Blogger Widgets

సోమవారం, మే 21, 2012

మూడేమాటలు మూడుమూండ్లు

సోమవారం, మే 21, 2012




మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది 
వేడుకొని చదువరో వేదాంత రహస్యము ||


జీవస్వరూపము చింతించి అంతటాను 
దేవుని వైభవము తెలిసి |
భావించి ప్రకృతి సంపదయిది యెరుగుడే 
వేవేలు విధముల వేదాంత రహస్యము ||


తనలోని  జ్ఞానము తప్పకుండా తలబోసి 
పనితోడ నందువల్ల భక్తినిలిపి |
మనికిగా వైరాగ్యము మరవకుండుతే 
వినవలసిన యట్టి వేదాంత రహస్యము ||


వేడుకతో నాచార్య విశ్వాసము కలిగి 
జాడల శరణాగతి సాధనముతో |
కూడి శ్రీవేంకటేశ్వరు కొలిచి దాసుడౌటే
వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము || 

ఆదివారం, మే 20, 2012

వాస్కోడిగామ సాహసయాత్ర

ఆదివారం, మే 20, 2012

పూర్వం నుండి  సాహస  యాత్రలు చేసేవారు వారిలో మొట్టమొదట  కొలంబస్ అను నావికా యాత్రికుడు ఎన్నో సాహస  యాత్రలు చేసారు వాటిలో నాలుగు గొప్ప యాత్రలు చేసి, ఇండియాని కన్నుక్కోవాలని ప్రయత్నించి ఇండియాకి దారి కనుక్కోలేకపోయినాడు, పశ్చిమ ఇండీస్ దీవులని, దక్షిణ అమెరికా ఖండాన్ని కనుక్కున్నాడు. కాని తను కనుక్కున  ప్రదేశము ఇండియ అనే చాలా కాలం వరకు  భ్రమలో ఉన్నాడు.   అయతే కొంత కాలం తరువాత  ఆ ప్రాంతం ఇండియా కాదని, ​​అదేదో కొత్త భూమి అని క్రమంగా యూరొపియన్ ప్రజలకి తెలిసింది అప్పుడు మళ్ళీ ఇండియా కనుక్కోవాలని తపన  వారిలో మొదలైనది.  అప్పుడు వారు  కొత్త  దారుల వెతుకు లాట  మళ్లీ మొదలుపెట్టారు .  అప్పుడు పోర్చిగీసు నావికుడు దీనికి పూనుకొని తన సాహస  యాత్ర  మొదలు పెట్టాడు.  వారు ఆ యాత్రలో చాలా కష్టాలు అనుభవించారు.  పెద్ద పెద్ద తుఫానులు,  గాలులు, వర్షాలు ఎన్నో అధిగమించి చిట్ట చివరికి మన ఇండియాని కన్నుక్కున్నాడు.  ఇండియాని చేరక పూర్వం ఇండియా అనుకోని రెండు ప్రదేశాలకు చేరి అవి ఇండియా కాదు అని తెలుసుకొని తన ప్రయాణం కొనసాగించారు.  అ తను ఆఫ్రికా చుట్టూ  వెళితే ఇండియా చేరుకోవచ్చు అని అనుకున్నాడు.  అయితే మూడోసారి ప్రయాణం చేసాక అప్పుడు ఇండియాని కనిపెట్టేసాడు ఈ  సాహస యాత్రికుడు వాస్కోడిగామ.   ఇతను కనుక్కొన తరువాతే అందరికి మన దేశం అందరికి తెలిసిపోయింది.  అప్పుడే మనకు బ్రిటిష్ వారి వంటి వారు చేరి మనలను కస్టాలు పాలు చేసారా అనిపిస్తోంది.  ఈరోజు నాడు 1498 మే 20 న ఈ యాత్రికుడు సముద్ర  మార్గము ద్వారా ఇండియాని అప్పటి కాలికట్  ఇప్పటి కోజికోడ్ ను చేరాడు. ఇంత  పట్టుదలతో ఇండియాని మొట్ట మొదట చేరిన  వాస్కోడిగామ గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినందుకు ధన్యవాదములు.        
 

గురువారం, మే 17, 2012

భూమాత విష్ణువును ప్రార్ధిస్తున్నది.

గురువారం, మే 17, 2012



భూమాత దుష్ట రాక్షసులు యొక్క ధుష్టపనులు నుండి ప్రపంచంను కాపాడుతున్న మరియు మానవశరీరము ధరించిన విష్ణువును ప్రార్ధిస్తూ మరియు  పొగడుతూ ఈ విధంగా పాడుతుంది.

శ్లోకం : 
శరణ ముపగతాహం త్వం శరణ్యం జనానాం
నిఖిల భయ వియోగం యోగి చింత్యాం మనంతం
సుర రిపుగణ భారం దుస్సహం దుర్భరమ్మే
పరిహర పరమాత్మన్ భక్తి సిద్ధైక మూర్తే||

తాత్పర్యం:  
ఓహ్ దేవాదిదేవ శ్రీమన్నారాయణ, మీరు ఏకైక రక్షకుడైన ఉన్నారు. మీరు మా భయాలును దూరంగా వెదజల్లు. యోగులు ఎల్లప్పుడూ మీమీద ధ్యానం చేస్తువున్నారు. అనేక రాక్షసులు భూమిపై భరించలేని విధంగా దుష్టకర్మలు చేస్తున్నారు. ఇలాంటి పనులు మేము భరించలేకపోతున్నారు నన్ను వారి భారం నుండి నాకు ఉపశమనం కలిగించి నాకు మరియు ప్రపంచం ను కాపాడండి.

పాట :   



శరణం భవ కరుణమయి కురు దీన దయాళో
కరుణా రస వరుణలయ ఖరిరాజ క్రుపాళొ ||

అధునా ఖలు విధిన మయి సుధియ సురభరితం 
మధుసూదన మధుసూదన  హర మామక దురితం ||

వరనూపుర ధర సుందర కరశోభిత వలయ 
సురభూసుర భయవారక ధరణీ ధర క్రుపయా 
త్వరయా హర భర మీశ్వర సురవర్య మదీయం 
మధుసూదన మధుసూదన హర మామక దురితం || 

ఘ్రుణి మందల మణి కుందల ఫణి మందల శయన
అణి మాది సుగుణ భూషణ మణి మంటప సదన
వినతా సుత ఘన వాహన ముని మానస భవన 
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||

అరి భీకర హలి సొదర పరిపూర్ణ సుఖాబ్ధే 
నరకంతక నరపాలక పరిపాలిత జలధే 
హరిసేవక శివ నారా యణ తీర్థ పరాత్మన్ 
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||

బుధవారం, మే 16, 2012

పొట్టేళ్ల పోట్లాట జవాబు తెలిస్తేనాకు చెప్పేయండి

బుధవారం, మే 16, 2012

పొట్టేల పోట్లాట  నట్టేట్లో పడిపోయాయి కదచేబుతాను వినండి ఆని మాఅమ్మ  తన  చిన్నప్పుడు తన  క్లాస్ పుస్తకంలో చదువుకుందిట.  ఆ  కధ  నాకు చెప్పింది.  ఆ క ధ  నాకు బలే నచ్చేసింది.  వింటే మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను.  
ఒక  ఊరిలో ఒకానొక  మేక ఆహారము కోసం ఒక  నిలువుగా వున్నా కొండ  ఎ క్కి అక్కడ  ఆహారం తిని తిరిగి వస్తూవుంటడేది .  కానీ  ఆకొండ  ఎక్కాలి అంటే  ఒక నీటి ప్రవాహం దాటాలి.  ఆ నీటి ప్రవాహం మీద  ఒక  బ్రిడ్జ్  వుంది.  కానీ ఆ బ్రిడ్జ్  చాలా ఇరుకుగా వుంటుంది.  దానిమీద  ఒక్కరు మాత్రమే వెళ్ళ గలరు.  అలా ఒకరోజు అలా బ్రిడ్జ్  మీద  దాటుతున్నప్పుడు అటునుండి ఇంకో పొట్టేలు వస్తోంది.  నేను ముందు వచ్చాను నువ్వు వెనక్కి వెళ్ళు నన్ను ముందువెళ్ళని అని ఆ పొట్టేలు అంది.  ఈ పొట్టేలు కూడా అలానే అంది నాను ముందుకు వెళ్ళనీ నువ్వు ముందు వెనక్కి వెళ్ళు అని అన్నాది.  వాటి మద్య  వాదన  పెరిగింది.  రెండు వాటి కొమ్ములతో కొట్టుకున్నాయి.  వాటి మద్య  యుద్ధ వాతావరణం నెలకొంది.  అలా కొమ్ములుతో కొట్టుకొని వాటి కొమ్ములు విరిగిపోయి అవి ఆ నీటి ప్రవాహంలో పడిపోయి కొట్టుకుపోయాయి.  మరలా కొన్ని రోజులు తరువాత  మరలా అదే పరిస్థితి వచ్చింది.  అవే పొట్టేళ్ళు అదే బ్రిడ్జ్ మీద  కలుసుకున్నాయి.  అయితే యిప్పుడు అవి వెనకకు వెళ్ళవు, కొట్టుకోవు నీటిలోకి పడిపోవు,  వాటిదారిలో అవి సమానంగా వెళ్ళిపోతాయి అది ఎలా? మీకు ఒక  hint  కూడా ఇస్తాను అవి ఒక  ఒప్పందానికి వస్తాయి.  అది ఎలాంటి ఒప్పందమో మీరు చెప్పాలి?   అవి ఎ విధంగా రెండు పొట్టేళ్ళు సురక్షితంగా వంతెన ద్వారా మార్పు చెందుతాయి.  మీకు జవాబు తెలిస్తే నాకు తొందరగా చెప్పేయండి మరి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)