Blogger Widgets

బుధవారం, డిసెంబర్ 19, 2012

మార్గశిర లక్ష్మివార వ్రతము- కధ

బుధవారం, డిసెంబర్ 19, 2012

శ్రీ కనక మహాలక్ష్మి దేవి 
శ్రీమద్భగవద్గీత లో శ్రీ క్రిష్ణులవారు మాసానాం మార్గశీర్షోహం అని అన్నారు.   శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసం. 'మాసానాం మార్గశీర్షం'- మాసాల్లో తాను మార్గశిరమాసాన్ని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని విభూతియోగంలో అన్నారు.  మాసాలన్నిటిలో  మార్గాశిర మాసం చాలా విశిష్టమైనది అని చెప్పకనే తెలుస్తున్నది.  ఈ నెలలో ధనుర్మాస వ్రతం చేస్తారని తెలుసు కద.  అలాగే మార్గశిర లక్ష్మివార వ్రతం కూడా చేస్తారు .  ఇది లక్ష్మి వారం నాడు చేస్తారు.  మనం పూజలు చేస్తాం.  ప్రతీ మనిషికి ఒక కోరిక వుంటుంది.  అది లక్ష్మి కటాక్షం కలగాలన్న కోరిక అందరికి వుంటుంది కదా.  ఆ కోరికను మనకు నేనవేర్చే తల్లి శ్రీ మహాలక్ష్మి.  ఆమెకు చేసే వ్రతమే ఈ మార్గశిర లక్ష్మివార వ్రతము.   మరి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలగటానికి ఈ వ్రతం చేస్తారు. ఈ  వ్రతం ఎలా చేసుకోవాలి అంటే: 
 మార్గశిర లక్ష్మివార వ్రతము
మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకునే అన్ని సమస్యలను పరిష్కరించటానికి మరియు దేవత లక్ష్మీ దేవి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్య తో నివశించాగలరని భక్తులు నమ్ముతారు. మార్గశిర లక్ష్మీ పూజ పూజ విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజ వంటి ఇతర లక్ష్మీ వ్రతం వలెనే అయితే, ఈ దేవత కు సమర్పించే ఆ నైవేద్యం వైవిధ్యమైనది. 
మార్గశిర నెల గురవారం, భక్తులు దేవాలయాలు లోను లేదా ఇళ్లలో లక్ష్మీ పూజ చెయ్యడానికి ముందు రోజే సిద్ధం చేసుకుంటారు. ఇళ్ళు, శుభ్రం చేసి చక్కగా ఉంచబడిన పండుగ రోజులలో మరియు దేవత లక్ష్మి యొక్క చిత్రం లేదా చిన్న విగ్రహం పూజ ప్రదేశం వద్ద ఉంచుతారు. 
లార్డ్ వినాయక కు మొదటి పూజలు చేస్తుంటారు. భక్తులు అవరోధాలు లేదా విఘ్నాలు వదిలించుకోవటం కొరకు గణపతి ప్రథమ పూజ చేస్తారు. గణపతి పూజ తర్వాత, దేవత లక్ష్మీ షోడశోపచార పూజ మరియు అష్టోత్తరం తో పూజలు మరియు నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం అందింస్తారు. మార్గశిర లక్ష్మీ పూజ, కథ చదువుకోవాలి.  లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురవారం చేస్తారు. కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో లో వుంటాయి కానీ ఈ లక్ష్మి పూజ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం.
నైవేద్యం లేదా మార్గశిర లక్ష్మివార వ్రతం సమయంలో దేవత లక్ష్మీ దేవికి ఆహార సమర్పణలు:
1 వ గురువారం - పులగం 
2 వ గురువారం - అట్లు, తిమ్మనం
3 వ గురువారం - అప్పాలు, పరమాన్నము
4 వ గురువారం - చిత్రాన్నం, గారెలు, 
5 వ గురువారం - పూర్ణం బూరెలు 
మార్గశిర లక్ష్మివార వ్రత కధ:
పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది. ఆసుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆదుకునేది సుశీల. ఇలాకొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా! నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీలఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న ఒకకర్రను దోలిపింఛి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆచిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రవదిలి వెళ్ళిపోయాడు. ఆకర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను. మనదరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగితెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి. ఒకచేప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకునివెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను. సరే అని తీసుకునివెళ్లి మార్గమద్యలో దాహంవేసి ఒక చేరువుగాట్టును చెప్పులు మూట పెట్టి నీరుతాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి భాదపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను. మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే వుందని చెప్పెను. అప్పుడు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయంసమయంలో ఒకచేరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు. ఇంతలో ఒకబాటసారి పండుబాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను. ఆకుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు. ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్ళకు. తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారిదరిద్రమును తెలుసుకొని చింతిచి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమివేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అనిచేప్పెను. ఆమెకూడా అలాగే నేనేమైనా చిన్నదాననా? ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నంపెట్టి నోటిలో ఒకముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగినది తల్లిచేప్పినది. ఆవారం కూతురుమాత్రమే చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది. ఆవారం కూడా వ్రతం చేయవీలుకాలేదు. మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగావుండమని చెప్పినది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలడువ్వుకొని వ్రతం చేయలేకపోయినది. కూతురుమాత్రమే చేసుకున్నది. నాలగవ వారం ఈసారి అయినా చాలజాగ్రత గావుండమని చెప్పి సుశీల తల్లి ఈపని చేయకుండా వుండటానికి ఒకగోతి లో కూర్చోబెట్టినది. పని అయినతరువాత అమ్మను తెస్సుకుని వచ్చి స్నానం చేస్తే పూజచేసుకుంధం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజచేసుకొని. ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం . అప్పుడు సుశీల తల్లిని తనకోగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్నకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా.... నీ చిన్నతనం లో నీవు బొమ్మలు తో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసినదానికి క్షమించమని ప్రార్ధించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృస్యము అయ్యినది మహాలక్ష్మి. సరే అని మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం, మూడవ వారం అప్పాలు, పరమాన్నము, నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు, పుష్యమాసం లో మొదటి వారం లో పూర్ణపుకుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కధా అక్షింతలు తలమీద వేసుకున్నారు. అప్పటినుండి ఆమెకు సకలసంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కధలోపమైనను వ్రత లోపము కారాదు. భక్తి తప్పినను ఫలము తప్పదు. 

శ్రీ మహాలక్ష్మికి హారతి 

తిరుప్పావై (మాయనై మన్ను వడమదురై) 5వ పాశురం

వర్షము ఎలా కురవాలో వారు ఇంతకు ముందు పాశురములో మేఘదేవుని ప్రార్ధించారు కదా.  వర్శములేక పాడిపంటలు శూన్యమైన సమయములో సస్యసమృద్ధికి పుష్కలముగా పైరులు పండుటకు వర్షపాతము సమృద్ధిగా పెద్దల అనుమతితో ఈ వ్రతము ప్రారంభించిరి.  కావునా ఇలా ప్రార్ధించారు. మరి ఈ పాశురము లో ఏమనుకుంటున్నారో మన గోపికలు తెలుసుకుందామా.
మాయనై మన్ను వడమదురై మైందనై పాశురము:
మాయనై మన్ను వడమదురై మైందనై

తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్



மாயனை மன்னுவட பாடல் வரிகள்:


மாயனை மன்னுவட மதுரை மைந்தனை(த்)
தூய பேரு நீர் யமுனை(த்) துறைவனை
ஆயர் குலத்தினில் தோன்றும் அணி விளக்கை(த்)
தாயை(க்) குடல் விளக்கம் செய்த தாமோதரனை(த்)
தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி(த்) தொழுது
வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க(ப்)
போய பிழையும் புகுதருவான் நின்றனவும்
தீயினில் தூசாகும் செப்பேலோர் எம்பாவாய் 



Lyrics of Maayanai Mannu :

maayanai mannu vada madhurai maindhanai(th)
thooya peru neer yamunai(th) thuRaivanai
aayar kulaththinil thOnRum aNi viLakkai(th)
thaayai(k) kudal viLakkam seydha dhaamOdharanai(th)
thooyOmaay vandhu naam thoomalar thoovi(th) thozhudhu
vaayinaal paadi manaththinaal sindhikka(p)
pOya pizhaiyum pugudharuvaan ninRanavum
theeyinil thoosaagum cheppElOr empaavaai


తాత్పర్యము:
 మనము సక్రమముగా పూర్తిచేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనము చేసిన పాపములాటంకములు కావచ్చునని భయపడనవసరము లేదు.  ఎందుచేతనంటే  శ్రీ కృష్ణుడే మన ఈ వ్రతానికి కారకుడు మరియు నాయకుడు. అతని గుణములు ఆశ్చర్యకరములైనవి.  అతని పనులు కూడా అట్టివే.  ఉత్తరమున మధురానగరమునకు నిర్వాహకుడుగా జన్మించినాడు.  నిర్మలమైన జలముగల యమునానది ఒడ్డున నివసించుచు మనకొరకు యదుకులమందున అవతరించిన మహానుభావుడు.  తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు.  అంతటి మహాత్ముడి ఉండి కూడా ఆమెచే త్రాటితో కట్టబడిన సౌలభ్య మూర్తి.  కనుక మనము సందేహములను వీడి పరిసుద్దములై అతనిని సమీపించి పరిసుద్దమైన వికసించిన హృదయకుసుమమును సమర్పించి నోరార పాడాలి.  నిర్మలమైన మనస్సుతో ద్యానిమ్చాలి. అంతటనే వెంటనే ఇంతకుముందు పాప సమూహము రాబోవు పాపముల సమూహము మంటలో పడిన దూది వలె భస్మము అయిపోతాయి.  మన వ్రతమునకు ఆటంకములుకలుగవు.

మంగళవారం, డిసెంబర్ 18, 2012

తిరుప్పావై (ఆళి మళైక్కణ్ణా) 4వ పాశురము

మంగళవారం, డిసెంబర్ 18, 2012

గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడిపంటలతో సమృద్దిగా వుండాలని కోరుకున్నారు. తన వ్రతముకు స్నానము ప్రదానము కావున స్నానము చేయుటకు అనుగుణముగా జలమును సమృద్దిగా ఉండవలెను అని భావించినారు.  ఈ వ్రతమునకు ఫలముగా అనుకుని వేరే వాటిని ఆశ్రయించక భక్తి తో భగవంతుని వినయ విదేయత కలిగివున్నారు .  వానదేవుని ఈ పాసురములో ప్రార్ధిస్తున్నారు.  మరి ఈ పాసురము లో ఎలా అడుగుతున్నారో తెలుసుకుందాము.
ఆళి మళైక్కణ్ణా! పాశురము:

ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్

ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్



ஆழி மழை கண்ணா பாடல் வரிகள்:
ஆழி மழை(க்) கண்ணா ஒன்று நீ கை கரவேல்
ஆழி உள் புக்கு முகந்து கொடு ஆர்த்து ஏறி
ஊழி முதல்வன் உருவம் போல் மெய் கறுத்து(ப்)
பாழிய் அம் தோளுடை(ப் ) பற்பனாபன் கையில்
ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்று அதிர்ந்து
தாழாதே சார்ங்க முதைத்த சர மழை போல்
வாழ உலகினில் பெய்திடாய் நாங்களும்
மார்கழி நீராட மகிழ்ந்தேலோர் எம்பாவாய் 


Lyrics of Azhimazhai Kanna:
aazhi mazhai(k) kaNNaa onRu nee kai karavEl
aazhi uL pukku mugandhu kodu aarthu ERi
oozhi mudhalvan uruvam pOl mey kaRuththu(p)
paazhii am thOLudai(p) paRpanaaban kaiyil
aazhi pOl minni valamburi pOl ninRu adhirndhu
thaazhaadhE saarnga mudhaiththa sara mazhai pOl
vaazha ulaginil peydhidaay naangaLum
maargazhi neeraada magizhndhElOr empaavaai

తాత్పర్యము 
గంభీరమైన స్వభావము కలవాడైన వర్షము కురుయునట్టి ఓ మేఘదైవతమా!  నీవు వర్షజలముననుగ్రహించు దాత్రుత్వములో ఏ మాత్రము సంకోచము చూపించకు.  గంభీరమైన సముద్రము మద్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాసమునంతను వ్యాపింపచేయును.  సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరమువలె దివ్యమైన నల్లని స్వరూపమును ధరించి ఆభగవంతుని సుందర విశాల దీర్గబాహువుల జంటలో కుడిచేతి యందలి చక్రాయుధమువలె మెరయుచు ఎడమచేతి యందలి శంఖము వలె మధురగంభీరముగా ఉరిమి ఆ భగవంతుని శారంగమను ధనుస్సు నుండి వెడలివచ్చు బాణములవలె వర్షదారాలు  లోకమునంతను సుఖింపజేయునట్లును.  మేము సంతోషముతో మార్ఘశీర్ష స్నానము చేయునట్లు వర్షించు. అని అండాళ్ళమ్మ ఈ పాశురములో ప్రార్దించుచున్నది.  

మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం

మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం
మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం.

శిరమునందున మెరయుచుండెడి నెమలిపించకు మంగళం
శ్యామలాంగుని కరములందలి మదురమురళికి మంగళం
మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం
మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం.

వనజగమ్మును దిక్కరించెడి వదనశోభకు మంగళం
కరుణరసమును చిందుచుండెడి కన్నుదోయికి మంగళం
మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం
మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం.

బ్రహ్మచేపూజింపబడిన చరణయుగళికి మంగళం
జగములన్నియు కన్నతండ్రగు చక్కనయ్యకు మంగళం
మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం
మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం.

గోపికాగణ  సేవితుడు శ్రీ గోవిందునకు మంగళం
రాధికా పరివేష్టితుండౌ రసేశ్వరునకు మంగళం
మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం
మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం.

సోమవారం, డిసెంబర్ 17, 2012

తిరుప్పావై (ఓంగి ఉలగళంద ఉత్తమన్) 3వ పాశురము

సోమవారం, డిసెంబర్ 17, 2012

రెండవ పాశురములో మనము వ్రత నీయమాలు నిర్ణయించుకున్నాము కదా.  మరి వ్రతము ఒక ఫలాపేక్ష తో చేస్తున్నాము కదా! మరి ఆ వ్రత ఫలము ఎలావుండాలి?  ఆ ఫలము ఎలావుండాలో? మూడవ పాశురము లో తెలుపుతారు మన అమ్మ గోదాదేవి .  అయితే ఈ పాశురము విశేషము కలది .  ఈ విశేష పాసురమునకు  చక్కేరపోంగాలిని స్వామివారికి  నివేదించాలి.
ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
*ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి

 నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
 తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
 ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
 పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
 తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
 వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
 నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్


ஓங்கி உலகளந்த பாடல் வரிகள்:

ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி
நாங்கள் நம் பாவைக்கு(ச்) சாற்றி நீராடினால்
தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும் மாறி பெய்து
ஓங்கு பெரும் செந் நெல் ஊடு கயலுகள(ப்)
பூங்குவளை(ப்) போதில் பொறி வண்டு கண் படுப்ப(த்)
தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பற்றி
வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள்
நீங்காத செல்வம் நிறைந்தேலோர் எம்பாவாய் 



Lyrics of Ongi Ulagalantha:
Ongi ulagaLandha uththaman pEr paadi
naangaL nam paavaikku(ch) chaatri neeraadinaal
theenginRi naadellaam thingaL mum maari peydhu
Ongu peRum senN nel oodu kayalugaLa(p)
poonguvaLai(p) pOdhil poRi vandu kaN paduppa(th)
thEngaadhE pukkirundhu seerththa mulai patri
vaanga kudam niRaikkum vaLLal perum pasukkaL
neengaadha selvam niRaindhElOr empaavaai

తాత్పర్యము
పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారము ఎత్తి బలిచక్రవర్తిని మూడు అడుగులు భూమిని దానము అడిగెను.  బలిచక్రవర్తి అలాగే అని దానము చేయగా వామనుడు మూడు పాదాలతో మూడు లోకాలను ఆక్రమించారు.  అట్టి త్రివిక్రముని దివ్యనామములను గానము చేయుచూ వ్రతనిమిత్తముగా మేము స్నానము చేయుటచే సకాలములో కావలసిన వర్షము కురిసి చక్కగా పెరిగిన వరిచేను కన్నులకానందము కలుగచేయాలి.  చేనులోని నీటిలో చేపలు యెగిరి పడుచు మనస్సును ఆకర్షించవలెను.  అన్ని పైరులును బాగుగా పెరిగి ఆనందము కలిగింపవలెను.  పాలు పితుకువారు  పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చోండి పోదుగునంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలను వర్షించవలెను.  స్థిరమైన  సంపదదేశమంతటను విస్తరింపవలేనని ఈ పాసురములోని గోదామాత కోరుచున్నది.

ఆదివారం, డిసెంబర్ 16, 2012

తిరుప్పావై (వైయత్తు వాళ్ వీర్గాళ్) 2వ పాశురం

ఆదివారం, డిసెంబర్ 16, 2012

మొదటి పాటలో తామేమి పొందదలచి ఈ వ్రతం చేయదలచుకున్నారో , ఈ వ్రతమునకు సాయపడువారు ఎవరో, ఆ వ్రతమును జేయుటకు తమకు ఏమి అధికారమో వివరించినారు. ఈ దినము ఒక కార్యము చేయ దలచుకున్నప్పుడు ముందుగా తెలుసుకోవలసినవి ఆ మూడే. ఏ ఫలము కాంక్షించి ఈ కార్యము చేయుచున్నామో తెలిసి ఫలము తప్పక పొందదగినదె అని తెలిసిన కాని కార్యము నందే వరికిని ప్రవృత్తి కలగదు. ఆ ఫలము మంచిదే అని తెలిసినా తముచేయగలమా , చేయలేమా , మద్యలో శక్తి లేక మాని నవ్వులపాలగుదురు. దానికి కావలసిన పరికరాలు సమకుర్చుకో గలమో లేమో నిర్నయిమ్చుకోవాలి . ఆ కార్యము చేయుటకు తనకు గల అధికారాన్ని తెలుసుకోవాలి .
ఇవన్నీ సమకుర్చగలది కేవలము కృష్ణుడే అని తెలిసిన నీకు అన్ని సమకురినట్లే.  దీనికి శ్రీ కృష్ణుడే ఉపాయం , శ్రీ కృష్ణుని పాడుటయే ఫలమని విశ్వసించి వానిని కైమ్కరమునదే రుచిగాగల నియామాలుందున ? అసలు నియమాలు పాటించాలా? వారు గొల్లపిల్లలు కదా ? వారికి నియమాలు ఎలాతెలియును?  వీటన్నిటికీ ఒకటే ఉపాయమున్నది. భగవంతునిపై భక్తి , పరిసుద్దమైన మనసు కలిగిన చాలు . కాని భక్తులు భాగాత్స మ్రుద్దికి భగవద్భాక్తులు ఆనందముగా కొన్ని నియమాలు పాటించుదురు .



వైయత్తు వాళ్ వీర్గాళ్ పాశురము:

వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్ 



வையத்து வாழ்வீர்காள் பாடல் வரிகள்:
வையத்து வாழ்வீர்காள் நாமும் நம்பாவைக்கு(ச்)
செய்யும் கிரிசைகள் கேளீரோ பாற்கடலுள்
பைய(த்) துயின்ற பரமனடி பாடி
நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி
மையிட்டு எழுதோம் மலரிட்டு நாம் முடியோம்
செய்யாதன செய்யோம் தீக்குறளை(ச்) சென்றோதோம்
ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி
உய்யுமாறெண்ணி உகந்தேலோர் எம்பாவாய.

Lyrics of Vaiyathu Vazhveergal:
vaiyaththu vaazhveergaaL naamum nampaavaikku(ch)
cheyyum kirisaigaL kELeerO paaRkadaluL
paiya(th) thuyinRa paramanadi paadi
neyyuNNOm paaluNNOm naatkaalE neeraadi
maiyittu ezhudhOm malarittu naam mudiyOm
seyyaadhana seyyOm theekkuRaLai(ch) chenROdhOm
aiyamum pichchaiyum aandhanaiyum kai kaatti
uyyumaaReNNi ugandhElOr empaavaai.


తాత్పర్యము :
శ్రీ కృష్ణుడు అవతరించిన కాలములో పుట్టి దుః ఖమగు ఈ ప్రపంచములో కుడా ఆనందమునే అనుభావిమ్చుచున్న వారలారా ! మేము మావ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు:-
పాలసముద్రములో ద్వానికాకుండా మెల్లగా పడుకోనివున్న ఆ పరమ పురుషుని పాదములకు మంగళము పాడదేము . ఈ వ్రతసమయములో నేతిని కాని పాలను కాని మేము ఆరగింపము . తెల్లవారు జామున స్నానము లు చేసెదము . కంటికి కాటుక పెట్టుకోము . కొప్పులో పువ్వులు ముడువము. మా పెద్దలు ఆచరించని పనులు మేము ఆచరించము . ఇతరులకు బాద కలిగించెపనులు మేము చేయము. అసత్యాలాడము. ఎచ్చటా పలుకము.ఙానులకు అధిక ధన ధాన్యాధులు తో సత్కరించుదుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షలను ఉంచుధుము. మీము ఉజ్జీవించు విధముగానీ పర్యాలోచన చేసికొనెదము. దీనిని అంతావిని మీరానదింప కోరుచున్నము.

జై శ్రీమన్నారాయాణ్ -ఆండాళ్ తిరువడిగలే శరణం  

శనివారం, డిసెంబర్ 15, 2012

తిరుప్పావై (మార్గళి త్తింగళ్) 1వ పాశురం

శనివారం, డిసెంబర్ 15, 2012

ఈ రోజు నుండి ధనుర్మాసం ప్ర్రారంభము అయ్యింది కదండి. ఈ నెలరోజులు పాశురాలు పాడతాము కదా.  అయితే మరి మొదటి పాశురం గురించి తెలుసుకుందాం.
గోపికలును గోదాదేవి ఈ వ్రతం గురించి ముందుగా వారు మార్గశిరమాసం గురించి ఆ వ్రతం చేయుటకు అనుకూలంగా వుందని కాలాన్ని వారు పొగిడారు.  తరువాత ఈ వ్రతం ఎవరు చేస్తారో దాని వల్లన కలుగు ఫలితం గురించి తెలుసుకున్నారు.  ఆవిషయాన్ని మొదటి పాశురంలో చెప్పదలచారు.  
మొదటి పాశురం నారాయణ తత్వము
మార్గళి త్తింగళ్ పాశురము :
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .



மார்கழி(த்) திங்கள் பாடல் வரிகள்:
மார்கழி(த்) திங்கள் மதி நிறைந்த நன்னாளால்
நீராட(ப்) போதுவீர் போதுமினோ நேரிழையீர்
சீர் மல்கும் ஆய்ப்பாடி(ச்) செல்வ(ச்) சிறுமீர்காள்
கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன்
ஏரார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம்
கார் மேனி செங்கண் கதிர் மதியம் போல் முகத்தான்
நாராயணனே நமக்கே பறை தருவான்
பாரோர் புகழ(ப்) படிந்தேலோர் எம்பாவாய் 


Lyrics of Margazhi Thingal:
maargazhi(th) thingaL madhi niRaindha nannaaLaal
neeraada(p) pOdhuveer pOdhuminO nErizhaiyeer
seer malgum aayppaadi(ch) chelva(ch) chiRumeergaaL
koorvEl kodundhozhilan nandhagOpan kumaran
Eraarndha kaNNi yasOdhai iLam singam
kaar mEni cengaN kadhir madhiyam pOl mugaththaan
naaraayaNanE namakkE paRai tharuvaan
paarOr pugazha(p) padindhElOr empaavaai


పాశురం తాత్పర్యము:  
ఒహ్హో మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజులు  . ఓ! అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలో సంపదలతో తులతూగుచున్న ఓ! బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్న సంకల్పమున్నచో రండు. ముందునడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపదరాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహము నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించని మనకే , మనమాపేక్షెంచు వ్రతసాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చేయుటను చూచి లోకులందరు సంతోషించునట్లు మీరు అందరూ కూడా చేరి ఈ వ్రతము చేయండి అని భావము.
జై శ్రీమన్నారాయాణ్ - ఆండాళ్ తిరువదిగళే శరణం 

శుక్రవారం, డిసెంబర్ 14, 2012

ధనుర్మాసం అనగా

శుక్రవారం, డిసెంబర్ 14, 2012

ధనుర్మాసం అనగానే అది మార్గశిరమాసం లో వస్తుందని అందరికి తెలుసు కదా మరి మర్ఘశిరమాసం వచ్చింది దనుర్మాసం కూడా మొదలు కాబోతుంది. ఎంతో విశేషమైన రోజులు.  ఈ దనుర్మాసం నెల రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి పాడిన ౩౦ పాశురాలును పాడతారు  ఇది చాలా విశేషమైననెల. 
అంత విశేషమైన ఈ నెలరోజులు చంద్రమానము బట్టి చేయుటకు గుర్తుగా ఆ నెలరోజులు ఇంటి ముంగిట పండగ వాతావరనముతో విశేషమైన ముగ్గులు పెట్టి అందులో నేలగంట పెడతారు . ఆ నెలరోజులు వైష్ణవ గుళ్ళకు వెళ్ళతారు ఈ నెలరోజులు రోజుకు ఒక పాశురమ్  చదువుతారు . ఇలా 30 రోజులు పాశురములు నివేదిస్తారు.
శ్రీశైలేశ దయాపాత్రం  ప్రవచనం 

శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్ |
యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్ ||
లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమామ్ |
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం ||


యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ

వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే |
అస్మద్గురోర్ భగవతోస్య దయైకసిన్ధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ||


మాతా పితా యువతయ స్తనయా విభూతిః 

సర్వం యదేవ నియమేన మదన్వయానామ్ |
ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం
శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా ||


భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ

శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ |
భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్
శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమ్ ||


కల్పాదౌ హరిణాస్వయంజనహితం దృష్ట్వైవ సర్వాత్మ్నాం

ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం  |
సర్వేషాం ప్రకటం విధాతుమనిశం శ్రీధన్వినవ్యేపురే
జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాముదారాంస్తుమ: ||

ఈ పాశురాలన్ని ఆండాలమ్మ తల్లి ధనుర్మాస వ్రతము చేసి రోజుకో పాశురం ఆశువుగా పాడి ౩౦ రోజులు నియమనిష్టలతో వ్రతము చేసి . ఆ పాండురంగనుని వివాహం చేసుకొని ఆయనలో ఐక్యమైనది.  అలాంటి గోదాదేవి చేసిన వ్రతము మనమూ చేద్దాం . అయితే ఆ అమ్మకు భక్తితో నమస్కార రూపమున శ్రి శ్రీ శ్రీ పరాసుర భట్తరువారు ఈ శ్లోకం తో విన్నవించారు.  ప్రవచనం 

నీలా తుంగస్తన గిరితటీ సుప్త ముద్బోధ్య కృష్ణం
పారార్ధ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్ధ మధ్యాపయంతి
స్వోచ్చిస్టాయాం స్రజి నిగళితం యా బలాత్క్రుత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః       


అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగఱ్ఱ్కు
ప్పన్ను తిరుప్పావై ప్పల్పదియం ఇన్నిశైయాల్
పాడి కొడుత్తాళ్ నర్పామాలై పూమాలై
శూడి కొడుత్తాళై చ్చోల్లు

శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్పావై
పాడియరుళవల్ల పల్-వళై యాయ్ నాడినీ
వేంగడవఱ్ఱ్కెన్నె  విది ఎన్ఱ ఇమ్మాఱ్ఱం
నాంగడవా వణ్ణమే నల్గు

శ్రీ కృష్ణ పరమాత్ములవారు నీలా దేవి యొక్క ఉన్నతమైన స్తనగిరులలో నిద్రించుచున్నారు . ఆ నిద్రిస్తున్న కృష్ణ సింహమును మేల్కొల్పినది అమ్మ గోదామాత . ఆయనికి ఉపనిషత్తు లలొ ప్రతిపాదించబడిన పరతంత్రమును పాఠమును చెప్పినది . తాను అనుభవించిన వదన మాలికతో అతనిని బంధించింది . అలాంటి అలాంటి గోదాదేవికి నా మరలా మరలా నమస్కారములు .

మనము కూడా మాయచే నిద్రించుచున్నాము. కాని పరమాత్మ నిద్రించడు , అట్టి పరమాత్మకు నిద్ర తెప్పించు సౌందర్యరాశి నీలాదేవి. ఆయనని మెల్కొల్పినధి గోదాదేవి. ఆలాంటి పరమాత్మకే  ఉపదేసించినధి ఈ గోదాదేవి. ఆమె పరమాత్మను తాను అనుభవించి విడిచిన పూమాలలతో మరియు పాశురములతో బంధించింధి.  తాను చెసిన కర్మకు ఫలితంగా పరమాత్మనే అనుభవించింధి. శ్రీ గోదాదేవి. ఈ స్థితి  కేవలము శ్రీ గోదామాతకే చెల్లినది.
ఆమె దరించిన మాల పరమాత్మ స్వీకరించుటచే ఆమెకు ఆముక్తమాల్యద" అని పేరు వచ్చినది.  మాలలు తయారు చేయువాని బిడ్డ కావునా కోదై అని అంటారు. కోదై అంటే గోదా అని అర్దం.  ఇలా భట్టనాధుని కూతురై , శ్రీ రంగనాధుని ప్రియురాలై, భగవద్రామనుజులకు అభిమాన సొదరైన ఆండాళి కు మరలా మరలా నేను నమస్కారిస్తున్నాను.
.
గోదాదేవి భగవంతుని విషయంలో ఏవిధమగు దాస్యము కోరుకున్నదో, ఆ విధముగా దాస్యము ఆమె యెడ మాకు లభించుగాక అని పరాశర భట్టారువారు ప్రార్ధించిరి.  నేను రేపు వ్రతం ఎలా చేయాలి దాని విశేషమ్ వివరిస్తాను.
అలానే మనం కూడా ఈధనుర్మాశమ్ వ్రతం చేద్దామ్.

గురువారం, డిసెంబర్ 13, 2012

కార్తీక పురాణం 30వ రోజు

గురువారం, డిసెంబర్ 13, 2012

కార్తికవ్రత మహిమ ఫలశ్రుతి నైమిశారణ్య ఆశ్రమములో శౌనికాది మహామునులకందరకు సుతమహాముని తెలియజేసిన విష్ణు మహిమలను , విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయి నోళ్ళకొనియాడిరి. శౌనికాది మునులకు ఇంకను సంశయములు తిరనందున, సుతునిగాంచి "ఓముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గ ములకు దాసులై, అత్యాచారపరులై జీవి౦చుచు సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైన కలదా?ధర్మములన్నిటిలో మోక్షసాధన కుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొంసంగు వుత్తమ దైవమెవరు?మానవుని అవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగలవుపాయమేమి? హరి నమస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈసంశాయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియజేయు" మని కోరిరి. అంత సుతుడా ప్రశ్న నాలకించి" ఓమునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకోనవలసినవి. కలియుగమందలి మానవులు మంద బుద్దులు క్షణికసుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము వలన యాగాదిక్రతువు లోనర్చిన పుణ్యము, దానధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీ మన్నారాణునకు ప్రీతీకరమైన వ్రతము ఇది అన్నివ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వర్ణించియున్నాడు. ఆవ్రత మహిమ వర్ణించుట నాకు శక్తిచాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆబ్రహ్మదేవునికి కూడా శత్యముగాదు. అయినను సుక్ష్మముగా వివరించెదను. కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్దతులనుజెప్పు చున్నాను. శ్రద్దగా అలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పని సరిగ నది స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరి హరదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చెయవలయును . ఈనెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని, శివాలయమున గాని ఆవునేతిలో దీపారాధన చెయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపటణము చెయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులరాశి యందున్న నెలరోజులు యీవిధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి వుండి కూడా ఆచరించక గాని, లేక, ఆచరించువారలను జూచియెగతాళి చేసిన గాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడినవారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతరమందు నరకములోపడి యమకింకరులచేత నానా హింసలపాలుకాగలరు. అంతియే గాక అట్టివారు నూరుజన్మల వరకు ఛ౦డాలాది హీనజన్మలెత్తుదురు.
కార్తీకమాసములో కావేరి, నదిలోగాని, గంగానదిలో గాని, అఖండ గౌతమీ నదిలో గాని స్నానమాచరించి ముందుచెప్పిన విధముగా నిష్టతో ఆచరించినవారు యిహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది. అధికఫలదాయకయైనది. హరిహరాదులకు ప్రితికరమైనది. కనుక కార్తీకమాసవ్రతము వలన జన్మజన్మలను౦డి వారలకున్న సకలపాపములుహరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీవ్రత మాచరించవలెననెది కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యేవగింపు అసహ్యము కలుగును. కాన, ప్రతిమానవుడు ఈపరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యకాలమును చెతులారావిడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారలు కార్తీక శుద్దపౌర్ణమినాడు అయినను తమ శక్తీకొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజన మిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు, చేసినచొ యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెలరోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరి నామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్ధములను సేవిస్తూ, దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈకథను చదివినవారికిని శ్రీ మన్నారాయుణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠప్రాప్తి కలుగచేయును.
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు
ఓం సర్వేషాం పూర్ణ౦భవతు ఓం శ్శాంతి శ్శాంతి::||

బుధవారం, డిసెంబర్ 12, 2012

రేడియో సంకేతాల ప్రసారం 12/12

బుధవారం, డిసెంబర్ 12, 2012

wireless receiver
12 /12 / 1901 లో అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటి మొట్టమొదట రేడియో సంకేతాలను ప్రసారం చేశారు. ఆ ప్రయోగము విజయవంతముగా పనిచేసింది.  దీంతో వైర్లెస్ పరిశ్రమలో పెద్ద మార్పు వచ్చింది. ఆ తర్వాత వైర్‌లెస్ వ్యవస్థ వలన ఎన్నో ఉపయోగాలు కలిగాయి. నేడు తీగ లేకుండా సంకేతాలు పంపుతున్న, అందుకుంటున్న టెక్నాలజీకి ఆద్యుడు మార్కొని.  ఆ రేడియోని మార్కొని కనుకున్నారు దీని వలన అప్పట్లో ఒకరినుండి ఒకరికి కమ్యునికేషనికి బాగాఉపయోగించారు. అప్పడు తయారు చేసిన రేడియో చాలాచాలా  మార్పులు చెంది నేటి FM  వరకు రూపు దిద్దుకుంది.  ఈరోజుల్లో టీవీలు వున్నా  రేడియో  అంటే ప్రజలు ఎక్కువ ఉపయోగిస్తున్నారు.  మనకు ఎక్కడ బడితే అక్కడ  రేడియో వినటానికి వీలుగా వుంది.  మనకు Online Radio లు కూడా ప్రజలుకు అందుబాటులోకి వచ్చాయి. Hats off to  మార్కొని.

Marconi Wireless Radio Wave meter

కార్తీక పురాణం 29వ రోజు

అంబరీషుడు దుర్వాసుని పూజించుట 
ద్వాదశి పారాయణము అత్రిమహాముని అగస్త్యు వారితో యీ విషముగా- సుదర్శన చక్రము అంబరీషునకభయమిచ్చి వుభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైనవైనము చెప్పి తిరిగి ఇట్లు నడువనారంభించెను. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సు పైజల్లుకొని, " ఓమునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను నాశక్తికొలది నేను శ్రీ మన్నారయణుని సేవింతును, ద్వాదశివ్రతము జేసుకోనుచు ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నావలన మీకు సంభవించిన కష్టమునకు నన్నుమన్ని౦పుడు. మీయెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్య మివ్వవలయునని ఆహ్వానిన్చితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించినన్నును, నావంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్రహృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించనను మరల నాగృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుధర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీవుపకరమును మరువలేకున్నాను. మహానుభావా! నా మనస్సంతోషమచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నానోట పలుకులురాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనందబాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుండును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నరజన్మ రాకుండా వుండేట్లును, సదా, మీ బోటి ముని శ్రేష్ఠులయందును- ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గల వాడనై యుండునట్లును నన్నశిర్విదించుడని ప్రార్ధించి, సహా ప౦క్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి " రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువుల కైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమాన మని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు తండ్రితో సమానుడవైనావు. నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు ఆయుక్షీణం కలుగును.

అందుచేత నీకు నమస్కరించుటలేదు. నీకోరిక యీస్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్రయేకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభావిన్చితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివేదిక్కయితివి. నీతో భోజనము చేయుట నాభాగ్యముగాక, మరొకటి యగునా?" అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగంచి, అతని భక్తి ని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవుపొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను. ఈ వ్రుతాంత్త మంతయు కార్తిక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది.
 ఓ అగస్త్యమహాముని! ద్వాదశివ్రత ప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణు మూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్నమనస్కుడై చేసిన పుణ్యము యితర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తిక శుద్ధయేకదశి రోజున శుష్కోపవసము౦డి పగలెల్ల హరి నామ సంకీర్తన చే గడిపి ఆరాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూజాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీ మన్నారయణుని ప్రీతీ కొరకు దానము లిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీవ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీ మన్నానారయుణుకు ప్రీతీకరమైన దినము కనుక ఆనాడు ద్వాదశిఘడియలు తక్కువగా యున్నాను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను. ఎవరికైతే వైకుంటములో స్థిర నివాస మేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టివారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి ప్రీతీకరమగు కార్తికశుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కర మైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింపకూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్ష మైన విధముగా కార్తీక మాసములో నియమాను సారముగ జేసినాయేకొంచము పుణ్య మైనను, అది అవసానకాలమున యమదూతల పలుక నీయకకాపాడును. అందులకే యీ కార్తిక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును- అని అత్రి మహాముని అగస్త్యనకు బోధించిరి.

మంగళవారం, డిసెంబర్ 11, 2012

కార్తీక పురాణము 28వ రోజు

మంగళవారం, డిసెంబర్ 11, 2012

విష్ణు సుదర్శన చక్ర మహిమ
జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు ఆలోచింపక మహాభక్తునిశుద్ధని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను. అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణునికడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపదుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి " అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నాపైగల అనురాగముతో ద్వాదశి పారాయణ మునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయతలపెట్టితిని. గాని నాదుర్బద్దినన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్ద మైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని. ఆ పురాణపురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్దకేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడనైనను నీనిష్కళంక భక్తి ముందవియేమియు పనిచెయలేదు. నన్నివిపత్తు నుండి కాపాడు " మని అనేక విధాల ప్రార్ధoచగా, అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,"ఓ సుదర్శన చక్రమా! నీకివే నామన: పూర్వక వందనములు. ఈ దూర్వాసమహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొనితెచ్చుకొనెను. అయినను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు, ఒకవేళ నీకర్త వ్యమును నిర్వహింపతలచితి వేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీ మన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీ మన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనెక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే యీదుర్వాసుడు ముల్లో కములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకొటులన్నియు ఒక్కటిగా యేకమైన నూ నిన్నేమియు చెయజాలవు, నీ శక్తికి యేవిధ మైన అడ్డునూలేదు. ఈ విషయములోక మంతటికి తెలియును. అయిననుముని పుంగవునికి యేఅపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్దoచుచున్నాను. నీయుందు ఆ శ్రీ మన్నారాయణుని శక్తి యిమిడి యున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణువేడిన యీదుర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రా యుధము అంబరీషుని ప్రార్దనలకు శాంతించి" ఓ భక్తగ్రేశ్వరా ! అంబరీషా! నీ భక్తీ ని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహా పరాక్రమవంతులైన మధుకైటభులను- దేవతలందరు యెకమైకూడ- చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును.

ఇది యెల్లరకు తెలిసిన విషేయమే, ముక్కోపియగు దుర్వాసుడు నీపైపగబూని నీ వ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్ట వలనని కన్నులెర్ర జేసినీమీదజూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిర పరాధవగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మ తేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తీలో నాకంటె యెక్కువేమియుగాదు. సృషికర్త యగు బ్రాహ్మతేజస్సు కంటెను,కైలాసవతియగు మహేశ్వరునితే జశ్శక్తి కంటెను యెక్కువ మైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతొ రుద్రతేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియతేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నే దుర్కొన జాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్త మము. ఈనీతిని ఆచరించు వారాలు యెటువంటి విపత్తుల నుండి అయిన ను తప్పించుకోన గలరు. ఇంత వరకు జరిగిన దంతయు విస్మరించి, శరణార్దమై వచ్చిన ఆదుర్వాసుని గౌరవించి నీధర్మము నీవు నిర్వరింపు" మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవగో , బ్రాహ్మణాదుల యుందును, స్త్రీ లయందును, గౌరవము గలవాడను. నారాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవులేనునియే నాయభిలాష . కాన, శరణు గోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్ని దేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేకమైన నూ నీ శక్తీకి, తేజస్సు కూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ - గో - బ్రాహ్మణ హింసా పరుల పై నిన్ను ప్రయోగించి, వారిని రక్షించి, తనకుక్షియుందున్న పధాలుగులోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నికివే నామన: పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రా యుధ పు పాదముల పైపడెను. అంతట సుదర్శన చక్రము అంబరీ షుని లేవదీసిగాడాలింగన మొనర్చి " అంబరీషా! నీనిష్కళంక భక్తి కి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరుపరింతురో, యెవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్దిచేసుకొందురో, యెవరోపరులను హింసించక - పరధనములను ఆశ పడక- పరస్త్రీలను చెరబెట్టిక - గోహత్య - బ్రాహ్మణహత్య- శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములునశించి, యిహమందున పరమందున సర్వ సాఖ్యములతో తులతూగుధురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీద్వాదశి వ్రతప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు యీమునిపుంగవునిత పశ్శక్తి పని చేయలేదు ." అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యామమ్యెను.

సోమవారం, డిసెంబర్ 10, 2012

How many animals are there?

సోమవారం, డిసెంబర్ 10, 2012

Here is a optical illusion. How many animals are there?

కార్తీక పురాణం 27వ రోజు

దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట:  
మరల అత్రిమహాముని అగస్త్యునకిట్లు వచించెను- కుంభసంభవా! ఆ శ్రీహరి దుర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను ఇట్లు చెప్పెను. "ఓ దుర్వాస మహాముని ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆపది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము లెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెనుగాన, అందులకు నేనంగికరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతా క్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై  ప్రాయోపవేశ మొనర్పనెంచినాడు. ఆ కారణమూ వలన విష్ణు చక్రము నిన్ను భాదింపబూనెను. ప్రజారాక్షనమే రాజు ధర్మముగాని, ప్రజా పీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించాకూడదు. బ్రాహ్మణా యువకుని దండించుట కంటే పాతకములేదు. విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును. బ్రాహ్మణ హితకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాళ్ళతో తన్నినవాడును, విపర ద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును, విపర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మ హ౦తుకులే అగుదురు. కాన, ఓ దుర్వాస మహర్షి! అంబరీషుడుని గురించి - తపశ్శాలియు, విప్రోత్త ముడును అగు దుర్వాసుడు నామూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో ! నేను బ్రాహ్మణ హంతకుడ నాయితినే- యని పరితాపము పొందుచున్నాడు కా బట్టి, నీవు వేగమే అబరిషుని కడకేగుము అందువలన నీవుభయులకు శాంతి లభించును" అని విష్ణువు దుర్వసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)