గురువారం, డిసెంబర్ 13, 2012
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg-xZmVY4Cyg6-03CG2MmpvnSQoK818EzrBtF2zAXd5IaaPCDg8QxyK8eOHLZgMyyee2V-OzkzYDZBUoL0_zG7fpNxnpR47Qow1sqd5udaFN4V-OO4dB3EyYAbsN0z2Z8GfL-FdT9D4cok/s400/Screenshot_3.jpg)
కార్తికవ్రత మహిమ ఫలశ్రుతి నైమిశారణ్య ఆశ్రమములో శౌనికాది మహామునులకందరకు సుతమహాముని తెలియజేసిన విష్ణు మహిమలను , విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయి నోళ్ళకొనియాడిరి. శౌనికాది మునులకు ఇంకను సంశయములు తిరనందున, సుతునిగాంచి "ఓముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గ ములకు దాసులై, అత్యాచారపరులై జీవి౦చుచు సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైన కలదా?ధర్మములన్నిటిలో మోక్షసాధన కుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొంసంగు వుత్తమ దైవమెవరు?మానవుని అవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగలవుపాయమేమి? హరి నమస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈసంశాయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియజేయు" మని కోరిరి. అంత సుతుడా ప్రశ్న నాలకించి" ఓమునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకోనవలసినవి. కలియుగమందలి మానవులు మంద బుద్దులు క్షణికసుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము వలన యాగాదిక్రతువు లోనర్చిన పుణ్యము, దానధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీ మన్నారాణునకు ప్రీతీకరమైన వ్రతము ఇది అన్నివ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వర్ణించియున్నాడు. ఆవ్రత మహిమ వర్ణించుట నాకు శక్తిచాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆబ్రహ్మదేవునికి కూడా శత్యముగాదు. అయినను సుక్ష్మముగా వివరించెదను. కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్దతులనుజెప్పు చున్నాను. శ్రద్దగా అలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పని సరిగ నది స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరి హరదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చెయవలయును . ఈనెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని, శివాలయమున గాని ఆవునేతిలో దీపారాధన చెయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపటణము చెయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులరాశి యందున్న నెలరోజులు యీవిధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి వుండి కూడా ఆచరించక గాని, లేక, ఆచరించువారలను జూచియెగతాళి చేసిన గాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడినవారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతరమందు నరకములోపడి యమకింకరులచేత నానా హింసలపాలుకాగలరు. అంతియే గాక అట్టివారు నూరుజన్మల వరకు ఛ౦డాలాది హీనజన్మలెత్తుదురు.
కార్తీకమాసములో కావేరి, నదిలోగాని, గంగానదిలో గాని, అఖండ గౌతమీ నదిలో గాని స్నానమాచరించి ముందుచెప్పిన విధముగా నిష్టతో ఆచరించినవారు యిహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది. అధికఫలదాయకయైనది. హరిహరాదులకు ప్రితికరమైనది. కనుక కార్తీకమాసవ్రతము వలన జన్మజన్మలను౦డి వారలకున్న సకలపాపములుహరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీవ్రత మాచరించవలెననెది కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యేవగింపు అసహ్యము కలుగును. కాన, ప్రతిమానవుడు ఈపరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యకాలమును చెతులారావిడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారలు కార్తీక శుద్దపౌర్ణమినాడు అయినను తమ శక్తీకొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజన మిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు, చేసినచొ యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెలరోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరి నామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్ధములను సేవిస్తూ, దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈకథను చదివినవారికిని శ్రీ మన్నారాయుణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠప్రాప్తి కలుగచేయును.
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు
ఓం సర్వేషాం పూర్ణ౦భవతు ఓం శ్శాంతి శ్శాంతి::||
బుధవారం, డిసెంబర్ 12, 2012
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhDzRue92_hTzXysupDYfwWXNpYKm3ZwW5F7EilMOhgPwxNxBXv2KpsiGcPmrb3tHLiSg-XMsqR1vp76lAybFVyxw-DP0bD6CidQS8VCkFjSxYBp2yntAY6SJ3F1VhuaOQ7IQvXFSlw5LM/s320/Screenshot_3.png) |
wireless receiver |
12 /12 / 1901 లో అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటి మొట్టమొదట రేడియో సంకేతాలను ప్రసారం చేశారు. ఆ ప్రయోగము విజయవంతముగా పనిచేసింది. దీంతో వైర్లెస్ పరిశ్రమలో పెద్ద మార్పు వచ్చింది. ఆ తర్వాత వైర్లెస్ వ్యవస్థ వలన ఎన్నో ఉపయోగాలు కలిగాయి. నేడు తీగ లేకుండా సంకేతాలు పంపుతున్న, అందుకుంటున్న టెక్నాలజీకి ఆద్యుడు మార్కొని. ఆ రేడియోని మార్కొని కనుకున్నారు దీని వలన అప్పట్లో ఒకరినుండి ఒకరికి కమ్యునికేషనికి బాగాఉపయోగించారు. అప్పడు తయారు చేసిన రేడియో చాలాచాలా మార్పులు చెంది నేటి FM వరకు రూపు దిద్దుకుంది. ఈరోజుల్లో టీవీలు వున్నా రేడియో అంటే ప్రజలు ఎక్కువ ఉపయోగిస్తున్నారు. మనకు ఎక్కడ బడితే అక్కడ రేడియో వినటానికి వీలుగా వుంది. మనకు Online Radio లు కూడా ప్రజలుకు అందుబాటులోకి వచ్చాయి. Hats off to మార్కొని.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgarvp6gi7zIFVMUlUHJaMdxFJcCDPoVMJPcPP0i0tT4Pv12R91C2wrVCiZN7ZBHRKhRKKfu5FFsniJPHyuCxezH9_Wx_b-5xiH91q0D1tF3WMBc4TK7bQpNI_x_5d1tR7BVho7BYcaQiQ/s320/Screenshot_4.png) |
Marconi Wireless Radio Wave meter |
అంబరీషుడు దుర్వాసుని పూజించుట
ద్వాదశి పారాయణము అత్రిమహాముని అగస్త్యు వారితో యీ విషముగా- సుదర్శన చక్రము అంబరీషునకభయమిచ్చి వుభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైనవైనము చెప్పి తిరిగి ఇట్లు నడువనారంభించెను. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సు పైజల్లుకొని, " ఓమునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను నాశక్తికొలది నేను శ్రీ మన్నారయణుని సేవింతును, ద్వాదశివ్రతము జేసుకోనుచు ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నావలన మీకు సంభవించిన కష్టమునకు నన్నుమన్ని౦పుడు. మీయెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్య మివ్వవలయునని ఆహ్వానిన్చితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించినన్నును, నావంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్రహృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించనను మరల నాగృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుధర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీవుపకరమును మరువలేకున్నాను. మహానుభావా! నా మనస్సంతోషమచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నానోట పలుకులురాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనందబాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుండును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నరజన్మ రాకుండా వుండేట్లును, సదా, మీ బోటి ముని శ్రేష్ఠులయందును- ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గల వాడనై యుండునట్లును నన్నశిర్విదించుడని ప్రార్ధించి, సహా ప౦క్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి " రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువుల కైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమాన మని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు తండ్రితో సమానుడవైనావు. నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు ఆయుక్షీణం కలుగును.
అందుచేత నీకు నమస్కరించుటలేదు. నీకోరిక యీస్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్రయేకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభావిన్చితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివేదిక్కయితివి. నీతో భోజనము చేయుట నాభాగ్యముగాక, మరొకటి యగునా?" అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగంచి, అతని భక్తి ని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవుపొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను. ఈ వ్రుతాంత్త మంతయు కార్తిక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది.
ఓ అగస్త్యమహాముని! ద్వాదశివ్రత ప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణు మూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్నమనస్కుడై చేసిన పుణ్యము యితర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తిక శుద్ధయేకదశి రోజున శుష్కోపవసము౦డి పగలెల్ల హరి నామ సంకీర్తన చే గడిపి ఆరాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూజాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీ మన్నారయణుని ప్రీతీ కొరకు దానము లిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీవ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీ మన్నానారయుణుకు ప్రీతీకరమైన దినము కనుక ఆనాడు ద్వాదశిఘడియలు తక్కువగా యున్నాను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను. ఎవరికైతే వైకుంటములో స్థిర నివాస మేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టివారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి ప్రీతీకరమగు కార్తికశుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కర మైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింపకూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్ష మైన విధముగా కార్తీక మాసములో నియమాను సారముగ జేసినాయేకొంచము పుణ్య మైనను, అది అవసానకాలమున యమదూతల పలుక నీయకకాపాడును. అందులకే యీ కార్తిక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును- అని అత్రి మహాముని అగస్త్యనకు బోధించిరి.
మంగళవారం, డిసెంబర్ 11, 2012
విష్ణు సుదర్శన చక్ర మహిమ
జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు ఆలోచింపక మహాభక్తునిశుద్ధని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను. అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణునికడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపదుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి " అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నాపైగల అనురాగముతో ద్వాదశి పారాయణ మునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయతలపెట్టితిని. గాని నాదుర్బద్దినన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్ద మైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని. ఆ పురాణపురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్దకేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడనైనను నీనిష్కళంక భక్తి ముందవియేమియు పనిచెయలేదు. నన్నివిపత్తు నుండి కాపాడు " మని అనేక విధాల ప్రార్ధoచగా, అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,"ఓ సుదర్శన చక్రమా! నీకివే నామన: పూర్వక వందనములు. ఈ దూర్వాసమహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొనితెచ్చుకొనెను. అయినను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు, ఒకవేళ నీకర్త వ్యమును నిర్వహింపతలచితి వేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీ మన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీ మన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనెక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే యీదుర్వాసుడు ముల్లో కములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకొటులన్నియు ఒక్కటిగా యేకమైన నూ నిన్నేమియు చెయజాలవు, నీ శక్తికి యేవిధ మైన అడ్డునూలేదు. ఈ విషయములోక మంతటికి తెలియును. అయిననుముని పుంగవునికి యేఅపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్దoచుచున్నాను. నీయుందు ఆ శ్రీ మన్నారాయణుని శక్తి యిమిడి యున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణువేడిన యీదుర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రా యుధము అంబరీషుని ప్రార్దనలకు శాంతించి" ఓ భక్తగ్రేశ్వరా ! అంబరీషా! నీ భక్తీ ని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహా పరాక్రమవంతులైన మధుకైటభులను- దేవతలందరు యెకమైకూడ- చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును.
ఇది యెల్లరకు తెలిసిన విషేయమే, ముక్కోపియగు దుర్వాసుడు నీపైపగబూని నీ వ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్ట వలనని కన్నులెర్ర జేసినీమీదజూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిర పరాధవగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మ తేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తీలో నాకంటె యెక్కువేమియుగాదు. సృషికర్త యగు బ్రాహ్మతేజస్సు కంటెను,కైలాసవతియగు మహేశ్వరునితే జశ్శక్తి కంటెను యెక్కువ మైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతొ రుద్రతేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియతేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నే దుర్కొన జాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్త మము. ఈనీతిని ఆచరించు వారాలు యెటువంటి విపత్తుల నుండి అయిన ను తప్పించుకోన గలరు. ఇంత వరకు జరిగిన దంతయు విస్మరించి, శరణార్దమై వచ్చిన ఆదుర్వాసుని గౌరవించి నీధర్మము నీవు నిర్వరింపు" మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవగో , బ్రాహ్మణాదుల యుందును, స్త్రీ లయందును, గౌరవము గలవాడను. నారాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవులేనునియే నాయభిలాష . కాన, శరణు గోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్ని దేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేకమైన నూ నీ శక్తీకి, తేజస్సు కూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ - గో - బ్రాహ్మణ హింసా పరుల పై నిన్ను ప్రయోగించి, వారిని రక్షించి, తనకుక్షియుందున్న పధాలుగులోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నికివే నామన: పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రా యుధ పు పాదముల పైపడెను. అంతట సుదర్శన చక్రము అంబరీ షుని లేవదీసిగాడాలింగన మొనర్చి " అంబరీషా! నీనిష్కళంక భక్తి కి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరుపరింతురో, యెవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్దిచేసుకొందురో, యెవరోపరులను హింసించక - పరధనములను ఆశ పడక- పరస్త్రీలను చెరబెట్టిక - గోహత్య - బ్రాహ్మణహత్య- శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములునశించి, యిహమందున పరమందున సర్వ సాఖ్యములతో తులతూగుధురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీద్వాదశి వ్రతప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు యీమునిపుంగవునిత పశ్శక్తి పని చేయలేదు ." అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యామమ్యెను.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ