వర్షము ఎలా కురవాలో వారు ఇంతకు ముందు పాశురములో మేఘదేవుని ప్రార్ధించారు కదా. వర్శములేక పాడిపంటలు శూన్యమైన సమయములో సస్యసమృద్ధికి పుష్కలముగా పైరులు పండుటకు వర్షపాతము సమృద్ధిగా పెద్దల అనుమతితో ఈ వ్రతము ప్రారంభించిరి. కావునా ఇలా ప్రార్ధించారు. మరి ఈ పాశురము లో ఏమనుకుంటున్నారో మన గోపికలు తెలుసుకుందామా.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjzaM4UOw-mZXsjNAQD9LOQ2Z4WRSX7CztfNkf6xRL_rlsQrWgtjBBU8pWsgQhtQiYVsdbV09TV_naqox802qZm9wFkxAkn2bJ65TEKKFIY8eH-KqcvqNPL869QQQRg7cqQfzdA6xYnGUc/s400/Untitled.jpg)
పాశురము:
మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము: మనము సక్రమముగా పూర్తిచేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనము చేసిన పాపములాటంకములు కావచ్చునని భయపడనవసరము లేదు. ఎందుచేతనంటే శ్రీ కృష్ణుడే మన ఈ వ్రతానికి కారకుడు మరియు నాయకుడు. అతని గుణములు ఆశ్చర్యకరములైనవి. అతని పనులు కూడా అట్టివే. ఉత్తరమున మధురానగరమునకు నిర్వాహకుడుగా జన్మించినాడు. నిర్మలమైన జలముగల యమునానది ఒడ్డున నివసించుచు మనకొరకు యదుకులమందున అవతరించిన మహానుభావుడు. తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు. అంతటి మహాత్ముడి ఉండి కూడా ఆమెచే త్రాటితో కట్టబడిన సౌలభ్య మూర్తి. కనుక మనము సందేహములను వీడి పరిసుద్దములై అతనిని సమీపించి పరిసుద్దమైన వికసించిన హృదయకుసుమమును సమర్పించి నోరార పాడాలి. నిర్మలమైన మనస్సుతో ద్యానిమ్చాలి. అంతటనే వెంటనే ఇంతకుముందు పాప సమూహము రాబోవు పాపముల సమూహము మంటలో పడిన దూది వలె భస్మము అయిపోతాయి. మన వ్రతమునకు ఆటంకములుకలుగవు.
విశేషార్ధము:
మాయనై :
ఆశ్చర్యకరములగు గుణములు, చేష్టములు కలవానిని కీర్తించి మనము మన వ్రతమున ఉపక్రమించుదుము.
మాయ అంటే భగవద్శక్తి ఇది చాలా విచిత్రముగా వుండును.
మన్ను వడమదురై మైందనై:
ప్రతినిత్యము భాగావత్సంబంధముకల ఉత్తర మధురకు నాయకుడగు వానిని కీర్తించుచున్నారు. పyరమపదమున వికార రహితుడగు విష్ణువు ఏకరూపుడై ఎల్లప్పుడు నిత్యసూరులకు దర్సనమిచ్చు పరమాత్మయే మధురానగరిలో అవతారములు మార్చి మార్చి దర్శనము ఇచ్చినాడు. ఈ మదురనే సిద్దాశ్రామము. అక్కడ వామనావతారుడుగా దర్సనం ఇచ్చారు. ఇక్కడ శత్రుఘ్నుడు ఇక్కడ నేలవనుడను రాక్షసుడును చంపి రాజదానిగా చేసికొని పాలించాడు. తరువాత దేవకీవసుదేవులకు శ్రీ కృష్ణుడుగా ఇచట అవతరించాడు.
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై:
పరిశుద్ధములగు అగాధములగు జలములుగల యమునానది యొక్క తీరమున విహరించువాడా! అని కీర్తించుచున్నారు. ఇక్కడ యమునానది పవిత్రము అయినది అని అంటున్నారు. ఈ నది శ్రీ రామావతారములో అయోద్యగా సరయునదిగా వచ్చింది. ఇక్కడ శ్రీ కృష్ణావతారములో మదురగా యమునగా వచ్చినది. అలా వచ్చుటచే భగవంతుని అభిప్రాయము తెలిసి కృష్ణుని ఎత్తుకు వచ్చుటకు వసుదేవునకు దారినిచ్చినది. అలా దారి ఇవ్వటమే ఆనది ప్రత్యేకత.
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై:
గోపవంసమునందు ప్రకాశించిన మణిద్వీపమయిన వానిని కీర్తించుచున్నారు. ఈ పరమపదములో సర్వేస్వరుడు ఉన్నా అక్కడ తన గుణములన్నియు ప్రకాశింప వీలుండదు. ఆ పరమ పురుషుడే మధురలో జనించి నందవ్రజము చేరి దీపమువలె ప్రకాసించినాడు.
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై:
తల్లి అయిన యశోద గర్బమును ప్రకాసిమపచేసిన దామోదరుని కీర్తిమ్చుచున్నారు. ఆనాడు వన్నెల చిన్నవాడు అగు శ్రీ కృష్ణుని యశోదమ్మ తాడుతో రోటికి కట్టిన మచ్చ ఎప్పుడు కనపడుటచే అతనికి దామోదరుడు అని పేరు వచ్చింది ఆ పేరును కీర్తిస్తున్నారు. దామోదరతత్వముచే తల్లికి కీర్తి తెచ్చినవాడు చిన్ని కృష్ణయ్యా.
తూయోమాయ్ వందు నాం :
ఇట్లు స్మరించుచు పరిశుద్దలమై వచ్చి మనము సేవించినచో సకల పాపములు పోతాయి అని చెప్పుచున్నారు. పరిశుద్ధము అనగా భగవద్ సంబందము తప్ప వేరొకటి లేకుండా మనసు శుద్ధముగా వుమ్చుకోనుట.
తూమలర్ తూవి త్తొళుదు:
పరిశుద్ధములయిన పుష్పములు విసిరి సేవించి. పుష్పాలకు పారిసుద్ధము, సమర్పించు వారి భక్తియే! ఈ పువ్వునైనా భక్తితో అర్పించినా అది పరిశుభ్రమినదే. భగవంతుడు ఆకు అయినా, పువ్వునైనా, ఫలం అయినా, నీరు అయినా సరే భక్తితో సమర్పిస్తే వారిని కరుణిస్తాడు. భగవంతునికి ఇష్టమైన పుష్పాలు ఎనిమిది వున్నాయి.
అవి అహింసా, ఇంద్రియనిగ్రహము, సర్వభూతదయ, క్షమా, ఙ్ఞానము , తపస్సు, సత్యము, ద్యానము ఇవే ఆయన కోరుకునే పుష్పాలు.
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క:
మనము భగవంతునివద్దకు నడచి వెళ్ళుటచే అతని మనస్సున భాదకలిగించును. అయ్యో! నేనే వారివద్దకు వెళ్ళవలసినది. వాళ్ళు వచ్చేవరకు చేసెనే అనుకుంటాడు. పైగా మనం మాటాడినా ఇంకా భాదపడును. మనము అతని అనుగ్రహము కొరకు అతని వద్దకు చేరి కీర్తించూదాం.
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం తీయనిల్ తూశాగుం:
ముందు చేసిన పాపములు, తరువాత రాబోవు పాపములు కూడా అగ్నిలో పడిన దూది వలె అవుతుంది. భగవంతుని మనము అర్చించి, పాడి, చింతించిన వెంటనే మనము చేసిన పాపాలు భగవంతుడు విస్మరించును. రాబోవు పాపాలు తెలియనట్లు వదిలివేయును.
శెప్పు:
చెప్పుడు, మాయావీ, మధురానాయకా, యమునాతీరా విహారి! నందవ్రజ మంగళదీపా ! యశోదాగర్భ ప్రకాశకా! దామోదరా! అని కీర్తించుట చాలు. అలా కీర్తించినా సర్వ పాపాలు నాశనం అవుతాయి. అని చెప్పి వ్రతమునకు అందరిని ప్రిపేర్ చేసింది. రేపటినుండి వ్రతానింకి ఉపక్రమిస్తున్నారు గోపికలు.