Blogger Widgets

శుక్రవారం, డిసెంబర్ 22, 2017

తూర్పు దిక్కున తెల్లవారుచున్నది

శుక్రవారం, డిసెంబర్ 22, 2017

నిన్నటి దినమున రెండవ గోపికను లేపుటకు. తెల్లవారింది అనిచేప్పుటకు. వారు  భరద్వాజ పక్షులు ఎలా మాటాడుకుంతున్నాయో గోపికలు పెరుగు చిలుకుతున్నపుడు వచ్చు నగలసవ్వడి, పెరుగు సవ్వడి రకరకాలుగా తెల్లవారుటకు గుర్తులు చెప్పి ఆమెను పిచ్చిదానిగాను, నాయకురాలుగాను, తెజస్సుకలదానివి అని పిలచి నిద్రమేల్కొల్పారు.  మరి ఈ రోజు మూడవ గోపికను నిడురలేపుచున్నారు మరి ఆమెను ఎలా లేపుచున్నారు అంటే. క్రింది పాసురములో చూద్దాం.
   
 పాశురం :  

కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు 
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్  

తాత్పర్యము: తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది.  తెల్లవారినది మేతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించుచున్నవి.  మనతోటి పిల్లలు వ్రతస్తలమునకు వెళ్ళుటకు కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు.  అట్లు వెళ్ళుచున్నవారిని నిలిపివేసి మేము నిమ్ము పిలుచుటకు నీ ద్వారమందు నిలిచి యున్నాము.  కుతూహముగల ఓ లలనా ! లేచి రమ్ము.  శ్రీ కృష్ణుని దివ్యమంగళ "పర" అను సాధనము గ్రహించి కేశియను రాక్షసుని చీల్చి సంహరించినట్టియు మల్లుర ప్రాణములను కొల్లకోట్టినట్టియు దేవతలందరకు ఆ దేవుడైన వానిని సమీపించి సేవించినట్లు అయితే అతడు మెచ్చుకొని అయ్యయ్యో నేను రావలెననుకొనుచుండగా మీరే వచ్చితిరే అని మానను పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే లేచి రమ్ము అని తోటి కన్యను మేల్కొల్పుతున్నారు.

విశేషార్దము:
కీళ్ వానమ్ వెళ్లెన్ఱు:
ఇంతకు ముందే తెల్లవారుటకు గుర్తుగా కొన్ని శబ్దములు చెప్పారు కదా.  ఆ శబ్దములు అర్ధరాత్రి సమయమునైనా రావచ్చునని కావునా తూర్పు దిక్కున తెల్లవారుచున్నది అది చూడమని ఇందు చెప్పుచున్నారు.  లోపలనున్న స్త్రీ అంతలో ఇలా అంది మీలో ఏ ఒక్కరి ముఖము భగవద్ అనుగ్రహం వల్ల కాంతివంతమగుచున్నది. వారు తూర్పు వైపు న వుండుట వల్ల తెల్లవారినది అనుకుంటున్నారు మీరు.
ఎరుమై  శిఱు వీడు మేయ్ వాన్ పరందనకాణ్:
గేదెలు చిన్న బీడు మేయుటకు పోవుచున్నవి.  తెల్లవారు జాముననే రాత్రి మంచుపడిన పచ్చికను మేయుటకు గేదెలను బీడులోకి వదులుతారు.  మరలా తోలుకు వచ్చి పాలు పితికి తరువాత పగలంతా మేయుటకు అడవిలోకి తోలుచుందురు.  అది తెల్లవారుటకు గుర్తుగా చెప్పుచున్నారు.  రాత్రియే కృష్ణ సమాగమమును పొందగల్గెడి వారు కనుక తెల్లవారినచో ఇక కృష్ణుడు కనబడడని బెంగతో మేల్కొని నీవు రావలదా?  అలా ఎందుకు పడుకుంటివేలా అని అడుగుచున్నారు?  ఆమె లోపలనుండి అవి గేదెలుకావు మీ ముఖ కాంతి వల్ల చుట్టూ నల్లగా విరిసిన చీకట్లు గుంపు మీకు అలా తోచుచున్నట్లుఉంది.  అని ఉరకుండెను.
మిక్కుళ్ళ పిళ్ళైగళుం పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ 
కాత్తు ఉన్నైక్కూవువాన్ వందు నిన్ఱోం:
మిగిలిన పిల్లలును అదే పోవుటగా పోవుచున్నారు. వారిని వెళ్లకుండ ఆపి నిన్ను పిలుచుటకై వచ్చి నిలిచితిమి.
మేమేగాడు, ఊరిలోని పడతులందరును పెద్దసమూహముగా పోవుచున్నారు.  ఆపోవుట కృష్ణపరమాత్మను చేరుటకే.  అయినను తర్వాత చేరుదుమో చేరామో అన్న విచారము లేక వానికోరకు ఈ దారిని పడుచుటయే పరమానందముగా నడచుచున్నారు.
మావాయ్ పిళందానై:
గుర్రపు నోటిని చీల్చినావాడు . అసురావేశము కల్గిన గుర్రమును రెండు దవడలు పట్టి చీల్చి తనను మనలను కాపాడినవాడు.  ఆ కేశి అను రాక్షసుడు శ్రీ కృష్ణుని చంపచూసాడు. కృష్ణుడు అన్నవాడు లేకపోతె మనము కూడాలేము.  శ్రీ కృష్ణుడు తనను కాపాడుకోటమే కాక మనలను కూడా కాపాడారు.  ఇక్కడ కేళి అనునది అహంకారము గా దానిని నశింపచేయువాడు.  మనలను అహంకారం నుండి కాపాడువాడు.
మల్లరై మాట్టియ:
మల్లురను చంపినవాడు.  ఆ మల్లురను చంపుట మధురాపుర స్త్రీల మనస్సులను ఆకర్షించుతకే.  ఆ మల్లురే కామ క్రోదాలు. అవి పరమాత్మతో మనము చేరకుండా అడ్డగించును.  వీనిని కృష్ణపరమాత్మను చంపుటకై కంసుడు ప్రయోగించాడు.  దానిని మట్టి పెట్టినాడు.  కామక్రోధములు మొదలుగు వాటిని జయించినాడు.  కానీ ఆత్మకు అమ్తుకోనిన ఆవిద్య తొలగదు.  అందుచే కీర్తించి పరమపురుషార్ధమును పొందుదాము.  అతనిని శంకించకు. 
దేవాది దేవనై:
బ్రహ్మరుద్రెంద్రాది దేవతలకు కారణమైన దేవుడు.  శ్రీ కృష్ణుడే సర్వభుతములకు కారకుడు, ప్రళయ హేతువు అని చెప్పుచున్నారు.  అతడే ఉపాస్యుడు, పురుషార్ధప్రదుడు, లేచి కీర్తించి పురుషా పొందుదము.  అబలలను చూచునా అన్న ఆలోచన నీకు అవసరంలేదు.
 శేన్రూ నాం శేవిత్తాల్  ఆవా ఎన్ఱారాయుందరుళ్ :
చేరి మనము సేవించినచో అయ్యో! అయ్యో అని భాదపడి మనలను పరామర్శించి కృపచేయును.  పరమాత్మను మనము పొందుట మనకొరకుకాదు.  అతని కొరకే! అతని వస్తువులమైన మనం అతని కొరకే.  కానీ మనము చైతన్యము కలవారమగుటచే, అతను విలక్షణమైన గుణపరిపూర్తి కలవాడు అగుటచే వీడివుండలేకపోతున్నాం కదా.  అలాంటిది అతను వచ్చేవరకు వుండలేకపొతే అతడెంత భాధపడునో కదా.  అందుకే మనము పాడి పురుషార్ధం పోమ్దేదము. పోయి అతనికి ప్రియమైన కైంకర్యము చేద్దాం.  లెమ్ము ముందు నడువు అని ఆ గోపికను నిడురలేపినారు.

గురువారం, డిసెంబర్ 21, 2017

పక్షులు కిలకిల రవములు వినబడుట లేదా

గురువారం, డిసెంబర్ 21, 2017




నిన్న ఉత్తిష్ట అను చిన్న గోపికను మేలుకోల్పిరి. మరి నేడు.
వేద పఠనము కు ముందు ఎల్లప్పుడూ "శ్రీ గురుభ్యోనమః, హరిః  ఓమ్" అని ప్రారంభిస్తారు.  నిన్న గోపికలు మెల్కొలుపుట తో మన ధనుర్మాస వ్రతం ప్రారంభము అయ్యింది.  అందుకే పక్షులు కిలకిల రవములు, శంఖనాదము, హరి హరి అను వినబడుట లేదా అంటున్నారు.  పక్షులు శ్రీ గురుమూర్తులు.  అందుకే శ్రీ గురుబ్యోన్నమః అన్నట్లు భావించాలి.  తరువాత శంఖము హరి శబ్దము - హరిః ఓం అన్నట్లు భావించాలి. 
ఇలా వ్రతారంభము చేసి నేడు ఆ శ్రవణము లో వైవిధ్యమును వివరించుచు వేరొక గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. మరి ఏవిధంగా లేపుతున్నారో చూద్దం. నేడు విశేష పాశురము కావున నేడు పులిహోర ఆరగింపు పెట్టవలెను.
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు కోసం చిత్ర ఫలితం
పాశురము: 
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్.


తాత్పర్యము:భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్నివైపులా మాట్లాడుకుంటున్నాయి.  ఆ ధ్వని నీవు వినలేదా?
ఓ పిచ్చిదానా! పువ్వులతో చుట్టబడిన కేశబంధములు విడిపోవుటచేత సువాసనలు వేదజల్లుచున్న జుట్టుముడులతో ఉన్నగోప వనితలు కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు పెరుగు కుండల నుండి వెలువడు మృదంగ గంభీరధ్వని ఆ కాంతల చేతుల గాజుల సవ్వడి మరియు మేడలో ఆభరణముల ధ్వని కలిసి ఆకాశమునకు తగులుచున్నవి.  నీ చెవికి సోకటం లేదా ?  
ఓ నాయకురాలా!  అంతటను వాత్సల్యముతో వ్యాపించి ఉన్న పరమాత్మ మనకు కనబడవలెను అని శరీరము ధరించి కృష్ణుడు అవతరించినాడు.  లోకకంటకులైనవారిని నశింపజేసిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తించుచుండగా నీవు వినియును మేల్కొనవేలా?  నీ తేజస్సును మేము దర్శించి అనుభవించునట్లుగా తలుపులు    తెరువవలేనని మేల్కొల్పుతున్నారు. 


విశేషార్ధము: 
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు  పేశిన పేచ్చరవం కేట్టిలైయో:
కీచు కీచు మని అంతటను భరద్వాజ పక్షులు కలిసికొని పల్కుచున్న మాటల ధ్వని వినలేదా. అని గోపికలు,   తెల్లవారినది అని తెల్పుతున్నారు.  భరద్వాజ పక్షులు లేచి కీచు కీచు అనగానే ఆలోపాలి కాంత అది తెల్లవారుటకు గుర్తుగా అనుకోవటం లేదు.  తెల్లవారుటకు ముందు లేచి శబ్దము చేయుచున్నవని భావిస్తున్నది.
పేయ్ ప్పెణ్ణే:
పిచ్చిపిల్లా! అని అధిక్షేపించుచున్నారు.  భగవంతుని అనుభవించుటే ప్రదానమనుకొని వేరే భక్తులతో కలవకుండా ఏకాంతముగా అనుభవించుట పిచ్చితనమే.  అంటే ఏమిచెయ్యాలో తెలియకపోవుట.  వెనుక పాశురములో 'పిళ్ళాయ్' ఓ పిల్లా అన్నారు  ఆమెకి ఈ వ్రతము కొత్త అవటంవల్ల.  ఇక్కడ ఈమెను 'పెణ్' అంటే స్త్రీ అంటున్నారు అంటే భగవద్ అనుబవము కల స్త్రీ నే కానీ పిచ్చిది. అంటే భగవదానుభావం ఎలాపొందాలో తెలియనిది.  తాను ఒక్కతే కాక పదిమంది తో కలసి అనుభవించుట వివకము.  ఆ వివేకము లేనితనము పిచ్చితనమే అని వారి భావము.  లోపల ఉన్నామె పక్షులు కిలకిల లు తెల్లవారుట కాదు.  మీరే పిచ్చివారు తెల్లారింది అనుకుంటునారు అన్నది.
అప్పుడు బయటి గోపికలు వేరొక గుర్తు చెబుతున్నారు.
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు :
మెడలోని తాళిబొట్టు అచ్చుబొట్టు గలగల మనుచున్నవి చేతులూపుచూ, తలలోని పూలు జారుటచే మంచి సువాసన కల కేశపాశము కల గోపయువతులు, కవ్వముతో చిలుకుచుండగా బయల్వేడిన పెరుగు శబ్దము వినలేదా?  అని అడుగుతున్నారు.
శ్రీ కృష్ణుడు పుట్టిన తరువాత వ్రేపల్లెలో పాడి ఎక్కువైనది. గోపవనితలు పొద్దున్నే లేచి మంచిగా తయ్యారు అయ్యి పెరుగు చిలుకుతారు.  పెరుగును కవ్వముతో త్రిప్పుట వాళ్ళ వారి నగలు శబ్దము చాలా వస్తోంది.  కవ్వము త్రిప్పి త్రిప్పి అలసిపోవుట కొప్పువీడినది.  వారు చిలుకుతున్నప్పుడు క్షీరసాగరమదనము గురించి చెప్పుకుంటున్నారు అడినీవు వినలేదా అంటున్నారు.  గోపికలు పెరుగు చిలుకుతున్నప్పుడు పాట పాడుతున్నారు, వారి ఆభరణాల ధ్వని, చిలికే పెరుగు శబ్దము మూడు ధ్వనులు వినబడుతున్నాయి.  
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!:
నాయకురాలా! అని సంభోదిస్తున్నారు.  నీ అనుభవము మాకూ కూడా పంచుటకు తగినదానావు.  ఏకాంతాముగా అనుభావిస్తున్నావు అది తగదు.  పిచ్చిపిల్లా! అని సంభోదించుటకు నాయకురాలా! అని సంభోదించుటకు భావములో తేడాలేదు.  మమ్ములను నీవు ముందు వుంది నడిపించు.  శ్రీ కృష్ణుని చేర్చగల నీవు ఇలా ఉండకూడదని భావం.
నారాయణన్ మూర్త్తి కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో:
ఇక భగవద్గుణములను కీర్తించి ఆమెను వెలుపలికి తీసుకొని రావలెను అని భావించి, ముందుగా పరమాత్మ వాత్సల్యమును సూచించు 'నారాయణన్' నారాయణుని కీర్తించినారు. ఇలా నారాయణుని కీర్తించుట నీకు వినబడుటలేదా?  మూర్తి -కేవలము అంతర్యామి అయినటువంటి వాడు మనకోసం కనిపించుట వీలుగా చర్మ చక్షువులు దాల్చిన సులభుడు. అంతే కాదు మనలను శత్రువుల నుండి, తన శ్రమను కూడా లక్ష్యము చేయని కేసవుని చూడగలము. అతనికి మంగళము పాడెదము.  అయన గుణాలు విని లేవకుండా ఎలా పండుకొంటివి అమ్మా!
ఇలా చెప్పి ద్వారా రంద్రములలో నుండి బయటికి ప్రసరించు తేజస్సు చూసి.
తేశం ఉడైయాయ్!:
తేజశ్సాలినీ! అని సంబోదిస్తున్నారు.  పిచ్చిపిల్లా, నాయకురాలా! తేజశ్సాలినీ! అని మూడు విధాల పిలిచారు.  భగవద్ అనుభవం కల్గి భ్రహ్మ తేజస్సు నీలో కనిపిసూవుండగా లేదనుట తగదు.  ఆ అనుభవం నీవు ఒక్కదానివే అనుభావిస్తున్నావ్ అలా తగదమ్మా! ఏమ్మమ్మా! పిచ్చా అని వీరడుగుతున్నారు.
తిఱ:
తలుపు తెరువుము.  నీ తేజస్సు ను చూచి మేమందరం కూడా అనుభవించునట్లు తలుపు తెరువు అని అభ్యర్దిస్తున్నారు. భగవదానుభావం అందరితో పంచుకుంటే వృద్ది చెందుతుంది అని చెప్పుచున్నారు.
ఇలా రెండవ గోపవనితను కూడా నిదుర మేల్కొల్పినారు గోపికలు.
జై శ్రీ మన్నారాయణ్

బుధవారం, డిసెంబర్ 20, 2017

కృష్ణుని ప్రేమ అందరికి సమానమే

బుధవారం, డిసెంబర్ 20, 2017

ఆండాళ్ళు తల్లి ఈ వ్రతమునకు అంతా సిద్దముచేసింది.  గోదాదేవి ఈ వ్రతమునకు తానూ ఒకత్తే కాకుండా మిగతా గోపికలును కూడా ఈ వ్రతమునకు రమ్మని ఆహ్వానించింది.  ఈ వ్రతము అందరు చేయచ్చు అని వ్రతము భగవద్ అనుగ్రహము కొరకు. పాడి పంటలు బాగుండాలి అని వర్షాలు పడాలి అని లోక కల్యాణానికి అని చెప్పింది.
 కృష్ణ ప్రేమ పొందాలని చాలా కోరికతో కలలు కంటున్నారు మరి కొందరు. మరి కొందరు బగావంతుని ప్రేమ పొందుతున్నట్లు కలలు కంటూ మత్తుగా నిద్ర పోతున్నారు. ఆహా కృష్ణుడు కేవలము నా వాడే అనే తలంపుతో మగత నిద్రపోతున్నారు. కొందరైతే అస్సలు నిద్ర పోతాం లేదు. మరి కొందరు నిద్ర పోతున్నారు. అసలు శ్రీ కృష్ణుని ప్రేమ అందరికి సమానమే . మరి భగవంతుని గుణగణాలు మత్తులాంటిది  . అవి నిద్రను కలిగిస్తాయి .
ఆ నిద్రనుండి లేవని వారి పట్ల కుడా కృష్ణుని ప్రేమ ఎక్కువే. వారిని మనగోదా నిద్రలేపి వారి మనస్సులో వున్నా దోషాలను వారికి కమ్ము కున్న పొరలను తొలగిస్తుంది. భగవంతనుగ్రహము పొందేలా చేస్తుంది.
ఈ రోజు చిన్న పిల్ల అయిన ఉత్తిష్టను నిద్ర లేపుతున్నది. ఎలా అంటే.

పాశురము :

 
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము:  భగవదారణ పూర్వము లేనందునను ఈ వ్రతము యొక్క గొప్పతనము తెలియకపోవుటచేత తానోక్కతియే తన భవనమున పరుండి నిద్రించుచున్న యొక్క స్నేహితురాలిని గోదాదేవితో వచ్చినవారు మేల్కొల్పుతున్నారు.  ఎట్లానగా ఆహారము సంపాదించుకోనుటకు పక్షులు గూళ్ళనుండి లేచి ధ్వని చేయుచు పోవుచ్చున్నవి.  ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయములో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేయుచు భక్తులను రండి రండి అని ఆహ్వానించుచున్నది.  ఆ ధ్వని నీకు వినబడటంలేదా.  ఓ పిల్లా! లే ! మేము ఎలా లేచామో తెలుసునా?  పూతన ఇచ్చిన స్తన్యము త్రాగినట్టియు తనను చంపగా వచ్చిన శకటాసురునికాలుతాపు తో కాలునివద్దకు పంపినవాడను.  సముద్రజలముపై హంసతూలికా తల్పముకంటే సుఖకరమైన శేషశయ్య పై లోక రక్షణమునే ఆలోచించు యోగానిద్రననుభవించు జగత్కారణమైన పరమాత్మను తమ హృదములందు బంధించి మెల్లగా నిద్రమేల్కోను మునివర్యులు హరి హరి అని చేయు భగవన్నామ ధ్వని మా హృదయములో ప్రవేసించి మమ్ము నిద్రలేపినది.  నీవు కూడా లేచి రమ్ము.  అని నిద్రపోతున్న గోపికను గోదాదేవి చెలికత్తెలు లేపుతున్నారు.


విశేషార్ధాము:
పుళ్ళుం శిలమ్బిన కాణ్:
తెల్లవారు చున్నది అని తెలియచేయుటకు మొట్టమొదట పక్షులు కలకాలమును ఇందు చెప్పుచున్నారు. తెల్లవారుచున్నది అని తెలుసుకుని తాము ముందు లేచి ఇతరులకు మేల్కొల్పునవి పక్షులు.  తాము భగవదనుభావము ననుభవించి తమ వాక్కుచే ఇతరులకు కూడా భగవదనుగ్రము కల్గించుటకు మేల్కొల్పునట్లు చేయువారు మాహాఙ్ఞానులు .  వీరి వాక్కులచే ప్రాత:కాలము అవుచున్నది.
పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో:
పక్షిరాజగు గరుడునియోక్క ప్రభువు అగు శ్రీ మహావిష్ణువు ఆలయములో మ్రోగుచున్న - అందరినీ ఆహ్వానించు-తెల్లని శంఖము యొక్క పెద్దధ్వనియు నీవు వినలేదా! 
పక్షుల కిలకిలలును ఆమె తెల్లవారినట్టు నమ్మటంలేదు అందుకు వారు వేరొక గుర్తు చెబుతున్నారు.  పక్షులకు రాజగు గరుత్మంతుడు ఆలయములో అందరినీ రమ్మని తెల్లని శంఖమును పూరించుచున్నాడు. ఆ ధ్వని చాలా పెద్దది ఆ ధ్వని నీకు వినబడలేదా అని అడుగుతున్నారు గోపికలు.
పిళ్ళాయ్! ఎళుందిరాయ్:
ఓ పిల్లా! లెమ్ము.  అప్పుడు ఆపిల్ల  మీరు వారికంటే ముందేలేచారు కదా ! మిమ్మల్ని ఎవరు లేపారు అని అడుగగా దానికి జవాబుగా మునులు, యోగులు వారి పక్కనుండి వీడి మెల్లగా లేస్తున్నప్పుడు ఉచ్చరిస్తున్న హరి హరి హరి అను శబ్దము మాకు వినబడినది అని చెప్పారు.  ఆ యోగులు స్మరించు సర్వేశ్వరుని గుణాలు మూడిటిని చెప్పి నిరూపిస్తున్నారు.
పేయ్ములై నంజుండు:
పూతన స్తనమునందలి విషమును ఆరగించి,
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి:
కృత్రిమ శకటమును  సంధిబంధములూడినట్లు కాలుచాచి కూల్చి, 
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై:
క్షీరసాగరమున శేషశయ్యపై నిద్రపోవుచున్న కారణభూతుని,
ఉళ్ళత్తు క్కొండు:
హృదయమున పెట్టుకొని,
మునివర్గళుం యోగిగళుం మెళ్ళ వెళున్ధు:
మునులును, యోగులును మెల్లగా లేచి
అరియెన్ఱ పేరరవం ఉళ్ళం పుగుందు కుళ్ళిర్ న్ధు:
హరి హరి హరి అనిన పెద్ద శబ్ధము ఊరంతా వ్యాపించి ఆ ధ్వని మా చెవులలో ప్రవేసించి మా మనసులో పది కృష్ణవిహారము చే మా హృదయము బీటలు వాలిన హృదయ క్షేత్రమున నీరుపెట్టి పదను చేసినది.  ఆ చల్లబడి తాపముపసమింఛి మేము మీల్కొంటిమమ్మా! నీవు కూడా మేల్కొనివచ్చి మాతో కలువు.  అని మొదటి గోపికను మేల్కొల్పిరి.

మంగళవారం, డిసెంబర్ 19, 2017

మన వ్రతమునకు ఆటంకములుకలుగవు.

మంగళవారం, డిసెంబర్ 19, 2017

వర్షము ఎలా కురవాలో వారు ఇంతకు ముందు పాశురములో మేఘదేవుని ప్రార్ధించారు కదా.  వర్శములేక పాడిపంటలు శూన్యమైన సమయములో సస్యసమృద్ధికి పుష్కలముగా పైరులు పండుటకు వర్షపాతము సమృద్ధిగా పెద్దల అనుమతితో ఈ వ్రతము ప్రారంభించిరి.  కావునా ఇలా ప్రార్ధించారు. మరి ఈ పాశురము లో ఏమనుకుంటున్నారో మన గోపికలు తెలుసుకుందామా.

పాశురము:
 


మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము: మనము సక్రమముగా పూర్తిచేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనము చేసిన పాపములాటంకములు కావచ్చునని భయపడనవసరము లేదు.  ఎందుచేతనంటే  శ్రీ కృష్ణుడే మన ఈ వ్రతానికి కారకుడు మరియు నాయకుడు. అతని గుణములు ఆశ్చర్యకరములైనవి.  అతని పనులు కూడా అట్టివే.  ఉత్తరమున మధురానగరమునకు నిర్వాహకుడుగా జన్మించినాడు.  నిర్మలమైన జలముగల యమునానది ఒడ్డున నివసించుచు మనకొరకు యదుకులమందున అవతరించిన మహానుభావుడు.  తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు.  అంతటి మహాత్ముడి ఉండి కూడా ఆమెచే త్రాటితో కట్టబడిన సౌలభ్య మూర్తి.  కనుక మనము సందేహములను వీడి పరిసుద్దములై అతనిని సమీపించి పరిసుద్దమైన వికసించిన హృదయకుసుమమును సమర్పించి నోరార పాడాలి.  నిర్మలమైన మనస్సుతో ద్యానిమ్చాలి. అంతటనే వెంటనే ఇంతకుముందు పాప సమూహము రాబోవు పాపముల సమూహము మంటలో పడిన దూది వలె భస్మము అయిపోతాయి.  మన వ్రతమునకు ఆటంకములుకలుగవు.


విశేషార్ధము:
మాయనై : 
ఆశ్చర్యకరములగు గుణములు, చేష్టములు కలవానిని కీర్తించి మనము మన వ్రతమున ఉపక్రమించుదుము.
మాయ అంటే భగవద్శక్తి ఇది చాలా విచిత్రముగా వుండును.
మన్ను వడమదురై మైందనై:
ప్రతినిత్యము భాగావత్సంబంధముకల ఉత్తర మధురకు నాయకుడగు వానిని కీర్తించుచున్నారు.  పyరమపదమున వికార రహితుడగు విష్ణువు ఏకరూపుడై ఎల్లప్పుడు నిత్యసూరులకు దర్సనమిచ్చు పరమాత్మయే మధురానగరిలో అవతారములు మార్చి మార్చి దర్శనము ఇచ్చినాడు.  ఈ మదురనే సిద్దాశ్రామము.  అక్కడ వామనావతారుడుగా దర్సనం ఇచ్చారు.  ఇక్కడ శత్రుఘ్నుడు ఇక్కడ నేలవనుడను రాక్షసుడును చంపి రాజదానిగా చేసికొని పాలించాడు.  తరువాత దేవకీవసుదేవులకు శ్రీ కృష్ణుడుగా ఇచట అవతరించాడు.
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై:

పరిశుద్ధములగు అగాధములగు జలములుగల యమునానది యొక్క తీరమున విహరించువాడా! అని కీర్తించుచున్నారు.  ఇక్కడ యమునానది పవిత్రము అయినది అని అంటున్నారు.  ఈ నది శ్రీ రామావతారములో అయోద్యగా సరయునదిగా వచ్చింది.  ఇక్కడ శ్రీ కృష్ణావతారములో మదురగా యమునగా వచ్చినది.  అలా వచ్చుటచే భగవంతుని అభిప్రాయము తెలిసి కృష్ణుని ఎత్తుకు వచ్చుటకు వసుదేవునకు దారినిచ్చినది.  అలా దారి ఇవ్వటమే ఆనది ప్రత్యేకత.
 ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై:
గోపవంసమునందు ప్రకాశించిన మణిద్వీపమయిన వానిని కీర్తించుచున్నారు.    ఈ పరమపదములో సర్వేస్వరుడు ఉన్నా అక్కడ తన గుణములన్నియు ప్రకాశింప వీలుండదు.  ఆ పరమ పురుషుడే మధురలో జనించి నందవ్రజము  చేరి దీపమువలె ప్రకాసించినాడు.
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై:
తల్లి అయిన యశోద గర్బమును ప్రకాసిమపచేసిన దామోదరుని కీర్తిమ్చుచున్నారు.  ఆనాడు వన్నెల చిన్నవాడు అగు శ్రీ కృష్ణుని యశోదమ్మ తాడుతో రోటికి కట్టిన మచ్చ ఎప్పుడు కనపడుటచే అతనికి దామోదరుడు అని పేరు వచ్చింది ఆ పేరును కీర్తిస్తున్నారు.  దామోదరతత్వముచే తల్లికి కీర్తి తెచ్చినవాడు చిన్ని కృష్ణయ్యా.
తూయోమాయ్ వందు నాం :
ఇట్లు స్మరించుచు పరిశుద్దలమై వచ్చి మనము సేవించినచో  సకల పాపములు పోతాయి అని చెప్పుచున్నారు.  పరిశుద్ధము అనగా భగవద్ సంబందము తప్ప వేరొకటి లేకుండా మనసు శుద్ధముగా వుమ్చుకోనుట.
తూమలర్ తూవి త్తొళుదు:
పరిశుద్ధములయిన పుష్పములు విసిరి సేవించి.  పుష్పాలకు పారిసుద్ధము, సమర్పించు వారి భక్తియే!  ఈ పువ్వునైనా భక్తితో అర్పించినా అది పరిశుభ్రమినదే.  భగవంతుడు ఆకు అయినా, పువ్వునైనా, ఫలం అయినా, నీరు అయినా సరే భక్తితో సమర్పిస్తే వారిని కరుణిస్తాడు. భగవంతునికి ఇష్టమైన పుష్పాలు ఎనిమిది వున్నాయి.
అవి అహింసా, ఇంద్రియనిగ్రహము, సర్వభూతదయ, క్షమా, ఙ్ఞానము , తపస్సు, సత్యము, ద్యానము ఇవే ఆయన కోరుకునే పుష్పాలు.
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క:
మనము భగవంతునివద్దకు నడచి వెళ్ళుటచే అతని మనస్సున భాదకలిగించును.  అయ్యో! నేనే వారివద్దకు వెళ్ళవలసినది.  వాళ్ళు వచ్చేవరకు చేసెనే అనుకుంటాడు.  పైగా మనం మాటాడినా ఇంకా భాదపడును.  మనము అతని అనుగ్రహము కొరకు అతని వద్దకు చేరి కీర్తించూదాం.
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం తీయనిల్ తూశాగుం:
ముందు చేసిన పాపములు, తరువాత రాబోవు పాపములు కూడా అగ్నిలో పడిన దూది వలె అవుతుంది.  భగవంతుని మనము అర్చించి, పాడి, చింతించిన వెంటనే మనము చేసిన పాపాలు భగవంతుడు విస్మరించును.  రాబోవు పాపాలు తెలియనట్లు వదిలివేయును.
శెప్పు:  
చెప్పుడు,  మాయావీ, మధురానాయకా, యమునాతీరా విహారి! నందవ్రజ మంగళదీపా ! యశోదాగర్భ ప్రకాశకా!  దామోదరా! అని కీర్తించుట చాలు.  అలా కీర్తించినా సర్వ పాపాలు నాశనం అవుతాయి. అని చెప్పి వ్రతమునకు అందరిని ప్రిపేర్ చేసింది.  రేపటినుండి వ్రతానింకి ఉపక్రమిస్తున్నారు గోపికలు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)