Blogger Widgets

శుక్రవారం, జనవరి 06, 2012

audiopal for my voice

శుక్రవారం, జనవరి 06, 2012



ఎందరో మహానుభావులు అందరికీ వందనములు


ఎందరో మహానుభావులు అందరికీ వందనములు  అన్న పాటకు కర్త, కర్మ, క్రియ, త్యాగరాజు అని అందరికీ తెలుసు కదా.  అయితే  త్యాగరాజు (మే 4, 1767 1 - జనవరి 6, 18472) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తారు.  
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు వారిలో ఒక్కరు త్యాగయ్యగారు.

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు 
రాగం: శ్రీ
తాళం: ఆది
గాయకుడు: Dr . మంగళంపల్లి బాలమురళీకృష్ణ

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 

చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున 
జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు

సామగాన లోల మనసిజ లావణ్య 
ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు

మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే 
వారెందరో మహానుభావులు 

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము
సేయువారెందరో మహానుభావులు

పతిత పావనుడనే పరాత్పరుని గురించి 
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును 
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు 
వారెందరో మహానుభావులు

హరిగుణ మణిమయ సరములు గళమున 
షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో 
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే 
బ్రోచువారెందరో మహానుభావులు

హొయలు మీర నడలు గల్గ్గు సరసుని 
సదా కనుల జూచుచును పులక శరీరులై 
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము 
గలవారెందరో మహానుభావులు

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన 
దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు 
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు 
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము 
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు

నీ మేను నామ వైభవంబులను 
నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను 
వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను 
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి 
సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు 
వారెందరో మహానుభావులు

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను 
శివాది సన్మతముల గూఢములన్ 
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి 
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి 
నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన 
వారెందరో మహానుభావులు

ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు 
రామభక్తుడైన త్యాగరాజనుతుని 
నిజ దాసులైనన వారెందరో మహానుభావులు
అందరికీ వందనము-లెందరో మహానుభావులు

గురువారం, జనవరి 05, 2012

తిరుప్పావై ద్వివింశతి పాశురము

గురువారం, జనవరి 05, 2012

గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనమని వెనుకటి పాశురములో ప్రార్ధించారు. వేరొక గతిలేక నీకే చెందినవారమని చెప్పారు. ఈ పాశురములో తమ ను మెల్లమెల్లగా కనువిచ్చి చూడవలసిందిగా అర్ధించుచున్నారు .
పాసురము:
  అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన 
అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన
పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే
శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్

ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము:
సుందరము విశాలమగు మహా పృధ్వీ మండలము నంటాను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనేది అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులు చేరి ఉన్నట్లు , మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విదియున్న తామరపువ్వులు వలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము.
సూర్య చంద్రులిరువురు ఒక్క సారి ఆకాశమున ఉదయించునట్లు ఉండేది నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షిమ్చితివా! మేము అనుభావిమ్చియే తీరాలి అనే శాపాము వంటి కర్మ మమ్ములను వీడి పోవును.





ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

 
                                          ఈ రోజు National Birds Day .
ఆకాశములోని కనిపించిన పక్షులును చూసి పంజరములో వున్నా ఈ పక్షి ఏమనుకుంటోంది అంటే ....ఎగిరిపోతే ఎంత బాగుంటుంది .
ఈ మనుషులు మనసులో కష్టము కలికినప్పుడు ఆకాశములోఉన్న మా పక్షులును చూసి నాకు రెక్కలు వచ్చి ఎగిరిపోతే ఎంతబాగుంటుంది అని పాడుకుంటారు. అవి హాయిగా ఆకాశం అంతా నాదే అని ఎగురుతూ వుంటే చూడటానికి ఎంతబాగుంది అనుకుంటారు.  మా శబ్దాలను (కిలకిల రవాలు) హాయిగా విని ఎంతో ఎంజాయ్ చేస్తారు.  పక్షులులో చాలా అందముగా అనేకానేక రంగుల్లో వుంటాయి.  ఇప్పుడు మాకు  కాలం బాలేదు అనిపిస్తోంది.  మాకు మనిషి అధికముగా అనేకరకాలుగా కష్టాన్ని కలిగిస్తున్నాడు.  చేట్లు నరికేసి మాకు నిలువు నీడలేకుండా చేస్తున్నాడు.  సెల్ ఫోన్ టవర్స్ కట్టి ఒకరకంగా మాఉనికినే పూర్తిగా తీసేస్తున్నాడు.  విపరీతమైన వాతావరణ కాలుష్యము చేసేస్తున్నాడు, ఇంకా దొరికితే తినేస్తున్నారు.  మరి కొందరు మాతో circus చేయించి డబ్బు సంపాదిస్తారు. కొందరు మాలో మాకు యుద్దాలు (కోడిపందాలు) పెట్టి మమ్ములను మేమే చంపుకునేటట్టు చేసి మమ్ములను తినేస్తున్నారు. అంతే కాదు భారతీయులు అయితే తమ జాతీయ పక్షిగా పెట్టుకున్న నెమలిని రెక్కలు పీకి నేమలీకలు అని చెప్పి అమ్మేస్తున్నారు.  రాజకీయనాయకులు, ధనవంతులు నెమలిని తింటున్నారు.  ఇంకా చెప్పాలి అంటే మా బాధలు చాలా వున్నాయి.  నాకు ఇలా చెప్తుంటే కళ్ళు నీళ్ళు కారుతున్నాయి.  పక్షులును చూసి ఆనందిచేవారు వాటిని cage  లో బంధించి మా స్వేచ్చను తొలగిస్తున్నారు.  మరలా మమ్ములను ఆకాశములో చూసి మేము రెక్కలు వచ్చి ఎగిరితే ఎంత బాగుంటుంది అని పాడుకుంటారు ఇదెక్కడి న్యాయం.  మాకు కష్టం కలిగించినా సరే కష్టంలో కూడా మాకు ఇల్లు మేమే కట్టుకొని వుంటే గూళ్ళు పీకేసి సంతోషిస్తున్నారు. మేము వంశమును పెంచుకోటానికి గుడ్లు పెట్టుకుంటే అవికూడా లాగేసుకొని తినేస్తున్నారు.  నాకే కనుక భగవంతుడు ఒక న్యాయస్తానం చూపిస్తే  న్యాయస్థానంలో  మనిషి మీద వారు చేస్తున్న ఆకృత్యాలమీద కేసుపెట్టాలని వుంది.  మాకు జరుగుతున్నా అన్యాయానికి గొంతెత్తి అరిచి మాకు న్యాయం చేయమని న్యాయపోరాటం చేయాలని వుంది.  మనుషులమని చెప్పుకుని జీవిస్తున్న జీవులకి మానవత్వం ఎక్కడుంది అని అడగాలని వుందిమాకు స్వేచ్చ స్వాతంత్రాలు కావాలని అడగాలని వుంది.  నన్ను నావారినుండి విడదీసే హక్కు మనుషులకు ఎవరిచ్చారని అడగాలని వుంది.   నాకు  పంజరము నుండి ఎగిరిపోవాలని వుంది. మా పక్షిజాతిని కాపాడండి.  దయచేసి నన్ను, మా జాతిని స్వేచ్చగా బ్రతకనీయండి. మానవులారా మేము మీలానే ప్రాణం కలవారమే.  దయచేసి మాకు హాయిగా బ్రతికే అవకాసము ఇవ్వండి.  ఇక మిమ్ములను మేము ఏమీ అడుగము.     దయ చేసి నన్ను వదిలేయండి.  మీకు మీ పెద్దలికి నా నమస్సులు . 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)