Blogger Widgets

ఆదివారం, డిసెంబర్ 14, 2008

కాస్త కలా పోసన వుండాలి - గోదారి అందం

ఆదివారం, డిసెంబర్ 14, 2008


మనిషన్నాకా కాస్తో కూస్తో కలాపోసనవుండాలి . లేకుంటే మనిషికి గొడ్డుకి తేడా ఎటుంటాధి ? ఇది భద్రాచలం ఎల్తావుంటే నావలోనుంది చూస్తావుంటే ఉదయిస్తున్న సూర్యుడి తో గోదారమ్మ ఎంత అందముగావుందో. ఆ అందాన్ని ఎవరైనాచూసి తీరాల్సిందే . అబ్బో ఏమి అందమో . మీరు చూడండి ఈ గోదారి అందం . నేను సెప్పింది నిజమేనా ...........?

శనివారం, డిసెంబర్ 13, 2008

అందమైన పక్షులు ..

శనివారం, డిసెంబర్ 13, 2008

అందమైన పక్షులు లండన్లో నాకు నచ్చినవి . మీరూ చూస్తారా అయితే చూడండి . ఆ పక్షులు ఫోజు బలేవుంది కదా..

గురువారం, డిసెంబర్ 11, 2008

దత్తం వందే జగద్గురం -జగద్గురువులు

గురువారం, డిసెంబర్ 11, 2008


హాయ్ ! బాగున్నారా ! రేపు శ్రీ శ్రీ శ్రీ గురు దత్తాత్రేయులవారి జన్మదినము . అందువల్ల మా అమ్మమ్మ గురుచరిత్ర పారాయణ చేస్తోంది. అప్పుడు నాకు సులువుగా వుంటుందని ఇది నేర్పించింది.

దత్తాత్రేయం శివం శాంతం సచ్చిదానంత మద్వయం
ఆత్మరూపమ్ వరందివ్యం అవధూత ముపాస్మహే
నగురో రధికం తత్త్వం నగురోరధికం తపః
నగురో రధికం జ్ఞానం తస్మై శ్రీగురువేనమః !

శ్రీ రాముడు , శ్రీ కృష్ణుల అవతారలకంటే ముందే , కృతయుగములో శ్రీ దత్తాత్రేయులవారి అవతారం జరిగింది. దత్తత్రేయులువారు ఒకప్పుడు ఉంది ఒకప్పుడు లేనిఅవతారం కాదుట !.................మా అమ్మమ్మ చెప్పింది. ఏదో ఒక రూపంలోనే కనిపించే అవతారం కాదుట. ఎల్లప్పుడూ వుండి వివిధ రూపాలలో
ఒక్కొక్కసారి తెలిసేలా
ఒక్కొక్కసారి తెలియకుండా రహస్యమ్గా విచిత్ర, విలక్షణ అవతాముర్తి శ్రీ శ్రీ దత్తాత్రేయులు .
భగవాన్ షిరిడి సాయిబాబా వంటి మహనీయులను దత్తాత్రేయ ముర్తిగానే భావించి సేవించటం జరుగుతోందట.
జగత్తునే గురువుగా బావించి జగద్గురువు అయినమహాముర్తి . గురువు కంటే అధికమైన తత్త్వం కాని, తపస్సుగాని , జ్ఞానం కాని లేదు . అందుకే ఆయన జగద్గురువు అయ్యారు.
ఒకసారి యయాతి వంసియుడు యదుమహారాజుకు శ్రీ దత్తాత్రేయులవారు యువకుని రూపంలో గురువులగురిమ్చి చెప్పారు. ఆయనకీ 24 మంది గురువులని చెప్పారుట .
అవి ఏమిటి అనిఅడిగితే? అవి
భూమి , పర్వతం , వాయువు, ఆకాశం , జలం , అగ్ని , చంద్రుడు , సూర్యుడు , పావురం , కొండచిలువ , సముద్రం , కీటకం , తుమ్మెద , తేనెటీగ , ఏనుగు , లేడి , చేప , వేశ్య , ఉడుత , బాలిక , విలుకాడు , సర్పం , మట్టిపురుగు , సాలెపురుగు ఇవే నాగురువులు అన్నారు.
వీరంతా మీ గురువులా అని యదు రాజు అడుగగా అవును వీరే నాగురువులు అని చెప్పారు. వారు ఎలాగురువులో వివరించి చెప్పారు. మట్టి పురుగునుండి ఆకాశాన వున్నాసూర్యుని వరకు గురువులే అని చెప్పారు.
ఈ జగత్తును గురువులుగా గుర్తించారు.
నేర్చుకోవాలంటే ప్రకృతిలోని ప్రతీ అణువు మనకు పాఠం చెబుతుందని భోధిస్తారు. జగత్తుకే పరమగురువులయిన దత్తాత్రేయులవారు. యదుమహారాజుకు .
అయితే మనం ఆగురువులకు , జగత్గురువుకు మనం కుడా వందనములు తెలుపుదామా మరి.!

బుధవారం, డిసెంబర్ 10, 2008

మాసానాం మార్గశీర్షం - లక్ష్మీ హృదయకమలం ముగ్గు

బుధవారం, డిసెంబర్ 10, 2008

మార్గ శిర మాసం వైష్ణవ మాసం అని కుడా అంటారు. "మాసానాం మార్గశీర్షోహం " అని మాసాలలో మార్గశీర్షమాసాన్ని నేనే అని భగవగీత లో శ్రీ క్రిష్ణులవారు అర్జునితో విభూతి యోగములో వివరించారు. అంటే అన్ని మాసాలలోని మార్గశిర మాసం లో శ్రీ కృష్ణ పరమాత్మ ఒక వ్రుక్షచాయ. ఇది గ్రీష్మత్ప్తులకు చల్లగాను, శీతపీడితులకు వెచ్చగాను ఉంటుంది. అలాగే విష్ణు స్వరుపమగు మార్గశీర్ష మాసంకుడా, అతిశీతలం కాక అతి వేడి కాకుండా సమ శీతోష్ణముగా ఉంటుంది. సంవత్సరంను ఒకరోజుగా భావిచినచో మార్గశిరమాసాన్నిబ్రహ్మ ముహార్థముగా చెప్పుకొనవచ్చు.
అనగా తెల్లవారుజాము చాలామంచిదని తెలుసు . మార్గ శిరం సత్వ గుణము ను పెంచి భగవదనుభుతిని కలుగ చేస్తుంది.
లోకమంతా పైరులతో పచ్చగా వెలయు కాలం మార్గశిర్షం . మార్గశిర్శమో ! క్షేత్రములో సస్యములు పంది భారంతో వంగి మనోహరంగా ఉంటుంది.
అల్లా వున్నప్పుడు ప్రజలు సంతోషముగా వుందురు. ఈ నెల ప్రారంభం నుండిఇళ్ళల్లొ ఆడవారు మార్గశిర లక్ష్మి వారపూజలు ప్రత్యెకంగా లక్ష్మివారం రోజు చేయటం ప్రారంభించి పుష్యమాసం మొధటి లక్ష్మి వారం వరకు చాలానియమ నిస్టలతో పూజలు చేస్తారు. ఆ రోజు లక్ష్మేహ్రుదయకమలం ముగ్గు పెట్టి లక్ష్మి ని ఆహ్వానించి పూజచెస్తారు. ఈమెని కనక మహాలక్ష్మి గా కొలుస్తారు .
చంద్ర మానాన్ని బట్టి మార్గశిరమని , సూర్య మానాన్ని బట్టి ధనుర్మాసమని ఏర్పడ్డయి . ఈ రెండూ ఒకటె.
ఈ మాసంలొ తెల్లవారుజామున లెచి మార్గశిర స్నానాలు చేసి తమలో వున్న ఙ్ నాన్ని మెలుకొల్పుదురు. ఆద్యాతంక చింతన కలిగి వుంధురు .
ఇక మార్గశిర మాసంలొ ఒక రహస్యమున్నది. మార్గముని నిర్ధెశించునధి. అని అర్ధము. భగవానుని పొంధు దారి అన్న మాట.
ధనుర్మాసంలొ గోధాదేవిని శ్రీ కౄషులను పూజించుధురు .ఆ అమ్మవారు పాడిన 30 పాశురాల తిరుప్పావై ని ఈ నెల పాడుధురు . దీనిని ధనుర్మాస వ్రతముగా కన్నెపిల్లలు చెయుధురు. తమకి మంచి జరుగునని భావించి ఆధ్యత్మికద్రుక్పధముతొ మెలగుధురు. . ఈ నెలరోజులూ వైష్ణవ ఆలయాలు చాలా వినసొంపుగా లయబద్ధముగా తిరుప్పవై చధువుతారు. ఆలయాలన్నీ ఆద్యాత్మికంగా వుంటాయి . సాయంకాల సమయంలొ విష్ణుసహస్ర పారాయణములతొ నెలరోజులూ సంధడిగా గడుపుధురు.
ఈ వ్రతాలు గురించి మిగతావి మరొసారి చెప్పుకుంధాము సరేన మరి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)