Blogger Widgets

శుక్రవారం, డిసెంబర్ 29, 2017

ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ?

శుక్రవారం, డిసెంబర్ 29, 2017

ఇంతవరకు తొమ్మిదిమంది గోపికలని మేల్కొల్పినారు. పదవ గోపికను ఈ పాశురములో మేల్కొల్పుతున్నారు.  దీనిలో ముందుగా భాగావ్ద్భాక్తులను మేల్కొల్పుతారు. తరువాత భగవానుని మేల్కొల్పుతారు. మొదటి పదిహేనవ పాశురాలలో మొదటి ఐదు పాశురాలుచే  ఈ వ్రతము నాకు పుర్వరంగామును తెలిపి తరువాత పది పాశురాలలో పది మంది గోపికలను మేల్కొల్పినారు . దీనితో భగవద్ ఆలయములో చేరుకొనుటకు అర్హత కలిగెను. ఇంతవరకు భగవద్భాక్తుల విషయమున ప్రవర్తింపవలసిన విధనములు నిరూపించి ఈ పాశురములో దాని ఫలమును నిరుపించబడుచున్నది. ఇంతవరకు భాగాత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరిచారు గోదామాత. అట్టి సాధన చేయుటచే ఏర్పదవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలగుట. అది పుర్ణంగా తొలగినాడు గాని ఆచార్య సమాస్రయనముస్ మంత్రము లభించి భగవదనుభావము కలుగదు . ఇట్టి పరిపూర్ణ స్తితినంది యున్న గోపిక ఈనాడు మేల్కొల్ప బడుచున్నది.   ఈమెను ఏవిదంగా లేపుచున్నారో కదా! ఈ పాశురమున లోపల ఉన్నా గోపిక కుబయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది. వారి మద్య సంబాషణ ఎలావుందంటే.
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో కోసం చిత్ర ఫలితం

పాశురము:
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్ 


తాత్పర్యము:

బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ?
లోని గోపిక: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి. నేను ఇదే చెప్పుచున్నాను.
బయటి గోపుకలు: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము కాఠిణ్యము మాకు ముందే తెలియును.
లోని గోపిక : మీరే నేర్పు కలవారు. పోనిండు ! నేనే కఠినురాలను.
బయటి గోపిక : నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా !
లోని గోపిక: అందరు గోపికలు వచ్చినారా. 
బయటి గోపికలు: వచ్చిరి , నీవు వచ్చి లెక్కించుకో .
లోని గోపిక: సరే , నేను వచ్చి నేను ఏమి చెయ్యాలి ?
బయటి గోపికలు: బలిష్టమగు కువయాపీడము అను ఏనుగును చంపినవాడను శతృవుల దర్పమును అణచినవాడను , మాయావి అగు శ్రీ కృష్ణుని కీర్తిని గానము చెయుటకు రమ్ము.   లెమ్ము మాతో వచ్చి చేరుము అని లోపలి గోపికను లేపినారు.

గురువారం, డిసెంబర్ 28, 2017

నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపెడియట్లు మాట ఇచ్చినావు మరచిపోయావా?

గురువారం, డిసెంబర్ 28, 2017

ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపుతానని చెప్పినది  ఆ గోపిక ఈనాడు  మేల్కొల్పబడుచున్నది . ఈమె వీరి సంఘమున కంతకూ నాయకురాలై నడిపించగల శ క్తిగాలది .
తన పూర్వ అనుభావముచే ఒడలు మరచి తానూ చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరిచి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తానూ ఉండిపొయినది .
ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట గలదు . పెరటివైపున వున్నా ఆ తోటలో దిగుడు బావికలదు. ఆ దిగుడు బావిలో తామర పూలు , కాలువలు , ఉన్నవి ఆమె తన్మయత్వముతో అనుభావిచుచు ఇతర విషయాలనే  మరచిఉన్నది. అట్టి స్థితిలో ఉన్నా గోపికను నేడు మేల్కొల్పుతున్నారు .

 పాశురము: 

ఉంగళ్ పుళ్ళైక్కడై తోట్టత్తు వావియుళ్
శెంగళ్లునీర్ వాయ్ నెగిళ్ న్దు ఆమ్బల్ వాయ్ కుమ్బినగాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:  
స్నానము చేయుటకు గోపికల నేల్లరను మేల్కొల్పుతాను అని చెప్పి నిద్రపోవుచున్న ఒక గోపికను ఈ పాసురములో లేపుచున్నారు.  ఈ బాలికకు ఊరివారినందరాను ఒకతాటిపై నడుపగల శక్తి కలది.  ఓ పరిపూర్ణురాలా! నీ పెరటిలో నున్న  గుండుబావిలో ఎరుపుతామర పూలు వికసించినవి. తెల్లకాలువలు ముడుచుకుంటున్నాయి. అంటే తెల్లవారుచున్నాడని భావము.  లెమ్ము ఎర్రని కాషాయ వస్త్రములు దరించి తెల్లని పలువరుసలు గలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమతమ నివాసములలో ఆరాధనము చేయుటకు వేల్లుచున్నారు లెమ్ము.  నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపెడియట్లు మాట ఇచ్చినావు మరచిపోయావా? ఓ లజ్జలేనిదానా! లెమ్ము.  ఓ మాట నేర్పు గలదానా! శంఖమును చక్రమును ధరించినట్టి ఆజాను బాహుడగు పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము. అని ఈనాటి గోపికను మేల్కొల్పినారు.

బుధవారం, డిసెంబర్ 27, 2017

నీకపటమును వీడిచి మాతో కలసి ఆనందము అనుభవింపుము.

బుధవారం, డిసెంబర్ 27, 2017

వెనుకటి పాశురమున గోపికలును మేల్కొలుపుచు కృష్ణ సంకీర్తనం మాని శ్రీ రామ చంద్రుని గుణగణాలను సంకీర్తనం చేస్తూ శ్రీరాముడు మనోభిరాముడని గోపికలు అంటున్నారు.  దానిని విని నందవ్రాజమున సంచలనం ఏర్పడింది.  మధురలో పుట్టి శ్రీకృష్ణుడు గోపవంసమున చేరి తాను కూడా గోపాలుడే అనునట్లు కలసిమెలసి ఉంది వారిని కాపాడుచుండగా అలాంటి కృష్ణుని విడిచి రాముని కీర్తించుట ఏమి అన్యాయము? అప్పుడు అయోధ్యలో ప్రజలు రాముడు, రాముడు, రాముడని యనుచుండెడి వారు.  కానీ ఇతర ప్రస్తావనే లేదు కదా ! నందవ్రజమున మాత్రం కృష్ణుని తప్ప అన్యుని కీర్తించుట ఏమి హేతువు? శ్రీ రాముడా! మనోభిరాముడా.  రామునికంటే కృష్ణుడే సౌందర్యవంతుడు గదా అని ఇలా అనవద్దని కోపికలు వివాదంలో పడిరి.  రాముని కీర్తిమ్చినవారు రాముడుకు కృష్ణునికి పోలికలు చెప్పి ఇద్దరు ఒక్కరే అని నిరూపించి గెలిచినారు.  అప్పుడు ఇద్దరినీ కీర్తించుదుము అనుకొన్నారు.  ఈ పాసురములో మేల్కొల్పబడుచున్న గోపిక నేత్ర సౌందర్యమున విశిష్టస్థానం కలది.  తన నేత్ర సౌందర్యము వుండటం వల్ల ఆ కృష్ణుడు వేదక్కొని రాక ఎలా వుందగలడు అని భావించి ఆమె దైర్యముగా ఇంటిలోనే పరుండివున్నది.  ఇక్క నేత్రము అనగా ఙ్ఞానము.  ఙ్ఞానము కల చోటకు కృష్ణుడు తప్పక వచ్చును కదా అది ఆమె భావం.  అలాంటి గోపికను నేడు ఎలా మేల్కొల్పుచున్నారో చూద్దాం.   
పాశురము:


పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్




తాత్పర్యము :
పక్షి శరీరమున ఆవేశించిన బకాసురుని నోరుచీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీ కృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని పది తలలను హేలగా చిగుళ్ళు త్రుపినట్లు త్రుంపి పారవేసిన శ్రీ రాముని గానముచేయుచూ  పోయి మనతోడి పిల్లలందరును వ్రత క్షేత్రమును చేరినారు. లోపల ఉన్న తుమ్మెదగల తామరపూలను పోలిన కన్నులు కలదానా !
లేడిచూపులు వంటి చూపులు కలదానా ! శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు . పక్షులు కిలకిల కూయుచున్నవి . కృష్ణ విరహ తాపము తీరునట్లు చల్లగా అవగాహన మొనర్చి స్నాన మోనర్పక పాన్పుపై ఏల పడుకున్నావు. ఓ సుకుమార స్వభావురాలా! ఈ మంచి రోజున నీవు నీకపటమును వీడిచి మాతో కలసి ఆనందము అనుభవింపుము.


విశేషార్ధం:
పుళ్ళిన్ వాయ్ కీండానై:
అసురావేశము కలిగిన కొంగనోటిని చీల్చిన వానిని ముందుగా గోపికలు శ్రీ కృష్ణుని కీర్తించుచున్నారు.  భాగవత్ప్రాప్తికి భగవంతుడే ఉపాయం అని నిశ్చయము కల్గుటకు దంభము, అహంకారము, ప్రదానమైన శత్రువులు.  ఆ రెండిటిని తొలగించి తానే ఉపాయం అని చెప్పుటకు బకాసుర వధ వృత్తాంతము కీర్తిస్తున్నారు. తరువాత రావణవధ వృత్తాంతం ప్రస్తావిస్తునారు.  వారు అంతకుముందే రాముడు కృష్ణుడు ఒకటే అని వారి కీర్తిని కీర్తిస్తున్నారు. ముందుగా కృష్ణుని తరువాత రాముని వృత్తాంతమును కీర్తింస్తున్నారు.
ప్పొల్లావరక్కనై  కిళ్ళి క్కళైందానై :
దుష్ఠరాక్షసుని గిల్లి పారవేసిన వానిని కీర్తించుచున్నారు. తమకు పరిచయమున్న కృష్ణుని వృత్తాంతము కీర్తిచి తరువాత తమతో సజాతీయయగు సీతాదేవిని విడచియుండలేక ఎంతో వ్యధ చెందిన సౌజన్యమూర్తి యని శ్రీ రాముని కీర్తిస్తున్నారు. శరీరమును ఆత్మను విడదీసినట్లు తల్లిని తండ్రిని ఒకచోట వుండనీక వారికి ఎడబాటు కల్గించిన నిక్రుష్టుడు  రావణుడు.  సర్వేశ్వరుని నుండి లక్ష్మిని విడదీయగాలిగిన రాక్షసుడు వేరొకడు లేదు అందుచే దుష్టరాక్షసుడు అంటున్నారు.  అలా అనగానే దుష్టరాక్షసుడు అనగానే స్పురించేది రావణునిపీరు మాత్రమె.  వారు పేరు కూడా చెప్పటంలేదు. అలాంటి వారిద్దరిని కీర్తిస్తున్నారు గోపికలు.
కీర్-త్తిమై పాడి ప్పోయ్:
కీర్తినిపాడి కొనుచూపోయి,  గోపికలు వ్రతము చేసే స్థలమునకు చేరిరి.  కీర్తనే ఆధారంగా చేసుకొని వ్రాతముచేయుతకు గోపికలు ముందుకు సాగుతున్నారు.
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్:
పిల్లలందరును వ్రతముచేయు క్షేత్రమునకు చేరినారు.  కృష్ణుని పొందుటకు నిర్ణయించబడిన స్థలమునకు ముందుగానే పోయిరి.  నీవును మేల్కొని రమ్ము అని లోనున్న గోపికను ఆహ్వానించిరి.  ఆమె యొక్క కృష్ణ సమాగామునందు ఆతురత గల గోపికలు ఆగలేక ముందుగానే వెళ్ళిపోయారు.  కానీ వారు వెళ్ళుట తెల్లవారుటకు గుర్తు అవునా! కావునా వేరే గుర్తు చెప్పండి అనగా తెల్లవారినది అనుటకు వేరే గుర్తు చెప్తున్నారు. 
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు:
శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు. గొల్లవారుఅగుటచే వీరు నక్షత్రములను బట్టియే వారికి తెల్లవారుట గుర్తిస్తారు.  శుక్రుడు ను ఙ్ఞానాముగా, గురుడును అఙ్ఞానముగా వీరు తలంతురు. అదే చెప్పిరి లోన వున్నా కోపిక మీరు సంతతము కృష్ణ పరమాత్మ సంస్లేషమునే కోరినవారాగుటచే మీకు తెల్లారినట్టు అనిపిస్తోంది. నక్షిత్రాలన్ని మీకు శుక్రుడుగా, గురుడుగానే కన్పిస్తున్నాయి.  అందుచే నమ్మదగిన ప్రాభాతిక చిహ్నము కాదు అని లేవకుడా పడుకున్నది.  అప్పుడు వేరొక గుర్తులు చెప్పుచున్నారు గోపికలు.
 పుళ్ళుం శిలమ్బిన కాణ్ :
పక్షులు ధ్వని చేయుచున్నవి.  వెనుక 6 , 7  పాసురములో పక్షులుగురిమ్చి వచ్చింది మళ్లీ ఇక్కడ కూడా పక్షుల కిలకిల రవములు పేర్కొనబడినది.  పక్షులు అనగా ఆచార్యులని మనం ఇదివరకే అనుకున్నాం.  భగవంతుని అనుభవించమని నిస్తులగు ఙ్ఞానులు మేల్కొల్పును అవి వేల్లుబుచ్చే పలుకులే మొదటి కాలం.  ఆ భగవద్ అనుభవం నీవు ఒకదానివె అనుభవించుట తగదు అంటున్నారు.  కానీ ఈమె వీరి మాటలును లెక్కచేయక మాటాడక పడుకుమ్డెను.  అలా పడుకోనుటకు ఆమె నేత్ర సౌందర్య గర్వమే అని ఆమె నేత్ర సౌందర్యమును ప్రసంసిస్తున్నారు.
పోదరి క్కణ్ణినాయ్:
తామరపూలు మద్య తుమ్మెద ఉన్నట్లు ఒప్ప్చున్న కన్నులున్నదానా!  తామరపువ్వుతో పోటీపడు కనులుకలదానా! ఇటు అటు సంచరించు లేడి కళ్ళను పోలు కనులు కలది అనుతచే మౌనము స్పురించును.  ఇలా పరిపూర్ణ బ్రహ్మనుభావమున మునిగియున్న ఈమెను నేడు మేల్కొల్పుచున్నారు.
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే పళ్ళి క్కిడత్తియో:
చల్లగా చల్ల్బడునట్లు మునిగి స్నానము చేయక పానుపు పై పడుకొని ఉంటావా? భక్తులగు మాతో భాగావదనుభావం పొందుటకు మాతో రావా?  మాతో కలిసి గుణానుభవ మొనర్చి భాగవత్సార శ్లేష మొనర్చాలి అని అర్ధిస్తున్నారు.
పావాయ్!:
సుకుమారమైన స్త్రీ త్వము కలదానా నీవు కృష్ణుని తో కూడి ఉండి మమ్ములను అనుగ్రహించు.
నీ నన్నాళాల్:
మంచి రోజులు కదా.  ఈ గోపికలు లోపలున్న గోపిక యోగ్యతా గుర్తించి భగవదనుభవ యోగ్యతా కలిగి ఏకాంతముగా నీవిట్లుండుట.  ఆ కృష్ణుని మనసునకు కూడా భాద కలిగించును మాతో వచ్చి వానిని అనుభవించు.
కళ్ళమ్ తవిరుందు కలన్దు:
కపటమును వీడి కలువు. కృష్ణుని అనుభావస్తున్నట్టు భావించి వీరు నీవు ఆడుతున్న నాటకాలు చాలు ఇక రా అని అంటున్నారు.  ఇలా ఈ పాసురమున గల అన్ని సన్నివేసమును బట్టి, సంబోధనమును బట్టి పెరియాళ్వారు ఈ పాసురమున ప్రబోధించినట్టు తెలుస్తోంది.

మంగళవారం, డిసెంబర్ 26, 2017

ఇకనైనను మేల్కొని లేచి రావమ్మా! పోరిగిళ్ళవాళ్ళు వచ్చి నీ గాఢ నిద్ర చూచుచున్నారు.

మంగళవారం, డిసెంబర్ 26, 2017

ఇది వెనుక మనము చూచినా స్థితప్రఙ్ఞానావస్థలలో నాల్గోదీయినది యాతనామావస్థ.  ఈ అవస్థలో తాబేలు తన అవయవాలను వెనుకగు లాక్కొన్నట్లు భగవదనుభవమున్నవారు ఇంద్రియ విషయములందు ఇంద్రియములు ప్రవర్తింపకుండ భగవానునియందే సర్వావస్థలువుండును.  ఇది ఒక నిద్ర వంటిదే.  ఇంతవరకు నాల్గు పాశురములలో  నలుగురు గొపికలను నిద్రించుట తగదు అని చెప్పి మెల్కొలుపుతలో ఈ స్థిత ప్రఙ్ఞావస్థలోని దశలనే వివరించినట్లు తెలుసుకున్నాం.  ఈ అవస్థని భగవద్గీతలొ ఇలా వర్ణించారు.
"యదా సంహారతేచాయం కూర్మోంగానీవ సర్వశః 
ఇంద్రియాణీంద్రి యార్ధేభ్యః తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా ll "
తాబేలు తన అవయవాలను బాగుగా వెనుకకు లాగినట్లు ఇంద్రియములు  ఇంద్రియ విషయములనుండి పూర్తిగా ఉపసంహరించుకొనినా అతని ప్రఙ్ఞ ప్రతిస్ట్టతమైనది.  ఈ విధంగా భగవత్కైంకర్యనిష్ట గల, ఇంద్రియ ప్రవృత్తి విరోధముగల గోపాలుని సోదరిని ఇందు మేల్కొల్పుతున్నారు.  మరి ఈ పాసురములో ఏవిధంగా ఈమెను మేల్కొల్ప్తున్నారో కదా. 
పాశురము
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము: 
యస్సునందున్న గేదెలు తమ దూడలు పాలుత్రాగుటకు రాకపోవట వలన పొదుగుల భాధచే అరచుచు దూడలు వచ్చి త్రాగబోవుచున్నట్లు తలచి ఏకధారగా పాలుకార్చుచూ నీ ఇంటను అంతా బురద చేయుచున్నవి.  ఇట్టి అధిక సంపద కలిగియుండి కృష్ణుని విడువక ఎప్పుడూ కలసివుండె గోపవీరుని చెల్లెలా! క్రింది నెల అంతా  బురదతో నిండి ఉండగా మా తలలయండు పైనుండి పాడెడు మంచు శరీరమునంతను తడిపివేయుచున్నా నిన్ను విడిచి వెళ్ళలేక నీ ఇంటి ముంగిట నిలిచి ఉన్నాం.  అంటే కాదు తన బార్యను దొంగిలించినందున కోపించి సుందరమైన బంగారు లంకాపట్టణంనకు రాజైన రావణాసురుని వధించిన మునిజనమనోభిరాముడకు శ్రీ రాముని గురించి పాటలు పాడుతున్నాము.  అయినాను నీవు పెదవి విప్పలేదు.  ఇకనైనను మేల్కొని లేచి రావమ్మా!  పోరిగిళ్ళవాళ్ళు వచ్చి నీ గాఢ నిద్ర చూచుచున్నారు. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)