వ్రేపల్లెలోని వారందరును ఈమెకు చుట్టములె ఈమెకు చెలికత్తేలే.  సమానమైన బుద్ధికలవారిని సఖులందరు.  అందరూ నీ వాకిలికి వచ్చినారు.
నిన్ ముత్తం పుగుందు :
నీ ముంగలి చొచ్చి నీ వాకిట చేరినాము.  ఆమెచే బందము కలుగటచే ఆ వాకిలి పరమపదము కంటే కూడా ప్రాప్యమును భావముతో చూచుచున్నది.  సర్వశేషియగు సర్వేస్వరుడు వచ్చి నిలుచు ముంగిలి కదా ఇది. ఆ ముంగిట చేరి పొందదలచిన దేమిటో చెప్పుచున్నారు.
ముగిల్ వణ్ణన్ పేర్-పాడ:
మేఘవర్ణుని నామమును కీర్తించుతాకే వచ్చితిమి. నీలమేఘశ్యాముని వర్ణించుట, అతని స్వరూపమును కీర్తించుట మా ఆనందమునకు కాదు.  నీ మనసుకు ఆనందము కలిగించుటకు కీర్తిస్తున్నాం.
శిత్తాదే పేశాదే:
అలా కీర్తిస్తున్నను నీవు ఉలుకక పలుకకు ఉన్నావేమి? భగవద్భక్తులు భాగావదనుభావము చే పొందే ఆనందాతిరేఖము చేసే చేష్టలు, పల్కులు, చూచి , విని ఆనందించుటనే ఆకాంక్షింపదగినది.
 శెల్వప్పెణ్డాట్టి:
సంపన్నురాలగు ఓయమ్మా! భగవద్అనుభవం ఒక రాసిగా చేసికొని అనుభావిమ్చుగల ఐస్వర్యము ఈమెకి కలదు. భగవద్పరతంత్రం ఉన్నది.  అలా భగవంతుని వసపరచుకొని ఆ పారవశ్యములో పాడుకొనుట  కాదు కదా
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్:
నీ నిద్రకు అర్ధం ఏమిటమ్మా?   ఇక్కడ నిద్ర అనగా పరిపూర్ణమైన భాగావదనుభావం లో బాహ్య స్మ్రుతి లేకుండుట.  అలాంటి ఎకానుభూతి కైవల్యము వంటిది.  అలాంటి కైవల్యము కల అమ్మాయిని పరకాలులు ఈ పాసురములో మేల్కొల్పినారు.

ఆదివారం, డిసెంబర్ 24, 2017

లాభనష్టాలు అన్ని పరమాత్మవే కాని తనవి కావు

ఆదివారం, డిసెంబర్ 24, 2017

శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ ను విడిచి గోపికలు విరహముచే నిద్ర లేక , వ్రతము చేయవలెనని బయలుదేరి వచ్చుచుండగా పదిమంది నిద్రించుట ఆశ్చర్యముగా ఉండును. వారిలో ఒక్కొక్కరిని ఒక్కొక్కవిదముగా మేల్కొల్పుచున్నారు. వారి నిద్ర కుడా లౌకిక నిద్ర వంటి తామస నిద్ర కాదని అది భావదనుభావము చేత కలిగిన తామస నిద్ర అని తెలియుచున్నది. భగవదనుభావమున్న వారిని మేల్కొల్పుట అనగా వారి అభిముఖ్యమును సంపాదించి వారి విశేషకటాక్షమునకు పాత్రులై పాత్రులై భగవదనుభావయోగ్యతను కలిగించుకోనుతయే! భాగాత్ప్రాప్తికి ఉపాయములు భిన్న భిన్నముగా ఉన్నట్లు కన్పట్టుచుండును. నిష్కామకర్మ, ఆత్మస్వరుప జ్ఞానము , భగవద్భక్తి , భాగాత్ర్పాప్తికి ఉపాయములుగా భగవద్గీతలో నిర్దేశింపబడెను . ఆల్వారాలను ఈ పదియవ పాసురమున మేల్కొలుపు చున్నారు.ఈ గోపిక ఫలమును ఆశించినది కాదు . లాభనష్టాలు అన్ని పరమాత్మవే కాని తనవి కావని నిశ్చలంగా ఉన్నది. ఇతర ఇంద్రియములు పనిచేయక కేవలము ఒక్క మనస్సు మాత్రమె పనిచేయుచున్నది. ఆ మనసు లో పరమాత్మ దురులకు ఆటంకములేదని సూచించుటకు కృష్ణుని పొరిగింటి పిల్ల ఈమె . ఫలము సిద్దింపక దుఃఖము కలిగినా ఉద్వేగము చెందదు . తనను పాడుట భగవానునికి ఫలముగా భావించి భాద కలిగినా భగవంతుడే ఉద్వేగము చెందాలని . ఆమె భావిచేది. ఆ సుఖాలమీద తనకి మమకారము లేదు . ఇలాంటి పారతంత్ర్య పరాకాస్తతో ఉన్న గోపిక ఈ గాఢ నిద్రలో మునిగి యున్న కృష్ణుని పొరిగింటి పిల్ల - ఈ వేళ మేల్కొల్పుచున్నారు.

                                                                                   పాశురము:  
 

నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:  మేము రాక ముందు నోమునోచి , దాని ఫలముగా సుఖనుభావమును పోందినతల్లీ! తలుపుతెరవకపోయినా పోదువుగాక, ఒక మాటనైనను పలుకవా! పరిమళముతో నిండిన తులసిమాలలు అలంకరింఛిన  కిరీటము గల నారాయణుడు, ఏమియులేని మావంటివారము మంగళము పాడినను `పర ' అను పురుషార్ధమును ఓసంగేడి పుణ్యముర్తి , ఒకనాడు కుంభకర్ణుని మృత్యువు నూతి లో పడత్రోయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడించబడి తనసోత్తగు ఈ గాఢ  నిద్ర ను నీకు ఒసగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ ! మాకందరకు శిరోభుషణమైనదానా! నిద్రనుండి లేచి, మత్తును వదలించు కొని, తేరుకొని వచ్చి తలుపు తెరువు , నీ నోరు తెరచి మాటలాడు.  కప్పుకొని ఉన్న దుప్పటిని తొలగించి ఆవరణములోకి వచ్చినీ దర్శనము మాకు కలిగించు. అని ఈ పాశురములో అంటున్నారు. 


విశేషార్ధం:
నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్:
నోమునోచుకోని స్వర్గమును చొచ్చుచున్న ఓ అమ్మా! కృష్ణుని విడిచి మాతో పాటు వ్రతము చేయుటకు సంకల్పించిన ఈమె, వ్రతము పూర్తి అయి ఫలము పొందినదానివలె ఈమె సుఖముగా పడుకోన్నదేమో అని ఆశ్చర్యముతో ఆక్షేపణగా, ఏవమ్మా ! అప్పుడే నీవ్రతము పూర్తి అయ్యినట్లున్నదే! ఫలమునుననుభావస్తున్న దానివలె వున్నావు అని అంటున్నారు.
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్:
"తలుపుతెరవకపోతే పోయావు మాటైనా పలుకవా!" ఈ గోపికా సముహామును చూచినానంద పారవశ్యముచే లోన నుండు గోపికా మాట రాక మాటాడకుండెను.
ఆంజనేయస్వామి శ్రీ రామ విజయవార్తను చెప్పగానే సీతమ్మ హర్శముచే స్థంభించినదియై ఏమీ మాటాడలేకపోయినది.  అలానే ఏ గోపికా కూడా మాటాడలేకపోయినది. దానికి సమాదానము ఇస్తే తాను అంగీకరించినట్టు అవును అని మాటాడకుండా అలానే పరుండెను.  ఆమె అభిప్రాయం తెలియనివీరు మాటైనా మాటాడవా అంటున్నారు.  ఏ మాటవిని కృష్ణునితో కలసి వున్నట్టు వారనుకుంటున్నారని గ్రహించి ఇక్కడ లేడే! మీరెందుకు అలా అంటున్నారు అన్నది.  అప్పుడు వీరు అమ్మా! నీవు దాచినా దాగదు ఈ తత్వము.  తులసి పరిమళం పైకి వ్యాపిస్తోంది అని వీరు చెప్పుచున్నారు. 
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్:
కిరీటమందు పరిమళించుచున్న తులసి కలవాడు  నారాయణుడు.  నీవు దాచినా దాగనిది తులసి వాసన.  అతడోక్కసారి కౌగలించుకొని వడిచినా,  ఆవాసన ఎన్ని స్నానములు చేసినాను విడవదు ఆవాసన.  ఆ వాసన బయటికి వస్తుంది మీ ఇంటినుండి, అతడు లేదనుట ఎలా నమ్మీతట్టు ఉంది.  తులసి వుండుట వల్ల వీరు కృష్ణుడు అక్కడ ఉన్నాడని నిశ్చయించుకున్నారు.  అతడు నారాయణుడే అని అనుచున్నారు.
నమ్మాల్ పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్:
"మాకు మంగళము పాడగానే పరను ఒసగు పుణ్యాత్ముడు". ఏమియు లేని మేము అనగా భాగాత్ప్రాప్తికి తగిన సాధనములు లేని గోపికలము చేరి ఆశ్రాయిమ్చుటకు అవకాసం ఇచ్చు పరమ ధార్మికుడు.  అతడు మాతో మాటాడకుండా నిన్ను అడ్డుకోడు. మేము జన్మతః హీనులమే కాని, నడువడి లేనివారమని అతను తలువాడు.  తనకు మంగళము పాడినా ఎవరైనా ఆశ్రయము ఇచ్చువాడు.  అంతటి ఉదారస్వభావుడు, పున్యమూర్థి, అతడే పుణ్యము అని అంటున్నారు.  అట్టి పుణ్యమే మృత్యుహేతువైనది కుంభకర్ణునికి.  ఆ పుణ్యమే నిన్ను ఈరోజు మాకు దూరం చేస్తోంది.  అది నీకు తగదని కుంభకర్ణ వృత్తాంతమును ప్రశంసించుచున్నారు.
............................పండొరునాళ్:
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో:
"పూర్వము ఒకరోజు మృత్యవు నోటిలో పడిన కుంభకర్ణుడును నీకు ఓడి పెద్ద నిద్రను ఒసగినాడా!.  ఈ గోపికా అహంకారవిజయము, శాస్త్రఙ్ఞానము, నిరంతర భగవద్యానం కల్గినది.  ఈమె  గాఢనిద్ర ఈ కృష్ణసంస్లేషమే.  అగస్యుని  ప్రభావంతో ఈమెకు అత్తినిద్ర వచ్చిందని ఈ పిల్లలు శంకించినారు.
అసురతత్వముగల కుంభకరునితో తనను పోల్చిరని భాదపడుతూ లోపలినుండి గోపికా లేచి వచ్చి వీరికి కనబడాలని కృష్ణ!-కృష్ణ! అనుచూ బాహ్యస్మృతి లోకి వచ్చినది.  అప్పుడే నిద్రలేచిన వారికి ఎట్టి మత్తు వుండునో అట్టి మత్తులో నున్న ఈమెను చూచి వీరనందింఛి. 
ఆత్త అనందల్ ఉడైయాయ్! :
అధికమగు నిద్రమత్తు కలదానా! అని పిలుచుచున్నారు.  మీరు మేల్కొనిన ఈతీరే మాకు చాలు.  కృష్ణభగవానుడు వద్దకు పోయి మేల్కొల్పుట ప్రధానము కాదు.  నీవు మేల్కొనుచుండగా దర్శించుట మా భాగ్యము. ఆ మత్తులో ఉన్న ఆమెను చూసి
అరుంగలమే:
"దుర్లభామగు ఓ భూషణమా!" అనుచున్నారు.  నీవేమియు చేయకున్నాను మాతో చేరి యుండుట మా గుంపుకు నాయక రత్నము అమర్చినట్లు అవుతుంది.  నీ ఙ్ఞానప్రకాసముచే మమ్ములను ప్రకాశింపచేసి ముందుకు నడువమని ప్రార్దిమ్చినారు.  ఎలా పిలవగానే ఆమె వారి ఆర్తిని చూసి తొందరగా లేచి బయటకు రావలేనని లోపలనున్న గోపిక త్వరపడుట గమనించి  
తేత్తమాయ్ వందు తిఱ:
"తెరుకోనినదానవై వచ్చి తరువు" అనుచున్నారు.  నిద్రావస్థలో అస్తవ్యస్తముగాఉన్న వస్త్రాభరణాదులతో, కృష్ణసంశ్లేష చిహ్నముతో వెలికివచ్చి అందరిదృష్టిలో పడకు. సర్ధుకొనివచ్చి తలుపు తెరువు.  లేనిచో మాకే ప్రమాధమని పైనున్న గోపికలు తేరుకొని రమ్మంటున్నారు. తలుపు తెరువుము.  నీవాక్కు మాకందునట్లు నీనోరు తెరువుము.  భగవదనుభవ పరవసమగు నీ శరీరము మా కంటపడునట్లు ప్రావరనమును తొలగించు అని ప్రార్ధిస్తున్నారు.  ఈ పాశురము లో ఈ కేంద్రేయావస్థలో నుండి ఇంద్రియములేవియు పనిచేయక మనసు భగవదాదీనమై సిద్దోపాయ నిస్టలో ఉన్న గోపిక మేల్కొల్పబడెను.

శనివారం, డిసెంబర్ 23, 2017

భగవంనామములను కీర్తించి ఆమెను మేల్కొనునట్లు చేయుము.

శనివారం, డిసెంబర్ 23, 2017

రుప్పావై లో మొదట కొన్ని పాశురములో వ్రతము ఎలా చెయ్యాలి నియామాలు ఏమిటి అని చెప్పారు.  తరువాత భగవంతుని ఒక్కరే అనుభవించకుండా గోపికలందరూతో కలసి అనుభవించాలని అనుకోని.  ముందు ఉత్తిష్ట అనే చిన్న పిల్లని నిదుర లేపారు. తరువాత బాగా దైవానుగ్రహం గల గోపికను నిదుర లేపారు.  తరువాత పాశురములో మూడవ గోపికకు తెల్లవారినది అని చెప్పి ఆమెను మేల్కొల్పారు. ఇప్పుడు నాల్గవ గోపికను నిదురలేపుతున్నారు.   ఈ గోపిక పరమాత్మయే ఉపాయము అను అధ్యవసాయమున పరినిస్తితురాలు. భాగవంతుని కంటే వేరే ఉపాయము లేదని  నమ్మినది . అలాంటి ఈమె నిద్రను చూచి గోదా మిగిలిన గోపికలు కూడి మొదటి రెండు పాశురాలు విన్నావు కదా ! మరి విని కుడా పరుంటివా ? లెమ్ము అని మెల్కొల్పుతున్నరు . మొదటి నాలుగు పాశురాలలొ నిద్ర నుండి మేల్కొల్పు తొ ఉన్న పాశురాలే కదా. నిద్ర గురించి భగవద్గీత లో నాలుగు అవస్తలు గురించి నాలుగు శ్లొకాలలొ వివరించారు. నాలుగు అవస్తలు 1 యతమానవస్థ 2. వ్యతిరేకావస్థ, 3. ఏకేంద్ర్దియావస్థ, 4. వశీకారావస్థ. అను అవస్థలు గురించి గీతలొ బాగా వివరించారు.
మొదటి రెండు పాశురాలలో శ్రవణము చెప్పబడినది . తరువాత పాశురములో మననము నిరూపించబడినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలో ధ్యానదశ వివరించబడినధి. అట్టి ధ్యానములో పరకాష్ట గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నది . మరి ఈమెను ఎలా నిదురనుండి మేల్కొల్పుతున్నారో చూద్దాం.  ఈ పాశురము చాలా విశేషమైనది. దీనికి దద్దోజనం ఆరగింపుగా సమర్పించాలి.

పాశురము: 
తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్

తాత్పర్యము: ఉజ్జ్వలములైన నవరత్నములతో నిర్మించిన మేడలో మెత్తని పాన్పుపై చుట్టును దీపములు ప్రకాశించుచుందగా అగురుధూపముల పరిమళము నాసికను వశమొనర్చుకోను చుండ నిద్రపోవు ఓ అత్తా కూతురా! మణికవాటము యొక్క గడియను తీయుము.  ఓ అత్తా! నీవైనా ఆమెను లేపుము.  నీ కుమార్తె మూగదా? లేక చెవిటిదా? లేక మందకొడి మనిషా?  ఎవరైనా నీవు కదలినచో  మేము సమ్మతింపమని కాపలా ఉన్నారా? లేక మొద్దు నిద్దుర ఆవేశించునట్లు ఎవరైనా మంత్రము వేసినారా.  మహామాయావీ! మాధవా! వైకుంఠవాసా! అని అనేకములైన భగవంనామములను కీర్తించి ఆమెను మేల్కొనునట్లు చేయుము అని భావము.

విశేషార్దము:
తూమణి మాడత్తు:
ఈనాటి గోపిక అద్దాలమేడలో పరుండియున్నది.  ఏ మేడ స్వచ్చమైన తొమ్మిది విధములగు రత్నములతో నిర్మించి ఉన్నది.  ఆ భవనములో నిదురపోతున్న తీరును వారు చెప్పుకొని ఆనందించుచున్నారు.
శిత్తుం విళక్కెరియ:
చుట్టూను దీపములు ప్రకాశించుచుండగా. మణి మయ భవనములో మణుల కాంతిచేతనే ప్రకాశమున్నను దీపములు వెలిగించుట మంగళార్ధము.  పగటివేళ భగవద్ సన్నిదిని దీపము వెలిగించుటలో అర్ధం అదే.  దీపము అంటే శాస్త్ర జన్యమైన ఙ్ఞానదీపము . శాస్త్రములచే కలిగిన ఙ్ఞానము తోడైయుండుటచే భగవదఅనుభవము చక్కగా పొందును.
తూపమ్ కమళ:
అగరు మొదలగు వాని ధూపము పరిమళించుచుండగా, ఈమె దీపములే కాక అగరు పొగ కూడా వేసుకొని పరుండియున్నది.  దూపము పోగాలేకుండా పరిమమలం మాత్రమె వున్నదిట.  దీపము ఙ్ఞానదీపము వంటిది, పరిమళం అనుష్టానము వంటిది.  ఏ రెండు కల్గి భగవదనుభావము కలది.  ఈ రెండే దీపము-పరిమళం దగ్గర పెట్టుకొని నిదురిస్తున్నది.  ఈమె భగవద అనుభవంలో నిమగ్నము అయ్యివున్నది అని అనుకుంటున్నారు.
మనసు పూర్తిగా పరమాత్మయందే నిలిపి ఉన్నది.
 తుయిలణై మేల్ కణ్ వళరుమ్:
నిద్రను చక్కగా పట్టించు పడక పై నిద్రించుచున్నది ఈ గోపిక.  ఈమె పూర్తిగా భగవంతుని అనుభవిస్తున్నది.  నిద్ర పట్టిస్తున్న పానుపు భగవంతుడే.  వానితో కలసి నిదురించుటనే నిద్ర.  ఈమె నివృత్తి మార్గనిష్టూరాలు.
మామాన్ మగళే!:
అత్తా కూతురా! అని ఆమెను సంబోదిస్తున్నారు.  గోపికాభావమును పొంది కేవలము ఆధ్యాత్మికముగానే కాక భౌతికంగా కూడా వార్తితో తనకు సంభందములను ఏర్పర్చుకోనుచున్నది గోదామాత.  గోదా తననుకూడా గోపవనితగా భావించుకొని.  గోపికను అత్తా కూతురా అంటోంది.
మణి క్కదవం తాళ్ తిఱవాయ్:
"మణులతో నిర్మింపబడిన తలుపుల గడియలను తెరువుము". ఆమె భవనం మణులతో వున్నది కదా దాని గడియలు ఎక్కడున్నావో తెలియటంలేదు. ఏది ద్వారమో, ఏది గోడో తెలియటంలేదు. ఆమెనే తలుపుతెరవమన్నారు.  "మీరే తెరుచుకురండి" అని ఆమె అన్నా గోపికలు అంగీకరించక ఆమెనే తలుపు తెరవమన్నారు వీరు. మేము ఇలా చెప్పినా లేవకుండా పడుకుండుట తగదు అని చెప్పుచున్నారు.
మామీర్! అవళై ఎళుప్పీరో:
అత్తా! ఆమెను లేపుము.  మా ఆర్తిని చూచి మేలుకోపోయినా, నీ అనునయము చేతనైనా మేల్కొనునట్లు చెయ్యి.  భగవంతుడే ఉపాయమని విశ్వసించి ఆ భగవంతునికొరకు ఆర్తి కలిగిన ఇతరులకై తానుకూడా భాధపడుచు వారికి సాయపడుట తప్ప వేరే ఉపాయం లేదు.  ఇది భగవంతుని పొందుటకు అనుకూలము అని తల్లే చెప్పి ఆ పరుండిన గోపికను మేల్కొల్పాలి.  అలా మేల్కోకపొక పోవుట చూచి మనసులో భాధకల్గి
 ఉన్ మగళ్ తాన్  ఊమైయో :
నీ కూతురు మూగదా! అని అనుచున్నారు. నీ కూతురు అని కోపముతో అనుచున్నారు. మారుమాటాడదా! పలకకుండా ఎవరైనా నోరు ముసినారా?  నీ కూతురు భగవంతుడే ఉపాయము అనుకునేవారితో కలసి రాదా ఏమి ?
ఇదేనా నీకూతురుకు నేర్పిన విద్య! అని ఆక్షేపిస్తున్నారు.  ఇలా చేయటం ఆమెకు అనుకూలము కాదు సరికదా ప్రతికూలమే అవుతుంది.  భగవదనువిరోదులుతో మాటాడకూడదు కానీ భగవదప్రాప్తి కాలమగు మాతో మాటాడరాదా?
 అన్ఱి చ్చెవిడో:
మూగయే కాక చెవుడు కూడనా? మామాటలు వినబడనట్లుగా అక్కడేవరైనా ఆమె చెవిలో మాటాడుతున్నారా?
అనన్ధలో :
ఏ వ్యాపారము చేయలేని అలసటలో వున్నదా ?
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో:
ఎవరైనా ఆమెను లేవవద్దని కాపలా ఉన్నారా? లేకపోతె గాఢనిద్ర పట్టునట్లు మంత్రించియున్నారా?  మాకు నిద్ర పట్టకుండా చేసినవాడే ఈమెకు నిద్రపట్టించినాడా?  అతడు కాపలాయుండి ఈమెను నిద్రనుండి మేల్కొననీయకుండా వున్నాడా? నిద్రకు, తెలివితెచ్చుకోనుటకు పరమాత్మే కారణం. అతనితో కలసినవారు నిద్రపోదురు. వీడినవారు నిద్రలేకుండా వుందురు.  అనన్యఉపాయత్వమ్ తెలిసినవారు భగవన్నామమునకు వశులై ఆ సంకీర్తనమునకు అంతరనుభావంనుండి భాహ్యను భావమునకు వస్తారు.  అదే మేల్కొనుట. 
"మామాయన్, మదవన్, వైకుందన్," ఎన్ఱెన్ఱు నామం పలవుమ్ నవిన్ఱు:
'మహా మాయావీ! మాధవా! వైకుంఠ వాసా ! అని అనేక నామాలును కీర్తించినారు.  ఈ మూడు నామాలలో భగవంతుని కళ్యాణగుణాలను కొన్నింటిని వీరు మరచినారు. మహామాయావి అనుటలో జగత్కారణం అయిన పరమాత్మ కృష్ణుని కీర్తిస్తున్నారు.
మాయ అనగా ప్రకృతి.  ఈ ప్రకృతినే పరమాత్మగా భావిస్తున్నారు. మాయ అనగా భగవద సంకల్పరూపము.అది ఆశ్చర్యమైన శక్తీ కలది. అదే ఈ సర్వమునకు మూలము అని.
మాదవ అంటే మా = శ్రీ యొక్క, ధవః = శ్రీయఃపతీ అని కీర్తించాడు. జగత్కారణమైన ఆ పరతత్వము. సర్వసులభమై దిగుటకు శ్రీ మహా లక్ష్మే కారణం.  ఆమెవద్ద శుశ్రూషచేతనే ఈ సౌలబ్యాము అతనికి అబ్బింది అని మాధవా అని కీర్తిస్తున్నారు.  ఈ లక్ష్మీపతితత్వమే యితడు పరతత్వమని నిరుపిస్తోంది.
దీనితో ఆభాగావదనుభవ నిమగ్నమైన గోపిక ఆప్రత్యేకానుభూతిని వీడి వీరితో కలసి అనుభావిమ్చినాగాని నిలువలేని మనస్థితి గలది వెలికి వచ్చెను ఈ గోపిక.  మొత్తానికి ఈ గోపికను కూడా నిదురలేపారు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)