Blogger Widgets

ఆదివారం, ఏప్రిల్ 21, 2024

కలియుగంలో కోరికలు తీర్చేదేముడయ్యా ఈ హనుమయ్య .........హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?

ఆదివారం, ఏప్రిల్ 21, 2024

 




హనుమాన్ చాలీసా పుట్టుక గురించి చాలా ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఇది 16వ శతాబ్దంలో మహాకవి తులసీదాసు చేత రచించబడింది. తులసీదాసు రామభక్తికి ప్రసిద్ధి చెందిన కవి-సన్యాసి మరియు రామచరితమానస అనే ఇతిహాసం రచయిత. హనుమాన్ చాలీసాలో నలభై శ్లోకాలు ఉంటాయి, అందుకే దీనిని ‘చాలీసా’ అని అంటారు, ఇందులో ‘చాలీస్’ అనే పదం నుండి వచ్చింది, దీని అర్థం హిందీ భాషలో ‘నలభై’.

హనుమాన్ చాలీసా వెనుక కథ?

వారణాసి లో ఒక సదాచార సంపన్నుడు తన ఏకైక కుమారుడు కి ఒక అమ్మాయి ని ఇచ్చి వివాహం చేస్తాడు.వారిద్దరూ చిక్కగా జీవనం సాగిపోతుండగా విధి ప్రభావంగా ఆ వక్తి మరణించాడు.దానిని చూసి అతని భార్య తట్టుకోలేకపోయింది ఎంతో బాధపడింది.తన భర్త శవ యాత్రకు అడ్డు పడింది.అది చూసి చుట్టూ పక్కల వాళ్ళు తనని పట్టుకున్నారు యాత్ర సాగుతుంది.ఈ యాత్ర తులసి దాస్ ఆశ్రమం మీదుగా జరుగుతుంది.ఆ అమ్మాయి అందరిని విడుచుకుని వెళ్లి తులసి దాస్ కాళ్ళ మీద పడుతుంది ఎంతో విలపిస్తోంది.ధ్యన్యమ్ లో నిమగ్యమై ఉన్న తులసీదాస్ 'దీర్ఘసుమంగళీభవ' అన్ని దీవించాడు దానితో ఆమె దీనంగా జరిగింది అంత తులసీదాస్ కు వివరించింది.అది విన్న తులసి దాస్ తల్లి నా నోట రాముడు ఎప్పుడు  అసత్యం పలికించాడు అని శవయాత్ర దక్కరకు వెళ్లి శవానికి కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండలం లో నీళ్లను శవం మీద జల్లుతాడు వెంటనే ఆ యువకుడు పునర్జీవితుడు అయ్యాడు.ఆ మహాత్యమును చుసిన జనులు అందరు రామ భక్తులు అయ్యారు.అది చూసి మరియు చెప్పుడు మాటలు విన్న అక్బర్ తులసి దాస్ ను పిలిపించి అదే రామ నమ మహిమ తో సభ అందరి ముందు ఒక శవాన్ని తెప్పించి బ్రతికించమని చెప్పాడు.జనన మరణాలు నా చేతిలో ఉండవు అని శవాన్ని బ్రతికించలేను అని రాజు చెప్పిన దానిని దిక్కరించాడు తులసి దాస్ అందుకు రాజు జైలు లో పెట్టించి చిత్రహింసలు పెట్టారు 

మహా రామ భక్తుడు అయినా తులసి దాస్ ను అలా హింసలు పెడుతుంటే రామ భక్తుడు అయినా హనుమాన్ తన వానర సైనం తో అక్బర్ మహల్ పై దాడి చేసారు.వందల సంఖ్యలో వానరులని చూసి రాజ్యం లోని వారు అందరు హడిలిపోయారు.కారాగారం లో ఉన్న తులసి దాస్ ను విడిపించకపోతే విధ్వంసం తప్పుడు అని చెప్పారు అక్కడి పండితులు అక్బర్ కి.వెంటనే తులసి దాస్ ను విడిపించారు.తనని కాపాడానికి మహా బాల శాలి అయినా హనుమంతుడు వచ్చాడని గ్రహించాడు తులసీదాస్.అప్పుడు హనుమంతుడు మహాకాయుడు అయ్యి దర్శనం ఇచ్చాడు.

హనుమంతుడిని చుసిన ఆనందం లో తులసీదాస్ నలభై దోహాలు ఆశువుగా స్వామిని స్తుతించాడు .తులసీదాస్ చేసిన స్తోత్రం కి హనుమంతుడు ప్రసన్నం అయ్యి ఈ స్తోత్రం చదివిన వారికీ తాను రక్షగా ఉంటాను అన్ని చెప్పాడు. 

హనుమాన్ చాలీసాలో సూర్యుడు మరియు భూమి దూరం వెల్లడి చేయబడింది

హనుమాన్ చాలీసా వాస్తవంగా సూర్యుడు మరియు భూమి మధ్యలో ఉన్న దూరంను సమర్థంగా చెప్పుతుంది. కానీ అసలు శాస్త్రిక సూత్రం వేరే. వేగం (S) = దూరం (D) ÷ సమయం (T) అనే సామాన్య శాస్త్రిక సూత్రం ఉంది. రికార్డ్ల ప్రకార, 1672లో జాన్ రిచర్ మరియు జోవాన్నికో కాసిని భూమి మరియు సూర్యుడు ఉన్న దూరంను భూమి వ్యాసాల ప్రమాణంగా 22,000 

పన్నెండు వేల దివ్య మైళ్ల దూరంలో ఉన్న సూర్యుడు, మీరు దానిని (సూర్యుడిని) మింగడానికి ప్రయత్నించారు, ఇది ఒక తీపి ఫలంగా భావించి, ఇక్కడ, యుగం అంటే నాలుగు యుగాల (1 పూర్తి మహాయుగం) దైవిక సంవత్సరాలలో ఏకం అవుతుంది. .

సత్యయుగం = 4800 దివ్య సంవత్సరాలు

త్రేతాయుగం = 3600 దివ్య సంవత్సరాలు

ద్వాపరయుగం = 2400 దివ్య సంవత్సరాలు

కలియుగం = 1200 దివ్య సంవత్సరాలు

కాబట్టి, 1 దివ్య యుగం అంటే 12,000 దివ్య సంవత్సరాలు.

సంస్కృతంలో,  సహస్ర  అంటే 1000 మరియు 1  యోజన  అంటే దాదాపు 8 మైళ్లకు సమానం.

కాబట్టి, 12,000 x 1000 x 8 = 96,000,000 మైళ్లు.

శాస్త్రవేత్తల ఇటీవలి లెక్కల ప్రకారం సూర్యుడు మరియు భూమి మధ్య దూరం 92,960,000 మైళ్లు.

భూమి సూర్యుని చుట్టూ ఎలిప్టికల్ కక్ష్యలో తిరుగుతుంది కాబట్టి, ఈ దూరం రుతువులను బట్టి మారుతుంది. ఉత్తర అర్ధగోళంలో వేసవిలో, శీతాకాలంలో కంటే భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది.

హనుమాన్ చాలీసా లేదా ఏదైనా మహామంత్ర జపం అనేది ఉత్పాదక మనస్తత్వానికి సానుకూల ధృవీకరణ. మనందరికీ తెలిసినట్లుగా, వాంఛనీయ ఫలితాన్ని సాధించడానికి సానుకూల మనస్తత్వాన్ని సృష్టించేందుకు ధృవీకరణలు సహాయపడతాయి. 

కలియుగంలో  కోరికలు  తీర్చేదేముడయ్యా  ఈ  హనుమయ్య .....ఈ హనుమాన్ జయంతికి అందరు తప్పకుండ పదకొండు సార్లు కనీసం హనుమాన్ చాలీసా పాటించడానికి ప్రయత్నిచండి .అన్ని రకాల బాధలు,ఆరోగ్య సమస్యలు అన్ని తొలిగిపోతాయి 



బుధవారం, ఏప్రిల్ 03, 2024

పియర్ జాన్సన్ @ హీలియం (chemistry helium gas)

బుధవారం, ఏప్రిల్ 03, 2024

1868లో పియర్ జాన్సన్ అనే ఫ్రెంచి ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక సూర్య గ్రహణం పరిశోధన సమయంలో ఒక క్రొత్త పసుపు రంగు స్పెక్ట్రల్ లైన్ కనుగొన్నాడు. ఇది హీలియం మూలకం సూచించే స్పెక్ట్రల్ లైను. నార్మన్ లాక్యర్ అనే మరో శాస్త్రవేత్త ఇదే గ్రహణాన్ని పరిశీలిస్తూ "హీలియం" అనే క్రొత్త మూలకం పేరు ప్రతిపాదించాడు. వీరిద్దరూ హీలియంను కనుగొన్నవారిగా గుర్తింపు పొందారు.
హీలియం (Helium) ( సంకేతం He) , ఒక రంగు, రుచి, వాసన లేని, హానికరం గాని (non-toxic), తటస్థమైన  ఒకే అణువు కలిగిన (monatomic రసాయనమూలకము. ఇది ఆవర్తన పట్టికలో ఉత్కృష్ట వాయువుల జాబితాలో ప్రధమంగా వస్తుంది. దీని పరమాణు సంఖ్య 2. దీని మరిగే ఉష్ణోగ్రత మరియు ద్రవీకరణ ఉష్ణోగ్రతఅన్ని మూలకాలలో అతి తక్కువ. ఇది దాదాపు అన్ని పరిస్థితులలోను వాయువుగానేఉంటుంది.
1903లో అమెరికా సహజ వాయువు నిల్వలలో పెద్ద మోతాదులో హీలియం కూడా ఉన్నట్లు గుర్తించారు. హీలియంను అధికంగా క్రయోజెనిక్స్ (cryogenics) సాంకేతికతలోను, సముద్రపు లోతులలో శ్వాసపీల్చడానికి వినియోగించే పరికరాలలోను (deep-sea breathing systems), అతివాహక అయస్కాంతాలను కూలింగ్ చేయడానికి, హీలియం డేటింగ్ ప్రక్రియలోను, బెలూన్లను ఉబ్బించడానికి, ఎయిర్ షిప్ (airships)లను తేలికగా చేయడానికి వాడుతారు. ఇంకా అనేక పారిశ్రామిక వినియోగాలున్నాయి. ఉదా: arc welding సిలికాన్ వేఫర్స్(silicon wafers) తయారీ వంటివి.  కొద్ది మోతాదులో హీలియం నాయువును పీల్చినట్లయితే మనిషి మాటలోని గరుకుదనంలో (timbre and quality) కొంత తాత్కాలికమైన మార్పు వస్తుంది.క్వాంటమ్ మెకానిక్స్ అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు హీలియం ద్రవరూపపు (liquid helium-4's two fluid phases, helium I and helium II) లక్షణాలు చాలా ఉపయోగకరమైనవి. ముఖ్యంగా super fluidity అధ్యయనంలోను, absolute zero వద్ద పదార్ధపు లక్షణాలను అధ్యయనం చేసే అతివాహకత (superconductivity) పరిశోధనలలోను.

అన్ని మూలకాలలోను హీలియం రెండ అతి తేలికైన మూలకం. మరియు విశ్వంలోఅత్యధికంగా లభించే రెండవ పదార్ధం. నిశ్వంలో హీలియం అధికంగా మహా విస్ఫోటనం(Big Bang) సమయంలో ఏర్పడింది. అంతే గాకుండా నక్షత్రాలలో హైడ్రోజెన్మూలకం న్యూక్లియర్ ఫ్యూషన్ (en:nuclear fusion) కారణంగా హీలియంగా మారుతుంటుంది. భూమిమీద మాత్రం హీలియం పరిమాణం చాలా తక్కువ. భూమి మీది హీలియం కొన్ని మూలకాల రేడియో యాక్టివ్ డికే (radioactive decay) కారణంగా తయారౌతున్నది. ఇలా తయారైన హీలియం సహజ వాయువులో కలిసి ఉంటుంది. దానిని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ (fractional distillation) ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు..
పేరుసంకేతముపరమాణు సంఖ్య : హీలియం, He, 2
ఎలక్ట్రాన్ విన్యాసం : 1s2
ప్రామాణిక పరమాణు భారం :4.002602(2) g·mol−1
రసాయన సిరీస్ : జడ వాయువులు
గ్రూపుపీరియడ్బ్లాక్ : 181s

ఆదివారం, మార్చి 27, 2016

ఎక్స్ కిరణాలు

ఆదివారం, మార్చి 27, 2016

     విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్.
  • రోగ నిర్దారణకు అప్పట్లో కొత్తవరావడి సృష్టించారు  ప్రపంచంలో వైద్యరంగంలో రోగనిర్దారణకు(రేడియోగ్రఫీ) మరియు రోగ నిర్మూలనకు(రేడియో థెరఫీ) కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలను కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్. ఈయన కనుగొనే ఎక్స్ కిరణాలు వైద్యరంగలములోనె కాక భద్రతా రంగంలో ఉపయోగపడుతున్నాయి. విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (మర్చి 27,1845 - ఫిబ్రవరి 10,1923) జర్మన్ దేశ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త. 1895 నవంబర్ 8 న విద్యుదయస్కాంత తరంగాలలో వివిధ తరంగ దైర్ఘ్యలుల అవధులలో గల ఎక్స్- కిరణాలను కనుగున్నాడు. ఈ పరిశోధన వల్ల 1991 లో భౌతిక శాస్త్రంలో మొదటి సారి నోబెల్ బహుమతి పొందారు. ఈయన చేసిన కృషికి గాను ఆవర్తన పట్టిక లో 111 పరమాణు సంఖ్య గల మూలకానికి రాంట్ జీనియమ్ అనిపేరు పెట్టి గౌరవించారు.
  • రాయింట్జన్ మార్చి 27, 1845 న జర్మనీలోని లెన్నెస్ లో జన్మించాడు. ఈయన తండ్రి ఒక రైతు. తల్లి ఒక డచ్ మహిళ. హాలెండ్ లో విద్యాభ్యాసం జరిగింది.1865 లో యుట్రెచ్ యూనివర్సిటీ లో చేరుటకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కాని జూరిచ్ లో గల ఫెడెరల్ పాలిటెక్నిక్ సంస్థ లో చేరి పరీక్షలను ఉత్తీర్ణుడయ్యాడు. అచట మెకానికల్ ఇంజనీరుగా చేరాడు. 1869 లో తత్వశాస్త్రమునందు జూరిచ్ విశ్వవిద్యాలయం నుండి పి.హె.డి పట్టాను పొందాడు. ఆ విశ్వవిద్యాలయంలో ప్రముఖ ప్రొపెసర్ అయిన ఆగస్ట్ కుండ్త్ యొక్క ప్రియమైన శిష్యుడయ్యాడు.   ఎక్స్ కిరణాలను రాయింట్ జన్ కిరణాలని అందురు. కాని రాయింట్ జనే స్వయంగా వాటిని ఎక్జ్ కిరణాలని పిలిచాడు. ఈ కిరణాలను కనుగొని లోకానికి పరోపకారం చేసినందుకు కృతజ్ఞతగా ఈయనకు 1901 లో భౌతిక శాస్త్రం తరపున నోబెల్ బహుమతి లభ్యమయింది. ఈ ఎక్స్ రే వెనుక ఎంతో ఆసక్తి కరమైన కథ ఉంది.
  • రాయింట్ జన్ కేథోడ్ రే ట్యూబ్(శూన్య గాజు నాళం) తో పరిశోధనలు చేసేవాడు. గది అంతా చీకటిగా ఉన్నప్పుడు యీ ట్యూబ్ గుండా కాంతి కిరణాలను పంపడం జరిగింది. పైగా ట్యూబ్ చుట్టూ నల్లని కాగితాన్ని కాంతి కిరణాలు ఏ కొంచెం కూడా వెలువడకుండా కప్పి ఉంచాడు. ఇలా చేసినప్పటికి కాథోడ్ ట్యూబ్ కు సమీపంలో ఉన్న బేరియం ప్లాటినో సైనైడ్ స్ఫటికం వింత మెరుపులతో ప్రకాశించ సాగింది. నల్లటి కాగితాన్ని కప్పి ఉంచినప్పటికీ కాథోడ్ ట్యూబ్ నుంచి ఏవో అజ్ఞాత కిరణాలు వెలువడి బేరియం ప్లాటినో సైనైడ్ స్ఫటికం మీద పడి అది మెరిసేటట్లు చేసిందని యీయన ఊహించగలిగాడు.
  • ఈ కిరణాలను కాగితం గుండా, చెక్క గుండా, లోహపు పలకల గుండా ప్రయాణం చేయగలవని యీయన కనుగొన్నాడు. ఈ కిరణాలు కూడా ఓ రకమైన కాంతి కిరణాలే అని అయితే వీటి తరంగ దైర్ఘ్యం చాలా తక్కువ కావటం వల్ల మనుషుల కళ్ళకు కనిపించవని రాయింట్జన్ వెల్లడించాడు. మామూలు కాంతి కిరణాలే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ల మీద ప్రభావం చూపుతూ ఉండగా, యీ కిరణాలు మాత్రం చూపకుండా ఉంటాయా అనే ఆలోచన రాయింట్ జెన్ కి రావటం - శాస్త్ర ప్రపంలో ఒక సరికొత్త అధ్యాయానికే కారణభూతమైనది.
  • ప్రయోగం చేయటం కోసం రాయింట్ జన్ ఫోటో గ్రాఫిక్ ప్లేటు మీద తన భార్య చేతిని ఉంచి యీ కిరణాలను ప్రసారం చేసి ఫోటోను డెవలప్ చేసి చూసి ఆశ్చర్యపోయాడు. చేతి ఎముకలు ఉంగరంతో సహా ఆ ఫోటో లో వచ్చింది. చుట్టూ మాంసం ఉన్నట్లు మసక మసకగా ఉంది. అంటే సజీవంగా ఉన్న మనిషి కంకాళాన్ని ఈ కిరణాల ద్వారా ఫోటో తీయవచ్చని స్పష్టంగా తేలింది.  దురదృష్ట వశాత్తు రాయింట్ జన్, ఆయనతో కలిసి పనిచేసిన మరో ఇద్దరు పరిశోధకులు యీ ఎక్స్ కిరణాల తాకిడికే క్రమ క్రమంగా మరణించారు. ఈ ఎక్స్-కిరణాల వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతున్నప్పటికీ వాటిని మితిమీరి వాడితే మాత్రం ప్రమాదం తప్పదు. యీ కారణంగానే ఎక్స్-కిరణాలను నిరంతరం గురి కాబట్టే రాయింట్ జన్ ఆ కిరణాల ప్రభావంగానే చనిపోయాడని తెలుస్తోంది.
  • 1901 లో రాంట్ జెన్ కు మొదటి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఈ బహుమతి ఆయన ఎక్స్ కిరణాలు కనుగొని విశేష సేవలందించినందుకు గాను యివ్వబడింది. కాని రాంట్ జెన్ ఆ బహుమతికి వచ్చిన ఆర్థిక ప్రతిఫలాన్ని తన విశ్వవిద్యాలయమునకు దానమిచ్చాడు. పియరీ క్యూరీ వలే రాంట్ జన్ తన పరిశోధనకు పేటెంట్ హక్కులను తిరస్కరించాడు.ఎందువలనంటే మానవాళికి తన పరిశోధన యొక్క ఫలితాలు ఉపయోగకరంగా ఉండాలని.ఈ కిరణాలకు తన పేరు కూడా పెట్టరాదని కోరుకున్నాడు.
  • రమ్ ఫోర్డ్ మెడల్ (1896)
  • మాటెక్కీ మెడల్ (1896)
  • ఎలియట్ క్రెస్సన్ మెడల్ (1897)
  • భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి (1901)
నవంబరు 2004 లో పరమాణు సంఖ్య 111 గా గల మూలకానికి ఆయన పై గౌరవార్థం రాంట్జెనీయం(Rg) అని IUPAC సంస్థ నామకరణం చేసింది. IUPAP కూడా ఈ పేరును నవంబర్ 2011 లో దత్తత తీసుకుంది.

శుక్రవారం, జనవరి 08, 2016

కాలం కధ చెప్పిన స్టీఫెన్ హాకింగ్

శుక్రవారం, జనవరి 08, 2016


నాకు చాలా ఇష్టమైన శాస్త్రవేత్త గురించి ఈరోజు మీతో చెప్తాను.  అతను ఎవరంటే ఐనిస్టీన్ తర్వాత అంతటి మేధావిగా మన్ననలు అందుకుంటున్న ప్రఖ్యాత బిటిష్ ఫిజిక్స్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్.  కాలానికి ఆరంభం ఉందా? మరి అంతమో! కాలం వెనుకకి ఎందుకు నడవదు? మనకు గతమే జ్ఞాపకముంటుంది. భవిష్యత్తు ఎందుకు ముందుగా తెలియదు? పసిపిల్లాడి కుతూహలాన్ని మహామేధావి అన్వేషణనీ కలగలిపితే స్టీఫెన్ హాకింగ్ అవుతాడు. కాలం కథ (A Brief History of Time) లో మనల్ని విశ్వవిహారానికి తీసుకెళతాడు హాకింగ్. ఈరోజు స్టీఫెన్ హాకింగ్ జన్మదినం. తనంతట తాను కనీసం కదలలేని ఎలాంటి సహకారం లేని శరీరము, మాట్లాడాలి అంటే కంప్యుటర్ సహాయంతో చక్రాల కుర్చికి అతుక్కుపోయిన మనిషి అతి అరుదైన మోటార్ న్యురాన్ వ్యాధి కలిగి తన శరీరాన్ని మొత్తం పనిచేయకుండా వున్నా కూడా విచిత్రంగా అతని మెదడు మాత్రమే పూర్తిగా పనిచేస్తుంది .    ఇది కేవలము అరుదైన విషయం వైద్య శాస్త్రానికే  పెద్ద సవాలుగా చెప్పుకోవచ్చు.  ఇదంతా కేవలము ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ యొక్క సంకల్ప బలం మాత్రమే .  అతనికి వచ్చిన వ్యాధి చాలా అరుదైన ప్రమాదకరమైనది. ఆవ్యాధిని కూడా లెక్కచేయకుండా అపరమార్కండేయుడుగా వున్నవాడు స్టీఫెన్ హాకింగ్.  కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం.

స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందించారు. ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే.

అప్పటికి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలిలియో మరణించి దాదాపు 300 సంవత్సరాలు అవుతోంది.  గెలిలియో మరణించి న రోజు జనవరి 8వ తేది నాడే 1942 వసంవత్సరం జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు.  లండన్ లోని హైగేట్స్ లో స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని ప్రారంభించాడు. మిల్ హిల్ ప్రాంతములో తండ్రి స్టీఫెన్ ని అక్కడి సెయింట్ ఆల్బన్స్ పాఠశాలలో చేర్చాడు. తన గణిత ఉపాధ్యాయుని ప్రేరణతో గణితశాస్త్రంలో స్పెషలైజేషన్ చేద్దామనుకున్నాడు స్టీఫెన్. కాని దానికి వ్యతిరేకంగా తండ్రి రసాయనశాస్త్రంలో చేర్పించాడు. తరువాత 1959లో నేచురల్ సైన్స్ విద్య కోసం స్కాలర్ షిప్ పరీక్ష రాశాడు. అందులో సఫలీకృతుడు కాగలిగినా భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశాడు స్టీఫెన్. 1962లో కేవలం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కాగలిగాడు. కాస్మాలజి, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కి వెళ్ళాడు. అప్పటి నుంచి స్టీఫెన్ పరిస్థితి పూర్తిగా మారింది. అన్నం తినాలన్నా, కనీసం బూట్ల లేసు కట్టుకుందామన్నా, స్టీఫెన్ శరీరం సహకరించేది కాదు. క్రిస్‌మస్ సెలవులకు ఇంటికి వెళ్ళిన స్టీఫెన్ పరిస్థితి ఆయన తల్లిదండ్రులను కలవర పెట్టింది. భోజనం చేయడానికి ఆయన పడుతున్న ఇబ్బంది. తల్లిని మధనపెట్టింది. ఆ సమయంలోనే ఆసుపత్రిలో చేసిన పరీక్షల్లో ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి (Motor Neuron Disease) అనే భయంకర వ్యాధి ఉన్నట్టు తెలిసింది. దీనినే Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధి అని కూడా అంటారు. నాడీ మండలం పై అంటే నరాలు, వెన్నుపూస పై ఇది ప్రభావం చూపుతుంది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా. కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. మళ్లీ విశ్వవిద్యాలయానికి తిరిగివచ్చిన హాకింగ్ తన పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసి మిత్రులు సహకరించాలని చూసినా స్టీఫెన్ సున్నితంగా తిరస్కరించే వాడు. 
ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పని చేసిన స్టీఫెన్ కు, వ్యాధి అడ్డంకిగా మారలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించాడు. 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించాడు. తీరికలేని స్టీఫెన్ తనకు వ్యాధి వుందన్న విషయాన్ని కూడా మరచి పోయాడు. క్వాంటం థియరి, జనరల్ రిలెటివిటీ లను ఉపయోగించి... కృష్ణబిలాలు కూడా రేడియేషన్ ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ పుస్తకరచన ప్రారంభించాడు. ఆ సమయంలోనే వ్యాధి వల్ల 1985లో వైద్యుల xbvbdng ఉండాల్సి వచ్చింది. అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నాడు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించాడు. అది అమ్మకాల్లో సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ కాలం కథ పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. 
"శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చేయాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినప్పటికీ నేను మృత్యువు కు భయపడటం లేదు. త్వరగా మరణించాలని నేను భావించటం లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి అవిఅన్నీ పూర్తిచేస్తాను" అంటారు హాకింగ్.   తాను భరించలేని బాధకు గురైన పక్షంలో...ఇక తాను ప్రపంచానికి చేయగలిగిందీ ఏమీ లేదని భావిస్తే...ముఖ్యంగా తనను ప్రేమించే వారికి తాను భారమైతే ఇతరుల సహకారంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమేనని ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ బతికే హక్కు ఉన్నట్లే.. చనిపోయే హక్కు కూడా ఉండాలని భావించే హాకింగ్, ప్రముఖ కమెడియన్ డారా ఓ బ్రియేన్‌కు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు ‘ది డెయిలీ టెలిగ్రాఫ్’ వెల్లడించింది.
అతనికి వచ్చిన ముఖ్యమైన అవార్డులు Prince of Asturias Award 1989 లోను Copley Medal 2006 లోను వచ్చాయి.  
అపర మార్కండేయుడు సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, కాలబిలాలు,Theoretical cosmology,Quantum gravity అవిష్కారవేత్త స్టీఫెన్ విలియం హాకింగ్ కు జన్మదిన శుభాకాంక్షలు. 

సోమవారం, జనవరి 04, 2016

విశ్వరహస్యాల గుట్టు విప్పిన మహానుభావుడు.

సోమవారం, జనవరి 04, 2016

మూడు ఆపిల్స్ ప్రపంచ గమనాన్నే మార్చేశాయి. ఒకటో ఆపిల్...ఆడమ్ - ఈవ్ రుచి చూసిన నిషిద్ధ ఫలం. రెండో ఆపిల్...న్యూటన్ విశ్రాంతి తీసుకుంటున్న చెట్టు మీంచి రాలిన పండు. మూడో ఆపిల్...స్టీవ్‌జాబ్స్ స్థాపించిన సంస్థ. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా 'ఆపిల్ కంప్యూటర్స్' రికార్డు సృష్టించింది.  

ఈ రోజు సర్ ఐజాక్ న్యూటన్ జయంతి.  ఐజాక్ న్యూటన్ జనవరి 41643లో లింకన్ షైర్ కౌంటీకి చెందిన ఒక చిన్న కుగ్రామమైన Woolsthorpe Manor అనే గ్రామంలో జన్మించాడు.  న్యూటన్ తండ్రి చనిపోయిన మూడు మాసాలకు జన్మించాడు. నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా చిన్నగా ఉండేవాడు. న్యూటన్ తల్లి Hannah Ayscough ఆ పసికందు ఒక లీటర్ పాత్రలో పట్టగలడని చెప్పినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈయన ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలొ అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం మరియు అది సైన్సు గా ఎలా పరిణామం చెందింది? అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవస్తుంది.

చిన్నతనంలో ఒకరోజు ఆపిల్ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న చిన్ని న్యూటన్ మీద చెట్టుమీదనుండి ఆపిల్ పండు పడింది.  అప్పుడు చిన్న ప్రశ్న మనస్సులో మెదిలింది.  పండు కిందకె ఎందుకు పడింది.  పైకి ఎందుకు పడలేదు అన్న ప్రశ్న.  ఈ ప్రశ్నకు సమాదానం అన్వేషించే క్రమంలోనే గురత్వాకర్షణ సిద్దాంతాని ప్రతిపాదించాడు.  1661 వ సంవత్సరలో గొప్ప చదువుల కోసం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరిన న్యూటన్  భౌతిక, గణిత, ఖగోళ  శాస్త్రంలో ఇష్టాన్ని పెంచుకున్నాడు. అక్కడే ప్రొఫెసర్ గా చేరాడు న్యూటన్.  1667 లో పరావర్తన దూరదర్శిని ని కనిపెట్టి అప్పట్లో సంచలనం సృస్టించాడు.   1687 లో ప్రచురితమైన ఆయన శాస్త్ర గ్రంథం en:Philosophiæ Naturalis Principia Mathematica, సైన్సు చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచన. ఈ గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తి గురించి, న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్థావించాడు. తరువాతి మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్సు దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి తరువాత ఆధునిక ఇంజనీరింగ్ కూ ఈ గ్రంథమే పునాది. ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం, భూమి మీదైనా లేక ఇతర గ్రహాలమీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించాడు. దీనికి ఆధారంగా కెప్లర్ నియమాలకూ మరియు గురుత్వాకర్షణ సిద్ధాంతాలకూ గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపాడు. దీంతో సూర్య కేంద్రక సిద్ధాంతంపైపూర్తిగా అనుమానం తొలిగిపోవడమే కాకుండా ఆధునిక సైన్సు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.


"ఎడ్మండ్ హాలే ఆర్థిక సహాయంతో జూలై 1687 లో Principia ప్రచురించబడింది. ఈ పనిలో,న్యూటన్ మూడు సార్వత్రిక చట్టాలు(universal law of gravitation)ని పేర్కొన్నాడు. ఇది ఒక విప్లవాత్క్మక అవిష్కరణ.." Principia తో, న్యూటన్ అంతర్జాతీయంగా గుర్తించబడిన్నాడు. న్యూటన్ పరిశోధనలకు 1705 లో బ్రిటన్ ప్రభుత్వం గుర్తించి "సర్" అనే బిరుదును గౌరవంగా అందించింది.  అప్పటినుండి సర్ ఐజాక్ న్యూటన్ గా పిలవబడుతున్నారు.  
 ఆధునిక యుగంలో  వైజ్ఞానిక విప్లవానికి శ్రీకారం చుట్టిన శాస్త్రవేత్తగా సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ చరిత్రలో నిలిచాడు. గురుత్వాకర్షణ శక్తిని, సౌర కుటుంబ చలనానికి మూల సూత్రాన్ని ఆవిష్కరించి, చీకట్లను పారదోలిన మహానీయుడు న్యూటన్‌. అవని నుంచి అంతరిక్షం వరకు పలు రంగాలను అర్ధం చేసు కోవడానికి ఆయన సూత్రాలు కొత్తమార్గాన్ని చూపాయి. 1727 మార్చి 20న న్యూటన్‌ మరణించారు . వైజ్ఞానిక ప్రపంచంలో తన పరిశోధనలతో విప్లవం సృష్టించిన సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ ఇలా అన్నారు .''వైజ్ఞానిక, సాంకేతిక ప్రగతి ఏ ఒక్కరివల్లో ఉన్నట్టుండి ఊడిపడేది కాదు. ఎందరో శాస్త్రవేత్తలు తరాల తరబడి చేసే కృషి ఫలితమే ప్రగతి అంటు'' విశ్వరహస్యాల గుట్టు విప్పిన మహానుభావుడు. 

మంగళవారం, అక్టోబర్ 13, 2015

శైలపుత్రి

మంగళవారం, అక్టోబర్ 13, 2015

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥
దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది. వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.
పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక దాక్షాయని. అ జన్మలో ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరిస్తాడు. దేవతలు తమతమ యజ్ఞభాగములను స్వీకరించటానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞానికి పిలువడు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం ఆమెకు తెలుస్తుంది. ఆ యజ్ఞాన్ని వీక్షించటానికై ఆమె మసస్సు ఉబలాటపడుతుంది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది. బాగా ఆలోచించి పరమేశ్వరుడు “కారణము ఏమోగానీ, దక్షుడు మనపై కినుకుబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు. యజ్ఞభాగములనుగూడ వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనలను పిలువలేదు. కనీసము సమాచారమునైననూ తెలుపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగను మంచిదిగాదు” అని హితవు బోధించారు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లినీ, తోబుట్టువులనూ చూడవచ్చునన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది. ఆమె పట్టుదలను చూసి, చివరకు శంకరుడు అనుమతిస్తారు.
సతీదేవి తన తండ్రియింటికి చేరినప్పుడు అక్కడివారెవ్వరూ ఆమెతో మాట్లాడరు, ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకొంటారు. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకొంటుంది. తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం, పరిహాసమూ నిండి ఉంటాయి. తనవారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణభావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రియైన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట, సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోతుంది. ‘పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికివచ్చి పెద్ద పొరబాటే చేసితిని‘ అని ఆమె భావిస్తుంది.
తన పతియైన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేక పోతుంది. వెంటనే ఆమె తన రూపమును అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మము గావిస్తుంది. భరింపలేని ఈ దారుణదుఃఖకరమైన సంఘటనను గురించి విని, పరమశివుడు మిక్కిలి క్రోధితుడవుతాడు. ఆయన తన ప్రమథగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ద్వంసం చేయిస్తారు.
సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి, మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడామె ‘శైలపుత్రి’గా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, హైమవతి అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, ఆమె హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది.
‘శైలపుత్రి’ అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ‘అర్ధాంగి’ అవుతుంది. నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి. మొదటి రోజున యోగులు ఉపాసనద్వారా తమ మనస్సులను మూలాధారచక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.

మంగళవారం, సెప్టెంబర్ 22, 2015

'గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా '

మంగళవారం, సెప్టెంబర్ 22, 2015

మనలో దాదాపు అందరికి తెలుసు  గ్రేట్ వాల్ ఆఫ్  చైనా, కానీ మన భారతదేశం కూడా ఒక  'గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ', ఉంది అని ఎంతమందికి తెలుసు.   చాలా తక్కువమందికే తెలుసు అనుకుంటున్నా.  ఇది ఒక కోట చుట్టూ రక్షణ కోసం కట్టబడింది.  దీనిపేరు కుంభాల్ ఘర్ ప్రాంతం వెలుపల గోడగా వుంది.  ఈ గోడ 36 kms విస్తరించింది, మరియు
ఛాయాచిత్రాలను ద్వారా వీక్షించవచ్చు .  దీనిని అందరు  గ్రేట్ వాల్ ఆఫ్ చైనాగా  పొరబడుతుంటారు. అయితే, Kukbhalgarh లో స్థానాలు మరియు సంస్కృతులను బట్టి అనేక శతాబ్దాల తరువాత  రెండు వేరు వేరు అని  1443 లో తెలుసుకున్నారు .  రాణా కుంభ రాజస్థాన్ ఆప్రాంతపు  మహారాజు మహారాణా వారి రాజ్యం చుట్టూ మరియు కొండ మీద తన కోటను ఎక్కువగా  రక్షించడానికి ఉద్దేశించి ఈ గోడ కట్టమని ఆదేశించింది, సముద్ర మట్టానికి సుమారు 1000 మీటర్ల ఎత్తులో నిర్మించారు.
 ఇది 19వ శతాబ్దంలో విస్తరింపబడిఉంది మరియు ఆ స్థానం ఇప్పుడు మ్యూజియంగా కొనసాగుతోంది.   ఆ గోడకు  ఏడు ముఖద్వారాలు కలిగివున్నాయి.  కొన్ని ప్రదేశాల్లో పదిహేను అడుగుల వెడల్పు కలిగివుంది.  Kubhalgarh నివాసులు, సారవంతమైన భూమిని కలిగివున్నారు. 
ఈ గోడల వెనుక పై భాగాన  360 దేవాలయాలు కలిగివున్నాయి.  హిందూమతం, బౌద్ధమతం మరియు జైనమతం కు చెందిన  దేవాలయాలు కలిగివున్నాయి. ఇవి కూడా వారికి రక్షణగా వున్నాయి.
  ఆరాజు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, గోడ ఒక కారణం వలన పూర్తి కాలేదు. రాజు స్వచ్చందముగా మరణించటం తో గోడలో కొంత ప్రదేశం కూలిపోయింది.





దానినిర్మాణము  నిలిపివేయబడింది,  అయితే ఈ ప్రదేశం ను పర్యాటకులు సందర్శించడం కోసము మ్యుజియంలా వుంచారు.   చరిత్రకు ఈ అందమైన స్మారక కట్టడంగా వుండిపోయింది. అయితే ఇప్పటికీ  ఇది ఒక రహస్యముగా వుండిపోయింది.  ఆ గోడ ఎందుకు కట్టడం ఆగిపోయిందో?

శనివారం, ఆగస్టు 29, 2015

తెలుగు భాష దినోత్సవం

శనివారం, ఆగస్టు 29, 2015

తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడుగిడుగు వెంకట రామమూర్తిగ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజలవాడుకభాషలోకి తీసుకు వచ్చినిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీవీలునూ తెలియజెప్పిన మహనీయుడుఆంధ్రదేశంలోవ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడుబహుభాషా శాస్త్రవేత్తచరిత్రకారుడుసంఘసంస్కర్త,హేతువాదిశిష్టజనవ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగుగిడుగు ఉద్యమంవల్ల కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగిఅందరికీ అందుబాటులోకి వచ్చిందిపండితులకే పరిమితమైనసాహిత్యసృష్టిసృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గాజరుపుకుంటున్నాము.  గిడుగు రామమూర్తి పుట్టిన రోజు ఆగష్టు 29 ని తెలుగు భాషా దినోత్సవముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముమరియు  ప్రజలు పాటిస్తున్నారు

విశ్వనాథ సత్యనారాయణ గారు రామమూర్తి పంతులు గారిగురించి ఇలా అన్నారు.  "రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోముల పంట".  అని ఇంకా  "రామ్మూర్తి పంతుల వాదాన్ని అర్థం చేసుకోకదురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు".
 రోజు సభలు జరిపిపదోతరగతిఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలనితెలుగు భాషాచైతన్య సమితి లాంటి స్వచ్ఛంధ సంస్థలు అందచేస్తున్నాయిప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి ఎంతగానో కృషిచేస్తున్నారు.  ప్రపంచంలో తెలుగు భాష ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగివుంది.  ప్రపంచీకరణ వలన పిల్లలను ఇంగ్లీషు మాధ్యమములోచదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారుప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగుమాధ్యమములో చదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి.  ఇది ఎంతో గొప్ప మార్పుగాచెప్పుకోవచ్చు.  తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు .

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)