మంగళవారం, మార్చి 31, 2015
![](https://heavyeditorial.files.wordpress.com/2015/03/3092958.jpg?quality=65&strip=all&w=780&h=1042) |
The Eiffel Tower on March 31, 1889, the day of its inauguration. (Getty) |
![](https://heavyeditorial.files.wordpress.com/2015/03/4679206381.jpg?quality=65&strip=all&w=780&h=1157) |
విధ్యుత్ కాంతిలో బంగారువర్ణం లో మెరిసిపోతున్న ఈఫిల్ |
పారిస్ అనగానే మనకు టక్ అని గుర్తువచ్చేది ఈఫిల్ టవర్. ఇది ఒక అద్భుతమైన నిర్మాణం. దీనిని ఒక కాంట్రాక్టర్, engineer, ఆర్కిటెక్ట్ మరియు గుస్టేవే ఈఫిల్ పేరు షోమ్యాన్లోనూ ఒక అత్యంత ప్రభావవంతమైన ప్రజలు పేరు పెట్టారు. ఈఫిల్ టవర్ ను మార్చి 31,1889 న పూర్తి చేసారు. ఈఫిల్ టవర్ ను మొదటి 1884 లో యోచించారు. ఈ టవర్ ను నిర్మించడానికి రెండు సంవత్సరాల రెండు నెలల టైం పట్టింది. ఇది 1887-1889కాలంలో నిర్మించడము జరిగింది. ఈ ఈఫిల్ టవర్ పైనుండి 59 కిలోమీటర్ల లేదా 37 మైళ్ల చుట్టూ దూరం చూడవచ్చు. ఈఫిల్ టవర్ 2012 నాటికి 124 సంవత్సరాల నాటిది. ఈఫిల్ టవర్ annually electricity యొక్క 7.5 కిలోవాట్ గంటలు ఉపయోగిస్తుంది. చాలావరకు ఈ విద్యుత్ బంగారు కాంతి తో పారిస్ ను విశదపరుస్తుంది. ఇది ఒక రేడియో ప్రసార టవర్గా మరియు పరిశీలన టవర్గా ఉపయోగిస్తారు.
![](https://encrypted-tbn2.gstatic.com/images?q=tbn:ANd9GcR1X7PXEPhZWvC_zP6znP2SPbYAUH4tZ618eFw6nwebjA2uZRBv) |
|
Stephen Sauvestre ఈఫిల్ టవర్ విభాగ ప్రధాన ఆర్కిటెక్ట్ ఉంది. ఈఫిల్ టవర్ నిర్మాణం పని చుట్టూ50 మంది ఇంజనీర్లు, 100 ఇనుము కార్మికులు మరియు 121 నిర్మాణ కార్మికులు పనిచేసారు. ఈ టవర్ లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు ఏడు సంవత్సరాల కొకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ ను వాడుతారు. భూమి మీద నుంచి చూసే వీక్షకుడికి ఇది సమదృష్టి కోసం మూడు రకాలైన రంగులను ఉపయోగిస్తారు, బాగా ముదురుగా ఉన్న రంగు క్రింద భాగంలోనూ, లేత రంగు టవర్ పైభాగం లోనూ వేస్తారు. ఈఫిల్ టవర్ యొక్క ప్రధాన భాగం ఇనుము. ఒక వ్యక్తి ఈఫిల్ టవర్ నిర్మాణంలో మరణించాడు. ఈఫిల్ టవర్కు ముదురు గోధుమ రంగు పెయింట్ చేస్తున్నారు. ఈఫిల్ టవర్ ఎత్తు సుమారు 984-990 అడుగుల పొడవు / ఎక్కువ (ఉష్ణోగ్రత మీద ఆధారపడి) లేదా 324 మీటర్ల పొడవైన / ఎక్కువ ఉంది. ఈఫిల్ టవర్ మెటల్ ఉండటం సుమారు 10,000 టన్నుల, వాటిలో 7.3 వేల బరువు. ఈఫిల్ టవర్ పెయింట్ కలిగి చేస్తుంది. ఇది ప్రతి 7 సంవత్సరాల కు మళ్ళి పైంట్ వెయ్యాలని ఉంది. 2008 చివరలో,ఈఫిల్ టవర్ 19 సార్లు చిత్రించబడ్డాయి ఉంటుంది. సుమారు 6.8 మిలియన్ల మంది ప్రతి సంవత్సరం ఈఫిల్ టవర్ సందర్శించుతూ వుంటారు అని ఒక అంచన . ఇది ఒక బిలియన్ ప్రజల క్వార్టర్ మీద దాని సుదీర్ఘ చరిత్ర లో ఈఫిల్ టవర్ వీక్షించేందుకు కలిగి అంచనా. ఈఫిల్ టవర్ లో 1665 మెట్లు దశలను ఉన్నాయి. పారిస్ నగరం ప్రస్తుతం ఈఫిల్ టవర్ కలిగి ఉంది. యాంటెన్నా దీర్ఘ 24 మీటర్లు ఉంటుంది. ఈఫిల్ టవర్ 108 కథలు ఉండేవి. మరి చరిత్ర చూస్తే ...... ఈ నిర్మాణం 1887 మరియు 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ ద్వారంగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈఫిల్ 1888వ సంవత్సరంలో బార్సిలోనా లో ఈ టవర్ ను నిర్మించాలనుకున్నాడు. కానీ బార్సిలోనా లోని దీనికి సంబంధించిన అధికారులు ఈ నిర్మాణం కొత్తగానూ, ఖర్చుతో కూడుకొన్న పని అనీ నగరం యొక్క డిజైన్ లో సరిపడదని చెప్పారు. తరువాత ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్ లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. తరువాత అక్కడే 1889 లో దీన్ని నిర్మించడం జరిగింది.
మొదట్లో ఈఫిల్ టవర్ ను 20 సంవత్సరాల వరకే ఉండేటట్లుగా ఒప్పందం కుదిరింది. దీన్ని ప్రకారం 1909లో కూల్చివేయాలి. కానీ అది కమ్యూనికేషన్ అవసరాలకు, మరియు మిలిటరీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుండడంతో అనుమతి ఒప్పందం అయిపోయిన తరువాత కూడా విజయ చిహ్నంగా అలాగే ఉంచారు. ఈ నిర్మాణం యొక్క నమూనా మన ఆంద్ర ప్రదేశ్ లో యానం లో వుంది.
శుక్రవారం, మార్చి 27, 2015
శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమేసహస్రనామ తత్తు(స్తు)ల్యమ్ రామనామ వరాననేరామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రథమనీ పలువురి నమ్మిక. "రామ" నామము లో పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'రా' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.
రామాయణంలో ధర్మనిరతి, ఉత్తమమైన వ్యక్తులు పాటించవలసిన నీతి ప్రధానంగా కనిపిస్తాయి. సేవకుడు ఎలా ప్రవర్తించాలి, కొడుకు ఎలా నడుచుకోవాలి, తమ్ముడు ఎలా నడచుకోవాలి, రాజు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి - వంటి నియమాలు రామాయణంలో కధాపరంగా వివరింపబడినాయి. మనకు రమాయణం ద్వారా మంచివిషయాలు తెలుస్తాయి. రామాయణము మనకు ఆధర్శంగావుంటుంది కదా.శ్రీ సీతారాముల కళ్యాణం శుభాకాంక్షలు.
సోమవారం, మార్చి 23, 2015
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgBMK5nJls8UvjHddNtheNExUInPREu3brhpbkJjOCaFRGcXU635VGfYgpBci-npX616XN05FWYo5zGJy-xQcE4fZ5Lf6GR8ryiEjLadkRJElA6y2UuZ0XYq2L9FnTFnnuRFYSkFwb3OA8/s1600/Shahed-Bhagat-Singh-Rajguru-Sukhdev-Singh.jpg) |
నిజమైన ఈ ముగ్గురు హీరోలకు (భగత్ సింగ్, సుఖ్ దేవ్ థాపర్, హరి శివరాం రాజ్ గురు) వందనం |
భగత్ సింగ్ (సెప్టెంబరు 28, 1907 –మార్చి 23, 1931) స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు.భారత స్వాతంత్ర్యోద్యమమునకు పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులల్లో ఆయన ఒకరు. ఈ కారణంగానే 'షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు'. చరిత్రకారుడు కె.ఎన్. పనిక్కర్ ప్రకారం భగత్ సింగ్,భారతదేశంలో ఆరంభ మార్కిస్టు గా పేరుపొందాడు.
సుఖ్ దేవ్ థాపర్ (15 మే 1907 - మార్చి 23, 1931) భారత స్వాతంత్ర్య సమర, ఉద్యమకారుడు. ఇతను భగత్ సింగ్ మరియు రాజ్గురు ల సహచరునిగా ప్రసిధ్ధి.
హరి శివరాం రాజ్ గురు (ఆగష్టు 24, 1908 - మార్చి 23, 1931) భారత స్వాతంత్ర ఉద్యమ, ఉద్యమకారుడు. మహారాష్ట్ర లోని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతను భగత్ సింగ్ మరియు సుఖ్ దేవ్ ల సహచరునిగా ప్రసిధ్ధి.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgDZA9Pg2g3m3MUQKOAgMl_wyNxKWiCwhp3mqQpDoj57Pkho3zXXFZTjR5GqLDExeuNxNhDcChnwE6by1ncKD2RW9oZxnLlPpKxKdUmgUYU0wva5PyyG3YToQ3dYFnmjZY6YIYbnI5p0WQ/s1600/Jpsandars.jpg) |
జె. పి. సండర్ |
1928లో భారత్లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సభ్యుడిగా ఒక్క భారతీయుడిని కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 30 అక్టోబరు 1928న కమిషన్ లాహోర్ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాలా లజ్పత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు.1 సెప్టెం, 2011 - 1929లో లాహోర్లో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న 64 ఏళ్ల వృద్ధుడు లాలా లజపతిరాయ్పై సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి పాశవికంగా లాఠీచార్జి చేసారు దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు అధికారి స్కాట్ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్గురు, జై గోపాల్ మరియ సుఖ్దేవ్ థాపర్లతో ఆయన చేతులు కలిపాడు. స్కాట్ను గుర్తించిన జై పాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా డీఎస్పీ J. P. సాండర్స్కనిపించినప్పుడు సింగ్కు జై పాల్ సంకేతమిచ్చాడు. ఫలితంగా స్కాట్కు బదులు సాండర్స్ హతమయ్యాడు. దాంతో పోలీసుల కంట పడకుండా ఉండటానికి భగత్ లాహోర్ పారిపోయాడు. గుర్తు పట్టకుండా ఉండటానికి గడ్డాన్ని గీసుకోవడం, వెండ్రుకలు కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు సింగ్ పాల్పడ్డాడు.
1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చినందులకు గాను భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన ఈ ముగ్గురు విప్లవకారులు (భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్) లను 1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో సాయంకాలం 7.33 సమయానికి ఉరి తీశారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరి శిక్ష అమలు జరపడం జరిగేది కాదు. వారి మృత దేహాలను రహస్యంగా, జైలు వెనుక గోడలు పగులగొట్టి తీసికొని వెళ్ళిసట్లెజ్ నది తీరాన హుస్సేన్వాలా అనే ఊరిలో దహనం చేశారు. మృత దేహాను చూసిన ప్రజలలో అలజడిని ఎదుర్కోకుండా ఇలా చేశారు.
ఆదివారం, మార్చి 22, 2015
ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి 22, 2014న విశ్వవ్యాప్తంగా పాటించారు. మంచి నీటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియచేసేందుకు యునైటెడ్ నేషన్స్ మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహిస్తుంది. మెరుగైన నీటి వనరుల ఉపయోగం, జల వనరుల సంరక్షణ ప్రపంచ జల దినోత్సవ ముఖ్యోద్దేశం. భూమిపై మూడొంతుల భాగం నీరు ఆవరించబడి ఉన్నది. ఈ భువిపై ఉన్న ప్రతి ప్రాణి నీరు లేనిదే మనుగడ సాగించలేదు.
భూభాగంలో 70.9 శాతం నీటితో నిండి వుంది. అందులో 86.5 శాతం సముద్రపు నీరు, 1.7 శాతం భూగర్భ జలాలు, 1.7శాతం మంచు రూపంలో ఉంది. అయితే భూమిమీద మొత్తం 2.5 శాతం మాత్రమే మంచినీరు ఉంది. అందులో 0.3 శాతం నదుల్లో, కాలువల్లో ఉంది.
యునైటెడ్ నేషన్స్, ప్రపంచ జల దినోత్సవాన్ని 1992 యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ (UNCED), రియో డి జెనీరియో సమావేశంలో ప్రతిపాదించింది. దీన్ని 1993వ సంవత్సరం నుంచి నిర్వహించడం ప్రారంభించారు.
మెరుగైన మంచి నీటి వనరుల నిర్వహణ, ప్రాముఖ్యత పట్ల అవగాహనా కల్పించడంకోసం యునైటెడ్ నేషన్స్ ప్రతి సంవత్సరం మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా జరుపుతుంది.
మనము నీటిని వృదా చేస్తున్నాం , కలుషితం చేస్తున్నాం . ఒకవిధంగా చెప్పాలి అంటే నీటిని విషపూరితం చేస్తున్నాం. భూమి మీద సమస్త జీవులు నీటిని ఆధారంగానే చేసుకొని జీవిస్తున్నాయి. మనం నీటిని కలుషితం చేయటం వల్ల జలచరాలు అనేకమైనవి వాటి ఉనికిని కోల్పోతున్నాయి. దీనికి అర్ధం కొంతకాలానికి మనకు అదే పరిస్థితి ఎదురవ్వకమానదు. మనకు నీరు చాలా అవసరం . నీరు లేకపోతే సమస్త జీవులకు జీవించటమే సమస్య గా మారిపోతుంది . నీరు ప్రకృతి ప్రసాదించిన వరం. ఇదే ప్రకృతి సహజమైన ఔషధం. సహజంగానే భూమి మీద నీటి కొరత ఏర్పడింది. అది అధికమిమచవలెను. దానికి ఒకే ఒక మార్గం చెట్లను అదికంగా పెంచటమే. మనం భారతీయులం కావున నీటిని గంగా మాతగా పూజిస్తాం. హారతులు పడతాం. అలాంటి నీటిని ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. వృదాచేయకుండా. కలుషితం చేయకుండా. అనావసరమైన వ్యర్ధాలు నీటిలో కలపకుండా జాగ్రత్త పడాలి. నీటిని కాపాడుదాం అలాగే ప్రపంచాన్ని కాపాడుదాం. ఈరోజు ప్రపంచ జల దినోత్సవాన్ని మంచి ఉద్యమంగా జరుపుకుందాం.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ