త్యాగరాజు కర్ణాటకా సంగీత అపర నాద బ్రహ్మ . ఈయనకి త్యాగ బ్రహ్మ అని అందరు అంటారు. పాటలు పాడి భగవంతుని పొందవచ్చని నిరూపించి గొప్ప వాగ్గేయకారుడు. ఈ త్యాగరాజ స్వామీ.
తమిళనాడులోని అగ్రహారము అనే గ్రామములో వైదిక తెలుగు బ్రాహ్మణ కుటుంబములో కాకర్ల వంశమున జన్మించినాడు. కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మల పుణ్యఫలముగా జన్మిచినాడు. త్యాగరాజుకు పద్దేమిది సంవత్సరములకు పార్వతి అను యువతితో వివాహమైనది కొన్ని రోజులకు ఆమె మరణించింది. తరువాత ఆమె చెల్లెలు కమలాబను వివాహముచేసుకొని ఒక పుత్రికను కలిగినారు.
ఈయన గొప్ప రామ భక్తుడు రామునిమీద చాలా పాటలు ఆయన రాసిన పాటలు దాదాపు 800 వరకు రాచి ఉంటారని అంచనా .దాదాపు తెలుగులోని రచనలు సాగాయి. కొన్ని సంస్క్రుతములోను వున్నాయి.
త్యాగరాజు సంస్కృతములో రాసిన జగదానందకారక అనే కీర్తనలో రాముని 108 పేరులు చెప్పారు. ఆయన చాలామంచి కీర్తనలు ప్రజల గుండెల్లో నిలచిపోయి ఉండేటట్లు రచించినారు. ఆయన పాటలలో రాగ, తాళ, శ్రుతి, మొదలగున్నవి వుండేటట్లు చూచుకొని ఒక ఇక సెలవా ప్రకారము శ్రీ రాముని కీర్తిమ్చుతూ రచనలు చేసారు. కీర్తించుతూ పాటల రచనలు చేసారు . ఈయన పాటలలో విశేషముగా పంచరత్నాలు రచించినవి చాలా ప్రజారంజకముగా వుంటాయి.
మనము కొన్ని పాటలు చూద్దాము.
ఘనరాగ పంచరత్నములు లో పేరు తెచ్చుకున్నవి
1) జగదానంద కారక! జయ జానకీ ప్రాణ నాయక!
గగనాధిప! సత్కులజ ! రాజరాజేశ్వర!
సుగుణాకర! సుజన (సేవ్య)
సేవ్య! భవ్య దాయక! సదా సకల 11 జగదానంద 11
ఇంకొ పాట :
దుడుకు గల నన్నే దొర
కొడుకు బ్రోచురా? ఎంతో
కడు దుర్విషయాకృష్ణూండై
మరొకటి
సాధించేనే ఓ మనసా!
భోధించిన సన్మార్గ వచనముల
బొంకు జేసి తా బట్టినపట్టు
సమయానికి తగు మాటలాడెనె
ఇంకొటేమో
కన కన రుచిరా కనకవసన !నిన్ను
దిన దినమును మనసున చనువున నిన్ను
పాలుగారు మోమున శ్రీయపార
మహిమ దనరు నున్ను
ఎంతో పేరు గల పాట
ఎందరో మహానుభావులు - లందరికి వందనము 11 ఎం11
దందురు వర్ణుని యంద-చందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానంద మనౌభవించులెవా 11ఎం11
ఇంకొకటి
నను పాలింప నడచి వచ్చితిఓ? నా ప్రాణనాధ 11 నను11
వనజనయన మోమునుజూచుట జీవనమనినెనరున మనసుమర్మము దెలిసి 11నను11
సురపతి నీలమణినిభతనువుతో నురమున ముత్యపు
సరులచయముతో కరమున శర కోదండ కాంతితో ధరణి
తనయుతో, త్యాగరార్చిత ! 11నను11
మరొకటి
నగుమోము గనలేని నా జాలి దెలిసి ,, సామజ వరగమన ,, మరుగేలరా,, పట్టి విడువరాదు , వివిధ తత్వాలు వంటివి ఎన్నొ రచించి కీర్తిచినారు త్యాగరాజులవారు. ఇలా చెప్పుకు పోతే చాల్లా వున్నాయి.
ఈయన భారతదెశమంతా ప్రాయణించి అన్ని ప్రదేశాలవారికి రాముని గుణ కీర్థించి చివరికి స్రీ రామునిలో లీనమైనారు.
మనవారు త్యాగరాజు కీర్తనలును గుర్తించి . త్యాగరాజ అరాధనోత్సవాలు జరుపుతున్నారు.
ఆదివారం, జనవరి 25, 2009
శుక్రవారం, జనవరి 23, 2009
అమ్మ కి ప్రేమ .
నవ మాసాలు మోసి చాలా బాధలు ను ఓర్చి బిడ్డను కంటుంది అమ్మ . అనుక్షణమూ తన కంటికి రెప్పలా కాపాడుతూ పెంచి పెద్ద చేస్తుంది. మంచి చెడులను, విచక్షణా జ్ఞానములను, బుద్దులను నేర్పుతుంది . మనము సమాజములో ఎలాబతకాలో నేర్పిస్తుంది. అమ్మ తన బిడ్డ ను గురించి చాలా కలలు కంటుంది . ఆ కలలను నిజాము చేసుకోటాని చాలా కష్టాలు పడుతుంది. అసలు అమ్మ ఆ కష్టాలని కష్టాలుగానే చూడదు. అవి కుడా సుఖాలుగానే భావిస్తుంది. ఇది నిజము. తన బిడ్డ పెరిగి పెద్దవాడై తనని చూడాలన్న ఆసతో బిడ్డ కోసము కష్టపడటం లేదు . కేవలము ఎటువంటి స్వార్ధము లేకుండా తనబిడ్డ పెరిగి ప్రయోజకుడై నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని. అందరు మెచ్చుకొనే స్థితికి చేరాలని . శ్రమిస్తుంది . ఆమె కోరుకున్న ఫలితము దొరికితే అమ్మ పడిన కష్టాలన్నీ ఎలామర్చిపోతుందంటే. అప్పటిదాకా ప్రసవవేదనను అనుభవించిన తల్లి బిడ్డ పుట్టినా మరు నిమిషానికి బిడ్డను చూసి ఆ సంతోశములో ఆమె పడిన వేదనను మరచినట్టుగా . ఆమె భాదలన్నీ మరచి చాలా సంతోషిస్తుంది.
తల్లి పిల్లలకోసము ఎంతటి త్యాగానికైనా సిద్దమై పోతుంది. బిడ్డ చెడిపోతుంది అని అనిపిస్తే తాళికట్టిన భర్తను సైతము లెక్కచెయదు. ప్రపంచములోచెడ్డ వారు వుంటారు కానీ. చెడ్డ తల్లులు అంటు వుండరట .
ఈ రోజులలో అమ్మని ఎవరు గౌరవంగా చూడటంలేదు . పెరిగి పెద్దఅయిన తరువాత పెరుతెచ్చుకొని ఆ అమ్మ తనకోసము చేసిన త్యాగాన్ని కష్టాన్ని మరచి .వివేకహీనులవుతున్నారు. ఇది విచారిచవలసినదే. ఆ తల్లిని ముసలి వారి నివాస గృహాలలో చేర్చుతున్నారు . ఇదేనా ఆమె కడుపున పుట్టి ఆమె ఋణము తీర్చుకోటము.
అమ్మకి బంగారాలు బాగ్యాలు ఇవ్వక్కరలేదు. అమ్మని ప్రేమగా చూసుకోండి చాలు. ప్రేమగా పలకరించండి చాలు.
నమస్తే .బాయ్.
బుధవారం, జనవరి 21, 2009
బుధవారం, జనవరి 14, 2009
పండుగ శుభాకాంక్షలు
అందరికి సంక్రాంతి పండుగ శుభాకాక్షలు . ఈ పండుగ అందరుకి సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ . శ్రీ వైష్ణవి .
మంగళవారం, జనవరి 13, 2009
తిరుప్పావై 30 వ పాశురము -ఫలశ్రుతి
ఆండాళ్ తిరువడి గలే శరణం :
గోదాదేవి గోపిక ఆ నాడు ఆచరించిన వ్రతమును తానూ అనుకరించి వ్రత సమాప్తి చేసి వ్రతఫలమును తానుకూడా పొందినది. శ్రీ కృష్ణ సమాగామంమును ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి తన ప్రియతముడగు శ్రీ రంగానాధుని భర్తగా పొందినది . శ్రీ రంగమునుండి రంగనాధుడు వ్రత సమాప్తి సమయమునకు తమ అంతరంగా భక్తులను ఆండాలమ్మ యుండిన శ్రీ విల్లిపుత్తురునకు పంపి ఆమెను శ్రీ రంగమునకు తోడి తెమ్మని ఆజ్ఞాపించెను .అంత భట్తనాదులు వారి శి ష్యులు వల్లభారాయులుతో సహా శ్రీ రంగమునకు ఆండాల్లమ్మను తోట్కుని వెళ్ళెను .అచట శ్రీ రంగనాధ స్వామీ అందరి సమక్షములో శ్రీ గోదాదేవిని తనలోచేర్చుకున్నారు. అందుచే గోదారంగానాయకుల కళ్యాణ దినమునకు భోగి ఆని పేరు .
భోగము = పరమాత్మ అను భావము
అది పోందినరోజును భోగి పండుగగా సార్ధకమైనది.
ఇలాఆండాళు వ్రతముచేసి ఆనాడు గోపికలు పొందిన ఫలమును తాను పొందగలిగినది. ఆ వ్రతము సర్వఫలముల నొసంగు నది. అందరు ఆచరించదగినది. ఇట్టి ఈ వ్రతము నాచరింపలేక పొయినను నిత్యము ఈ ముప్పై పాశురములు తప్పక అభ్యాసము చెయువారికి కూడా తాను చేసిన వ్రత ఫలము లభించాలని గొదాదెవి ఈ పాసురములొ ఆశించినది నిత్యము ముప్పై పాసురాలు చదువుటయే ముక్తికి హేతువు . ఈ లోకమున ఐశ్వర్యప్రధము అగు ఇట్టి వ్రతమును తప్పక అందరు ఆచరించి తరింతురుగాక.
గోదాదేవి తాను గోపికగనే వ్రతమునుచెసినది. ఫలము భగవత్ప్రాప్తి , అట్టి భగవానుడే పొదుటకై చేసినయత్నము పాల సముద్రమును ఆనాడు మధించుటలో కాననగును. మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చేయుటకంటె స్వామియే మనము పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమౄతమధన వృతాంతము నిందు కీర్తించుచున్నారు. ఈ ముప్పై పాశురములు పఠించిన వారికి ఆనాడు పాలసముద్రమును మధింపచెసిన లక్ష్మి ని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నంచి పొందును. ఇల్లా ఫలశ్రుతిని ఈ పాశురములో చేయుబడుచున్నది.
పాశురము:
వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జ్
అఙ్గప్పఱైకొణ్డవాత్తై , యణిపుదువై
పైఙ్గమలత్తణ్డెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న
శఙ్గత్తమిళ్ మాలై పుప్పదుం తప్పమే
ఇఙ్గిప్పరిశురై ప్పారీరిరణ్డు మాల్వరైత్తోళ్
శెఙ్గణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గుం తిరువరుళ్ పెత్తంబురువ రెంబావయ్.
తాత్పర్యము:
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపచేసిన లక్ష్మీ దేవిని పొం మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కుడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగువారును, విలక్ష్నణాభరణములు దాలిచిన వారు అగు గోపికలు చేరి , మంగళము పాడి, పఱ అను వాద్యమును లోకులకొరకును, భగవద్దస్యమును తమకొరకు ను పొందిరి . ఆ ప్రకారము లొకమునంతకును లోకమునకు ఆభరణమైఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామర పూసలమాలను మెడలొ ధరించిఉండు శ్రీ భట్టనాధుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పై పాశురములలో మాలికగా కూర్చినది.
ఎవరీ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో , వారు ఆనాడు గోపికలా శ్రీ కృష్ణుని నుండి పొందిన ఫలమును గూడ పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే , పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బాహుశిరస్సులు గలవాడును అగు శ్రీ వల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాధించును.
అని ఫలశ్రుతి పాడిరి.
ఆండాళ్ తిరువడి గళే శరణం , జై శ్రీమన్నారాయణ్ ,
సర్వేజనా సుఖినో భవంతు .
ఓం శాంతి శాంతి శాంతీః
సోమవారం, జనవరి 12, 2009
బోగి పండుగ శుభాకాంక్షలు
పండుగ శుభాకాంక్షలు . మన ఆంద్రులుకు సంవత్సరములో అతిపెద్ద పండుగ మూడురోజులు వరుసగా జురుపుకొనే పండుగ ఇది అందుకే దీనిని పెద్ద పండుగ అనికూడా అంటారు. మొదటిది భోగి, రెండోది సంక్రాంతి, మూడోది కనుమ . ఈ పండుగలను మనదేశములో అన్ని రాష్ట్రాలలోని జరుపుకుంటారు. కాకపొతే వాటికి వారివారి పేరులు ఉన్నాయి.
అసలు ఈ పండుగ జరుపుకోనుతకు ప్రత్యేకమైన కారణం ఏమిటంటే సంవత్సరములో మొదటి పంట చేతికి అందుతుంది దానికి సంతోషముతో ఈ పండుగలను ఆనంద ఉత్సాహాలతో జరుపుకొంటారు.
ఈ మూడురోజులు పండుగ చాలా బాగాజరుపుకుంటారు. అసలైతే ఈ నెలరోజులు పండుగ వాతావరణమే వుంటుంది .
చలి ఎక్కువుగా ఉంటుంది. ఈ నెలరోజులు తెలుగువారి లోగిలి చాలా అందముగా ముస్తాబవుతుంది . ప్రతీ ఇంట రంగురంగుల ముగ్గులతో చక్కని వాతావరనముతో ముచ్చట గొల్పుతూ వుంటాయి. ఆ రంగుల ముగ్గు మద్యలో గొబ్బెమ్మలు ను అలంకరించుతారు. సాయంత్రము సమయాలలో పోలాల్లోనుమ్డి బళ్ళు ధాన్యపు బస్తాలతో నిండి వస్తాయి. చాలా ఆనందముగా సందడిగా ఉంటుంది . ఈ నెల రోజులు.ఆ నెల రోజులు, పగటి వేషగాళ్ళు, హరిదాసులు ,గంగిరేద్దులువాళ్ళు వస్తూవుంటారు .
భోగి పండుగ జనవరి 13 వ తారికున వస్తుంది . భోగి రోజు తెల్లవారుజాముననే లేచి నలుగు పెట్టుకొని స్నానాలుచేసి భోగి మంటను వెలిగిస్తారు . ఈ భోగి మంట లో పాత కర్ర సమానులు వంటివి పనికిరాని వన్ని వేసి చలిని పారగోలుపుతారు. ఈ పెద్ద పండగకి కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి తప్పకుండా వస్తారు. బావా మరదళ్ల ఆటలు అల్లర్లుతో పండుగ చాలా సంతోషకరమైన శోభ తో ఉంటుంది. ఈ పండుగని రాయి తులు పండుగ అని కుడా అంటారు.
ఈ పండుగకి ముగ్గులులో గొబ్బెమ్మలు పెడతారు వాటి చుట్టూ పిల్లలు అన్నమాచార్య రచించిన గొబ్బెమ్మల పాట్లు పాడతారు.
కొలని దోపరికి గొబ్బిళ్ళో !
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికి గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవుల గాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యులకెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో
పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున గంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో
దండివైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిబైడి యగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో
అనే పాటలు పాడుతూ వాటి చుట్టూ తిరుగుతారు. సాయంత్రము సమయములో చిన్నపిల్లలకు బోగిపల్లును దిస్తితీసి వారి తలమీద పోస్తారు. దీనికి పెరంటాల్లను పిలిచి బోగిపళ్ళు పోస్తారు. ఈ బోగిపల్లలోకి శనగలు , పువ్వులు , అక్షింతలు, డబ్బులు, చెరుకుగడలు, రేగుపళ్ళు వేసి పిల్లలకు దిష్టితీసి తలమీదవేసి ఆసిర్వాదిస్తారు. బొమ్మల కొలువు పెట్టి పేరంటాలకి పసుపుకుంకుమలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు.
ఈ బోగి రోజు నెలరోజులు ధనుర్మాసము వ్రతము చేసిన గోదాదేవి రంగానాధునిని వివాహము చేసుకొని స్వామీ వారిలో ఐక్యము అయిపోతుంది. అందువలన అప్పటినుండి భోగిరోజు గోదా రంగానాయకులవివాహాలు ఆలయాలలోజరుపుతారు. ఈ వివాహము చూడటానికి రెండుకళ్ళు చాలని విధముగా చేస్తారు. ఇలా భోగి పండుగ ముగుస్తుంది.
తిరుప్పావై 29 వ పాశురం-ఎన్నెన్నో జన్మల బందం
ఆండాళ్ తిరువడి గలే శరణం :
మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షము నకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి.
కాని వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు . శ్రీ కృష్ణునితో కలసి మరి ఎడబాటు లేకుండా వానికి కింకర్యము చేయవలెనని కాంక్షిస్తున్నారు. స్నానమను చోట భగవదత్ప్రాప్తి యనియు పరయను చోట భగవత్
కైంకర్యము అనేది పరమ పురుషార్దము అని అభిప్రాయము వచ్చునట్లు వారిమ్తవరకు మాట్లాడుతున్నారు.
ప్రధానంగా తెలుసుకోవలసినవి రెండు విషయాలున్నవి ఇరవైఎనిమిది , ఇరవై తొమ్మిదో పాశురాలలో వివరించి వ్రతమును పుత్ర్తి చేస్తున్నారు. ముప్పైవ పాసురములో ఫలశ్రుతి.
మొదటి పాసురమున గోపికలు ఈ వ్రతమును ప్రారంభించారు.
అయితే గోపికలు ఈ పాసురములో తమ హృదయము నావిష్కరిమ్చి తమ వ్రతమును సమాప్తము చేసి మనము కూడా తరించవలెనని ఈ పాశురములో స్పష్టముగా వివరించినారు.
పాశురము :
శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్
పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ
కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;
ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,
మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్
తాత్పర్యము:
బాగా తెల్లవారకముందే నీ వున్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపువ్వులవలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ఫ్రయోజనమును వినుము, పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములయిన కోరికలేవియు లేకుండునట్లు చేయుము.
స్వామీ వివేకానందుడు - సూక్తులు పాటిద్దామా ..........?
వివేకానందుడు: ఈ రోజు వివేకానందుని పుట్టినరోజు . ఈ రోజు ఆయన సూక్తులు ఒకసారి మననం చేసుకుందామా......
ఎవరినీ తప్పు పట్టవద్దు , నిందించవద్దు
సహాయపడగలిగితే సాయంచేయ్యి
లేకపోతె ఆశీర్వధించి పంపివేయు
మనలను మన ఆలోచనలే తీర్చు దిద్దుతాయి
మాటలదేముంది ఆలోచనలే కలకాలం ఉంటాయి .
సుదూరము ప్రయాణము చేస్తాయి .
దేవుడు ఎక్కడో లేదు . నీలోనే ఉన్నాడు.
ప్రతీ జీవిలోను ఉన్నాడు.
ఇతరులకి మనము ఎంత మేలుచేస్తే
మన హృదయాలు అంత పవిత్రమవుతాయి.
అందులోనే దేవుడున్నాడు.
ఈ విధముగా ఆ మహనీయుడిని గుర్తు చేసుకోవటం చాలా సంతోషముగా వున్నది . ఆయన సూక్తులను పాతిదాం మరి.
ఆదివారం, జనవరి 11, 2009
తిరుప్పావై 28 వ పాశురము -అన్నింటికి శ్రీ కృష్ణుడే
ఆండాళ్ తిరువడి గలే శరణం :
గోపికలు శ్రీ కృష్ణునితో అన్నారు మేము మార్గ శీర్ష స్నానము చేయవలెనని వచ్చాము . మాకు మా వ్రతమునకు కావలసిన పరికరములు అడిగారు. ఆ వ్రతము చేసిన తర్వాత తామూ పొందవలసిన ఆభరణములను, వస్త్రములను, భోగములను ప్రార్దిమ్చినారు .
శ్రీ కృష్ణునకు వారు హృదయము తెలియును. ఇదంతయు లుకిక వ్రత గాధ కాదు. వీరు కోరునవి లుకిక వ్రతోపకరనములు కావు. ఆముష్మిక ఫలమునండుతకే వీరు కోరుచున్నారు. కాని వీరి నోటివేమ్తనే దానిని చెప్పిమ్చవలెను అని తలంచి ఇట్లు అడిగినారు.
ఓ గోపికలారా ! మీరు కోరినవన్నియు చాలా చక్కగా వున్నాయి. మీరు " పరిశీలించి కృపచేయమని" అని అన్నారు.
కదా పరిశీలించినా మీ అభిప్రాయమేమో నాకు తోచటంలేదు. వ్రతము చేసి మహత్తరమైన అలంకరనములను భోగములను అందవలెనన్నా దానికొక అదికారము ఉండాలి కదా? ఫలమునాశించిన మీరు ఆ ఫలాప్రాప్తికి ఏదోఒక యత్నము కుడా చేసి యుండాలి కదా? మా కది కావాలని అన్నంత మాత్రమున నేను ఇచ్చుటకు వీలుకాదు. దానికి తగిన యోగ్యతా మీకున్న ఇవ్వగలను. కావున మీకున్న అధికారము అనగా మీ యోగ్యతా ఎట్టిదో వివరించుము. ఫలమును అందగోరు వారు దానికి సాధనమునుగూడ సంపాదిమ్పవలేనుగాడా? మీరు అట్టి సాధనమును దేనినైనా ఆర్జించినారా ?
ఇట్లు అడుగగానే గోపికలు తమ హృదయము విప్పి చెప్పుచున్నారు .
గోపికలు కామ్క్షిమ్చునది పరమ పుశార్ధముఅగు నారంట భగవత్ పురక భవత్కైమ్కర్యము. దానికి వరేమియు యోగ్య తను సంపాదించుకొని రాలేదు . పరమాత్మే ఉపాయముగా నమ్మిన వారు, వాటి కంటే వేరే ఉపాయము తాము పొందుటకు ప్రతిభందకములని తెలుసుకున్నవారు. కర్మలు చేసి, జ్ఞానము సంపాదించి, భక్తి తో ఉపాసించి పరమాత్మను పొందాలని తలంపు వీరికి లేదు. వాడె వానిని పొందించ వలెనని నమ్మినవారు. అందుచే ఇట్లు భగవానుడే యుపాయమని నమ్మకము కలవారు. భగవానుని ముందు ఏమి విజ్ఞాపనము చేయవలెనో ఆమాటలను గోపికలు ఈ పాసురమున వివరిచుచున్నారు .
పాశురము :
కఱవైగళ్ పిన్ శెన్ఱు కానం కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో
డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్
తాత్పర్యము:
పశువుల వెంట వానిని మేపుటకై అడవికిపోయి. అచటనే శుచినియమములు లేక తిని, జీవిమ్చియుమ్డుతయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియు జ్ఞానములేని మాగోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మిచిన పుణ్యమే మాకున్న పుణ్యము . మాకెన్ని లోపాలున్నా తీర్చగాల్గినట్లు ఏ లోపము లేని వాడవు కదా నీవు. గోవిందా! ఓ స్వామీ ! నీతో మాకుగల సంబంధము పోగొట్టుకోన వీలుకాదు . లోక మర్యాదనేరుగని పిల్లలము. అందుచే ప్రేమవలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలచినాము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములననుగ్రహింపక ఉండకుము. మాకు ఆపేక్షితమగు పరను పరను ఇవ్వుము.
శనివారం, జనవరి 10, 2009
తిరుప్పావై 27 వ పాశురము - పరమాత్మతో కలసి పరమాన్నం
ఆండాళ్ తిరువడి గలే శరణం:
గోపికలు తామూ ఆచరించబోవు మార్గ శీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాసురమున విన్నవిమ్చినారు. అందు వారడిగిన ద్రవ్యములు సులభాములేయైననాను వారు కోరిన వారు కోరిన గునముఅలు గల ద్రవ్యము దుర్లభాములు. అందుచే శ్రీ కృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను గోరుట కాదు , నన్నే కోరి వీరీ వస్తువులను కోరినారు. అనుకొనెను.
పాచజన్యమును పోలిన శంఖములను కోరారు. మరి అల్లాంటి శంఖము దొరకదు. ఆ శంఖము శ్రీ కృష్ణుని వీడదు. అందుచే శ్రీ కృష్ణుడే శంఖధరుడై తమతో నుండవలెనని వారు కోరారు.
చల్లా పెద్ద పర కావలెనని గోపికలు కోరారు . శ్రీ కృష్ణుడు త్రివిక్రమావతారమున జాంబవంతుడు త్రివిక్రముని విజయమును చాటుచు వాయించిన పరయోకటి కలదు. శ్రీ కృష్ణ రుపముననున్న నేను కుంభ నృత్యము చేయునప్పుడు కట్టుకొని వాయించిన పర చాల పెద్ద పర. ఈ మూడింటిని ఇచ్చెదనని శ్రీ కృష్ణుడు గోపికలకు చెప్పెను. మంగళా శాసనము చేయువారు కావలెనని కోరిరి. మంగళా శాసనము చేయువారెచట నున్న పరమాత్మయే వారి వెంట నుండునని వీరీ అభిప్రాయము.
తమ దేవేరియగు శ్రీ మహాలక్ష్మి నే మంగళ దీపముగా వారితో ఉండునట్లు అంగీకరించెను . జెండా గరుత్మంతుడు . వారికి గరుడునికుడా ఒసగుటకు శ్రీ కృష్ణుడు సమ్మతించెను.
తరువాత చాందినీగా అనంతునే పంపనంగీకరించెను. మధురా నగరమున జన్మించి వ్రేపల్లెకు వచ్చిన ఆ రాత్రి వర్షమున శ్రీ కృష్ణునకు మేలు కట్టుగా తన పడగలనుపయోగించిన మహానీయుడు కదా! అనంతుడు, పడగ, ఆసనము, వస్త్రము, పాదుకలు, తలగడ, చత్రము, చాందిని మొదలగున్నవి విధముల సర్వేస్వరునకు తన శరీరమును భిన్న భిన్న రుపములుగాకుర్చి యుపయోగపడి తనచేతలచే శేషుడు అను పేరు పొందిన మహనీయుడు. వీరు కూడా శేషత్వమునే కోరుతున్నవారగుటచే , శేషునే వారికి చాందినిగా ఇచ్చెను .
ఇలా పరికరములన్నీ సమకూరినవి కదా ! ఇక మీ వ్రతమునకు ఫలమేమో వివరించమని స్వామీ కోరగా ........... గోపికలు ఈ పాసురమున ఈ వ్రతాచరనముచే తామూ పోంద కోరిన ఫలమును వివరించుచున్నారు.
పాశురము:
ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు
తాత్పర్యము:
తనతో కూడని శత్రువులను జయిమ్చేది కళ్యాణ గుణ సంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పర అను వాద్యమును పొంది పొందదలచిన ఘన సన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండును. చేతులుకు గాజులు మొదలుగు ఆభరణములు , బాహువులకు డందకదియములు , చెవి క్రిందు భాగమున దాలెచేది దుద్దు, పై భాగమున పెట్టుకొనే కర్ణపువ్వులు, కాలి అందెలు మొదలుగు అనేక ఆభరణాలు మేము ధరించాలి. తరువాత మంచి చీరలను దాల్చి వుండాలి. దాని తరువాత పాలు అన్నము మున్నగున్నవి నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా హాయిగా భుజిమ్చవలెను. గోపికలు తమ వ్రత ఫలమును ఇందులో వివరించారు.
శుక్రవారం, జనవరి 09, 2009
తిరుప్పావై ౨౬ వ పాశురం
ఆండాళ్ తిరువడి గలే శరణం :
శ్రీ కృష్ణ పరమాత్మ గోపికల మాటలకు పరమానందము తో వారిని చుచుతూ ఉండిపోయాడు. వారి ముఖ మండలమును, నేత్ర ములను , వక్షస్థలమును , నడుమును చూచుచు ఇతర స్పృహ లేనంతగా వ్యామోహముతో పరవశమై ఉన్నాడు .
వారి మాటలు విని మరి కొన్ని వినాలన్న కోరికతో ఒక ప్రశ్న అడిగెను " గోపికలారా ! నన్నే కోరి వచ్చాము అని చెప్పారు . మరలా నీకిష్టమైనచో పర అను వాద్యమును ఇమ్మని అంటున్నారు. నన్నే కలియవలేనని కోరిక ఉన్నవారు వేరోకదానిని కాంక్షించారు కదా?
మీరు పర అడుగుటలో ఉద్దేశ్యము ఏమి? మీ కోరిక విషయములో నాకు సందేహముకలుగుతున్నది. అని శ్రీ కృష్ణుడు వారిని ప్రశ్నించెను.
వారు దానికి భగవద్ ప్రీతి కొరకు మా పెద్దలు ధనుర్మాస వ్రతము చెయ్యమన్నారు. మేము పెద్దల యెడ ఉపకారబుద్ధితో ఈ వ్రతము ఆచరించ బూనినాము. అని గోపికలు చెప్పారు.
అంత శ్రీ కృష్ణ పరమాత్మ సరే కానిండు. అయితే ఆవ్రతము ఏమి ? దానికి ప్రమాణము ఏమి ? దానికి కావలిసిన పదార్ధాలు ఏమి ? అవి ఎన్ని కావాలి? వివరాలు తెలపండి. అని అడిగెను. అంత గోపికలు ఈ వ్రతమునకు కావలసినపరికరములు అర్ధించుచున్నారు. ఈ పాశురములో
పాశురము:
మాలే మణివణ్ణా మార్-గరి నీరాడువాన్
మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
ఆశ్రిత వ్యామోహముకలవాడా! ఇంద్ర నీలము అను మణిని పోలిన కాంతియు, స్వభావమును కలవాడా! అఘటిత ఘటనా సామర్ధ్యముచే చిన్న మర్రియాకుపై అమరి పరుండువాడా ! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరాలు అర్ధించి నీ వద్దకు వచ్చితిమి . ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరాలు విన్నవించేదము.
ఈ భూమండలమంతను వణుకుచున్నట్లు శబ్ధము చేయు , పాలవలె తెల్లనైన , నీ పాంచజన్యమనబడే శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద "పర " అను వాద్యము కావాలి మంగళ గానము చేయు భాగవతులు కావాలి. మంగళ దీపములు కావాలి. ధ్వజములు కావాలి. మేలుకట్లు కావాలి. పై పరికరములు ను క్రుపచేయుము అని గోపికలు శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి.
సర్వ శ క్తిమంతుడవై మాకోరకు శ్రీ కృష్ణుడు వై సులభుడవైన నీవు మాపై దయ చూపి మా వ్రతమునకు కావలసిన పరికరములు నోసగుమని గోపికలు ఈ పాశురములోప్రార్ధించినారు.