Blogger Widgets

శనివారం, డిసెంబర్ 16, 2017

భగవత్ప్రాప్తి కావాలని వ్రతము ప్రారంభించారు.

శనివారం, డిసెంబర్ 16, 2017

ధనుర్మాసవ్రతము ముప్పై రోజుల వ్రతము కదా అయితే గోపికలు మొదటిపాసురములో వారికి ఏమికావాలో ఎలాచేయాలో అల్లోచించారు.  వారు భగవత్ప్రాప్తి కావాలని వ్రతము ప్రారంభించారు అని తెలుస్తోంది.  మరి రెండవ పాసురములో వారు ఏమిచేస్తున్నారో తెలుసుకుందామా.
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు కోసం చిత్ర ఫలితం
పాశురము 


వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్ 


తాత్పర్యము:  భగవంతుని దర్శించుటకు వెళ్ళేవారు భాగాత్ప్రాప్తి కోసం కొన్ని నియమాలు పాటించాలని.  శ్రీ కృష్ణుడు అవతరించిన ఈ లోకములో పుట్టి దు:ఖమైన ఈ లోకములో కూడా భగవదనుగ్రహముచే ఆనందము అనుభవించుచుతున్న వారలారా!  మేము మా వ్రతమునకు ఏర్పరచుకోనిన నియామాలు వినండి.  పాలసముద్రములో పడుకొని నిద్రించుతున్న పరమాత్మ యొక్క పాదపద్మాలకు మంగళము పాడతాము.  మేము ఈవ్రతము చేసినంతన కాలమున నీటిని కానీ పాలను కాని అనుభవించము.  తెల్లవారుజాముననే నిదురలేచి చల్లనినీటినే స్నానము చేసెదము.  కళ్ళకు కాటుకను అలంకరించము.  తలకు పరిమలబరితమగు పూలదండలను ధరించము.  మా పెద్దలు విడిచిపెట్టిన చేడుపనులు మేము ఆచరించము.  ఇతరులకు బాధ కలిగే మాటలు కానీ, అసత్యాలను కాని ఎప్పుడూమాటాడము.  ఇతరులకు హాని uకలిగించము.  ఇతరులకు హానిలాగే ఆలోచనలు చేయము.  ఙ్ఞానసంపన్నులైన మహాత్ములను ధనధాన్యాదులచే ఎక్కువ సత్కారిచుదుము.  బ్రహ్మచారులకు బిక్షుకలుకు బిక్షపెట్టేదము.  భగవంతుని కళ్యాణ గుణాలను కీర్తించేదము.  గురువు ను పరబ్రహ్మగా భావించాలని మన పెద్దలు చెప్పారు కదా అందుకే గురువులను పూజించి ఆచార్య కృపపోందేదము.  వ్రతనీయమాలు ఏ రీతిగా చెప్పబడినవో ఆవిధంగా పాటిద్దాం అనుకున్నారు. శ్రీ కృష్ణుని పొందుదాము.


విశేషార్ధము :
1 .  వైయత్తు వాళ్ వీర్గాళ్!  :-
ఈ లోకములో ఆనందము అనుభవించువారలారా!  అని సంబోధించుచున్నారు.
2 . నాముం నం పావైక్కు చ్చెయ్యుఙ్గిరిశైగళ్ కేళీరో!  :-
మేము మా వ్రాతములో చేయు క్రియలను వినుడు.
3 . పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి  :-
పాలసముద్రములో మెల్లగా పాడుకొనిన పరమపురుషుని పాదములకు మంగళము పాడి.
4 . నెయ్యుణ్ణోం పాలుణ్ణోం  :-
నేతులారగించము- పాలు తాగము.
5 .  నాట్కాలే నీరాడి  :-
తెల్లవారుజ్హాముననే స్నానము చేయవలెను.
6 . మైయిట్టెళుదోం  :-
కాటుకను మాకళ్ళకు అలంకరించము.
7 .   మలరిట్టు నాం ముడియోమ్  :-
మేము మాకోప్పులలో పూలు ధరించము.
8 . శెయ్యాదన శెయ్యోం  :-
"మా పెద్దలు చేయని పనులను మేమూ చేయము"
9 .  తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్  :-
ఇతరులకు అనర్ధమును కల్గించు తప్పు మాటలను పలుకము.
10 .  ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి  :-
దానమును, భిక్షమును చాలు అన్నంతవరకు  ఇచ్చి  అయ్యో! ఏమియు చేయలేకపోతిమే అని విచారింతుము.
11 . ఉయ్యుమాఱెణ్ణి యుగందు :-
పైన విధంగా ఉజ్జీవించు విధములను పరిశీలించి సంతోషించి ఈ వ్రత నీయమాలను వినండి.

జై శ్రీమన్నారాయణ్

ఓహో ! మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజు .

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం  
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భూంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః

మార్గళి త్తింగళ్ పాశురము :
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .

ఓహో ! మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజు . ఓ అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలొ సంపదలతో తులతూగు చున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్నా సంకల్పమున్నచొ రండు. ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశొద యొక్క బాలసిమ్హమును, నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించనిమనకే , మనమాపేక్షెంచు వ్రత సాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చీయుటను చూచి లోకులందరు సమోషించునత్లు మీరందరు వచ్చి ఈ వ్రతములొ చేరుడు.

శుక్రవారం, డిసెంబర్ 15, 2017

ధనుర్మాస వ్రతారంభం

శుక్రవారం, డిసెంబర్ 15, 2017

తిరుప్పావై తెలుగు కోసం చిత్ర ఫలితం
ధనుర్మాస వ్రతారంభం 
ధనుర్మాసం అనగానే అది మార్గశిరమాసం లో వస్తుందని అందరికి తెలుసు కదా మరి మర్ఘశిరమాసం వచ్చింది.  శ్రీ కృష్ణులవారు స్వయంగా ఇలా అన్నారు మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో.  అలాంటి మార్గశిరమాసం అంత విశిష్టత సంతరించుకుంది .  ఇది తెలుగు సంవత్సరములలో తొమ్మిదో మాసం దీనినే మనం  దనుర్మాసం అని కూడా అంటాము.  ఎంతో విశేషమైన రోజులు.  ఈ దనుర్మాసం నెల రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి పాడిన ౩౦ పాశురాలును పాడతారు  అందుకే ఈ మాసం విశేషమైన మాసం గా చెప్పుకోవాలి. 
అంత విశేషమైన ఈ నెలరోజులు చంద్రమానము బట్టి చేయుటకు గుర్తుగా ఆ నెలరోజులు ఇంటి ముంగిట పండగ వాతావరణముతో విశేషమైన ముగ్గులు పెట్టి అందులో నేలగంట పెడతారు . ఆ నెలరోజులు వైష్ణవ గుళ్ళకు వెళ్ళతారు ఈ నెలరోజులు రోజుకు ఒక పాశురమ్  చదువుతారు . ఇలా 30 రోజులు పాశురములు నివేదిస్తారు.  ఈ వ్రతమునే కాత్యాయనీ వ్రతము అని మరియు సిరినోము అనికూడా అంటారు.  ఈ పాశురములు స్వయంగా గోదామాత పాడతారు.  మరి మనం కూడా ఈ నెల రోజులు గోదావ్రతం ఆచరిద్దాం.  
శ్రీశైలేశ దయాపాత్రం 

శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్ |
యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్ ||
లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమామ్ |
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం ||

యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే |
అస్మద్గురోర్ భగవతోస్య దయైకసిన్ధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ||

మాతా పితా యువతయ స్తనయా విభూతిః 
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్ |
ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం
శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా ||

భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ |
భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్
శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమ్ ||

కల్పాదౌ హరిణాస్వయంజనహితం దృష్ట్వైవ సర్వాత్మ్నాం
ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం  |
సర్వేషాం ప్రకటం విధాతుమనిశం శ్రీధన్వినవ్యేపురే
జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాముదారాంస్తుమ: ||

ఈ పాశురాలన్ని ఆండాలమ్మ తల్లి ధనుర్మాస వ్రతము చేసి రోజుకో పాశురం ఆశువుగా పాడి ౩౦ రోజులు నియమనిష్టలతో వ్రతము చేసి . ఆ పాండురంగనుని వివాహం చేసుకొని ఆయనలో ఐక్యమైనది.  అలాంటి గోదాదేవి చేసిన వ్రతము మనమూ చేద్దాం . అయితే ఆ అమ్మకు భక్తితో నమస్కార రూపమున శ్రి శ్రీ శ్రీ పరాసుర భట్తరువారు  ఈ శ్లోకం తో విన్నవించారు.  ప్రవచనం 

నీలా తుంగస్తన గిరితటీ సుప్త ముద్బోధ్య కృష్ణం
పారార్ధ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్ధ మధ్యాపయంతి
స్వోచ్చిస్టాయాం స్రజి నిగళితం యా బలాత్క్రుత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః       



అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగఱ్ఱ్కు
ప్పన్ను తిరుప్పావై ప్పల్పదియం ఇన్నిశైయాల్
పాడి కొడుత్తాళ్ నర్పామాలై పూమాలై
శూడి కొడుత్తాళై చ్చోల్లు

శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్పావై
పాడియరుళవల్ల పల్-వళై యాయ్ నాడినీ
వేంగడవఱ్ఱ్కెన్నె  విది ఎన్ఱ ఇమ్మాఱ్ఱం
నాంగడవా వణ్ణమే నల్గు

శ్రీ కృష్ణ పరమాత్ములవారు నీలా దేవి యొక్క ఉన్నతమైన స్తనగిరులలో నిద్రించుచున్నారు . ఆ నిద్రిస్తున్న కృష్ణ సింహమును మేల్కొల్పినది అమ్మ గోదామాత . ఆయనికి ఉపనిషత్తు లలొ ప్రతిపాదించబడిన పరతంత్రమును పాఠమును చెప్పినది . తాను అనుభవించిన వదన మాలికతో అతనిని బంధించింది . అలాంటి అలాంటి గోదాదేవికి నా మరలా మరలా నమస్కారములు .

మనము కూడా మాయచే నిద్రించుచున్నాము. కాని పరమాత్మ నిద్రించడు , అట్టి పరమాత్మకు నిద్ర తెప్పించు సౌందర్యరాశి నీలాదేవి. ఆయనని మెల్కొల్పినధి గోదాదేవి. ఆలాంటి పరమాత్మకే  ఉపదేసించినధి ఈ గోదాదేవి. ఆమె పరమాత్మను తాను అనుభవించి విడిచిన పూమాలలతో మరియు పాశురములతో బంధించింధి.  తాను చెసిన కర్మకు ఫలితంగా పరమాత్మనే అనుభవించింధి. శ్రీ గోదాదేవి. ఈ స్థితి  కేవలము శ్రీ గోదామాతకే చెల్లినది.
ఆమె దరించిన మాల పరమాత్మ స్వీకరించుటచే ఆమెకు ఆముక్తమాల్యద" అని పేరు వచ్చినది.  మాలలు తయారు చేయువాని బిడ్డ కావునా కోదై అని అంటారు. కోదై అంటే గోదా అని అర్దం.  ఇలా భట్టనాధుని కూతురై , శ్రీ రంగనాధుని ప్రియురాలై, భగవద్రామనుజులకు అభిమాన సొదరైన ఆండాళి కు మరలా మరలా నేను నమస్కారిస్తున్నాను.
.

1 నుంచి 5 వరకు ఉన్న పాశురాలలో వ్రత విధానం గురించి, 6 నుంచి 15 వరకు పాశురాలలో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్లడం, 16 నుంచి 17,18 పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొల్పడం, 23వ పాశురంలో మంగళాశాసనం చేయడం, 25, 26 స్వామివారికి అలంకారలైన ఆయుధాలను 'పర' అనే వాయిద్యాన్ని కోరుకుంటూ తమ శరణాగతిని అనుగ్రహించి తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంది. 27వ పాశురంలో పరమాత్మకు, జీవాత్మకు గల సంబంధాన్ని 'కూడారై' ప్రసాదంతో పోల్చి వివరించింది. 30వ పాశురం ఫలశ్రుతితో భగవంతునికి, మనకు గల సంబంధం తెలిస్తే కోరికలను మనం కోరవలసిన పనిలేదని స్వతంత్రించి భగవంతుడిని అడిగి పొందవచ్చని తెలియజేసింది గోదాదేవి.


గోదాదేవి భగవంతుని విషయంలో ఏవిధమగు దాస్యము కోరుకున్నదో, ఆ విధముగా దాస్యము ఆమె యెడ మాకు లభించుగాక అని పరాశర భట్టారువారు ప్రార్ధించిరి.  నేను రేపు వ్రతపాశురంలు ఆరంభిస్తాను. 
అలానే మనం కూడా ఈధనుర్మాసం  వ్రతం చేద్దామ్. 

బుధవారం, డిసెంబర్ 06, 2017

విశ్వప్రకాశునకు

బుధవారం, డిసెంబర్ 06, 2017



విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ
శాశ్వతునకూహింప జన్మమికనేడ

సర్వ పరి పూర్ణునకు సంచారమిక నేడ
నిర్వాణమూర్తికిని నిలయమిక నేడ
వుర్వీధరునకు కాలూదనొకచోటేడ
పార్వతీస్తుత్యునకు భావమిక నేడ

నానా ప్రభావునకు నడుమేడ మొదలేడ
ఆనన సహస్రునకు నవ్వలివ లేడ
మౌని హృదయస్తునకు మాటేడ పలుకేడ
జ్ఞానస్వరూపునకు కానవిన వేడ

పరమ యోగీంద్రునకు పరులేడ తానేడ
దురిత దూరునకు సంస్తుతి నిందలేడ
తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేడ
హరికి నారాయణున కవుగాములేడ

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)