Blogger Widgets

సోమవారం, డిసెంబర్ 19, 2011

తిరుప్పావై పంచమ పాశురము

సోమవారం, డిసెంబర్ 19, 2011

వర్షము ఎలా కురవాలో వారు ఇంతకు ముందు పాశురములో మేఘదేవుని ప్రార్ధించారు కదా.  వర్శములేక పాడిపంటలు శూన్యమైన సమయములో సస్యసమృద్ధికి పుష్కలముగా పైరులు పండుటకు వర్షపాతము సమృద్ధిగా పెద్దల అనుమతితో ఈ వ్రతము ప్రారంభించిరి.  కావునా ఇలా ప్రార్ధించారు. మరి ఈ పాశురము లో ఏమనుకుంటున్నారో మన గోపికలు తెలుసుకుందామా.
పాశురము:
  మాయనై మన్ను వడమదురై మైందనై


మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్



తాత్పర్యము: మనము సక్రమముగా పూర్తిచేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనము చేసిన పాపములాటంకములు కావచ్చునని భయపడనవసరము లేదు.  ఎందుచేతనంటే  శ్రీ కృష్ణుడే మన ఈ వ్రతానికి కారకుడు మరియు నాయకుడు. అతని గుణములు ఆశ్చర్యకరములైనవి.  అతని పనులు కూడా అట్టివే.  ఉత్తరమున మధురానగరమునకు నిర్వాహకుడుగా జన్మించినాడు.  నిర్మలమైన జలముగల యమునానది ఒడ్డున నివసించుచు మనకొరకు యదుకులమందున అవతరించిన మహానుభావుడు.  తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు.  అంతటి మహాత్ముడి ఉండి కూడా ఆమెచే త్రాటితో కట్టబడిన సౌలభ్య మూర్తి.  కనుక మనము సందేహములను వీడి పరిసుద్దములై అతనిని సమీపించి పరిసుద్దమైన వికసించిన హృదయకుసుమమును సమర్పించి నోరార పాడాలి.  నిర్మలమైన మనస్సుతో ద్యానిమ్చాలి. అంతటనే వెంటనే ఇంతకుముందు పాప సమూహము రాబోవు పాపముల సమూహము మంటలో పడిన దూది వలె భస్మము అయిపోతాయి.  మన వ్రతమునకు ఆటంకములుకలుగవు.


విశేషార్ధము:
మాయనై : 
ఆశ్చర్యకరములగు గుణములు, చేష్టములు కలవానిని కీర్తించి మనము మన వ్రతమున ఉపక్రమించుదుము.
మాయ అంటే భగవద్శక్తి ఇది చాలా విచిత్రముగా వుండును.
మన్ను వడమదురై మైందనై:
ప్రతినిత్యము భాగావత్సంబంధముకల ఉత్తర మధురకు నాయకుడగు వానిని కీర్తించుచున్నారు.  పyరమపదమున వికార రహితుడగు విష్ణువు ఏకరూపుడై ఎల్లప్పుడు నిత్యసూరులకు దర్సనమిచ్చు పరమాత్మయే మధురానగరిలో అవతారములు మార్చి మార్చి దర్శనము ఇచ్చినాడు.  ఈ మదురనే సిద్దాశ్రామము.  అక్కడ వామనావతారుడుగా దర్సనం ఇచ్చారు.  ఇక్కడ శత్రుఘ్నుడు ఇక్కడ నేలవనుడను రాక్షసుడును చంపి రాజదానిగా చేసికొని పాలించాడు.  తరువాత దేవకీవసుదేవులకు శ్రీ కృష్ణుడుగా ఇచట అవతరించాడు.
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై:
పరిశుద్ధములగు అగాధములగు జలములుగల యమునానది యొక్క తీరమున విహరించువాడా! అని కీర్తించుచున్నారు.  ఇక్కడ యమునానది పవిత్రము అయినది అని అంటున్నారు.  ఈ నది శ్రీ రామావతారములో అయోద్యగా సరయునదిగా వచ్చింది.  ఇక్కడ శ్రీ కృష్ణావతారములో మదురగా యమునగా వచ్చినది.  అలా వచ్చుటచే భగవంతుని అభిప్రాయము తెలిసి కృష్ణుని ఎత్తుకు వచ్చుటకు వసుదేవునకు దారినిచ్చినది.  అలా దారి ఇవ్వటమే ఆనది ప్రత్యేకత.
 ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై:
గోపవంసమునందు ప్రకాశించిన మణిద్వీపమయిన వానిని కీర్తించుచున్నారు.    ఈ పరమపదములో సర్వేస్వరుడు ఉన్నా అక్కడ తన గుణములన్నియు ప్రకాశింప వీలుండదు.  ఆ పరమ పురుషుడే మధురలో జనించి నందవ్రజము  చేరి దీపమువలె ప్రకాసించినాడు.
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై:
తల్లి అయిన యశోద గర్బమును ప్రకాసిమపచేసిన దామోదరుని కీర్తిమ్చుచున్నారు.  ఆనాడు వన్నెల చిన్నవాడు అగు శ్రీ కృష్ణుని యశోదమ్మ తాడుతో రోటికి కట్టిన మచ్చ ఎప్పుడు కనపడుటచే అతనికి దామోదరుడు అని పేరు వచ్చింది ఆ పేరును కీర్తిస్తున్నారు.  దామోదరతత్వముచే తల్లికి కీర్తి తెచ్చినవాడు చిన్ని కృష్ణయ్యా.
తూయోమాయ్ వందు నాం :
ఇట్లు స్మరించుచు పరిశుద్దలమై వచ్చి మనము సేవించినచో  సకల పాపములు పోతాయి అని చెప్పుచున్నారు.  పరిశుద్ధము అనగా భగవద్ సంబందము తప్ప వేరొకటి లేకుండా మనసు శుద్ధముగా వుమ్చుకోనుట.
తూమలర్ తూవి త్తొళుదు:
పరిశుద్ధములయిన పుష్పములు విసిరి సేవించి.  పుష్పాలకు పారిసుద్ధము, సమర్పించు వారి భక్తియే!  ఈ పువ్వునైనా భక్తితో అర్పించినా అది పరిశుభ్రమినదే.  భగవంతుడు ఆకు అయినా, పువ్వునైనా, ఫలం అయినా, నీరు అయినా సరే భక్తితో సమర్పిస్తే వారిని కరుణిస్తాడు. భగవంతునికి ఇష్టమైన పుష్పాలు ఎనిమిది వున్నాయి.
అవి అహింసా, ఇంద్రియనిగ్రహము, సర్వభూతదయ, క్షమా, ఙ్ఞానము , తపస్సు, సత్యము, ద్యానము ఇవే ఆయన కోరుకునే పుష్పాలు.
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క:
మనము భగవంతునివద్దకు నడచి వెళ్ళుటచే అతని మనస్సున భాదకలిగించును.  అయ్యో! నేనే వారివద్దకు వెళ్ళవలసినది.  వాళ్ళు వచ్చేవరకు చేసెనే అనుకుంటాడు.  పైగా మనం మాటాడినా ఇంకా భాదపడును.  మనము అతని అనుగ్రహము కొరకు అతని వద్దకు చేరి కీర్తించూదాం.
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం తీయనిల్ తూశాగుం:
ముందు చేసిన పాపములు, తరువాత రాబోవు పాపములు కూడా అగ్నిలో పడిన దూది వలె అవుతుంది.  భగవంతుని మనము అర్చించి, పాడి, చింతించిన వెంటనే మనము చేసిన పాపాలు భగవంతుడు విస్మరించును.  రాబోవు పాపాలు తెలియనట్లు వదిలివేయును.
శెప్పు:  
చెప్పుడు,  మాయావీ, మధురానాయకా, యమునాతీరా విహారి! నందవ్రజ మంగళదీపా ! యశోదాగర్భ ప్రకాశకా!  దామోదరా! అని కీర్తించుట చాలు.  అలా కీర్తించినా సర్వ పాపాలు నాశనం అవుతాయి. అని చెప్పి వ్రతమునకు అందరిని ప్రిపేర్ చేసింది.  రేపటినుండి వ్రతానింకి ఉపక్రమిస్తున్నారు గోపికలు.


జై శ్రీ మన్నారాయణ్

ఆదివారం, డిసెంబర్ 18, 2011

తిరుప్పావై ఛతుర్థ పాశురము

ఆదివారం, డిసెంబర్ 18, 2011

గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడిపంటల తో సమృద్దిగా వుండాలని కోరుకున్నారు. తన వ్రతముంకు స్నానము ప్రదానము కావున స్నానము చేయుటకు అనుగుణముగా జలమును సమృద్దిగా ఉండవలెను అని భావించినారు.  ఈ వ్రతము నకు ఫలముగా అనుకుని వేరే వాటిని ఆశ్రయించక భక్తి తో భగవంతుని వినయ విదేయత కలిగివున్నారు .  వానదేవుని ఈ పాసురములో ప్రార్ధిస్తున్నారు.  మరి ఈ పాసురము లో ఎలా అడుగుతున్నారో తెలుసుకుందాము.
పాశురము 
   ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్ 


ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము:  గంభీరమైన స్వభావము కలవాడైన వర్షము కురుయునట్టి ఓ మేఘదైవతమా!  నీవు వర్షజలముననుగ్రహించు దాత్రుత్వములో ఏ మాత్రము సంకోచము చూపించకు.  గంభీరమైన సముద్రము మద్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాసమునంతను వ్యాపింపచేయును.  సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరమువలె దివ్యమైన నల్లని స్వరూపమును ధరించి ఆభగవంతుని సుందర విశాల దీర్గబాహువుల జంటలో కుడిచేతి యందలి చక్రాయుధమువలె మెరయుచు ఎడమచేతి యందలి శంఖము వలె మధురగంభీరముగా ఉరిమి ఆ భగవంతుని శారంగమను ధనుస్సు నుండి వెడలివచ్చు బాణములవలె వర్షదారాలు  లోకమునంతను సుఖింపజేయునట్లును.  మేము సంతోషముతో మార్ఘశీర్ష స్నానము చేయునట్లు వర్షించు. అని అండాళ్ళమ్మ ఈ పాశురములో ప్రార్దించుచున్నది.  


విశేషార్ధము:
ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్:
ఈ గోపికలు వర్షాధిదేవుడగు పర్జన్యుని సంభోదించుచున్నారు.  ఆళి=సముద్రము వలె గంభీర్య వైశాల్యములు కలవాడు పర్జనుడు అని భావము.
ఆళి ఉళ్ పుక్కు:
సముద్రము మద్యలోనికి ప్రవేసించి,  సముద్రములో నీరు త్రాగుటకు పైపై ఒడ్డున తాగరాదు.  చిన్నచిన్న గుంటలు, పడియలలో, చెరువులలో, నదులలో నీరు త్రాగరాదు.  సముద్రములో మధ్యకు పోయి అగాధముగా నుండు చోట లోనికి చొచ్చి నీటిని త్రాగవలె.
ముగందు కొడు:
పూర్తిగా సముద్రజలమును త్రాగీ- గోపికలు మేఘముతో సముద్రపు నడిబొడ్డున చొచ్చి జలమునంతా ఇసుకతగిలే వరకు నీటిని త్రాగామంటున్నారు.
ఆర్తు  ఏఱి:
గర్జించి మిన్నంది.  ఓ మేఘమా ! నీవు సముద్రజలమును తృప్తిగా తాగిన తరువాత ఒక్కసారిగా గర్జించాలి.  మనము బోజనము చేసినతరువాత త్రేనుపు వస్తుంది అటువంటి శబ్ధము.
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు:
కాలమునకు కారణమైన బ్రహ్మతత్వముయొక్క రూపమువలె నీ శరీరమును నల్లగా చేయవలె. 
 "బ్రహ్మవేద బ్రహ్మైవభవతి" బ్రహ్మ నెరిగినవాడు బ్రహ్మ స్వరూపమునే పాడుతాడు అని ఉపనిషత్తు చెప్పుతుంది.
జలము త్రాగిన మేఘము నీలముగా మారును అది చల్లగా వుండును.
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని:
విశాలమగు సుందరమగు బాహువులుగల పద్మనాభుని చేతిలోని చక్రమువలె మెరిసి, వర్షించవలె.  ఆకాశమున అధిరోహించిన మేఘము నల్లగా వుంది వర్షించుటకు ముందు మెరయును.  ఆ మెరుపు పద్మనాబుని చేతిలోని చేక్రపు మెరపువలె ఉండాలి.  పరమాత్మ బాహువులు విశాలములు సుందరములు అనిచేప్తున్నారు.
 వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు:
దక్షణావర్త  శంఖము వలె నిలిచి గర్జించి. మేఘము మేరయుట ఘర్జించుట సహజమే.  కానీ మన గోపికలు శ్రీ మన్నారాయుణుని చేతిలోని చక్రంవలె  మెరవాలిట.   శంఖమువలె గర్జించవలెను అని వారి కోరిక.
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ :

శారంగమను విల్లు బాణములను వర్షించునట్టు వర్షము వర్షించాలి అని భావము.
నాంగళుమ్ మార్గళి నీరాడ మగిళుందేలోర్ :
ఆ వర్షానికి మేము ఆనందముగా మార్గశిర స్నానము చేయాలి అని అనుకుంటున్నారు.




జై శ్రీమన్నారాయణ్

శనివారం, డిసెంబర్ 17, 2011

తిరుప్పావై తృతీయ పాశురము

శనివారం, డిసెంబర్ 17, 2011

రెండవ పాశురములో మనము వ్రత నీయమాలు నిర్ణయించుకున్నాము కదా.  మరి వ్రతము ఒక ఫలాపేక్ష తో చేస్తున్నాము కదా మరి ఆ వ్రత ఫలము ఎలావుండాలి మరి. ఆ ఫలము ఎలావుండాలో మూడవ పాశురము లో తెలుపుతారు మన అమ్మ.  అయితే ఈ పాశురము విశేషము కలది  అయితే చక్కేరపోంగాలి నివేదించాలి స్వామికి. మరి ఆ పాశురము ఇదిగో.....   
పాశురం:
  ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి

*ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
 నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
 తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
 ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
 పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
 తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
 వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
 నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్



తాత్పర్యము:   పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారము ఎత్తి బలిచక్రవర్తిని మూడు అడుగులు భూమిని దానము అడిగెను.  బలిచక్రవర్తి అలాగే అని దానము చేయగా వామనుడు మూడు పాదాలతో మూడు లోకాలను ఆక్రమించారు.  అట్టి త్రివిక్రముని దివ్యనామములను గానము చేయుచూ వ్రతనిమిత్తముగా మేము స్నానము చేయుటచే సకాలములో కావలసిన వర్షము కురిసి చక్కగా పెరిగిన వరిచేను కన్నులకానందము కలుగచేయాలి.  చేనులోని నీటిలో చేపలు యెగిరి పడుచు మనస్సును ఆకర్షించవలెను.  అన్ని పైరులును బాగుగా పెరిగి ఆనందము కలిగింపవలెను.  పాలు పితుకువారు  పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చోండి పోదుగునంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలను వర్షించవలెను.  స్థిరమైన  సంపదదేశమంతటను విస్తరింపవలేనని ఈ పాసురములోని గోదామాత కోరుచున్నది.

విశేషార్ధము:  
1 ) ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి:
పెరిగి లోకములు కొలిచిన ఉత్తముని పేరు పాడి మేము ఈ వ్రతమునకు స్నానమాచరించుతుము.  పుట్టుట-ఉండుట-పెరుగుట-మారుట-తరగుట-లేకుండుట అనునవి ఆరు ప్రకృతి వికారాలు అలాంటి వికారాలు లేని స్వామీ మనకోసం వచ్చి పెరిగాడని గోపికలు సంతోషించారు.
2 )నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్:
మేము మావ్రతమునకు అని, మిష పెట్టి స్నానము చేసినచో లోకమంతయు సుఖముగా వుండును.  మేము-మావ్రతము గొప్పవని చెప్పుకుంటున్నారు.
3 ) తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు:
ఎటువంటి బాదలు లేకుండా దేశమంతా నెలకు మూడు వానలు పాడుటను.   ఈవ్రతం వల్లన లోకములో పాడి పంట సమృద్దిగా వుండును.
4 ) ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ: 
పెరిగిన పెద్దపెద్ద వరిచేనులో చేపలు త్రుళ్ళిపడును.  చేను పెద్దగా పెరుగుట, అడుగున నీరు సమృద్దిగా ఉండుట, పంటకు విశిష్టత.  అట్టివిశిష్టత ఈ వ్రతము వాళ్ళ కలుగును అని భావం.
5 )పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప:
పూచినా కలువ పువ్వులలో లేదా సుందరమైన కలువపూలలో అందమయిన తుమ్మెదలు ఒకదానితో ఒకటి కలహించుకోనుచూ నిద్రిస్తున్నవి.   వారి చేనులో నీరు అధికముగా వుండుట వాళ్ళ కాలువలు ఎక్కువున్నాయి.  వాటిలోని మకరందము కోసం తుమ్మెదలు వస్తున్నాయి.  అంటే వారి ఊరిలో పాడియోక్క వైబోగం చెప్తున్నారు.
6 )తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ:
ఎటువంటి జంకూలేకుండా కోట్టములోకి వెళ్లి కుర్చోనిన బాగా బలసిన చనుకట్లు పట్టి పాలు పిండగా  అక్కడ ఆవులు కుండలు కుండలు పాలు ఇస్తున్నాయి.  ఆ రేపల్లేలో గోవులు సమృద్దిగా వున్నవి అని.
7 )క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్ 
    నీంగాద శెల్వం నిఱైందే:
కుండలు నిండునట్లు పాలను ఇస్తున్న ఉదారములగు పశువులు, తరగని సంపద, నిండియుండును.

జై శ్రీమన్నారాయణ్

Flights of Inspiration.

ఇది అంతా ఏమిటనుకుంటుంన్నారా మనము  ప్రపంచంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి flights లో వెళ్ళిపోతున్నాము.  మొట్టమొదట ఆకాశంలో ఎగిరే విమానాన్ని Wright Brothers కనుక్కున్నారని అందరికి తెలుసు.  మరి ఆ విమానాన్ని తయారు చేయటానికి వారు చాలా కష్ష్టపడ్డారో చెప్పలేము.  వారు కృషి వుంటే సాధించలేనిది లేదు అని నిరూపించారు. 
వారు తయారుచేసిన మొదటి విమానం యొక్క డిజైన్. పక్షి ఎగురుటను inspiration గా వారు తీసుకుని డిజైన్ చేసారు.  క్రింద డ్రాయింగ్ 1903 ఫ్లైయర్ ది అని గుర్తించిన రేఖాచిత్రం ఇది. ఇది గోధుమ రంగు కాగితంపై పెన్సిల్ ఉపయోగించి రైట్ బ్రదర్స్ ద్వారా డ్రా చేయబడినది.  కాగితంపై మూడు అభిప్రాయాలుఉన్నాయి. టాప్ వీక్షణ ఫ్లైయర్ లోకి డౌన్ గురించి ఒక "bird's-eye" లా వుంటుంది. ( ఫ్లైట్ లోమొదటి చూసిన మానవులు మీద పక్షి యొక్క ప్రతిచర్య ఇమాజిన్!)  వారు ఆ ఫ్లైట్ కు ఏమి ఉపయోగిమ్చారంటే వాటి సైజెస్ ఇవే.


No blueprint or other drawing of the 1903 Flyer exists.
Some technical specifications for the Flyer:
1 )Gasoline-powered engine weighed 179 pounds, delivered 12 horsepower 
2 propellers, each 8.5 feet in diameter 
2 )ropeller made of 3 layers of 1 1/8 inch spruce, glued together, shaped with hatchet and drawshave .
3  )Wingspan = 40 feet, 4 inches .
4 )Chord = 6 feet, 6 inches .
5 )Wing camber = 1:20 .
6 )Total wing area = 510 square feet .
7 )Horizontal forward rudder = 48 square feet .
8 )Distance from nose to tail = 21 feet, 1 inch .
9 )Unmanned weight = 605 pounds (including engine, propellers, and chain drive)
10 )Wing skeleton covered with white French sateen fabric .
11 )Propeller shafts made of steel .


ఇవి ఉపయోగించి 1902 డిసెంబర్ 17 న Wright Brothers నింగిలో ఎగురవేసి వారి కలను నిజం చేసుకున్నారు.  నిజంగా ఆనాడు వారికి అది కల కానీ నేడు మనకు వేరేదేశాలకు వెళ్ళాలి అంటే మనకు అవసరంగా వుంది. నిజంగా వారు చాలా గ్రేట్.
 Heads  of  to  Wright  brothers .

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)