Blogger Widgets

ఆదివారం, ఏప్రిల్ 28, 2013

నాతో మాట్లాడాలి అంటే

ఆదివారం, ఏప్రిల్ 28, 2013

ఎన్నో అద్భుతమైన ప్రశ్నలతో  , సరదా సరదా ముచ్చట్లుతో  ,  
కధలు - పద్యాలు- ఆటలు, మీరు కోరిన పాటలతో ,  
మీతో సరదాగా మాట్లాడేస్తూ రోజు అంతా సంతోషంగా వుంచటానికి 
మీ ముందుకు వచ్చేస్తున్నాను. 
మీ చిన్ని  RJ Sree Vaishnavi ని .  ఎలా అంటే 
ప్రతీ ఆదివారము    05:00 pm to 6:00 pm వరకు 
మీ అభిమాన online RadioJoshLive Masth Maza Masth Music :)   లో.   
నాతో మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారు కదా!  
మరి నాతో మాట్లాడాలి అంటే ఈ నంబర్స్ కి కాల్ చేయండి. 
INDIA= +91 04042410008

USA = +19142147574
Skype Me™!
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com
నేను మీతో మాట్లాడటానికి రడీగా వుంటాను మరి మీరు కూడా నాతో మాట్లాడటానికి రడీనా.
Stay tune with 
  Masth Maza Masth Music. 

గురువారం, ఏప్రిల్ 18, 2013

శ్రీ సీతారాముల కల్యాణం చూతం రారండి

గురువారం, ఏప్రిల్ 18, 2013


శ్రీ సీతారాముల కల్యాణం చూతం రారండి
శ్రీ రాముడు రోజున జన్మించిన రోజును  మనము శ్రీ రామ నవమి జరుపుకుంటున్నాము. సీతారాముల కల్యాణం మహోత్సవం , శ్రీ రామ చంద్రమూర్తి రావణుని వధించి విజయవంతముగా అయోధ్యకు తిరిగివచ్చిన రోజు కుడా ఈ రోజే. ఆ మరుసటి రోజునే శ్రీ రాముని పట్టాభిషేకము జరిగింది. ఇది ప్రతీ హిందువు కు మరపురాని సంతోషకరమైన రోజు .
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

మానవునిలో ప్రవర్తనలో ఏ శుభలక్షణాలు౦టే లోకకళ్యాణ౦ జరుగుతు౦దో అలా౦టి మంచి శుభలక్షణ స౦పన్నుడు శ్రీరాముడు. సీతారాములు ఇరువురివి యజ్ఞ స౦బ౦ధమైన జన్మలే. అలా౦టి సీతారాముల కళ్యాణ౦ లోక కళ్యాణ౦.
చైత్రశుధ్ధ నవమి పునర్వసు నక్షత్రాన మధ్యాహ్నవేళ, కర్కాటక లగ్న౦లో సూర్యుడు మేష౦లో ఉ౦డగా, ఐదుగ్రహాలు ఉచ్ఛస్థాన౦లో ఉ౦డగా శ్రీరామావిర్భావ౦ జరిగి౦ది.  ఐదు గ్రహాలు ఉచ్ఛలో ఉ౦టే లోకనాయకుడు అవుతాడని అర్ధ౦. శ్రీరాముడు లోకోత్తర నాయకునిగా అవతరి౦చాడు. శ్రీరాముడు అవతరి౦చి ఒక కోటి 81 లక్షల 50 వేల స౦వత్సరాలు అయినట్లు ప౦డితులు పరిశోధి౦చి చెప్పారు. అయినా నేటికీ శ్రీరాముని ఆరాధన జరుగుతో౦ద౦టే ఆ అవతార వైశిష్ట్యాన్ని గుర్చి౦చవచ్చు.
మహిమాన్విత శ్రీరామనామ౦: 
ర - ఆత్మ
మ - మనస్సు
ర - సూర్య బీజ౦ - అజ్ఞానాన్ని పోగొడుతు౦ది
అ - చ౦ద్ర బీజ౦ - తాపాన్ని పోగొడుతు౦ది్.
మ - అగ్ని బీజ౦ - పాపాన్ని భస్మ౦ చేస్తు౦ది.  
రా - అ౦టే పురుషుడు
మ - అ౦టే ప్రకృతి

పురుషుడు ప్రకృతి కలిస్తేనే ఈ సర్వ ప్రప౦చ౦ ఏర్పడి౦చి. ఈవిధ౦గా రామ శబ్దానికి నిత్యసత్యమైన పరబ్రహ్మ౦ అని అర్ధ౦. విశ్వమ౦తా పరబ్రహ్మస్వరూపమే కాని మరొకటి లేదు. సమగ్ర ఐశ్వర్య౦, ధర్మ౦, కీర్తి, స౦పద, జ్ఞాన౦, వైరాగ్య౦ ఈ ఆరు గుణాల సమన్విత రూప౦ ధరి౦చినవాడే ఆ శ్రీరామచ౦ద్రమూర్తి. సకల సద్గుణ కరమై౦ది శ్రీరామనామ౦. రామోచ్ఛారణే సర్వపాప నివారక హేతువని విజ్ఞులు పలికారు. అ౦దుకని సర్వులూ ఆ స్వామి నామాన్ని జపి౦చి తరి౦చాలి. అ౦తేకాక
రామలో రా అ౦టే రావణ అని, మ అ౦టే మర్దన అని అర్ధ౦ స్ఫురిస్తో౦ది. అ౦టే రావణ మర్దనుడే రామ అన్నమాట. రావణుడ౦టే కామక్రోధాది దుర్గుణ స్వభావ౦. కనుక ఆ దుర్గుణాలను పోగొట్టేది శ్రీరామ పవిత్రనామార్ధ౦ అని మన౦ స౦భావి౦చుకోవచ్చు.
రాఅనే అక్షర౦ పలుకగానే నోరు తెరుచుకొని మనలోని దోషాలు, పాపాలు వెలికిపోతాయి. అనే అక్షర౦ పలుకగానే నోరు మూసుకొని మనల్ని దోష రహితులుగా చేస్తు౦ది. అ౦దుకే రామ అనేది బీజాక్షర యుక్తమైన మ౦త్ర౦.
రాముని వ౦టి ఏకపత్నీవ్రతుడు, రాముని వ౦టి కొడుకు, రాముని లా౦టి భర్త, రాముని లా౦టి అన్న, రాముని లా౦టి స్నేహితుడు, రాముని లా౦టి రాజు ఈ విశ్వప్రప౦చ౦లో నాటిను౦డి నేటి వరకు లేడ౦టే అతిశయోక్తి లేదు.
శ్రీమద్రామాయణానికి ర౦గుల హరివిల్లు శ్రీరాముని గుణ ఔన్నత్యమే. సీతమ్మ తల్లిని తప్పి౦చి స్వప్నమ౦దైననూ అన్య స్త్రీ ఆలోచన ఆ అవతార పురుషునికి వచ్చినట్లు ఎక్కడా లేదు తన భార్య కాక మిగిలిన స్త్ర్రీల౦దరూ మాతృసమాన౦గా ఆదరి౦చబడ్డారు శ్రీరామునిచే. అ౦దుకనే శ్రీరామచ౦ద్రుని వ౦టి భర్త రావాలని ప్రతి కన్య ఆశ పడుతో౦ది.
శ్రీరామునిలో మరో సుగుణమేమ౦టే శరణుకోరిన వారిని క్షమి౦చడ౦. అన్యధా శరణ౦ నాస్తి అనే వారిని వారి పూర్వాపరాలు విచారి౦చక, క్షమి౦చి, కోరిన వరాలిస్తాడు. విభీషణుడు శరణు వేడితే క్షమి౦చి, గౌరవి౦చి, స్నేహితునిగా స్థానమిచ్చి రాజ్యాభిషిక్తుని చేస్తానని వరమిచ్చి ఆప్రకారమే చేశాడు.
యజ్ఞపురుషుడు ప్రసాది౦చిన పాయసఫల౦గా శ్రీరామచ౦ద్రుడు అవతరిస్తే, యజ్ఞ నిర్వహణకై భూమిని శుద్ధి చేసేటప్పుడు నాగేటి చాలులో దర్శనమిచ్చిన పరమపావని సీత ఆమె జనకుని తనూజకాదు. జనకాత్మజ, అయోనిజ.
యాగరక్షణకోస౦ విశ్వామిత్రుని అనుసరి౦చిన శ్రీరాముడు ఆ మహర్షి వె౦ట మిథిలానగానికి వెళ్ళాడు. అక్కడ జనక మహారాజు విశ్వామిత్రునికి, శ్రీరామలక్ష్మణులకు శివధనస్సును చూపి, దాని విశేషాలను తెలియజేస్తాడు. దానిని ఎక్కుపెట్టినవానికి తన కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేస్తాన౦టాడు. విశ్వామిత్రుని ఆదేశ౦తో శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టే ప్రయత్న౦ చేశాడు. అలా ఎక్కుపెట్టిన విల్లు ఫెళ్ళుమని విరిగి౦ది. సీతారామ కళ్యాణానికి మార్గ౦ సుగమ౦ అయి౦ది.

శివధనస్సు అనేది మాయకు ప్రతీక. శ్రీరామ చ౦ద్రుడు ఆ ధనస్సును నిలిపి తాను మాయను భరి౦చగలనని నిరూపి౦చాడు. ఆ ధనస్సును త్రు౦చి తాను మాయను లోబరచుకొన్నవాడు మాధవుడు. మాయను జయి౦చిన మానవుడు మాధవుడౌతాడు. అతనిలో దాగియున్న దివ్యత్వ౦ అప్పుడు ఆవిష్కరి౦పబడుతు౦ది. యజ్ఞపరమైన కార్యాచరణ దివ్యత్వానికి ఫల౦. అ౦దువల్ల లోకకళ్యాణ౦ జరుగుతో౦ది.
రామాయణంలో ధర్మనిరతి, ఉత్తమమైన వ్యక్తులు పాటించవలసిన నీతి ప్రధానంగా కనిపిస్తాయి. సేవకుడు ఎలా ప్రవర్తించాలి, కొడుకు ఎలా నడుచుకోవాలి, తమ్ముడు ఎలా నడచుకోవాలి, రాజు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి - వంటి నియమాలు రామాయణంలో కధాపరంగా వివరింపబడినాయి. మనకు రమాయణం ద్వారా మంచివిషయాలు తెలుస్తాయి. రామాయణము మనకు ఆధర్శంగావుంటుంది కదా.
అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

ఆదివారం, మార్చి 24, 2013

నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారా

ఆదివారం, మార్చి 24, 2013

హాయ్! 
ఎన్నో అద్భుతమైన ప్రశ్నలతో , సరదా సరదా మాటలతో , కధలు - పద్యాలు- ఆటలతో, మీరు కోరిన పాటలతో , మీతో సరదాగా మాట్లాడేస్తూ మిమ్మల్ని నవ్వుకునేలా, రోజు అంతా సంతోషంగా వుంచటానికి మీ ముందుకు వచ్చేస్తున్నాను మీ చిన్ని RJ Sree Vaishnavi ని . ఎలా అంటే 
ప్రతీ ఆదివారము 10:00 am to 11:00 am వరకు 
మీ అభిమాన online రేడియో RadioJoshLive Masth Maza Masth Music :) (http://www.radiojosh.com/) లో నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా!
మరి నాతో మాట్లాడాలి అంటే ఈ నంబర్స్ కి కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడే యండి . 
INDIA= +91 04042410008
USA = +19142147475
Skype Me™!
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com
ధన్యవాదములు

శనివారం, ఫిబ్రవరి 16, 2013

ఆదిదేవ నమస్తుభ్యం

శనివారం, ఫిబ్రవరి 16, 2013


నమస్కారిస్తే ఆయురారోగ్యాలు, అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు సూర్యడు.
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమమ భాస్కర
దివార నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ll

ఓ ఆది దేవా ! నీకు నమస్కారము. భాస్కరా! నన్ను కరిణిమ్చు. ప్రభాకరా నీకు ప్రణామములు అంటు సూర్యునికి ప్రతినిత్యము నమస్కారములు చేస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిసే చాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్షభగావానుడు సూర్యుడు.
మాఘమాసములో వచ్చే శుద్ధ సప్తమి తిధి కి రధసప్తమి అను పేరు. ఇది సూర్యునికి సంబందించిన రోజు . ఇది ముఖ్యముగా సూర్యభగవానుని ఆరాధించు పండుగ. ఈ రోజు సూర్యడు తన రధమును ఉత్తరం దిక్కునకు మళ్ళించే రోజు.
ఈ పర్వదినము రోజు కుటుంబములోని వారందరూ తెల్లవారుజామున నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని జిల్లేడు ఆకుల్ని భుజాలమీద , తలమీద పెట్టుకొని
"జనని త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే, సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సుర్యమాతృకే "
అనే మంత్రముతో స్నానము చేయాలి, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి అర్గ్యమిస్తే అస్తిస్వర్యములిస్తాడు.
జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.

తులసి కోటని పసుపు, కుంకుమ లతో అలంకరించి, తులసికోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రముతో బొమ్మ ముగ్గు పెట్టాలి . ముగ్గుమీద ఆవు పిడకలతో కుంపటి ఏర్పరచి దానిమీద గిన్నెలో అన్నం పాయసము వండాలి. కొత్త గిన్నెకి పసుపురాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవుపాలను మూడుసార్లు పొంగించి , కొత్త బియ్యము, పటికబెల్లము, యాలకులపొడి చేర్చి , నెయ్యి వేసి చక్కగా వుడికించి పాయసముచేయ్యాలి.
పాలు మూడు సార్లు పొంగటమువల్ల ఇంట్లో సిరిసంపదలు పోంగిపోర్లుతాయని నమ్మకము వుంది.
చిక్కుడు కాయలకి చీపురుపుల్లలు గుచ్చి చేసిన రధమును ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరచి అందులో ఉడికించిన పాయసమును వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రునికి ఐదు ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి ఐదు , మిగతా ఐదు సుర్యభాగావానునికి నివేదించాలి. సూర్యునికి గంధ , పుష్ప, అక్షతల, షోడపోచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆయనికి ప్రదక్షణాలు చేసి నమస్కారము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది.
సాయమ్త్రము సూర్యుని గుడికి వెళ్లి నమస్కరించాలి.
రధ సప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను, పంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏ డురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు,శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.
బ్లాగ్ మిత్రులందరికి  రధసప్తమి శుభాకాంక్షలు 

శనివారం, జనవరి 12, 2013

తిరుప్పావై 29 & 30వ పాశురము

శనివారం, జనవరి 12, 2013

మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షము నకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి. కాని వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు . శ్రీ కృష్ణునితో కలసి మరి ఎడబాటు లేకుండా వానికి కింకర్యము చేయవలెనని కాంక్షిస్తున్నారు. స్నానమను చోట భగవదత్ప్రాప్తి యనియు పరయను చోట భగవత్ కైంకర్యము అనేది పరమ పురుషార్దము అని అభిప్రాయము వచ్చునట్లు వారిమ్తవరకు మాట్లాడుతున్నారు. ప్రధానంగా తెలుసుకోవలసినవి రెండు విషయాలున్నవి ఇరవైఎనిమిది , ఇరవై తొమ్మిదో పాశురాలలో వివరించి వ్రతమును పుత్ర్తి చేస్తున్నారు. ముప్పైవ పాసురములో ఫలశ్రుతి.
దటి పాసురమున గోపికలు ఈ వ్రతమును ప్రారంభించారు.


అయితే గోపికలు ఈ పాసురములో తమ హృదయము నావిష్కరిమ్చి తమ వ్రతమును సమాప్తము చేసి మనము కూడా తరించవలెనని ఈ పాశురములో స్పష్టముగా వివరించినారు.



శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్ పాశురము :
శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్
పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ
కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;
ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,
మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్



తాత్పర్యము: 
బాగా తెల్లవారకముందే నీ వున్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపువ్వులవలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ఫ్రయోజనమును వినుము, పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములయిన కోరికలేవియు లేకుండునట్లు చేయుము.



ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతం బాగా చేసుకున్నాము కదా ఈ రోజు ఆకరి పాసురము.  ఈ వ్రతము సర్వఫలముల నొసంగు నది. అందరు ఆచరించదగినది. ఇట్టి ఈ వ్రతము నాచరింపలేక పొయినను నిత్యము ఈ ముప్పై పాశురములు తప్పక అభ్యాసము చెయువారికి కూడా తాను చేసిన వ్రత ఫలము లభించాలని గొదాదెవి ఈ పాసురములొ ఆశించినది నిత్యము ముప్పై పాసురాలు చదువుటయే ముక్తికి హేతువు . ఈ లోకమున ఐశ్వర్యప్రధము అగు ఇట్టి వ్రతమును తప్పక అందరు ఆచరించి తరింతురుగాక.
గోదాదేవి తాను గోపికగనే వ్రతమునుచెసినది. ఫలము భగవత్ప్రాప్తి , అట్టి భగవానుడే పొదుటకై చేసినయత్నము పాల సముద్రమును ఆనాడు మధించుటలో కాననగును. మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చే
యుటకంటె స్వామియే మనము పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమౄతమధన వృతాంతము నిందు కీర్తించుచున్నారు. ఈ ముప్పై పాశురములు పఠించిన వారికి ఆనాడు పాలసముద్రమును మధింపచెసిన లక్ష్మి ని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నంచి పొందును. ఇల్లా ఫలశ్రుతిని ఈ పాశురములో చేయుబడుచున్నది.


వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై పాశురము: 
వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జ్
అఙ్గప్పఱైకొణ్డవాత్తై , యణిపుదువై
పైఙ్గమలత్తణ్డెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న
శఙ్గత్తమిళ్ మాలై పుప్పదుం తప్పమే
ఇఙ్గిప్పరిశురై ప్పారీరిరణ్డు మాల్వరైత్తోళ్
శెఙ్గణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గుం తిరువరుళ్ పెత్తంబురువ రెంబావయ్.

తాత్పర్యము:
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపచేసిన లక్ష్మీ దేవిని పొం మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కుడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగువారును, విలక్ష్నణాభరణములు దాలిచిన వారు అగు గోపికలు చేరి , మంగళము పాడి, పఱ అను వాద్యమును లోకులకొరకును, భగవద్దస్యమును తమకొరకు ను పొందిరి . ఆ ప్రకారము లొకమునంతకును లోకమునకు ఆభరణమైఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామర పూసలమాలను మెడలొ ధరించిఉండు శ్రీ భట్టనాధుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పై పాశురములలో మాలికగా కూర్చినది.

ఎవరీ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో , వారు ఆనాడు గోపికలా శ్రీ కృష్ణుని నుండి పొందిన ఫలమును గూడ పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే , పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బాహుశిరస్సులు గలవాడును అగు శ్రీ వల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాధించును. అని ఫలశ్రుతి పాడిరి.


సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు
ఆండాళ్ తిరువడి గళే శరణం 

 జై శ్రీమన్నారాయణ్ 
సర్వేజనా సుఖినో భవంతు 
ఓం శాంతి శాంతి శాంతీః 

బోగి పండగ శుభాకాంక్షలు

గోదాదేవి గోపిక  నాడు ఆచరించిన వ్రతమును తానూ అనుకరించి వ్రత సమాప్తి చేసి వ్రతఫలమును తానుకూడా పొందినదిశ్రీ కృష్ణసమాగామంమును ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి తన ప్రియతముడగు శ్రీ రంగానాధుని భర్తగా పొందినది . శ్రీరంగమునుండి రంగనాధుడు వ్రత సమాప్తి సమయమునకు తమ అంతరంగా భక్తులను ఆండాలమ్మ యుండిన శ్రీ విల్లిపుత్తురునకుపంపి ఆమెను శ్రీ రంగమునకు తోడి తెమ్మని ఆజ్ఞాపించెను .అంత భట్తనాదులు వారి శి ష్యులు వల్లభారాయులుతో సహా శ్రీరంగమునకు ఆండాల్లమ్మను తోట్కుని వెళ్ళెను .అచట శ్రీ రంగనాధ స్వామీ అందరి సమక్షములో శ్రీ గోదాదేవినితనలోచేర్చుకున్నారుఅందుచే గోదారంగానాయకుల కళ్యాణ దినమునకు భోగి ఆని పేరు .
భోగము = పరమాత్మ అను భావము  
అది పోందినరోజును భోగి పండుగగా సార్ధకమైనది .
 మూడురోజులు పండుగ చాలా బాగాజరుపుకుంటారుఅసలైతే  నెలరోజులు పండుగ వాతావరణమే వుంటుంది .  చలి ఎక్కువుగాఉంటుంది నెలరోజులు తెలుగువారి లోగిలి చాలా అందముగా ముస్తాబవుతుంది . ప్రతీ ఇంట రంగురంగుల ముగ్గులతో చక్కనివాతావరనముతో ముచ్చట గొల్పుతూ వుంటాయి రంగుల ముగ్గు మద్యలో గొబ్బెమ్మలు ను అలంకరించుతారుసాయంత్రముసమయాలలో పోలాల్లోనుమ్డి బళ్ళు ధాన్యపు బస్తాలతో నిండి వస్తాయిచాలా ఆనందముగా సందడిగా ఉంటుంది .  నెల రోజులు.నెల రోజులుపగటి వేషగాళ్ళుహరిదాసులు ,గంగిరేద్దులువాళ్ళు వస్తూవుంటారు .

 భోగి రోజు తెల్లవారుజాముననే లేచి నలుగు పెట్టుకొని స్నానాలుచేసి భోగి మంటను వెలిగిస్తారు .  భోగి మంట లో పాత కర్రసమానులు వంటివి పనికిరాని వన్ని వేసి చలిని పారగోలుపుతారు పెద్ద పండగకి కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి తప్పకుండా వస్తారు.బావా మరదళ్ల ఆటలు అల్లర్లుతో పండుగ చాలా సంతోషకరమైన శోభ తో ఉంటుంది పండుగని రైతుల పండుగ అని కుడా అంటారు.
 పండుగకి ముగ్గులులో గొబ్బెమ్మలు పెడతారు వాటి చుట్టూ పిల్లలు అన్నమాచార్య రచించిన గొబ్బెమ్మల పాటలు పాడతారు.                   

కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో

కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో

దండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో

పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో

దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో

అనే పాటలు పాడుతూ వాటి చుట్టూ తిరుగుతారుసాయంత్రము సమయములో చిన్నపిల్లలకు బోగిపల్లును దిస్తితీసి వారి తలమీదపోస్తారుదీనికి పెరంటాల్లను పిలిచి బోగిపళ్ళు పోస్తారు బోగిపల్లలోకి శనగలు , పువ్వులు , అక్షింతలుడబ్బులుచెరుకుగడలు,రేగుపళ్ళు వేసి పిల్లలకు దిష్టితీసి తలమీదవేసి ఆసిర్వాదిస్తారుబొమ్మల కొలువు పెట్టి పేరంటాలకి పసుపుకుంకుమలు ఇచ్చి దీవెనలుతీసుకుంటారు.
 బోగి రోజు నెలరోజులు ధనుర్మాసము వ్రతము చేసిన గోదాదేవి రంగానాధునిని వివాహము చేసుకొని స్వామీ వారిలో ఐక్యముఅయిపోతుందిఅందువలన అప్పటినుండి భోగి రోజు గోదా రంగానాయకులవివాహాలు ఆలయాలలోజరుపుతారు వివాహముచూడటానికి రెండుకళ్ళు చాలని విధముగా చేస్తారుఇలా భోగి పండుగ ముగుస్తుంది

శుక్రవారం, జనవరి 11, 2013

తిరుప్పావై (కఱవైగళ్ పిన్ శెన్ఱు)28వ పాశురము

శుక్రవారం, జనవరి 11, 2013

గోపికలు శ్రీ కృష్ణునితో అన్నారు మేము మార్గ శీర్ష స్నానము చేయవలెనని వచ్చాము . మాకు మా వ్రతమునకు కావలసిన పరికరములు అడిగారు. ఆ వ్రతము చేసిన తర్వాత తామూ పొందవలసిన ఆభరణములను, వస్త్రములను, భోగములను ప్రార్దిమ్చినారు .
శ్రీ కృష్ణునకు వారు హృదయము తెలియును. ఇదంతయు లుకిక వ్రత గాధ కాదు. వీరు కోరునవి లుకిక వ్రతోపకరనములు కావు. ఆముష్మిక ఫలమునండుతకే వీరు కోరుచున్నారు. కాని వీరి నోటివేమ్తనే దానిని చెప్పిమ్చవలెను అని తలంచి ఇట్లు అడిగినారు.
ఓ గోపికలారా ! మీరు కోరినవన్నియు చాలా చక్కగా వున్నాయి. మీరు " పరిశీలించి కృపచేయమని" అనిఅన్నారు.
కదా పరిశీలించినా మీ అభిప్రాయమేమో నాకు తోచటంలేదు. వ్రతము చేసి మహత్తరమైన అలంకరనములను భోగములను అందవలెనన్నా దానికొక అదికారము ఉండాలి కదా? ఫలమునాశించిన మీరు ఆ ఫలాప్రాప్తికి ఏదోఒక యత్నము కుడా చేసి యుండాలి కదా? మా కది కావాలని అన్నంత మాత్రమున నేను ఇచ్చుటకు వీలుకాదు. దానికి తగిన యోగ్యతా మీకున్న ఇవ్వగలను. కావున మీకున్న అధికారము అనగా మీ యోగ్యతా ఎట్టిదో వివరించుము. ఫలమును అందగోరు వారు దానికి సాధనమునుగూడ సంపాదిమ్పవలేనుగాడా? మీరు అట్టి సాధనమును దేనినైనా ఆర్జించినారా ?
ఇట్లు అడుగగానే గోపికలు తమ హృదయము విప్పి చెప్పుచున్నారు .
గోపికలు కామ్క్షిమ్చునది పరమ పుశార్ధముఅగు నారంట భగవత్ పురక భవత్కైమ్కర్యము. దానికి వరేమియు యోగ్య తను సంపాదించుకొని రాలేదు . పరమాత్మే ఉపాయముగా నమ్మిన వారు, వాటి కంటే వేరే ఉపాయము తాము పొందుటకు ప్రతిభందకములని తెలుసుకున్నవారు. కర్మలు చేసి, జ్ఞానము సంపాదించి, భక్తి తో ఉపాసించి పరమాత్మను పొందాలని తలంపు వీరికి లేదు. వాడె వానిని పొందించ వలెనని నమ్మినవారు. అందుచే ఇట్లు భగవానుడే యుపాయమని నమ్మకము కలవారు. భగవానుని ముందు ఏమి విజ్ఞాపనము చేయవలెనో ఆమాటలను గోపికలు ఈ పాసురమున వివరిచుచున్నారు .
కఱవైగళ్ పిన్ శెన్ఱు  పాశురము : 
కఱవైగళ్ పిన్ శెన్ఱు కానం కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో
డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్

తాత్పర్యము:
పశువుల వెంట వానిని మేపుటకై అడవికిపోయి. అచటనే శుచినియమములు లేక తిని, జీవిమ్చియుమ్డుతయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియు జ్ఞానములేని మాగోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మిచిన పుణ్యమే మాకున్న పుణ్యము . మాకెన్ని లోపాలున్నా తీర్చగాల్గినట్లు ఏ లోపము లేని వాడవు కదా నీవు. గోవిందా! ఓ స్వామీ ! నీతో మాకుగల సంబంధము పోగొట్టుకోన వీలుకాదు . లోక మర్యాదనేరుగని పిల్లలము. అందుచే ప్రేమవలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలచినాము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములననుగ్రహింపక ఉండకుము. మాకు ఆపేక్షితమగు పరను పరను ఇవ్వుము.

గురువారం, జనవరి 10, 2013

తిరుప్పావై (కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై ) 27వ పాశురము

గురువారం, జనవరి 10, 2013


గోపికలు తామూ చరించబోవు మార్గ శీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాసురమున విన్నవిమ్చినారు. అందు వారడిగిన ద్రవ్యములు సులభాములేయైననాను వారు కోరిన వారు కోరిన గునముఅలు గల ద్రవ్యము దుర్లభాములు. అందుచే శ్రీ కృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను గోరుట కాదు , నన్నే కోరి వీరీ వస్తువులను కోరినారు. అనుకొనెను.పాచజన్యమును పోలిన శంఖములను కోరారు. మరి అల్లాంటి శంఖము దొరకదు. ఆ శంఖము శ్రీ కృష్ణుని వీడదు. అందుచే శ్రీ కృష్ణుడే శంఖధరుడై తమతో నుండవలెనని వారు కోరారు.
చల్లా పెద్ద పర కావలెనని గోపికలు కోరారు . శ్రీ కృష్ణుడు త్రివిక్రమావతారమున జాంబవంతుడు త్రివిక్రముని విజయమును చాటుచు వాయించిన పరయోకటి కలదు. శ్రీ కృష్ణ రుపముననున్న నేను కుంభ నృత్యము చేయునప్పుడు కట్టుకొని వాయించిన పర చాల పెద్ద పర. ఈ మూడింటిని ఇచ్చెదనని శ్రీ కృష్ణుడు గోపికలకు చెప్పెను. మంగళా శాసనము చేయువారు కావలెనని కోరిరి. మంగళా శాసనము చేయువారెచట నున్న పరమాత్మయే వారి వెంట నుండునని వీరీ అభిప్రాయము.
తమ దేవేరియగు శ్రీ మహాలక్ష్మి నే మంగళ దీపముగా వారితో ఉండునట్లు అంగీకరించెను . జెండా గరుత్మంతుడు . వారికి గరుడునికుడా ఒసగుటకు శ్రీ కృష్ణుడు సమ్మతించెను.
తరువాత చాందినీగా అనంతునే పంపనంగీకరించెను. మధురా నగరమున జన్మించి వ్రేపల్లెకు వచ్చిన ఆ రాత్రి వర్షమున శ్రీ కృష్ణునకు మేలు కట్టుగా తన పడగలనుపయోగించిన మహానీయుడు కదా! అనంతుడు, పడగ, ఆసనము, వస్త్రము, పాదుకలు, తలగడ, చత్రము, చాందిని మొదలగున్నవి విధముల సర్వేస్వరునకు తన శరీరమును భిన్న భిన్న రుపములుగాకుర్చి యుపయోగపడి తనచేతలచే శేషుడు అను పేరు పొందిన మహనీయుడు. వీరు కూడా శేషత్వమునే కోరుతున్నవారగుటచే , శేషునే వారికి చాందినిగా ఇచ్చెను .
ఇలా పరికరములన్నీ సమకూరినవి కదా ! ఇక మీ వ్రతమునకు ఫలమేమో వివరించమని స్వామీ కోరగా . గోపికలు ఈ పాసురమున ఈ వ్రతాచరణముచే తామూ పోందకోరిన ఫలమును వివరించుచున్నారు.  ఈ పాసురము విశేషమైనది నేటి నివేదన చక్కెరపోంగళి ఆరగింపుగాఇస్తారు.  గోపికలు ఈ పాసురము రోజు 108  గిన్నెలు చెక్కరపొంగలి నెయ్యి ఎక్కువ వేసి మోచేతి నుండి కారునట్లు వేసిచేస్తారు.  ఎందుకుఅంటే 26  రోజులు వీరు నెయ్యి వాడలేదు కదా.  అందువల్ల ఈ పాసురము రోజు మంచిగా చెక్కెర పొంగలి నివేదిస్తారు.

కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై పాశురము:
కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై
ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్
నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్
ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు
మూడనెయ్ పెయ్దు మురంగైవరివార
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్ 

తాత్పర్యము:
తనతో కూడని శత్రువులను జయిమ్చేది కళ్యాణ గుణ సంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పర అను వాద్యమును పొంది పొందదలచిన ఘన సన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండును. చేతులుకు గాజులు మొదలుగు ఆభరణములు , బాహువులకు డందకదియములు , చెవి క్రిందు భాగమున దాలెచేది దుద్దు, పై భాగమున పెట్టుకొనే కర్ణపువ్వులు, కాలి అందెలు మొదలుగు అనేక ఆభరణాలు మేము ధరించాలి. తరువాత మంచి చీరలను దాల్చి వుండాలి. దాని తరువాత పాలు అన్నము మున్నగున్నవి నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా హాయిగా భుజిమ్చవలెను. గోపికలు తమ వ్రత ఫలమును ఇందులో వివరించారు. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)