బుధవారం, నవంబర్ 13, 2013
ఈరోజును ప్రభోధిని ఏకాదశి అనీ దేవోత్తాన్ ఏకాదశి అని పిలుస్తారు, చంద్రమాన శుక్లపక్ష కార్తిక మాస ఏకాదశి రోజు జరుపుకుంటాము . అప్పటివరకు విష్ణువు నిద్రలో వున్నట్టు మనం నమ్ముతాం . విష్ణువు శేషుని భుజంపై నిద్రిస్తుండగా మనము ఆరోజును శయన ఏకాదశి గా జరుపుకున్నాం మరియు ప్రభోధిని ఏకాదశిని మేల్కొనే రోజు కావున "ప్రభోధిని ఏకాదశి" ("పదకొండో మేల్కొలుపు"), విష్ణు-ప్రభోధిని("విష్ణువు యొక్క మేల్కొలుపు") మరియు దేవ్-ప్రభోధిని ఏకాదశి, Deothan, దేవోత్తాన్ ఏకాదశి లేదా "దేవుని మేల్కొలుపు". చతుర్మాసం ముగింపు అవుతుంది. ఇది కూడా కార్తీకి ఏకాదశి, కార్తీక శుక్ల ఏకాదశి అని అంటారు. ప్రభోధిని ఏకాదశి తర్వాత కార్తీక పూర్ణిమ రోజు దేవతలు దీపావళిను జరుపుకుంటారు. ప్రభోధిని ఏకాదశి రోజు ఉపవాసం వుంటారు మరియు సంప్రదాయపద్దతిగా తులసి మొక్కకు విష్ణువు కు వివాహం చేస్తారు ఈ వివాహం ఆచారాన్ని తులసి వివాహం అంటారు. ఈ వివాహాన్ని ఏకాదశి తరువాత రోజు చేస్తారు. ప్రభోధిని ఏకాదశి మహారాష్ట్ర లో దేవుడు విఠోబా - విష్ణు రూపంగా పూజిస్తారు .
యాత్రికులు పండరపుర ఈ రోజు విఠోబా ఆలయంకు
తరలి వస్తారు . పండరపుర ఉత్సవాలు ఈరోజు మొదలు అవుతాయి పౌర్ణమి రోజు వరకు ఘనంగా చేస్తారు. ఇప్పుడు చెరకు పంట ప్రారంభమవుతుంది. అందువల్ల రైతు అమలు పూజ సంప్రదాయబధ్ధంగా జరుపుకుంటారు వారు సరిహద్దు వద్ద ఐదు చెరకు కర్రలు పంచుతారు. కొన్ని చెరకు ముక్కలు బ్రాహ్మణ (పూజారి), కమ్మరి, వడ్రంగి, చాకలి ఇస్తారు. ఇంట్లోకి ఐదు కర్రలు తీసుకుని, విష్ణువు మరియు ఆయన భార్య రూపాలు లక్ష్మీ cowdung కి , వెన్న తో అలికిన చెక్క పలక మీద వుంచుతారు. పత్తి, తాంబూలం, కూర కాయ, ధాన్యాలు మరియు స్వీట్లు తో పాటు అందిస్తారు. విష్ణువు మేల్కొనడానికి విష్ణుదేవుడు మేలుకొలుపు పాట పాడాతారు. ఈరోజున భక్తులు ఉపవాసం వుంటారు విష్ణు సహస్ర పారాయణ చేస్తారు.
ప్రభోధిని ఏకాదశి శుభాకాంక్షలు.
సోమవారం, నవంబర్ 11, 2013
1918 వ సంవత్సరం నవంబర్ 11 వ తేదిన మొదటి ప్రపంచ యుద్ధం జరిగినందువల్ల నష్టాన్ని గ్రహించి మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధవిరమణ ఒడంబడిక చేసుకున్నాయి. ఈ రోజును యుద్దవిరమణ సంధి దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈరోజును రిమంబరెన్స్ డే మరియు వెటరన్స్ డే, ఆర్మిస్టైస్ డే అని కూడా అంటారు. మొదటి ప్రపంచ యుద్ధం యొక్క పశ్చిమ యుద్ధ విరమణ కోసం కాంపిగ్నే, ఫ్రాన్స్ ప్రపంచ యుద్ధం మరియు జర్మనీ మిత్రరాజ్యాలు మధ్య సంతకం యుద్ధ విరమణకు ప్రాముఖ్య జ్ఞాపకార్ధం గా జరుపుకుంటున్నాం. యుద్ద విరామ సంధి రోజు ద్వారా ప్రపంచ శాంతి ఏర్పడింది.
ఆదివారం, నవంబర్ 10, 2013
Hey friends catch me live today (Sunday) show
with your little RJ Sree Vaishnavi
from 05:00 pm to 06:00 pm
RadioJoshLive
Masth Maza Masth Music :)
Fun with me
If you want to talk with me plz call these numbers
INDIA= +91 04042410008
USA = +19142147574
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com
Thank You Very Much.
1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి, నేటి వైభవానికి కారణబూతమైనవాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిషు అధికారులలో బ్రౌన్ ఒకడు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్.
1817, ఆగస్ట్ 13. ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి ఓడ ఒకటి బయల్దేరింది. దాని పేరు కర్ణాటక్. వందలాది ప్రయాణికులున్నారు అందులో. ఆ వందల్లో ఓ అనామకుడు. 19 ఏళ్లవాడు పిల్లవాడే ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్. భవిష్యత్తులో మరణశయ్యపై ఉన్న తెలుగు సాహిత్యాన్ని. శాస్త్రీయతా అనే గంగతో బతికించే సాహితీ భగీరథుడు. 'కానీ ఆ ఓడ ఎక్కేటప్పుడు అసలు 'తెలుగు' అనే మూడక్షరాల మాట విన్లేదు' అంటాడతను నిజాయతీగా. కానీ అతని జీవితం మొత్తాన్ని ఆ మూడు అక్షరాలే శాసించాయి. అతని మాటల్లో చెప్పాలంటే 'పిచ్చెక్కించాయి'. అతని వూపిరున్నంత వరకు వూడిగం చేయించుకున్నాయి! ఒక్క వ్యక్తి.. కేవలం ఒకే వ్యక్తి. పండితుల ఇంట్లో నా అనేవారులేక చెదలుపట్టిపోయిన తెలుగు సాహిత్యం బూజు దులిపాడు. మహరాజపోషకులు లేక... అణగారిన సారస్వతానికి అండగా నిలిచాడు. మిణుమిణుకులు మరిచిన అనర్ఘ రత్నాల మట్టితుడిచి సానబెట్టాడు. బ్రౌనే లేకుంటే.. మన తెలుగు సాహిత్యం మరొక వందేళ్లు వెనకబడి ఉండేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. సి.పి.బ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు. ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. బ్రౌను అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. తరువాత 1817 ఆగష్టు 4 న మద్రాసు లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాధమిక జ్ఞానాన్ని సంపాదించాడు.1820 ఆగష్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడం లోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవాడు కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. 1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు. బ్రౌను మానవతావాది. 1832-33లో వచ్చినగుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పదవీ విరమణ తరువాత 1854లో లండన్లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12 న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్బార్న్ గ్రోవ్, లండన్ లో అవివాహితునిగానే మరణించాడు. ఈయనను కెన్సెల్ గ్రీన్ స్మశానంలో సమాధి చేశారు.
తెలుగు భాషకు చేసిన సేవ
వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించాడు. 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించాడు.
1841లో "నలచరిత్ర"ను ప్రచురించాడు.
"ఆంధ్రమహాభారతము", "శ్రీమద్భాగవతము" లను ప్రచురించాడు.
తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసాడు. 1840లో వ్యాకరణాన్ని ప్రచురించాడు.
లండన్లోని "ఇండియాహౌస్ లైబ్రరీ"లో పడి ఉన్న 2106 దక్షిణభారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించాడు.
బ్రౌన్ వ్యాయ ప్రయాసలకోర్చి సేకరించిన తెలుగు, సంస్కృత గ్రంధాలు అసంక్యాఖం. మనుచరిత్ర, రాఘవపాండవీయం, రంగనాధ రామాయణం, పండితారాధ్య చరిత్ర, దశావతార చరిత్ర మొదలైన కావ్యాలు, ప్రబంధాలు బ్రౌన్ కృషి వల్లనే తెలుగు వారికి అందుబాటులోకి వచ్చాయి.
"హరిశ్చంద్రుని కష్టాలు" గౌరన మంత్రిచే వ్యాఖ్యానం వ్రాయించి 1842లో ప్రచురించాడు.
1844లో "వసుచరిత్"', 1851లో "మనుచరిత్ర" ప్రచురించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు.
1852లో "పలనాటి వీరచరిత్ర" ప్రచురించాడు.
చిత్తు కాగితాలు గా ఉపయోగిస్తున్నవేమన ప్రతులను చూసి బాధపడి, ఆ గ్రంధాన్ని పునర్ముద్రించాడు.
కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు.
ఈ నాటికీ ప్రామాణికంగా ఉన్న బ్రౌన్ “ఇంగ్లిష్ – తెలుగు”, “తెలుగు-ఇంగ్లిష్” dictionary ని ఆయన 1852, 1853 లో సమకూర్చాడు.
రచనలు
ఆంధ్ర గీర్వాణ చందము కాలేజి ప్రెస్సు, మద్రాసు -1827.
లోకం చేత వ్రాయబడిన శుభ వర్తమానము, బైబిల్ కధల తెలుగు అనువాదం
రాజుల యుద్దములు, అనంతపురం ప్రాంత చరిత్ర.
తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులను రాసి, 1852, 1854లో ప్రచురించాడు.
తెలుగు వ్యాకరణము - 1840లో ప్రచురణ
వేమన పద్యాలకు ఆంగ్ల అనువాదం
|
బ్రౌన్ గురించి తెలుసుకోవాలని నాకు జిజ్న్యాస కలిగించిన నాటకం
తెలుగు సాహితీ పూ తోటను కాపాదడటానికి వచ్చిన తోటమాలి బ్రౌన్ తెలుగు భాషాబిమానులందరికి జయంతి శుభాకాంక్షలు |
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ