Blogger Widgets

బుధవారం, ఏప్రిల్ 06, 2016

జేమ్స్‌ వాట్సన్‌ జన్మదిన శుభాకాంక్షలు.

బుధవారం, ఏప్రిల్ 06, 2016

వేలిముద్రలు ద్వారా DNA  స్వీకరించి  ఒక వ్యక్తి యొక్క DNA మరియు వేరొక వ్యక్తి యొక్క  ఏకైక లక్షణాలను విశ్లేషించే ఒక టెక్నిక్. DNA వేలిముద్రలు ద్వారా ప్రసూతి / పితృత్వాన్ని పరీక్ష ద్వారా తెలుసుకోగలరు , ఫోరెన్సిక్స్, మరియు విపత్తు బాధితుల గుర్తించగలరు సమూలంగా. "DNA వేలిముద్రలు" మానవ గుర్తింపు సాధనంగా వేలిముద్రలు సాంప్రదాయికగా ఉపయోగాన్ని సూచిస్తాయి వాడబడుతున్నాయి. క్లాసిక్ వేలిముద్రలు పొందటానికి కష్టం మరియు ఉపయోగపడే నమూనాలను సంబంధించినదిగావుంది . సరిగా నిర్వహిస్తున్నపుడు, DNA ఆధారిత పరీక్ష మాత్రమే అందిస్తుంది, ప్రత్యేక సాక్ష్యం, అది ఒక వ్యక్తి యొక్క గుర్తింపును సాక్ష్యంగా  బయాస్ లేకుండా అందిస్తుంది.  DNA  పరీక్షా ద్వారా అసలైన నేరస్తులకు శిక్ష పడేటట్టు చెయవచ్చు.  ఇలాంటి DNA ని కనుక్కొన్న శాస్త్రవేత్త గురుంచి తెలుసుకుందాం.  
Image result for james watson dna

James Watson - జేమ్స్‌ వాట్సన్‌. జీవశాస్త్రంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్త.
అమెరికాలోని షికాగో నగరంలో 1928 ఏప్రిల్‌ 6న సంపన్న కుటుంబంలో పుట్టిన జేమ్స్‌ డేవీ వాట్సన్‌ బాల మేధావిగా పేరుపొందాడు. రేడియో క్విజ్‌ కార్యక్రమాల్లో చురుగ్గా రాణించిన జేమ్స్‌ 15 ఏళ్ల కల్లా షికాగో విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. జంతుశాస్త్రంలో పట్టభద్రుడయ్యాక 'వాట్‌ ఈజ్‌ లైఫ్‌' అనే గ్రంథం చదివి ఉత్తేజితుడై జన్యుశాస్త్ర (జెనెటిక్స్‌) అధ్యయనం ఆరంభించాడు. ఆపై 22 ఏళ్లకే డాక్టరేట్‌ సాధించాడు. పరిశోధనలు కొనసాగించి లండన్‌లోని కేవిండిష్‌ లాబరేటరీలో ఫ్రాన్సిస్‌ క్రీక్‌, మారిస్‌ విల్కిన్స్‌తో కలిసి డీఎన్‌ఏను ఆవిష్కరించగలిగాడు. 'డబుల్‌ హెలిక్స్‌' అనే గ్రంథం రాశాడు. జీవశాస్త్రంలో అద్భుతమైన ఆవిష్కరణగా పేరొందినది ఏమిటో తెలుసా? డీఎన్‌ఏ నిర్మాణాన్ని కనిపెట్టడం. ఆ పరిశోధనలో ప్రముఖ పాత్ర వహించిన శాస్త్రవేత్తే జేమ్స్‌ వాట్సన్‌. ఇందుకుగాను నోబెల్‌ బహుమతిని అందుకునేనాటికి అతడి వయసు 25 సంవత్సరాలే! ఆయన పుట్టిన రోజు -1928 ఏప్రిల్‌ 6 .
మానవ శరీరం కోట్లాది జీవకణాలతో నిర్మితమైందని మీరు పాఠాల్లో చదువుకుని ఉంటారు. ఒకో కణంలో సైటోప్లాజమ్‌ అనే జెల్లీలాంటి ద్రవ పదార్థం ఉంటుంది. కణ కేంద్రమైన న్యూక్లియస్‌లో క్రోమోజోమ్స్‌ అనే రసాయనిక పోగులుంటాయి. ఇవి క్లిష్టమైన DNA(Deoxy ribo Nucleic Acid) అనే రసాయనంతో తయారై ఉంటాయి. డీఎన్‌ఏ సర్పిలాకారపు నిచ్చెన (spiral ladder) రూపంలో ఉండే అతి పొడవైన రెండు దారాల్లాంటి నిర్మాణంతో మెలికలు తిరిగి ఉంటుంది. దీన్ని డబుల్‌ హెలిక్స్‌ అంటారు. జీవపదార్థాల్లో సమాచార మార్పిడికి ఇదెంతో కీలకం.
జేమ్స్‌ పరిశోధన వల్ల జీన్‌ క్లోనింగ్‌, జీన్‌ బ్యాంకులు, జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల పుష్ఠికరమైన ఆహార పదార్థాల ఉత్పత్తి, నాణ్యమైన ఔషధాల ఉత్పాదన, రోగ నిర్దారణలో ప్రమాణాలు సాధ్యమవుతున్నాయి. జేమ్స్‌ సారధ్యంలో కేన్సర్‌కి కారణమైన ఆంకోజీన్‌ను కనుగొన్నారు. ఎనభై రెండేళ్ల వయసులో ఆయన ఇప్పటికీ పరిశోధనలను చురుగ్గా కొనసాగిస్తుండడం విశేషం. అలాంటి జేమ్స్ వాట్సన్ కి జన్మదిన శుభాకాంక్షలు. 

ఆదివారం, మార్చి 27, 2016

ఎక్స్ కిరణాలు

ఆదివారం, మార్చి 27, 2016

     విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్.
  • రోగ నిర్దారణకు అప్పట్లో కొత్తవరావడి సృష్టించారు  ప్రపంచంలో వైద్యరంగంలో రోగనిర్దారణకు(రేడియోగ్రఫీ) మరియు రోగ నిర్మూలనకు(రేడియో థెరఫీ) కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలను కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్. ఈయన కనుగొనే ఎక్స్ కిరణాలు వైద్యరంగలములోనె కాక భద్రతా రంగంలో ఉపయోగపడుతున్నాయి. విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (మర్చి 27,1845 - ఫిబ్రవరి 10,1923) జర్మన్ దేశ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త. 1895 నవంబర్ 8 న విద్యుదయస్కాంత తరంగాలలో వివిధ తరంగ దైర్ఘ్యలుల అవధులలో గల ఎక్స్- కిరణాలను కనుగున్నాడు. ఈ పరిశోధన వల్ల 1991 లో భౌతిక శాస్త్రంలో మొదటి సారి నోబెల్ బహుమతి పొందారు. ఈయన చేసిన కృషికి గాను ఆవర్తన పట్టిక లో 111 పరమాణు సంఖ్య గల మూలకానికి రాంట్ జీనియమ్ అనిపేరు పెట్టి గౌరవించారు.
  • రాయింట్జన్ మార్చి 27, 1845 న జర్మనీలోని లెన్నెస్ లో జన్మించాడు. ఈయన తండ్రి ఒక రైతు. తల్లి ఒక డచ్ మహిళ. హాలెండ్ లో విద్యాభ్యాసం జరిగింది.1865 లో యుట్రెచ్ యూనివర్సిటీ లో చేరుటకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కాని జూరిచ్ లో గల ఫెడెరల్ పాలిటెక్నిక్ సంస్థ లో చేరి పరీక్షలను ఉత్తీర్ణుడయ్యాడు. అచట మెకానికల్ ఇంజనీరుగా చేరాడు. 1869 లో తత్వశాస్త్రమునందు జూరిచ్ విశ్వవిద్యాలయం నుండి పి.హె.డి పట్టాను పొందాడు. ఆ విశ్వవిద్యాలయంలో ప్రముఖ ప్రొపెసర్ అయిన ఆగస్ట్ కుండ్త్ యొక్క ప్రియమైన శిష్యుడయ్యాడు.   ఎక్స్ కిరణాలను రాయింట్ జన్ కిరణాలని అందురు. కాని రాయింట్ జనే స్వయంగా వాటిని ఎక్జ్ కిరణాలని పిలిచాడు. ఈ కిరణాలను కనుగొని లోకానికి పరోపకారం చేసినందుకు కృతజ్ఞతగా ఈయనకు 1901 లో భౌతిక శాస్త్రం తరపున నోబెల్ బహుమతి లభ్యమయింది. ఈ ఎక్స్ రే వెనుక ఎంతో ఆసక్తి కరమైన కథ ఉంది.
  • రాయింట్ జన్ కేథోడ్ రే ట్యూబ్(శూన్య గాజు నాళం) తో పరిశోధనలు చేసేవాడు. గది అంతా చీకటిగా ఉన్నప్పుడు యీ ట్యూబ్ గుండా కాంతి కిరణాలను పంపడం జరిగింది. పైగా ట్యూబ్ చుట్టూ నల్లని కాగితాన్ని కాంతి కిరణాలు ఏ కొంచెం కూడా వెలువడకుండా కప్పి ఉంచాడు. ఇలా చేసినప్పటికి కాథోడ్ ట్యూబ్ కు సమీపంలో ఉన్న బేరియం ప్లాటినో సైనైడ్ స్ఫటికం వింత మెరుపులతో ప్రకాశించ సాగింది. నల్లటి కాగితాన్ని కప్పి ఉంచినప్పటికీ కాథోడ్ ట్యూబ్ నుంచి ఏవో అజ్ఞాత కిరణాలు వెలువడి బేరియం ప్లాటినో సైనైడ్ స్ఫటికం మీద పడి అది మెరిసేటట్లు చేసిందని యీయన ఊహించగలిగాడు.
  • ఈ కిరణాలను కాగితం గుండా, చెక్క గుండా, లోహపు పలకల గుండా ప్రయాణం చేయగలవని యీయన కనుగొన్నాడు. ఈ కిరణాలు కూడా ఓ రకమైన కాంతి కిరణాలే అని అయితే వీటి తరంగ దైర్ఘ్యం చాలా తక్కువ కావటం వల్ల మనుషుల కళ్ళకు కనిపించవని రాయింట్జన్ వెల్లడించాడు. మామూలు కాంతి కిరణాలే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ల మీద ప్రభావం చూపుతూ ఉండగా, యీ కిరణాలు మాత్రం చూపకుండా ఉంటాయా అనే ఆలోచన రాయింట్ జెన్ కి రావటం - శాస్త్ర ప్రపంలో ఒక సరికొత్త అధ్యాయానికే కారణభూతమైనది.
  • ప్రయోగం చేయటం కోసం రాయింట్ జన్ ఫోటో గ్రాఫిక్ ప్లేటు మీద తన భార్య చేతిని ఉంచి యీ కిరణాలను ప్రసారం చేసి ఫోటోను డెవలప్ చేసి చూసి ఆశ్చర్యపోయాడు. చేతి ఎముకలు ఉంగరంతో సహా ఆ ఫోటో లో వచ్చింది. చుట్టూ మాంసం ఉన్నట్లు మసక మసకగా ఉంది. అంటే సజీవంగా ఉన్న మనిషి కంకాళాన్ని ఈ కిరణాల ద్వారా ఫోటో తీయవచ్చని స్పష్టంగా తేలింది.  దురదృష్ట వశాత్తు రాయింట్ జన్, ఆయనతో కలిసి పనిచేసిన మరో ఇద్దరు పరిశోధకులు యీ ఎక్స్ కిరణాల తాకిడికే క్రమ క్రమంగా మరణించారు. ఈ ఎక్స్-కిరణాల వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతున్నప్పటికీ వాటిని మితిమీరి వాడితే మాత్రం ప్రమాదం తప్పదు. యీ కారణంగానే ఎక్స్-కిరణాలను నిరంతరం గురి కాబట్టే రాయింట్ జన్ ఆ కిరణాల ప్రభావంగానే చనిపోయాడని తెలుస్తోంది.
  • 1901 లో రాంట్ జెన్ కు మొదటి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఈ బహుమతి ఆయన ఎక్స్ కిరణాలు కనుగొని విశేష సేవలందించినందుకు గాను యివ్వబడింది. కాని రాంట్ జెన్ ఆ బహుమతికి వచ్చిన ఆర్థిక ప్రతిఫలాన్ని తన విశ్వవిద్యాలయమునకు దానమిచ్చాడు. పియరీ క్యూరీ వలే రాంట్ జన్ తన పరిశోధనకు పేటెంట్ హక్కులను తిరస్కరించాడు.ఎందువలనంటే మానవాళికి తన పరిశోధన యొక్క ఫలితాలు ఉపయోగకరంగా ఉండాలని.ఈ కిరణాలకు తన పేరు కూడా పెట్టరాదని కోరుకున్నాడు.
  • రమ్ ఫోర్డ్ మెడల్ (1896)
  • మాటెక్కీ మెడల్ (1896)
  • ఎలియట్ క్రెస్సన్ మెడల్ (1897)
  • భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి (1901)
నవంబరు 2004 లో పరమాణు సంఖ్య 111 గా గల మూలకానికి ఆయన పై గౌరవార్థం రాంట్జెనీయం(Rg) అని IUPAC సంస్థ నామకరణం చేసింది. IUPAP కూడా ఈ పేరును నవంబర్ 2011 లో దత్తత తీసుకుంది.

ఆహా నమో నమో ఆదిపురుష నీకు






ఆహా నమో నమో ఆదిపురుష నీకు
ఈహల నెంతవాడను ఎట్టుగాచితివి

లోకాలోకములు లోన నించుకొన్న నీవు
ఈకడ నా యాత్మలోన నెట్టణగితివి
ఆకడ వేదములకు నగోచరమైన నీవు
వాక్కుచే నీ నామముల వడి నెట్టణగితివి

అన్నిటా బ్రహ్మాదుల యజ़్జ భోక్తవైన నీవు
అన్న పానాదు లివి యెట్టారగించితివి
సన్నుతి పూర్ణుడవై జనియించిన నీవు
 వున్నతి నా పుట్టుగలో వొకచో నెట్టుంటివి

దేవతలచే పూజ తివిరి గొనిన నీవు
ఈవల నాచే పూజ ఎట్టుగొంటివి
శ్రీ వేంకటాద్రి మీద సిరితో గూడిన నీవు
ఈ వీధి మా యింట ఇపుడెట్టు నిలిచితివి ||

బుధవారం, మార్చి 23, 2016

వినోద సంబరాల రంగుల పండుగ "హోలీ"

బుధవారం, మార్చి 23, 2016

"హోళికా" దహనం. 
ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఆమె ప్రీతి కోస౦ అ౦దరూ కలిసి గానాలు చేయడ౦, పరిహాసాలాడడ౦ చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధి౦చే స౦ప్రదాయ౦ ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి.
శ్రీ మహా లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు.  
శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధి౦చి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్ర౦, వ౦టివి పారాయణ చేయడ౦ మ౦చిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చి౦చే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
’డోలోత్సవ౦ శుభాకాంక్షలు. 

ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధి౦చాలి. దీని ’డోలోత్సవ౦’ అని అ౦టారు. ఒరిస్సావ౦టి ప్రా౦తాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు.

నరాడోలాగత౦ దృష్ట్వా గోవి౦ద౦ పురుషోత్తమ౦!
ఫాల్గుణ్యా౦ ప్రయతో భూత్వా గోవి౦దస్య పుర౦వ్రజేత్!!

ఉయ్యాలలో అర్చి౦పబడిన పురుషోత్తముడైన గోవి౦దుని ఈరోజున దర్శి౦చిన వారికి వైకు౦ఠలోక౦ ప్రాప్తిస్తు౦దని ధర్మశాస్త్రాల వాక్య౦.
వినోద సంబరాల రంగుల పండుగ "హోలీ" శుభాకాంక్షలు. 
హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాసిస్తాయి, అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషము.  
 హిరణ్యకశ్యపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.

ప్రాథమిక పరిశోధనల ప్రకారం 7వ శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకొన్నారని తెలిసింది. వాస్తవంగా హోలీ పండుగకు సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి, మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు మరియు పొడవైన చిమ్మే గొట్టాలు లేదా చిమ్మే తుపాకుల నుండి రంగు నీటిని జల్లుకుంటారు. సంగీత కచేరీల ద్వారా అనగా పండుగకు సంబంధించిన పాటలను మరియు రాధా మరియు కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు; ముఖ్యంగా జానపద పాటలు అనగా "హోరి" పాటలను పాడేవారు. కొన్ని సంప్రదాయక జానపద పాటలు ఆజ్ బిరాజ్ మే హోలీ రే రాసియా కొన్ని తరాల నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి.
సంవత్సరాలు గడుస్తున్నకొద్ది, ప్రవాసభారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, యూరప్ మరియు దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు.
వసంత కాలంలో వాతవరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం మరియు జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం: సంప్రదాయముగా రంగులను నిమ్మ , కుంకుమ, పసుపు, బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు.
తడి రంగుల కొరకు, మోదుగ పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది.  రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది. వీటి వల్ల అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి.  అలాంటి వ్యాధులు రాకుండా వుండాలి అంటే రసాయన రంగులను ఉపయోగించకుండా వుంటే మంచిది.
ఇది వసంతోత్సవ పండుగ.  హోలీ పండుగ కృష్ణుడు కూడా జరుపుకున్నాడు అంటారు.  ఈ పండుగ గురించి నేను కొంచెమే తెలుసుకున్నాను అని నాకు అనిపిస్తోంది. 


హోలీ పండుగను అందరు సంతోషము గా జరుపుకోవాలని అనుకుంటున్నాను.  
అయ్యప్ప జననదినోత్సవ శుభాకాంక్షలు.
ఈరోజు అయ్యప్ప స్వామీ వారి జయంతి కూడా.  ఒకేరోజు ఎన్ని విశేషాలు వున్నాయో కదా !
ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్తమణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమం తో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. అయ్యప్ప జననదినోత్సవ శుభాకాంక్షలు. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)