Blogger Widgets

సోమవారం, ఏప్రిల్ 15, 2013

గురునానక్ దేవ్

సోమవారం, ఏప్రిల్ 15, 2013

గురునానక్ దేవ్ 1469 ఏప్రిల్ 15 న పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్ లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. ఇతను హిందూ మరియు ఇస్లామియా మత గ్రంథాలు చదివాడు కానీ ఇతను ఈ రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతమును స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతము. వీరు ఏక్ ఓంకార్(ఏకైక దేవుడు)ని నమ్మతారు.  సిక్కు మతము గురునానక్ ప్రభోధనల ఆధారంగా యేర్పడిన మతము. ఏకేశ్వరోపాసన వీరి అభిమతము. సిక్కు మతములో దేవుని పేరు "వాహే గురు". వీరి పవిత్ర గ్రంధము గురుగ్రంధ సాహిబ్ లేదా ఆది గ్రంధము లేదా ఆది గ్రంధ్. వీరి పవిత్ర క్షేత్రము అమృత్ సర్ లోని స్వర్ణ మందిరము. ఈ మతాన్ని అవలంబించేవారిని సిక్కులు అని సంబోధిస్తారు. వీరు ప్రధానంగా పంజాబు (భారతదేశం మరియు పాకిస్తాన్) లలో నివసిస్తుంటారు. మరియు ప్రపంచమంతటా వ్యాపించియున్న సమూహం.
శిక్కు మతం, కాలంలో చూస్తే చాలా చిన్నది. దీని వయస్సు లూధర్ మతానికున్న వయస్సు ఎంతో అంత. దీనిని పదిహేనవ శతాబ్దంలో గురునానక్ స్థాపించాడు. గురునానక్ తల్వాండి (ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నది) లో 1469 లో జన్మించాడు. గురునానక్ చిన్నప్పుడు నుండి ఎక్కడో చూస్తుండేవాడు. దేనిని గురించో దీర్ఘంగా ఆలోచిస్తుండేవాడు. అందువల్ల పెరిగి పెద్దవాడయ్యాక గూడా అతడికి ఈ ప్రాపంచిన విషయాలు రుచింవ లేదు. అతడు 1539 లో పరమపదించారు.
శిక్కులకు దేవుడు అమూర్తి సత్యసూత్రం. దీనినే వారు విశ్వసిస్తారు. " ఇది అనేకం కాదు ఒక్కటే" విశ్వాంతర్యామి. పుట్టదు. గిట్టదు. తిరిగి పుట్టడానికి ఇదే వారి ప్రార్థన. మూడవ గురువు ఇలా అన్నాడు

అపూర్వ దేవతలను పూజించావారి
జీవితాలు, నివాసాలు అభిశప్తాలవుతాయి
వారి అన్నం - ప్రతిముద్ద - విషపూరితమవుతుంది
వారి దుస్తులు విషమయాలవుతాయి
వారిజీవితాలు కడగండ్ల పాలవుతాయి
తదనంతర జీవితం నరకం

ఇస్లాం లోని దైవాధీనతా వాదాన్ని బహిరంగంగానె వీరు నిరసించారు. "మీ జాతకాలను నిర్దేసించేది దేవుడు కాదు. మీ భవిష్యత్తును మీరే మలచుకోండి" అన్నాడు గురునానక్. శిక్కు మతం పునర్జన్మలను, కర్మవాదాన్ని అంగీకరిస్తుంది. కాని ఒకడు పునర్జన్మ శృంఖలాలనుంచి బయటపడాలంటే, ముక్తి పొందాలంటె, అతడు మానవుడు కావాలి. మనిషి అయితే (మానవత్వం ఉన్న) మోక్షం లభిస్తుంది. ఒకరు 8,400,000 జీవరూపాలను ఎత్తిన (జైన మతం ప్రకారం) తరువాత మోక్షం లభిస్తుందా. లెక తన వెలుగు దేవుని వెలుగులో మిళితం చేయడంతో ముక్తి లభిస్తుందా అనే విషయం అతడి జీవితం (మానవ జీవితం) నిర్ణయిస్తుంది.
మంత్ర పఠనం చేస్తూ "సత్ నాం, వహ్ గురు" (నిజమైన నామం అద్భుత గురువు) ను జపించడానికి శిక్కుమాంలో మంచి ప్రాముఖ్యం ఉంది. కాని గురువులు కేవలం మానవులు పదవ గురువు ఇలా అన్నాడు.

నేనొక మతాన్ని స్థాపించి, దాని నియమాల
నేర్పరుప నియుక్తుడయ్యాను
నన్నెవడైనా దేవునిగా భావిస్తే
అతడు అశక్తుడవుతాడు, వినాశమవుతాడు

వారి మతంలో మానవ పూజ లేదు., ఏదైనా పూజింపబడితే అది ఒక పుస్తకం. "గ్రంథ సాహిబ్". ప్రత్యేక సమయాలలో దీనిని అట్ట నుంచి అట్ట వరకు చదువుతారు. కొన్ని గృహాలలో నిత్యం ఈ గ్రంథ భాగాలు పారాయణం చేయబడతాయి.

శనివారం, ఏప్రిల్ 13, 2013

కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడేయండి

శనివారం, ఏప్రిల్ 13, 2013

హాయ్! 

ఎన్నో అద్భుతమైన ప్రశ్నలతో  , సరదా సరదా మాటలతో ,  కధలు - పద్యాలు- ఆటలతో, మీరు కోరిన పాటలతో ,  మీతో సరదాగా మాట్లాడేస్తూ మిమ్మల్ని నవ్వుకునేలా,  రోజు అంతా సంతోషంగా వుంచటానికి  మీ ముందుకు వచ్చేస్తున్నాను మీ చిన్ని  RJ Sree Vaishnavi ని .  ఎలా అంటే ప్రతీ ఆదివారము    10:00 am to 12:00 pm వరకు  మీ అభిమాన online RadioJoshLive Masth Maza Masth Music :)  లో  నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా! 
మరి నాతో మాట్లాడాలి అంటే   ఈ నంబర్స్ కి కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడే యండి .  
INDIA= +91 04042410008
USA = +19142147475
Skype Me™!
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com

గురువారం, ఏప్రిల్ 11, 2013

కొత్త రోజుకి కొత్తరోజు

గురువారం, ఏప్రిల్ 11, 2013

ఉగాది తెలుగు వారి పండుగ ఈ పండుగ తో తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగనే సంవత్సరాధి అని కూడా అంటారు. ఈ సంవత్సరం పేరు   విజయ .  దీనిని  విజయ నామసంవత్సరం అంటారు. 
ఉగాది పండుగరోజు ఉదయమునే లేచి, తలంటు స్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు.  ఇంటిని మామిడితోరణాలతో పూలదండలతో అలంకరిస్తారు.  పరగడుపున ఉగాది పచ్చడి తినటం ఈ పండుగ ప్రత్యేకత. ఈ పచ్చడిలో చేదు, పులుపు, ఉప్పు, తీపి , వగరు, కారం అనే ఆరు రుచులు వుంటాయి. 
మరి పచ్చడి చెయడానికి  వేప పూత, మామిడి, ఉప్పు, బెల్లం, కారం, చింతపండు వేసి పచ్చడి తయారుచేస్తారు.
ఈ పచ్చడి జీవితంలో మనకు కలిగే తీపి లాంటి సుఖాలను, చేదులాంటి కష్టాలను,సమానంగా అనుభవించాలని తెలుపుతుంది.  ఈ పచ్చడి తినడం ఆరోగ్యానికి కూడా మంచిది.
ఈపచ్చడి  వసంతలక్ష్మి కి నైవేద్యంపెట్టి అందరు స్వీకరించి కొత్త సంవత్సరానికి సంతోషంగా ఆహ్వానిస్తారు.
ఉగాది రోజు సాయంత్రం గుడి ఆవరణలో పురోహితుడు పంచాంగం వినిపిస్తారు.  రాబోయే సంవత్సర్ ఫలితాలు , పాడి ఫంటలు ఎలా వుంటాయో చెబుతారు. మనకు జరగబోయే మంచి చెడులు చెపుతారు.  దీన్నే పంచాగశ్రవణం అని అంటారు.  ఇది చాలా ఆసక్తికరంగావుంటుంది. ఈ పండుగ ను అందరు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అని  నాకు మా స్కూల్లో చెప్పారు.


యుగయుగాలు గడుపుతూ  యుగాది మళ్ళీ వచ్చింది
కొత్త రోజుకి కొత్తరోజు  కొత్త కొత్తది తెచ్చింది. .
చేయీ చేయీ కలపండి స్నేహ హస్తమీయండి
మనసు లోన ఉన్న చెడునంతా   మట్టి లోన కలపండి
మనసున  భేదభావమును  మానండి
బ్లాగుద్వారా తెలుగున వున్న అంద చందాలను లోకానికి చాటండి. 
దేశ భాషలందు తెలుగు లెస్స అన్న   
శ్రీ కృష్ణదేవరాయలు మాటలను రుజువు  చేద్దాం 
ఈ విధంగా నందన సంవత్సరానికి వీడ్కోలు తెలిపి   
విజయ నామ  సంవత్సరానికి స్వాగతమిద్దాం !
నవ యుగాదికి నవ్వుతు స్వాగతించుదాం .
అందరికి ఈ  విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు .
ఉగాది పండుగను  సంతోషంగా జరుపుకుందాం.

ఈ సంధర్భంగా నా బ్లాగు మిత్రులు అందరుకు విజయ  నామ సంవత్సర శుభాకాంక్షలు.

నా జన్మదినము

నేడు నా జన్మదినము కావునా మీరందరూ నన్ను ఆశిర్వదించండి.  అలాగే ఈరోజు ఉగాది కదా! అందరికి విజయనామ సంవత్సర శుభాకాంక్షలు. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)