Blogger Widgets

శనివారం, డిసెంబర్ 24, 2011

ఎవరో చూడాలి అని నాట్యమాడదే

శనివారం, డిసెంబర్ 24, 2011


ఎవరో చూడాలి అని  నాట్యమాడదే  నెమలి 
ఎటుగా  సాగాలి  అని  ఏరు ఎవరినడగాలి 

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి

కో అంటూ కబురు పెడితే రగిలే కొండగాలి
ఓ అంటూ కరిగి రాదా నింగే పొంగి పొరలి
ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి

తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా
చెరలో కునుకే కరవై కలవరమే తరిమినా
వనమే నన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని
పసిపాపల్లె కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని
నెమ్మదిగా నా మదికి నమ్మకమందించిందెరో ఎవరో

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి

వరసే కలిపే చనువై నను తడిమే పూలతో
కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో
ఎపుడో కన్న తీపికల ఎదురౌతుంటే దీపికలా
శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకున్నదిలా
దుందుడుకో ముందడుగో సంగతి అడిగి వారెవరో ఎవరో

శుక్రవారం, డిసెంబర్ 23, 2011

తిరుప్పావై నవమ పాశురము

శుక్రవారం, డిసెంబర్ 23, 2011

తిరుప్పావై లో మొదట కొన్ని పాశురములో వ్రతము ఎలా చెయ్యాలి నియామాలు ఏమిటి అని చెప్పారు.  తరువాత భగవంతుని ఒక్కరే అనుభవించకుండా గోపికలందరూతో కలసి అనుభవించాలని అనుకోని.  ముందు ఉత్తిష్ట అనే చిన్న పిల్లని నిదుర లేపారు. తరువాత బాగా దైవానుగ్రహం గల గోపికను నిదుర లేపారు.  తరువాత పాశురములో మూడవ గోపికకు తెల్లవారినది అని చెప్పి ఆమెను మేల్కొల్పారు. ఇప్పుడు నాల్గవ గోపికను నిదురలేపుతున్నారు.   ఈ గోపిక పరమాత్మయే ఉపాయము అను అధ్యవసాయమున పరినిస్తితురాలు. భాగవంతుని కంటే వేరే ఉపాయము లేదని  నమ్మినది . అలాంటి ఈమె నిద్రను చూచి గోదా మిగిలిన గోపికలు కూడి మొదటి రెండు పాశురాలు విన్నావు కదా ! మరి విని కుడా పరుంటివా ? లెమ్ము అని మెలొల్పుతున్నరు . మొదటి నాలుగు పాశురాలలొ నిద్ర నుండి మేల్కొల్పు తొ ఉన్న పాశురాలే కదా. నిద్ర గురించి భగవద్గీత లో నాలుగు అవస్తలు గురించి నాలుగు శ్లొకాలలొ వివరించారు. నాలుగు అవస్తలు 1 యతమానవస్థ 2. వ్యతిరేకావస్థ, 3. ఏకేంద్ర్దియావస్థ, 4. వశీకారావస్థ. అను అవస్థలు గురించి గీతలొ బాగా వివరించారు.
మొదటి రెండు పాశురాలలో శ్రవణము చెప్పబడినది . తరువాత పాశురములో మననము నిరూపించబడినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలో ధ్యానదశ వివరించబడినధి. అట్టి ధ్యానములో పరకాష్ట గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నది . మరి ఈమెను ఎలా నిదురనుండి మేల్కొల్పుతున్నారో చూద్దాం.  ఈ పాశురము చాలా విశేషమైనది. దీనికి దద్దోజనం ఆరగింపుగా సమర్పించాలి.

పాశురము: 
తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్

తాత్పర్యము: ఉజ్జ్వలములైన నవరత్నములతో నిర్మించిన మేడలో మెత్తని పాన్పుపై చుట్టును దీపములు ప్రకాశించుచుందగా అగురుధూపముల పరిమళము నాసికను వశమొనర్చుకోను చుండ నిద్రపోవు ఓ అత్తా కూతురా! మణికవాటము యొక్క గడియను తీయుము.  ఓ అత్తా! నీవైనా ఆమెను లేపుము.  నీ కుమార్తె మూగదా? లేక చెవిటిదా? లేక మందకొడి మనిషా?  ఎవరైనా నీవు కదలినచో  మేము సమ్మతింపమని కాపలా ఉన్నారా? లేక మొద్దు నిద్దుర ఆవేశించునట్లు ఎవరైనా మంత్రము వేసినారా.  మహామాయావీ! మాధవా! వైకుంఠవాసా! అని అనేకములైన భగవంనామములను కీర్తించి ఆమెను మేల్కొనునట్లు చేయుము అని భావము.

విశేషార్దము:
తూమణి మాడత్తు:
ఈనాటి గోపిక అద్దాలమేడలో పరుండియున్నది.  ఏ మేడ స్వచ్చమైన తొమ్మిది విధములగు రత్నములతో నిర్మించి ఉన్నది.  ఆ భవనములో నిదురపోతున్న తీరును వారు చెప్పుకొని ఆనందించుచున్నారు.
శిత్తుం విళక్కెరియ:
చుట్టూను దీపములు ప్రకాశించుచుండగా. మణి మయ భవనములో మణుల కాంతిచేతనే ప్రకాశమున్నను దీపములు వెలిగించుట మంగళార్ధము.  పగటివేళ భగవద్ సన్నిదిని దీపము వెలిగించుటలో అర్ధం అదే.  దీపము అంటే శాస్త్ర జన్యమైన ఙ్ఞానదీపము . శాస్త్రములచే కలిగిన ఙ్ఞానము తోడైయుండుటచే భగవదఅనుభవము చక్కగా పొందును.
తూపమ్ కమళ:
అగరు మొదలగు వాని ధూపము పరిమళించుచుండగా, ఈమె దీపములే కాక అగరు పొగ కూడా వేసుకొని పరుండియున్నది.  దూపము పోగాలేకుండా పరిమమలం మాత్రమె వున్నదిట.  దీపము ఙ్ఞానదీపము వంటిది, పరిమళం అనుష్టానము వంటిది.  ఏ రెండు కల్గి భగవదనుభావము కలది.  ఈ రెండే దీపము-పరిమళం దగ్గర పెట్టుకొని నిదురిస్తున్నది.  ఈమె భగవద అనుభవంలో నిమగ్నము అయ్యివున్నది అని అనుకుంటున్నారు.
మనసు పూర్తిగా పరమాత్మయందే నిలిపి ఉన్నది.
 తుయిలణై మేల్ కణ్ వళరుమ్:
నిద్రను చక్కగా పట్టించు పడక పై నిద్రించుచున్నది ఈ గోపిక.  ఈమె పూర్తిగా భగవంతుని అనుభవిస్తున్నది.  నిద్ర పట్టిస్తున్న పానుపు భగవంతుడే.  వానితో కలసి నిదురించుటనే నిద్ర.  ఈమె నివృత్తి మార్గనిష్టూరాలు.
మామాన్ మగళే!:
అత్తా కూతురా! అని ఆమెను సంబోదిస్తున్నారు.  గోపికాభావమును పొంది కేవలము ఆధ్యాత్మికముగానే కాక భౌతికంగా కూడా వార్తితో తనకు సంభందములను ఏర్పర్చుకోనుచున్నది గోదామాత.  గోదా తననుకూడా గోపవనితగా భావించుకొని.  గోపికను అత్తా కూతురా అంటోంది.
మణి క్కదవం తాళ్ తిఱవాయ్:
"మణులతో నిర్మింపబడిన తలుపుల గడియలను తెరువుము". ఆమె భవనం మణులతో వున్నది కదా దాని గడియలు ఎక్కడున్నావో తెలియటంలేదు. ఏది ద్వారమో, ఏది గోడో తెలియటంలేదు. ఆమెనే తలుపుతెరవమన్నారు.  "మీరే తెరుచుకురండి" అని ఆమె అన్నా గోపికలు అంగీకరించక ఆమెనే తలుపు తెరవమన్నారు వీరు. మేము ఇలా చెప్పినా లేవకుండా పడుకుండుట తగదు అని చెప్పుచున్నారు.
మామీర్! అవళై ఎళుప్పీరో:
అత్తా! ఆమెను లేపుము.  మా ఆర్తిని చూచి మేలుకోపోయినా, నీ అనునయము చేతనైనా మేల్కొనునట్లు చెయ్యి.  భగవంతుడే ఉపాయమని విశ్వసించి ఆ భగవంతునికొరకు ఆర్తి కలిగిన ఇతరులకై తానుకూడా భాధపడుచు వారికి సాయపడుట తప్ప వేరే ఉపాయం లేదు.  ఇది భగవంతుని పొందుటకు అనుకూలము అని తల్లే చెప్పి ఆ పరుండిన గోపికను మేల్కొల్పాలి.  అలా మేల్కోకపొక పోవుట చూచి మనసులో భాధకల్గి
 ఉన్ మగళ్ తాన్  ఊమైయో :
నీ కూతురు మూగదా! అని అనుచున్నారు. నీ కూతురు అని కోపముతో అనుచున్నారు. మారుమాటాడదా! పలకకుండా ఎవరైనా నోరు ముసినారా?  నీ కూతురు భగవంతుడే ఉపాయము అనుకునేవారితో కలసి రాదా ఏమి ?
ఇదేనా నీకూతురుకు నేర్పిన విద్య! అని ఆక్షేపిస్తున్నారు.  ఇలా చేయటం ఆమెకు అనుకూలము కాదు సరికదా ప్రతికూలమే అవుతుంది.  భగవదనువిరోదులుతో మాటాడకూడదు కానీ భగవదప్రాప్తి కాలమగు మాతో మాటాడరాదా?
 అన్ఱి చ్చెవిడో:
మూగయే కాక చెవుడు కూడనా? మామాటలు వినబడనట్లుగా అక్కడేవరైనా ఆమె చెవిలో మాటాడుతున్నారా?
అనన్ధలో :
ఏ వ్యాపారము చేయలేని అలసటలో వున్నదా ?
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో:
ఎవరైనా ఆమెను లేవవద్దని కాపలా ఉన్నారా? లేకపోతె గాఢనిద్ర పట్టునట్లు మంత్రించియున్నారా?  మాకు నిద్ర పట్టకుండా చేసినవాడే ఈమెకు నిద్రపట్టించినాడా?  అతడు కాపలాయుండి ఈమెను నిద్రనుండి మేల్కొననీయకుండా వున్నాడా? నిద్రకు, తెలివితెచ్చుకోనుటకు పరమాత్మే కారణం. అతనితో కలసినవారు నిద్రపోదురు. వీడినవారు నిద్రలేకుండా వుందురు.  అనన్యఉపాయత్వమ్ తెలిసినవారు భగవన్నామమునకు వశులై ఆ సంకీర్తనమునకు అంతరనుభావంనుండి భాహ్యను భావమునకు వస్తారు.  అదే మేల్కొనుట. 
"మామాయన్, మదవన్, వైకుందన్," ఎన్ఱెన్ఱు నామం పలవుమ్ నవిన్ఱు:
'మహా మాయావీ! మాధవా! వైకుంఠ వాసా ! అని అనేక నామాలును కీర్తించినారు.  ఈ మూడు నామాలలో భగవంతుని కళ్యాణగుణాలను కొన్నింటిని వీరు మరచినారు. మహామాయావి అనుటలో జగత్కారణం అయిన పరమాత్మ కృష్ణుని కీర్తిస్తున్నారు.
మాయ అనగా ప్రకృతి.  ఈ ప్రకృతినే పరమాత్మగా భావిస్తున్నారు. మాయ అనగా భగవద సంకల్పరూపము.అది ఆశ్చర్యమైన శక్తీ కలది. అదే ఈ సర్వమునకు మూలము అని.
మాదవ అంటే మా = శ్రీ యొక్క, ధవః = శ్రీయఃపతీ అని కీర్తించాడు. జగత్కారణమైన ఆ పరతత్వము. సర్వసులభమై దిగుటకు శ్రీ మహా లక్ష్మే కారణం.  ఆమెవద్ద శుశ్రూషచేతనే ఈ సౌలబ్యాము అతనికి అబ్బింది అని మాధవా అని కీర్తిస్తున్నారు.  ఈ లక్ష్మీపతితత్వమే యితడు పరతత్వమని నిరుపిస్తోంది.
దీనితో ఆభాగావదనుభవ నిమగ్నమైన గోపిక ఆప్రత్యేకానుభూతిని వీడి వీరితో కలసి అనుభావిమ్చినాగాని నిలువలేని మనస్థితి గలది వెలికి వచ్చెను ఈ గోపిక.  మొత్తానికి ఈ గోపికను కూడా నిదురలేపారు.

జై శ్రీ మన్నారాయణ్


గురువారం, డిసెంబర్ 22, 2011

తిరుప్పావై అష్టమ పాశురము

గురువారం, డిసెంబర్ 22, 2011

నిన్నటి దినమున రెండవ కోపికను లేపుటకు. తెల్లవారింది అనిచేప్పుటకు. వారు  భరద్వాజ పక్షులు ఎలా మాటాడుకుంతున్నాయో గోపికలు పెరుగుచిలుకుతున్నపుడు వచ్చు నగలసవ్వడి, పెరుగు సవ్వడి రకరకాలుగా తెల్లవారుటకు గుర్తులు చెప్పి ఆమెను పిచ్చిదానిగాను, నాయకురాలుగాను, తెజస్సుకలదానివి అని పిలచి నిద్రమేల్కొల్పారు.  మరి ఈ రోజు మూడవ గోపికను నిడురలేపుచున్నారు మరి ఆమెను ఎలా లేపుచున్నారు అంటే. క్రింది పాసురములో చూద్దాం.
                                  
పాశురం :  
  కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు  
కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు 
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్
 


తాత్పర్యము: తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది.  తెల్లవారినది మేతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించుచున్నవి.  మనతోటి పిల్లలు వ్రతస్తలమునకు వెళ్ళుటకు కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు.  అట్లు వెళ్ళుచున్నవారిని నిలిపివేసి మేము నిమ్ము పిలుచుటకు నీ ద్వారమందు నిలిచి యున్నాము.  కుతూహముగల ఓ లలనా ! లేచి రమ్ము.  శ్రీ కృష్ణుని దివ్యమంగళ "పర" అను సాధనము గ్రహించి కేశియను రాక్షసుని చీల్చి సంహరించినట్టియు మల్లుర ప్రాణములను కొల్లకోట్టినట్టియు దేవతలందరకు ఆ దేవుడైన వానిని సమీపించి సేవించినట్లు అయితే అతడు మెచ్చుకొని అయ్యయ్యో నేను రావలెననుకొనుచుండగా మీరే వచ్చితిరే అని మానను పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే లేచి రమ్ము అని తోటి కన్యను మేల్కొల్పుతున్నారు.

విశేషార్దము:
కీళ్ వానమ్ వెళ్లెన్ఱు:
ఇంతకు ముందే తెల్లవారుటకు గుర్తుగా కొన్ని శబ్దములు చెప్పారు కదా.  ఆ శబ్దములు అర్ధరాత్రి సమయమునైనా రావచ్చునని కావునా తూర్పు దిక్కున తెల్లవారుచున్నది అది చూడమని ఇందు చెప్పుచున్నారు.  లోపలనున్న స్త్రీ అంతలో ఇలా అంది మీలో ఏ ఒక్కరి ముఖము భగవద్ అనుగ్రహం వల్ల కాంతివంతమగుచున్నది. వారు తూర్పు వైపు న వుండుట వల్ల తెల్లవారినది అనుకుంటున్నారు మీరు.
ఎరుమై  శిఱు వీడు మేయ్ వాన్ పరందనకాణ్:
గేదెలు చిన్న బీడు మేయుటకు పోవుచున్నవి.  తెల్లవారు జాముననే రాత్రి మంచుపడిన పచ్చికను మేయుటకు గేదెలను బీడులోకి వదులుతారు.  మరలా తోలుకు వచ్చి పాలు పితికి తరువాత పగలంతా మేయుటకు అడవిలోకి తోలుచుందురు.  అది తెల్లవారుటకు గుర్తుగా చెప్పుచున్నారు.  రాత్రియే కృష్ణ సమాగమమును పొందగల్గెడి వారు కనుక తెల్లవారినచో ఇక కృష్ణుడు కనబడడని బెంగతో మేల్కొని నీవు రావలదా?  అలా ఎందుకు పడుకుంటివేలా అని అడుగుచున్నారు?  ఆమె లోపలనుండి అవి గేదెలుకావు మీ ముఖ కాంతి వల్ల చుట్టూ నల్లగా విరిసిన చీకట్లు గుంపు మీకు అలా తోచుచున్నట్లుఉంది.  అని ఉరకుండెను.
మిక్కుళ్ళ పిళ్ళైగళుం పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ 
కాత్తు ఉన్నైక్కూవువాన్ వందు నిన్ఱోం:
మిగిలిన పిల్లలును అదే పోవుటగా పోవుచున్నారు. వారిని వెళ్లకుండ ఆపి నిన్ను పిలుచుటకై వచ్చి నిలిచితిమి.
మేమేగాడు, ఊరిలోని పడతులందరును పెద్దసమూహముగా పోవుచున్నారు.  ఆపోవుట కృష్ణపరమాత్మను చేరుటకే.  అయినను తర్వాత చేరుదుమో చేరామో అన్న విచారము లేక వానికోరకు ఈ దారిని పడుచుటయే పరమానందముగా నడచుచున్నారు.
మావాయ్ పిళందానై:
గుర్రపు నోటిని చీల్చినావాడు . అసురావేశము కల్గిన గుర్రమును రెండు దవడలు పట్టి చీల్చి తనను మనలను కాపాడినవాడు.  ఆ కేశి అను రాక్షసుడు శ్రీ కృష్ణుని చంపచూసాడు. కృష్ణుడు అన్నవాడు లేకపోతె మనము కూడాలేము.  శ్రీ కృష్ణుడు తనను కాపాడుకోటమే కాక మనలను కూడా కాపాడారు.  ఇక్కడ కేళి అనునది అహంకారము గా దానిని నశింపచేయువాడు.  మనలను అహంకారం నుండి కాపాడువాడు.
మల్లరై మాట్టియ:
మల్లురను చంపినవాడు.  ఆ మల్లురను చంపుట మధురాపుర స్త్రీల మనస్సులను ఆకర్షించుతకే.  ఆ మల్లురే కామ క్రోదాలు. అవి పరమాత్మతో మనము చేరకుండా అడ్డగించును.  వీనిని కృష్ణపరమాత్మను చంపుటకై కంసుడు ప్రయోగించాడు.  దానిని మట్టి పెట్టినాడు.  కామక్రోధములు మొదలుగు వాటిని జయించినాడు.  కానీ ఆత్మకు అమ్తుకోనిన ఆవిద్య తొలగదు.  అందుచే కీర్తించి పరమపురుషార్ధమును పొందుదాము.  అతనిని శంకించకు. 
దేవాది దేవనై:
బ్రహ్మరుద్రెంద్రాది దేవతలకు కారణమైన దేవుడు.  శ్రీ కృష్ణుడే సర్వభుతములకు కారకుడు, ప్రళయ హేతువు అని చెప్పుచున్నారు.  అతడే ఉపాస్యుడు, పురుషార్ధప్రదుడు, లేచి కీర్తించి పురుషా పొందుదము.  అబలలను చూచునా అన్న ఆలోచన నీకు అవసరంలేదు.
 శేన్రూ నాం శేవిత్తాల్  ఆవా ఎన్ఱారాయుందరుళ్ :
చేరి మనము సేవించినచో అయ్యో! అయ్యో అని భాదపడి మనలను పరామర్శించి కృపచేయును.  పరమాత్మను మనము పొందుట మనకొరకుకాదు.  అతని కొరకే! అతని వస్తువులమైన మనం అతని కొరకే.  కానీ మనము చైతన్యము కలవారమగుటచే, అతను విలక్షణమైన గుణపరిపూర్తి కలవాడు అగుటచే వీడివుండలేకపోతున్నాం కదా.  అలాంటిది అతను వచ్చేవరకు వుండలేకపొతే అతడెంత భాధపడునో కదా.  అందుకే మనము పాడి పురుషార్ధం పోమ్దేదము. పోయి అతనికి ప్రియమైన కైంకర్యము చేద్దాం.  లెమ్ము ముందు నడువు అని ఆ గోపికను నిడురలేపినారు.
జై శ్రీమన్నారయణ్   

బుధవారం, డిసెంబర్ 21, 2011

తిరుప్పావై సప్తమ పాశురము

బుధవారం, డిసెంబర్ 21, 2011

నిన్న ఉత్తిష్ట అను చిన్న గోపికను మేలుకోల్పిరి. మరి నేడు.
వేద పఠనము కు ముందు ఎల్లప్పుడూ "శ్రీ గురుభ్యోనమః, హరిః  ఓమ్" అని ప్రారంభిస్తారు.  నిన్న గోపికలు మెల్కొలుపుట తో మన ధనుర్మాస వ్రతం ప్రారంభము అయ్యింది.  అందుకే పక్షులు కిలకిల రవములు, శంఖనాదము, హరి హరి అను వినబడుట లేదా అంటున్నారు.  పక్షులు శ్రీ గురుమూర్తులు.  అందుకే శ్రీ గురుబ్యోన్నమః అన్నట్లు భావించాలి.  తరువాత శంఖము హరి శబ్దము - హరిః ఓం అన్నట్లు భావించాలి. 
ఇలా వ్రతారంభము చేసి నేడు ఆ శ్రవణము లో వైవిధ్యమును వివరించుచు వేరొక గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. మరి ఏవిధంగా లేపుతున్నారో చూద్దం. నేడు విశేష పాశురము కావున నేడు పులిహోర ఆరగింపు పెట్టవలెను.
పాశురము: 
  కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్.



తాత్పర్యము:భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్నివైపులా మాట్లాడుకుంటున్నాయి.  ఆ ధ్వని నీవు వినలేదా?
ఓ పిచ్చిదానా! పువ్వులతో చుట్టబడిన కేశబంధములు విడిపోవుటచేత సువాసనలు వేదజల్లుచున్న జుట్టుముడులతో ఉన్నగోప వనితలు కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు పెరుగు కుండల నుండి వెలువడు మృదంగ గంభీరధ్వని ఆ కాంతల చేతుల గాజుల సవ్వడి మరియు మేడలో ఆభరణముల ధ్వని కలిసి ఆకాశమునకు తగులుచున్నవి.  నీ చెవికి సోకటం లేదా ?  
ఓ నాయకురాలా!  అంతటను వాత్సల్యముతో వ్యాపించి ఉన్న పరమాత్మ మనకు కనబడవలెను అని శరీరము ధరించి కృష్ణుడు అవతరించినాడు.  లోకకంటకులైనవారిని నశింపజేసిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తించుచుండగా నీవు వినియును మేల్కొనవేలా?  నీ తేజస్సును మేము దర్శించి అనుభవించునట్లుగా తలుపులు    తెరువవలేనని మేల్కొల్పుతున్నారు. 


విశేషార్ధము: 
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు  పేశిన పేచ్చరవం కేట్టిలైయో:
కీచు కీచు మని అంతటను భరద్వాజ పక్షులు కలిసికొని పల్కుచున్న మాటల ధ్వని వినలేదా. అని గోపికలు,   తెల్లవారినది అని తెల్పుతున్నారు.  భరద్వాజ పక్షులు లేచి కీచు కీచు అనగానే ఆలోపాలి కాంత అది తెల్లవారుటకు గుర్తుగా అనుకోవటం లేదు.  తెల్లవారుటకు ముందు లేచి శబ్దము చేయుచున్నవని భావిస్తున్నది.
పేయ్ ప్పెణ్ణే:
పిచ్చిపిల్లా! అని అధిక్షేపించుచున్నారు.  భగవంతుని అనుభవించుటే ప్రదానమనుకొని వేరే భక్తులతో కలవకుండా ఏకాంతముగా అనుభవించుట పిచ్చితనమే.  అంటే ఏమిచెయ్యాలో తెలియకపోవుట.  వెనుక పాశురములో 'పిళ్ళాయ్' ఓ పిల్లా అన్నారు  ఆమెకి ఈ వ్రతము కొత్త అవటంవల్ల.  ఇక్కడ ఈమెను 'పెణ్' అంటే స్త్రీ అంటున్నారు అంటే భగవద్ అనుబవము కల స్త్రీ నే కానీ పిచ్చిది. అంటే భగవదానుభావం ఎలాపొందాలో తెలియనిది.  తాను ఒక్కతే కాక పదిమంది తో కలసి అనుభవించుట వివకము.  ఆ వివేకము లేనితనము పిచ్చితనమే అని వారి భావము.  లోపల ఉన్నామె పక్షులు కిలకిల లు తెల్లవారుట కాదు.  మీరే పిచ్చివారు తెల్లారింది అనుకుంటునారు అన్నది.
అప్పుడు బయటి గోపికలు వేరొక గుర్తు చెబుతున్నారు.
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు :
మెడలోని తాళిబొట్టు అచ్చుబొట్టు గలగల మనుచున్నవి చేతులూపుచూ, తలలోని పూలు జారుటచే మంచి సువాసన కల కేశపాశము కల గోపయువతులు, కవ్వముతో చిలుకుచుండగా బయల్వేడిన పెరుగు శబ్దము వినలేదా?  అని అడుగుతున్నారు.
శ్రీ కృష్ణుడు పుట్టిన తరువాత వ్రేపల్లెలో పాడి ఎక్కువైనది. గోపవనితలు పొద్దున్నే లేచి మంచిగా తయ్యారు అయ్యి పెరుగు చిలుకుతారు.  పెరుగును కవ్వముతో త్రిప్పుట వాళ్ళ వారి నగలు శబ్దము చాలా వస్తోంది.  కవ్వము త్రిప్పి త్రిప్పి అలసిపోవుట కొప్పువీడినది.  వారు చిలుకుతున్నప్పుడు క్షీరసాగరమదనము గురించి చెప్పుకుంటున్నారు అడినీవు వినలేదా అంటున్నారు.  గోపికలు పెరుగు చిలుకుతున్నప్పుడు పాట పాడుతున్నారు, వారి ఆభరణాల ధ్వని, చిలికే పెరుగు శబ్దము మూడు ధ్వనులు వినబడుతున్నాయి.  
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!:
నాయకురాలా! అని సంభోదిస్తున్నారు.  నీ అనుభవము మాకూ కూడా పంచుటకు తగినదానావు.  ఏకాంతాముగా అనుభావిస్తున్నావు అది తగదు.  పిచ్చిపిల్లా! అని సంభోదించుటకు నాయకురాలా! అని సంభోదించుటకు భావములో తేడాలేదు.  మమ్ములను నీవు ముందు వుంది నడిపించు.  శ్రీ కృష్ణుని చేర్చగల నీవు ఇలా ఉండకూడదని భావం.
నారాయణన్ మూర్త్తి కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో:
ఇక భగవద్గుణములను కీర్తించి ఆమెను వెలుపలికి తీసుకొని రావలెను అని భావించి, ముందుగా పరమాత్మ వాత్సల్యమును సూచించు 'నారాయణన్' నారాయణుని కీర్తించినారు. ఇలా నారాయణుని కీర్తించుట నీకు వినబడుటలేదా?  మూర్తి -కేవలము అంతర్యామి అయినటువంటి వాడు మనకోసం కనిపించుట వీలుగా చర్మ చక్షువులు దాల్చిన సులభుడు. అంతే కాదు మనలను శత్రువుల నుండి, తన శ్రమను కూడా లక్ష్యము చేయని కేసవుని చూడగలము. అతనికి మంగళము పాడెదము.  అయన గుణాలు విని లేవకుండా ఎలా పండుకొంటివి అమ్మా!
ఇలా చెప్పి ద్వారా రంద్రములలో నుండి బయటికి ప్రసరించు తేజస్సు చూసి.
తేశం ఉడైయాయ్!:
తేజశ్సాలినీ! అని సంబోదిస్తున్నారు.  పిచ్చిపిల్లా, నాయకురాలా! తేజశ్సాలినీ! అని మూడు విధాల పిలిచారు.  భగవద్ అనుభవం కల్గి భ్రహ్మ తేజస్సు నీలో కనిపిసూవుండగా లేదనుట తగదు.  ఆ అనుభవం నీవు ఒక్కదానివే అనుభావిస్తున్నావ్ అలా తగదమ్మా! ఏమ్మమ్మా! పిచ్చా అని వీరడుగుతున్నారు.
తిఱ:
తలుపు తెరువుము.  నీ తేజస్సు ను చూచి మేమందరం కూడా అనుభవించునట్లు తలుపు తెరువు అని అభ్యర్దిస్తున్నారు. భగవదానుభావం అందరితో పంచుకుంటే వృద్ది చెందుతుంది అని చెప్పుచున్నారు.
ఇలా రెండవ గోపవనితను కూడా నిదుర మేల్కొల్పినారు గోపికలు.
జై శ్రీ మన్నారాయణ్

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)