Blogger Widgets

శుక్రవారం, డిసెంబర్ 09, 2011

శ్రీ దత్త జయంతి

శుక్రవారం, డిసెంబర్ 09, 2011

శ్రీ దత్త జయంతి శుభాకాంక్షలు

31 Days of Science and Spirituality


The International Gita Society and Krishnauniverse invite you for the worldwide  " 31 Days of Science and Spirituality" Bhagavad Gita Reading Campaign to celebrate Gita Jayanti 2011.


సోమవారం, డిసెంబర్ 05, 2011

గీత సుఖ జీవన మంత్ర

సోమవారం, డిసెంబర్ 05, 2011

ఈరోజు  గీతా జయంతి. 

హిందూ పవిత్ర గ్రంధం భగవ​ద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా మార్గశిర ​శుద్ధ ఏకాదశి  రోజు జరుపుకొంటారు.  ఈ రోజు కౌరవ రాజు దృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు.   భగవత్ గీత భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామ భూమి లో ఉపదేశిస్తాడు.అన్ని సంధి ప్రయత్నాలూ విఫలమైన తర్వాత, యుద్ధం ప్రకటిస్తారు పాండవులు. సంగ్రామ భూమిమీద అడుగు పెట్టిన తర్వాత ఆ మహా సైన్యం చూసి, వారిలో తన తాత అయిన భీష్ముడు వంటి వారిని చూసి నేను యుద్ధం చేయలేను అని అస్త్త్రాలు విడిచి పెట్టాడు.  అప్పుడు శ్రీ కృష్ణులు వారు గీతోపదేశం చేసారు. దాని సారం శాంతి. కృష్ణుడు అర్జునుడుతో ఇలా ఇన్నారు.
మిత్రమా !ఎందుకు భాధపడుతున్నావు !అయ్యిందేదో అయ్యింది . పొయిందేదో పోయింది .
ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమి తెలేదుకదా. వట్టి చేతులతో వచ్చావు ! పోయేటప్పుడు లగేజిలతో పొవాలనుకుంటున్నావు! అందుకే నీకంత యాతన. నువ్వేమి తెచ్చావని -నువ్వు పోగొట్టుకున్తున్నావు. నీవేమి సృస్తిమ్చావని నీకు నష్టం వచ్చింది? నువ్వు ఏదైతే పోదావో అది ఇక్కడనుండే పోదావు. ఏదైతే ఇచ్చావో అదీ ఇక్కడనుండే ఇచ్చావు.

ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం , రేపు ఇంకొకరి సొంతం కాగలదు.
కావున జరిగేది జరుగక మానదు . అనవసరంగా ఆందోళన చెందకు . ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపంలేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా భగవంతుని ప్రసాదంగా స్వీకరించు అన్నారు.
సుమారు 6,000 సంవత్సరాల పుర్వం ఉపదేశించబడినా ఇది ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడడం విశేషము. ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గం లో నడిపిస్తుంది.  అనటంలో ఎటువంటి సందేహం లేదు.


మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగితే అదే అదృష్టంగా బావిస్తాము.  అన్నిటిలోనూ మనం అనుకున్నది జరగక పొతే అప్పుడు మనం అనుకుంటాం మనకు ఆ గీత రాసి లేదు అనుకుంటాము.  మన గీత లోనే వుంది భగవద్గీత.  అడితెలిసినవాడు ఎటువంటి భాధకు లోనుకాడు. గీతను శ్రీ క్రిష్ణులవారు ద్వాపరయుగం చివర లో అనగా కలియుగానికి ప్రారంబం లో జరిగింది.  జగత్గురు శ్రీ కృష్ణులు కార్తీక బహుళ అమావాస్యనాడు చెప్పారు.  ఉపనిషిత్తులు ను అవులుగాను,  అర్జునుని దూడగా చేసి శ్రీ కృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత.  గీతను అర్జునునికి శ్రీ కృష్ణుడు చెప్పిన గీత జ్ఞానం అంతా 18 అద్యాయాలుగా పరమపదసోపాన మార్గంగా విరాజిల్లుతోంది.  ఎవరు సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సుఖంగా, సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు. మోక్షస్థానాన్ని ల క్ష్యంగా చేసుకున్న వారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతాడు.  


వ్యాసుని అనుగ్రహం వల్ల గీతాబోధనను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగాడు. అందువల్ల భగవంతుని ద్వారా విన్నది విన్నట్లుగా సంజయుడు గీతను లోకానికి అందించాడు. గీత అనే పదంలో గీ అంటే త్యాగం, త అంటే తత్వజ్ఞానం. అంటే త్యాగాన్ని, తత్వజ్ఞానాన్ని బోధించేదే గీత. అది భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది. గీతలో నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి.


గీతను మొదట  ఎవరు విన్నారంటే... శ్రీకృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథంపై ఎగిరే ధ్వజరూపంలో ఉన్న ఆంజనేయుడు.
గీతామహాత్మ్యాన్ని శివుడు పార్వతికి, విష్ణువు లక్ష్మీదేవికి, బ్రహ్మ సరస్వతికి చెప్పారు. త్రిమూర్తులే ఒకరి సతులతో ఒకరు గీతామహాత్మ్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత? కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. చదవలేనివారు వినాలి. అదికూడా సాధ్యం కానివారు కనీసం పూజగదిలో ఉంచి పూజించాలి.


గీతాగ్రంథాన్ని పఠించిన వారికే కాదు, పూజించిన వారికీ ప్రయోజనకరమే. యజ్ఞం చెసిన ఫలం.  సమస్త  భూమండలాన్నీ దానం చెసినంత ఫలం.  గీతాగ్రందాన్ని పూజించిన దానం చెసినా ఎన్నొ  ఎంత పుణ్యం లభిస్తుందో, గీతాగ్రంథాన్ని పూజించినా, దానం చేసినా అంతే పుణ్యం లభిస్తుంది. సకల పుణ్యతీర్థాలలో అన్ని వ్రతాలూ ఆచరించిన పుణ్యంతో సరిసమానమైన పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, గీతాగ్రంథం ఉన్న వారి ఇంట భూతప్రేత రోగబాధలతో సహా దైవిక-దేహిక పీడలు తొలగిపోతాయి.


ఆధునిక జీవితంలో యుద్ధాలు లేకపోవచ్చు కాని జీవనయానం కోసం వేసే ప్రతి అడుగూ ఒక యుద్ధభేరి వంటిదే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అర్జునుడిలా, శ్రీకృష్ణునిలా అవతారం ధరించవలసిందే. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా శాంతంగా, స్థిమితంగా ఆలోచించడం ఎలాగో వివరించిన గ్రంథం ఇదొకటే! కాబట్టి దీనిని మించిన జీవన విధానం, వ్యక్తిత్వ వికాసమూ మరొకటి లేదని చెప్పవచ్చు.


భగవద్గీత మానవ సుఖ జీవన మంత్రంగా ఉపయోగించుకోవచ్చు.  ఇది నిజం.

బ్లాగర్లందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు.
జై శ్రీమన్నారాయణ 




శనివారం, డిసెంబర్ 03, 2011

నీతి కధ

శనివారం, డిసెంబర్ 03, 2011

అనగనగా ఒక ఇంట్లో ఒక చిన్న కుటుంబము నివసిస్తూ వుంది.  వారు చాలా కష్టపడి సంపాదించుకొని వచ్చిన డబ్బుతో వారికి కావలసిన సరుకులు తెచ్చుకొని కొంత వండుకొని కొంత దాచుకొనేవారు.  కానీ తెల్లవారి లేచి చూసే సరికి ఆ సామానులు వుండేవి కావు.  బట్టలు చినిగిపోయి వుండేవి.  ఇదంతా ఎందుకు ఎలా జరుగుతోంది అని వారు ఆలోచించారు.  ఒకరోజు వారు రాత్ర్హి వారు తెలుసుకుందామని నిద్రపోకుండా కనిపెట్టే ప్రయత్నం చేసారు.  అప్పుడు వారికి అర్ధం అయ్యింది ఇదంతా ఎలుకలవల్ల జరుగుతోందని.  ఇలా చాలారోజులు జరుగుతుంటే వాటి అల్లరి భరించలేక  ఆ ఇంట్లోవాళ్ళు ఒక ఎలుక బోను తెచ్చి అందులో మంచి తినుబండారాలు వుంచారు.  ఒక ఎలుక ఆ పదార్ధాలను చూసి తినాలనుకుని బోనులోకి వెళ్ళింది.  ఆ బోనులో ఆ ఎలుక చిక్కుకు పోయింది.  అప్పుడు అందులో చిక్కుకున్న ఎలుక తానూ బందీగా ఉన్నాను అనుకుంది.  తానూ బయటికి వెళ్ళలేను అను తానూ చినిపోతాను అనుకుని, చాలా భాధపడుతోంది.  అందువల్ల తన ఎదురుగుండా వున్నా తినుబండారాలు  వున్నాసరే వాటిని కనీసం చూడటం కూడా చూడటంలేదు.  అక్కడున్న మిగిలిన ఎలుకలు మాత్రం బోనులో వున్నా ఎలుకను చూసీ సంతోషించి ఆహా ఏమి మహా భాగ్యము.  అది చాలా అదృష్టవంతురాలు.  అటువంటి అదృష్టము మనము పొందలేదు.  అలాంటి అదృష్టము మనకు ఎప్పుడు దొరుకునో అని బాధపడతాయి.
అదేవిధంగా అధిక ధన బోగ భాగ్యాలను అనుభవించేవాడు ఇతరులకు భాదను కలిగిస్తాడు.  సంపన్నుల సుఖసౌఖ్యాల వెనుక ఎంతో భాధ, అశాంతి వుంటాయి.  మనం ఎంతో హాయిగా సుఖసంతోషాలు అనుభవిస్తున్నప్పుడు ధర్మా ధర్మాలు, న్యాయాన్యాలు పాటించడు.  అలా సంపాదించిన సొమ్ముతో సంతోషంగా వుండలేరు.  అతిగా ఆశపడకుండా వున్నదానిలోని సంతోషంగా గడపాలి.  లేనిచో బోనులో వున్న ఎలుకవలే,  ఎంత డబ్బు దస్కం వున్నా సంతోషంగా వుండలేరు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)