Blogger Widgets

ఆదివారం, సెప్టెంబర్ 22, 2013

Catch Me Live

ఆదివారం, సెప్టెంబర్ 22, 2013

ఆకాశంలో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు. ఆ హరివిల్లు కూడా సాయంత్రం 05:00 నుండి సాయంత్రం  06:00 గంటలవరకు వస్తుంది. అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం Online Radio Josh Live లో మాత్రమే వస్తుంది. ఇది కేవలముప్రత్యక్ష ప్రసారము మాత్రమే కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును. నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు. మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.

మరి నా షోపేరు చెప్పేసాను కదా, మరి నాతో మాట్లాడాలి అంటే

Radio Josh
INDIA= +91 04042410008
USA = +19142147574
Skype Me™!
                                                                                
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com

ధన్యవాదములు 

శనివారం, సెప్టెంబర్ 21, 2013

గురజాడ అప్పారావు

శనివారం, సెప్టెంబర్ 21, 2013


దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది ఎవరో తెలుసా గురజాడ అప్పారావు గారు. 
ఈరోజు అనగా సెప్టెంబర్ 21st న గురజాడ అప్పారావుగారి పుట్టినరోజు . గురజాడ అప్పారావుగారు 1862 september 21st న విశాఖపట్టణం జిల్లా లో యలమంచలి తాలూక లో సర్వసిద్ధి రాయవరం అన్న వూరిలో తండ్రి వెంకట రామదాసు , తల్లి కౌసల్యమ్మలకు జన్మిచినారు.  గురజాడ అప్పారావుగారు తెలుగు సాహిత్యమ్ మీద చాలా కృషిచేసారు.  అప్పారావుగారు అన్నారు "ఆధునిక మహిళ భారత దేశ చరిత్రను పునర్నిర్మ్స్తుంది" అని అన్నారు.  ఆయన రచనలు మామూలు వాడుక భాషలోనే రాసేవారు. ఆయన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అనే నాటకం మంచి పేరు తెచ్చుకుంది.కన్యాశుల్కము ఆయన రచనలలో మంచి పేరు తెచ్చుకుంది.  గురజాడ అప్పారావు గారు (1862-1915) తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు.గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. హేతువాది19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు. వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు.  వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు వీరి "కన్యాశుల్కం" తెలుగు అన్నిటికన్నా గొప్ప నాటకం అని చెప్పవచ్చు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన వీరు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలోముఖ్యులు. వీరికి "కవి శేఖర" అనే బిరుదు కూడా కలదు.
అప్పారావు గారు రచనలలో మనము ఎప్పుడు వినే మాట 
తాంబూలాలు ఇచ్చేసాము తన్నుకు చావండి 
డామిట్! కథ అడ్డంగా తిరిగింది
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌
గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.
అప్పారావుగారి గేయాలలో మనలో దేశభక్తిని పెంచుటకు దేశభక్తి పాట రాసారు అందులో ఒకటి
దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టిమేల్‌ తలపెట్టవోయి
పాడి పంటలు పొంగిపొర్లె
దారిలో నువు పాటు పడవోయి
తిండి కలిగితే కండ కలుగును
కండ కలవాడేను మనిషోయి
యీసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుఅగునోయ్‌
జల్దుకుని కళలన్ని నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను ఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌
చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌
సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌

అప్పారావుగారి రచనలలో సారంగధర,  పూర్ణమ్మ,  కొండుభట్టీయం,  నీలగిరి పాటలు,  ముత్యాల సరాలు, కన్యక, సత్యవ్రతిశతకము, బిల్హణీయం (అసంపూర్ణం), సుభద్ర, లంగరెత్తుము, దించులంగరు, 
లవణరాజు కల, కాసులు,సౌదామిని ,రాయాలనుకున్న నవలకు తొలిరూపం), కథానికలు,మీపేరేమిటి ,దిద్దుబాటు,మెటిల్డా,సంస్కర్త హృదయం, మతము విమతము ఇంకా చాలా రచనలు వున్నాయి. 
ఈరోజు అప్పారావుగారి 151 వ జన్మదినం సందర్భంగా సాహిత్యప్రియులందరికి 
" ఆధునిక తెలుగు సాహిత్య దినోత్సవ శుభాకాంక్షలు "  మరియు  అప్పారావుగారికి నివాళి అర్పిస్తున్నాము. 

"సంపూర్ణ ప్రపంచ శాంతి వర్థిల్లాలి"

ఈ రోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవం (International Day of Peace) ఐక్య రాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన జరుపుకుంటాయి. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల పొందుట కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఎటువంటి అల్లర్లు , ఘర్షన్లు కేకుండా శాంతియుత జీవనానికే ప్రజలందరూ ఇష్టపడతారు.
శాంతి పావురాలను  ఎగరవేసి శాంతిపట్ల తమకు గల విశ్వాసాన్ని చూపిస్తున్నారు. ప్రపంచ శాంతికోసం అంతర్జాతీయ స్థాయిలో అనేక సమావేసాలు జరుపుతారు . వ్యక్తులు , సంస్థలు ,దేశాలు ప్రపంచశాంతికోసం తమవంతు ప్రయత్నాలు , ఆచరణీయ కార్యక్రమాలు చేపట్టడానికి ఉద్దేశించిన రోజుగా భావిస్తారు . ప్రపంచము మొత్తం మీద 60 దేశాల ప్రజలు విరాళంగా ఇచ్చిన నాణేలతో ఒక పెద్ద "శాంతి గంట"ను తయారుచేసి "యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ జపాన్" వారు ఐ.రా.స.కు బహూకరించారు. న్యూయార్క్ లోని ఐ.రా.స. కేంద్ర కార్యాలయం ఆవరణలోని వెస్ట్ కోర్ట్ తోటలో ఈ గంటను ఏర్పాటుచేశారు. ప్రతి సంవత్సరం శాంతి దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ఈ గంట మ్రోగించిన తర్వాత దీని సమీపంలోనే నిర్వహిస్తారు.  ప్రతి ఏటా సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశాలు, జాతులు, సమూహాలు తీవ్ర ఘర్షణల్లో మునిగి తేలుతున్నప్పటికీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ ప్రకటిస్తూ శాంతికోసం పలు కార్యక్రమాలను నిర్వహించడం పరిపాటి. ప్రపంచానికి శాంతి అవసరం గురించి ప్రబోధించే ఈ మహా దినం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో శాంతి ఘంట మోగిస్తారు. ఆ గంటపై ఇలా రాసి ఉంది. "సంపూర్ణ ప్రపంచ శాంతి వర్థిల్లాలి" .  కాలం గడిచేకొద్దీ అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిజంగానే ప్రపంచ వ్యాప్త స్వభావాన్ని సంతరించుకుంటోంది. ప్రతిదేశంలోనూ ఈ ఉత్సవాన్ని సంభరంగా జరుపుకుంటున్నారు. ఆవిర్భావము : 1981లో సెప్టెంబర్ 21న ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం ప్రారంభ సందర్భంగా కోస్టారికా సమర్పించిన తీర్మానం ప్రకారం ప్రతి ఏటా సెప్టెంబర్ 21ని ప్రపంచ శాంతి దినంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రకటించింది. సర్వత్రా శాంతియుత భావాలను బలోపేతం చేయడానికి గాను ప్రపంచ శాంతి దినం అంకితమవుతుంది. తొలి ప్రపంచశాంతి దినాన్ని 1982 సెప్టెంబర్ లో నిర్వహించారు . 2002 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 21 వ తేదీని అంతర్జాతీయ శాంతి దినోత్సవ్ నిర్వహణకు శాశ్విత తేదిగా ప్రకటిండం జరిగింది .  ప్రపంచ దేశాల మధ్య శాంతి ఒడంబడికపై సంతకాలు జరిగిన 50వ సంవత్సరంగా కూడా 2008 సెప్టెంబర్ 21 చరిత్రలో నమోదవుతోంది. ఈ సంవత్సరం ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పునస్కరించుకుని మహాత్మా గాంధీ అహింసా పురస్కారానికి ప్రపంచ స్థాయిలో తొలిసారిగా రెవరెండ్ ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టూటూ ఎంపికయ్యారు.
ప్రపంచ శాంతిని పాదుకొల్పడంలో డెస్మండ్ టూటూ చేసిన అవిరాళ కృషిని గుర్తించిన ' ది జేమ్స్ మాడిసన్ యూనివర్శిటి (జేఎమ్‌యూ)' లోని మహాత్మా గాంధీ ప్రపంచ స్థాయి అహింసా కేంద్రం ఆయనకు పురస్కారాన్ని అందించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 21న వర్జీనియాలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని అందచేయాలని నిర్ణయించారు. 
ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకోవడానికి  ఒక క్యాండిల్ వెలిగిస్తే చాలు  లేదా మౌనం గా కొద్దిసేపు కూర్చుని ధ్యానం చేసినా చాలు ... ప్రజలకు ఈ ప్రపంచ శాంతి యొక్క ఆవశ్యకతను వివరిస్తే చాలు. 
 "సంపూర్ణ ప్రపంచ శాంతి వర్థిల్లాలి" 

బుధవారం, సెప్టెంబర్ 18, 2013

ఈ పాదమే కదా

బుధవారం, సెప్టెంబర్ 18, 2013


ఈ పాదమే కదా ఇలయెల్ల గొలిచినది 
ఈ పాదమే కదా ఇందిరా హస్తముల సితవైనది

ఈ పాదమే కదా ఇందరును మ్రొక్కెడిది 
ఈ పాదమే కదా ఈ గగనగంగ పుట్టినది
ఈ పాదమే కదా యెలమి పెంపొందినది 
ఈ పాదమే కదా ఇన్నిటికిని యెక్కుడైనది


ఈ పాదమే కదా యిభరాజు దలచినది 
ఈ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది
ఈ పాదమే కదా యీబ్రహ్మ కడిగినది 
ఈ పాదమే కదా యెగసి బ్రహ్మాండమంటినది


ఈ పాదమే కదా ఇహపరము లొసగెడిది 
ఈ పాదమే కదా ఇల నహల్యకు కోరికైనది
ఈ పాదమే కదా యీక్షింప దుర్లభము 
ఈ పాదమే కదా ఈ వేంకటాద్రిపై నిరవైనది

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)