Blogger Widgets

బుధవారం, ఆగస్టు 29, 2012

జాతీయ క్రీడాదినోత్సవ శుభాకాంక్షలు.

బుధవారం, ఆగస్టు 29, 2012


ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవము - భారత దేశము. క్రీడా మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి (1905 జననం). భారతదేశపు హాకీ క్రీడను ప్రపంచ దేశాల్లొ చాటాడు. అందుకని ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించి ప్రతీ సంవత్సరం అమలు చేస్తుంది. అందువల్ల క్రీదాభిమానులందరకు జాతీయ క్రీడాదినోత్సవ శుభాకాంక్షలు.
Play A Game

Get Adobe Flash Player



తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు



తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడుగిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త,హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 నితెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము.  గిడుగు రామమూర్తి పుట్టిన రోజు ఆగష్టు 29 ని తెలుగు భాషా దినోత్సవముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు  ప్రజలు పాటిస్తున్నారు

విశ్వనాథ సత్యనారాయణ గారు రామమూర్తి పంతులు గారిగురించి ఇలా అన్నారు.  "రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట".  అని ఇంకా  "రామ్మూర్తి పంతుల వాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు".
రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంధ సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు.  ప్రపంచంలో తెలుగు భాష ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగివుంది.  ప్రపంచీకరణ వలన పిల్లలను ఇంగ్లీషు మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి.  ఇది ఎంతో గొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు.  తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు .

ఆదివారం, ఆగస్టు 26, 2012

మదర్ థెరీస జయంతి

ఆదివారం, ఆగస్టు 26, 2012

మదర్ థెరీసాగా పేరు పొందిన ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు (ఆగష్టు 261910 – సెప్టెంబరు 51997మాసిడోనియాలో అల్బేనియన్ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించింది. ఈమె తన జీవితాన్ని పేద రోగులకు సేవచేయడంలోనే గడిపింది. ఈమె సేవకు గుర్తింపుగా 1979 లో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారము లభించింది. ఈమెకు తరవాత భారతదేశ ప్రభుత్వం కూడా 1980లో భారతరత్నను ప్రకటించింది.  ఈరోజు మదర్ థెరీస జయంతి సందర్బంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

నా షో పేరు హరివిల్లు

ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు.  ఆహరివిల్లు కూడా ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 12:00  గంటలవరకు వస్తుంది.  అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం  Online Radio Josh Live  లో మాత్రమే  వస్తుంది.  ఇది  కేవలము live ప్రోగ్రాం మాత్రమె కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి.  నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును.  నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు.  మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.   
మరి నా షోపేరు చెప్పేసాను కదా,  మరి నాతో మాట్లాడాలి అంటే 
Skype id: radiojoshlive
US: 914-214-7574
UK: 20-3286-9594
AUS: 28003-4546
Local Number: 040-4200-2003  
ఈ నెంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు.  మరి నా షోను మిస్ కాకండి.  ధన్యవాదములు. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)