Blogger Widgets

ఆదివారం, మే 13, 2012

మాతృమూర్తులకు మాతృపూజాదినోత్సవ నాశుభాకాంక్షలు

ఆదివారం, మే 13, 2012

 
      ఈ రోజు మాతృపూజా దినోత్సవంగా జరుపుకుంటున్నాం  అందుకుగాను ముందుగా  మన మాతృ భూమికి (భారతమాత )కు మరియు ప్రపంచంలో వున్నా మాతృమూర్తులకు మాతృపూజాదినోత్సవ నాశుభాకాంక్షలు.  

సృష్టిలో అమ్మ లేనిజీవి అన్నది లేదు .  ఎక్క డైనా చెడ్డ బిడ్డ  వుండవచ్చేమో కాని చెడ్డ తల్లి అన్నది వుండదుట.  ఏ  తల్లి అయ్యినా తన  బిడ్డ  గొప్పగా వుండాలి అని కోరుకుంటుంది.  మనకు ప్రపంచంలో కెల్లా అతి తియ్యనైన పదం అమ్మ .  అమ్మప్రేమ కంటే  గొప్ప ప్రేమ  , అమ్మకంటే గొప్ప రక్షణ , అమ్మ  కంటే గొప్ప గురువు, అమ్మ కంటే గొప్ప దైవం ఎక్కడా లేదు. ఇది  నిజం .  అలాంటి అమ్మ ఋణము మనం ఎన్ని జన్మలుఎత్తినా తీర్చలేము.  

ఈ సందర్బములో నాకు ఒక కదా గుర్తు వస్తోంది అది ఏమిటి అంటే!!!!! ఈ కదా అమ్మ ప్రేమకు ఒక  నిదర్సనం అని చెప్పుకోవచ్చు.  ఒక ఊరిలో ఒక అమ్మ వుంది ఆ అమ్మకి ఒక బిడ్డ వున్నాడు.  అతను  అన్ని చెడ్డ అలవాట్లు కలిగి వుంటాడు.  అతనికి ఒక ప్రియురాలు వుంది ఆమె ఒకనాడు నాకు తల నొప్పిగా వుంది అని చెప్పింది.  ఆ తలనొప్పి తగ్గాలి అంటే అతని అమ్మ  హృదయపు రక్తం రాస్తే తగ్గుతుంది అని చెప్పింది.  అప్పుడు ఆతను మాఅమ్మ హృదయం ఇప్పుడే తెస్తాను అని చెప్పి వెళ్ళాడు.  వెళ్లి అమ్మని అడిగాడు.  అమ్మా నీ హృదయం కావాలి అని అడిగాడు.  ఆమె వెంటనే సరే నాయనా తప్పకుండా తీసుకో అంది.  అప్పుడు ఆతను తల్లిని పొడిచి హృదయాన్ని తీసుకున్నాడు. ఆ హృదయం రక్తం కారుతోంది దానిని తన చేతిలో తీసుకొని వెళ్తూ వుండగా ఆ రక్తం లో జారి పడబోయాడు.  అప్పుడు అమ్మ హృదయం తల్లడిల్లిపోయి బాబూ జాగ్రత్త చూసుకొని నడువు నాయనా అంది.  అప్పుడు ఆ కొడుకులో మార్పు వచ్చి ఇంత మంచి అమ్మనా నేను చంపింది అని ఏడుస్తాడు.  చూసారా ఎక్కడైనా అమ్మ మంచిగానే వుంటుంది.  అలాంటి అమ్మను మనం కష్టపెట్టకూడదు.

మనకు తెలిసిన రామాయణంలో రాముడు  తల్లి (కైకెయి)కోరికకు కట్టుబడి అడవికి వెళ్లి ఎన్నోకస్టాలు అనుభవించాడు.  కృష్ణుడు, యశోద ప్రేమ మనం వర్ణించలేము. అర్జునుడు ద్రుపది స్వయంవరంలో గెలిచిన ద్రుపధిని  పాండవులు తల్లిమాట విని ద్రౌపదిని ఐదుగురు భార్యగా పొందారు. తరువాత చత్రపతి శివాజి తనతల్లి కొరికను నెరవేర్చి. చక్రవర్తి అయ్యాడు.  గాంధి గారుకు తన తల్లి తన చిన్నప్పటి నుండి అనేక కదలు చెప్పేది.  ఆ కధలు గాంధిగారికి మార్గనిర్ధేశకంగా నిలిచాయి.      
మనకు పంచ  మాత లు కలరు అని కుమారశతకంలో ఇలా అన్నారు.

ధరణీ నాయకు రాణియు
గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
న్న రమణి దనుగన్నదియును
ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా !

భావం:రాజు భార్య (రాణి), అన్న భార్య (వదిన), గురుని భార్య (గురుపత్ని), భార్య తల్లి (అత్త) మరియు కన్న తల్లి - పంచమాతలు గా భావించవలెను.

అమ్మని ఇప్పుడు mommy అని పిలుస్తున్నారు.  mommy అన్న పదం కంటే అమ్మ అన్న పదం లోనే తియ్యదనం వుంది అని తెలుసుకుంటే బాగుంటుంది. 
ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం 
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం 
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి .........
ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే... --సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్న పాట రాసారు ఇది అక్షరసత్యం అని గ్రహించగలరు.  ఎందరో కవులు అమ్మ గురించి వర్ణించటానికి ప్రయత్నించారు.  కానీ ఎవరు రాయగలరండి అమ్మ గురించి. 
 అమ్మలందరికి మాతృ పూజా దినోత్సవం శుభాకాంక్షలు.  

(మా అమ్మకి)I love You Amma. 

శనివారం, మే 12, 2012

ఫ్లోరెన్స్ నైటింగేల్

శనివారం, మే 12, 2012




ఈ రోజు ప్రపంచం మొత్తం మీద నర్సులు  పండగ గా గరుపుకుమ్తున్నారు ఎందుకు  అంటే ఈరోజు International Nurses Day కదా! .  ఈరోజునే ఎందుకు జరుపుకుంటున్నారు అంటే ఈరోజు ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు.  ఈమె ఒక నిజంమైన  స్పూర్తిదాయకమైన నర్సు.
ఫ్లోరెన్స్ నైటింగేల్ క్రిమియన్ యుద్ధం సందర్భంగా ఆమె నర్సింగ్ పని చేసి ప్రసిద్ధి చెందింది.ఆమె చాలా ముఖ్యమైన బాధ్యతలు ఒక అత్యధిక నైపుణ్యం కలిగిన మరియు బాగా గౌరవనీయ వైద్య వృత్తి ఎక్కువగా అభ్యాసం లేని వృత్తి నుండి నర్సింగ్ మార్చబడింది.ఫ్లోరెన్స్ నైటింగేల్ 12 మే 1820 న ఫ్లోరెన్స్, ఇటలీ లో జన్మించారు. ఆమె తండ్రి ఒక సంపన్న భూస్వామి . ఆమె డెర్బిషైర్  మరియు హాంప్షైర్  లో పెరిగింది.  ఫ్లోరెన్స్ కు ఆమె జన్మ స్థలం పేరు పెట్టబడిందిఫ్లోరెన్స్ జన్మింఛి ఉన్నప్పుడు ఆ సమయంలో, అమ్మాయిలు విద్యను ఏ రకంగాను అందుకోలేదు. ఆమె తండ్రి, విలియం నైటింగేల్,  మహిళలు ఒక విద్యను పొందాలి అని  భావించారు ఎందుకంటే ఫ్లోరెన్స్ బాగా అదృష్టవంతుడు. అతను ఫ్లోరెన్స్ మరియు ఆమె సోదరి సైన్స్ మరియు గణితం నుండి చరిత్ర మరియు తత్వశాస్త్రం వరకు విషయాలు  నేర్పించారు.ఫ్లోరెన్స్ పెరిగిన గా ఆమె ఇతరులు సహాయం మీద ఆసక్తి పెరిగింది. ఆమె అవకాశం లభించింది చేసినప్పుడు ఆమె అనారోగ్యంతో పెంపుడు జంతువులు మరియు సేవకులు కోసం ఆలోచించలేదు.ఫ్లోరెన్స్ నైటింగేల్ ఒక నర్సు కావాలని దేవునిని ప్రార్ధించారు.  వయస్సు పదిహేడు సంవత్సరాలు,  ఆమె దేవుని ద్వారా సేవ చెయ్యాలి అని "నిస్సహాయంగా మరియు నీచ నుండి బాధలో వున్నవారికి సహాయం చేయాలని." కోరుకున్నారు.మొదట ఆమె తల్లిదండ్రులు ఆ సమయంలో, అది ఒక బాగా విద్యావంతులు స్త్రీ ఒక అనుకూలమైన వృత్తిగా  భావించ లేదు, ఎందుకంటే ఆమె ఒక నర్సు మారింది దానికి  వారు  తిరస్కరించారు.  చిట్టచివరికి 1851 లో ఆమె తండ్రి అనుమతితో  ఫ్లోరెన్స్ ఒక నర్స్ గా శిక్షణ Germany కు వెళ్లి పొందారు.1853 లో లండన్ లో ఒక ఆసుపత్రి నడుస్తున్న జరిగినది.1849 - యూరోపియన్ ఆసుపత్రి వ్యవస్థ అధ్యయనం యూరప్ కి ప్రయాణించాడు.1850 - అలెగ్జాండ్రియా, ఈజిప్ట్ వెళ్లింది సెయింట్ విన్సెంట్ డి పాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వద్ద నర్సింగ్ చదవడం ఆరంభించారు.1851 - వయస్సు ముప్పై-ఒక గొప్ప నర్స్ మారింది.  ఆమె మరికొందరికి శిక్షణ ఇవ్వడానికి Germany కు వెళ్ళారు.1853 - లండన్ లో Gentlewomen కోసం ఆసుపత్రి సూపరింటెండెంట్గా మారింది.1854 - క్రిమియన్ యుద్ధంలో బయటపడింది.1854 లో ఫ్లోరెన్స్ నైటింగేల్ క్రిమియన్ యుద్ధం (- 56 1854) గాయపడ్డాడు బ్రిటీష్ సైనికుల నర్సింగ్ నిర్వహించేందుకు టర్కీ వెళ్ళారు. ఆమె గాయపడిన సైనికులుకు  సహాయం Scutari (క్రిమియన్ యుద్ధంలో గాయపడిన మరియు అనారోగ్యంతో సైనికులు తీసిన ఇక్కడ స్థానం) వెళ్ళింది.ఫ్లోరెన్స్ తన జీవితం ఉద్యోగంకు  అంకితం చేశారు. ప్రతి ఒక కేవలం వారు సరి ఉండేవి నిర్థారించడానికి నిద్రలోకి ఉన్నప్పుడు ఆమె తరచుగా రాత్రి సైనికులు సందర్శించండి ఉంటుంది. ఆమె చక్రంలా నిద్ర సమయం విరామం తీసుకునేదే కాదు  ఎందుకంటే అప్పుడు ఆమె "లేడి విత్  ది లంప్ " అని అనటం జరిగినది.  గాయపడిన చాలా unwashed మరియు బ్లాకెట్స్ను లేదా decent ఆహార లేకుండా overcrowded, మురికి గదులు లో నిద్రపోవటం వల్ల .  టైఫస్ ఈ పరిస్థితులు వ్యాధులు లో, కలరా మరియు విరేచనాలు త్వరగా వ్యాపించాయి. ఫలితంగా, గాయపడిన సైనికులు మధ్య మరణాల రేటు బాగా ఎక్కువ.చాలా సైనికులు అంటువ్యాధులు మరియు వ్యాధి మరణించారు. ఫ్లోరెన్స్ మరియు ఆమె నర్సులు ఈ పరిస్థితులును మార్చింది.  వారు, ఒక వంటగది ఏర్పాటు వారి స్వంత సరఫరా నుండి గాయపడిన మృదువుగా, పారిశుధ్యం కోసం latrines తవ్విన, మరియు గాయపడిన యొక్క భార్యలు నుండి సహాయం కోసం కోరారు. వారు అప్పుడు సరిగా పడిపోయింది సైనికులు మధ్య అనారోగ్యం మరియు గాయపడిన మరియు మరణం రేటు కోసం శ్రమ పోయారు.ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇంగ్లాండ్ లో ఒక సంవృద్ధిఅయిన కుటుంబం కుమార్తె. క్రిమియన్ యుద్ధం సమయంలో, ఆమె నర్సింగ్ విభాగ ఉంచబడినది. ఆమె యుద్ధ రంగంలో ఆసుపత్రిలో మందిరాలు లేచి, "దీపం తో మహిళ" అని పిలుస్తారు మారింది ఆమె ఒక దీపం తీసుకెళ్లారు.  ఈమె ఒక గొప్ప నర్సు గా పేరు తెచ్చుకుని, నర్సు లకు ఆదర్శంగా నిలిచినది. 

బుధవారం, మే 09, 2012

అన్నమయ్య జన్మదిన శుభాకాంక్షలు

బుధవారం, మే 09, 2012

అమ్మ తన బిడ్డ అన్నము తినటానికి  మారం చేసినప్పుడు ప్రతీ  ఇంట్లోని అమ్మ   చందమామని చూపిస్తూ ,గోరుముద్దలు తినిపిస్తూ  తన  బిడ్డకి  "చందమామరావో జాబిల్లిరావో"  అన్నపాట ను పాడుతుంది.  ఈ పాట  తెలియని తెలుగు లోగిలి వుండదు.  ఇలాంటి  పాటలు రాసిన వారు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అయిన  "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు"  అను బిరుదాంకితుడు అన్నమయ్య.   నారాయణయ్య కొడుకు నారాయణ సూరి. విద్యావంతుడు. అతని భార్య లక్కమాంబ. ఆమెది తాళ్ళపాక సమీప గ్రామం మాడుపూరు. అక్కడ ఉన్న విష్ణువు కోవెలలో అమె శ్రద్ధగా మాధవుని అర్చించేదట. వారికి చాలా కాలం సంతానం కలుగలేదు. అతడు, అతని భార్య సంతానార్ధులై తిరుమలను దర్శించారట. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని ఒక  కధ  కలదు. అలా జన్మిచిన వాడే అన్నమయ్య  . సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేటమండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడిపోయింది.
అన్నమయ్య ఇంటిలోతల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు.  ఈ పాటరాసింది తెలుగువాగ్గేయకారుడు కలియుగదైవము వేంకటేశ్వరస్వామికి గొప్పభక్తుడు అయిన అన్నమయ్య .  అన్నమయ్య చాలాపాటలు రాసారు పాడారు .స్వామి వారికి మేలుకొలుపు అన్నమయ్య పాడినప్పుడు "మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల మేలుకోవె నా పాలి మించిన నిధానమా "  వంటి మేలుకోలుపు పాటలకు స్వామి వారు నిద్రలేసారు. మళ్ళీ రాత్రి జోల పాటలు అన్నమయ్య రాసిన"జో అచ్యుతానంద జోజో ముకుందా, రావె పరమానంనద , రామ గోవిందా జోజో జోజో"  అన్నపాటకు స్వామి వారు హాయిగా నిద్రపోతారు. అన్నమాచార్యలవారు అనేఅనేక వేలపాటలు రాసారు పాడారు. అయానపాటలవల్లే స్వామి వారికి అంతకీర్తికలిగిందా అనిపించేటట్టు వుంటాయి అన్నమయ్య పాటలు సామాన్యమానవులు కు అర్ధమైయ్యె టంత వీలు గా వుంటాయి. అన్నమయ్యపాటలు స్వామి వారికే కాదు అమ్మవారికి కూడాచాలా ఇష్టం  అమ్మవారిమీదకూడా చాలాపాటలు రాసారు. "క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం"  అన్నపాట అమ్మవారి నీరాజనం ఇచ్చుసమయమున పాడారు. అమ్మను చూసి   చక్కని తల్లికి చాంగుభళా అంటూ పాట చలా బాగుంటుంది.   అంతే కాకు తిరుతిరు జవరాల అన్న పాట,  వుయ్యాల పాటల, తుమ్మెద పాటలు , గొబ్బిళ్ళ పాటలు, జనపదాలు,  శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంన్నాయి. అన్నమయ్యరచనలు ఇంచుమించు ముప్పైరెండువేలు పాటలు వుంటాయి.  అన్నమయ్యకు పదకవితాపితామహుడు అన్నబిరుదు కలదు. అన్నమయ్య 32,000 సంకీర్తనలతో పాటు, సంస్క్రత వేంకటాచల మహాత్మ్యం, సంకీర్తనా లక్షణం, ద్విపద రామాయణం, 12 తెలుగు శతకాలు, శృంగార మంజరి, వంటి "నానా ప్రబంధములను" రచించినట్టు చిన్నన్న రచించిన ద్విపద వల్ల తెలుస్తుంది.  అన్నమయ్య గురించి మరియు ఆయన రచనలు గురించి చెప్పుకుంటే ఎంతకీ తరుగదు అనిపిస్తోంది.  నాకు అవకాసం వున్నప్పుడు అన్నమయ్య వారి సంకీర్తలగురించి తప్పకుండా పోస్ట్  చేస్తాను.

సోమవారం, మే 07, 2012

నవ్వితినే గొల్లెతా

సోమవారం, మే 07, 2012




నవ్వితినే గొల్లెతా నాయ మవుర గొల్లడా
యెవ్వరేమనిరే నిన్ను నియ్యకుంటిఁ బదరా

కానీలే గొల్లెతా కద్దులేరా గొల్లడా
ఔనా మఱవకువే అట్టే కానీరా
నే నేమంటిని నిన్ను నీకే తెలుసురా
మానితినే ఆమాట మంచిదాయఁ బదరా

అదియేమే గొల్లెతా అందుకేరా గొల్లడా
కదినెఁ గడుపనులు కల్లగాదురా
ఇది నిక్కమటవే ఇంతకంటె నటరా
పదరకువే నీవు పలుమారు నేలరా

మెచ్చితినే గొల్లెతా మేలు లేరా గొల్లడా
కుచ్చితిఁ గాగిట నిన్నేఁ గూడుకొంటిరా
యిచ్చకుఁద శ్రీవేంకటేశుడను నేనేయెచ్చరించవలెనా, యెఱుగుదుఁ బదరా

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)