స స ని స గ స ! మ గ స ! స స ని స గ స ! ప మ గ స ! స స ని స గ స ! మ గ స ! స స ని స గ స ! ప మ గ స ! స స గ గ మ ! గ మ ప ని ! ప ప ని ని స ! ప ని స గ ! మ గ స ని ! ప మ గ స ! ని స గ గ ! స గ మ మ...
ధిమి ధింకి తొంగ తొంగ ధి ధిమీక్కియారే
మమారె పాత్రారావో మజ్జా ! మజ్జా !
కమలనాభుని తమ కపుటింతి నీకు
అమరె తీరుకో ఇదే అవధరించగదో (తిరు తిరు ౩)
స స ని స గ స ! మ గ స !
స స ని స గ స ! ప మ గ స !
స స ని స గ స ! మ గ స !
స స ని స గ స ! ప మ గ స !
స స గ గ మ ! గ మ ప ని !
ప ప ని ని స ! ప ని స గ !
మ గ స ని ! ప మ గ స !
ని స గ గ ! స గ మ మ...
ఝక ఝక్క ఝం ఝం ఝణకీనానీ
ప్రకటపూ ముఱువొప్పె భళా ! భళా !
సకలపతికి సరసపు కొమ్మ
నీ మొకశిరి మెరసే చిమ్ముల మురిపెముల (తిరు తిరు 3)
స గ స ! మ గ స ! ప మ గ స ! ని ప మ గ స !
స గ స ! మ గ స ! ప మ గ స ! ని ప మ గ స !
స గ స ! స మ గ ! స ప మ ! స ని ప ! స స ని !
స ని ప మ గ ! ని ప మ గ స ని !
ని స గ గ ! స గ మ మ..
మాయి మాయి అలమేలుమంగ నాంచారి మతి
బాయని వేంకటపతి పట్టపురాణీ
మ్రోయ చిరుగజ్జలని మ్రోతలాడీని
సోయగమైన నీ సొలపు చూపమరే (తిరు తిరు ౩)
అన్నమాచార్యులవారు రాసిన పాట తిరు తిరు జవరాల తి తి తి తి. ఈ పాట నాకు చాలా బాగ వచ్చు.నాకు చాలా ఇష్టమైన పాట కూడా.
నాకు ఈ పాట నేర్చుకోటానికి 4 రోజులు పట్టింది. lyric రావటానికి మరి పాట పూర్తిగా రావటానికి 10 రోజులు పట్టింది.
మీరు కూడా నేర్చుకొంటారని. నేను ఈ పాటని మీకోసం పోస్ట్ చేస్తున్నాను. మరి నేర్చుకోండి.
ఈ రోజు భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు .1904సం.అక్టోబర్ 2వ తేదిన ఉత్తరప్రదేశ్ లోని మొగలాయ్ సరాయ్ గ్రామంలో తండ్రి శారదా ప్రసాద్ రాయ్ శాస్త్రిగారు. గాంధిగారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో ను , సత్యాగ్రహము లోను పాల్గొనుటకు ఉత్సాహంగా వుండెవారు . అప్పుడు జైల్లోకూడా స్వాతంత్ర్యము తర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశాడు. స్వాతంత్ర భరత దేశానికి నెహ్రు మొదటి ప్రదాని , నెహ్రు తరువాత లాలబహదుర్ శాస్త్రిగారు రెండవ ప్రదాని గా ప్రమాణ స్వీకరము చేసారు. ఆయన. 1965 యుద్ధంలో పాకిస్తానును కాళ్ళబేరానికి తీసుకువచ్చాడు. తాష్కెంటు లో పాకిస్తానుతో సంధి చర్చలకు వెళ్ళినపుడు 1966 జనవరి 11 న గుండెపోటుతో మరణించాడు. మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది.
ఈరోజు అయనను మనం తలుచుకొని అయనికి నివాళి అర్పిద్దాం.
అందరికీ నమస్కారము. ఈ రోజు మన జాతి పితా గాంధి తాతగారి పుట్టినరోజు.ఈరోజు గాంధిగారిని ఒకసారి స్మరించుకుందాము.
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
జన్మ నామం:మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జననం: అక్టోబరు 2, 1869 పోరుబందరు(గుజరాత్) మరణం: జనవరి 30, 1948 హత్య చేయబడ్డాడు వృత్తి :న్యాయవాది పదవి :మహాత్మ, జాతి పిత భార్య/భర్త :కస్తూర్బా సంతానం:హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ తండ్రి: కరంచంద్ గాంధీ తల్లి: పుతలీ బాయి గాంధి గారు చిన్నప్పటి నుండి మంచి మంచి కదలు విని inspire అయ్యేవారు. ఆయనకు చత్రపతి శివాజి, భగవత్ గీత వంటి వి ఆయన జీవితంపై గొప్పప్రభావము చూపించాయి అనటంలో అసత్యము లేదు. గాంధి గొప్పస్వాతంత్ర సమర యోధుడు. మనభారతీయులందరు చేత పూజలు అందుకుంటున్నారు.ప్రజలు అయనని జాతి పితగా గుర్తించారు. పిల్లలు బాపుజీగా తలుస్తారు. గాంధి గారు సత్యాగ్రహము, సహాయ నిరాకరణ ఉద్యమము , అహింసా వంటివి ఆయన పాటించేవారు. గాంధిగారు అహింస అనే అనే అస్త్రముతోనే మనదేశాన్ని పరిపాలించటానికి వచ్చిన బ్రిటిష్ వారిని వారిదేశానికి పారిపోయేలా చేసింది. గాంధిగారు, నారవస్త్రము , చేతికి కర్ర, కళ్ళకు అద్దాలు, కలిగివుండేవారు. ఈయన మాట సత్యమేవ జయతే. ఈరోజు గాంధిగారి పుట్టినరోజు నుNon-violence dayగా జరుపుకోవాలి . ఈ సంధర్బములో నా బ్లాగ్ మిత్రుల తరుపునా నా తరుపునా గాంధితాతకు నివాళి అర్పిస్తున్నాను.
దసరా కదండి అందరు బొమ్మల కొలువులు పెడతారు కదా అప్పుడు బొమ్మల పెళ్ళి కూడా పెడతారు కదా అందులో బొమ్మల పెళ్ళి కూడా పెడతారు అందుకు పాటలు పాడతాం కదా అందుకు నేను చిట్టి చిట్టి బొమ్మల పేళ్ళి పాట నేర్చుకున్నాను మీరు చూడండి.