Blogger Widgets

బుధవారం, డిసెంబర్ 20, 2017

కృష్ణుని ప్రేమ అందరికి సమానమే

బుధవారం, డిసెంబర్ 20, 2017

ఆండాళ్ళు తల్లి ఈ వ్రతమునకు అంతా సిద్దముచేసింది.  గోదాదేవి ఈ వ్రతమునకు తానూ ఒకత్తే కాకుండా మిగతా గోపికలును కూడా ఈ వ్రతమునకు రమ్మని ఆహ్వానించింది.  ఈ వ్రతము అందరు చేయచ్చు అని వ్రతము భగవద్ అనుగ్రహము కొరకు. పాడి పంటలు బాగుండాలి అని వర్షాలు పడాలి అని లోక కల్యాణానికి అని చెప్పింది.
 కృష్ణ ప్రేమ పొందాలని చాలా కోరికతో కలలు కంటున్నారు మరి కొందరు. మరి కొందరు బగావంతుని ప్రేమ పొందుతున్నట్లు కలలు కంటూ మత్తుగా నిద్ర పోతున్నారు. ఆహా కృష్ణుడు కేవలము నా వాడే అనే తలంపుతో మగత నిద్రపోతున్నారు. కొందరైతే అస్సలు నిద్ర పోతాం లేదు. మరి కొందరు నిద్ర పోతున్నారు. అసలు శ్రీ కృష్ణుని ప్రేమ అందరికి సమానమే . మరి భగవంతుని గుణగణాలు మత్తులాంటిది  . అవి నిద్రను కలిగిస్తాయి .
ఆ నిద్రనుండి లేవని వారి పట్ల కుడా కృష్ణుని ప్రేమ ఎక్కువే. వారిని మనగోదా నిద్రలేపి వారి మనస్సులో వున్నా దోషాలను వారికి కమ్ము కున్న పొరలను తొలగిస్తుంది. భగవంతనుగ్రహము పొందేలా చేస్తుంది.
ఈ రోజు చిన్న పిల్ల అయిన ఉత్తిష్టను నిద్ర లేపుతున్నది. ఎలా అంటే.

పాశురము :

 
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము:  భగవదారణ పూర్వము లేనందునను ఈ వ్రతము యొక్క గొప్పతనము తెలియకపోవుటచేత తానోక్కతియే తన భవనమున పరుండి నిద్రించుచున్న యొక్క స్నేహితురాలిని గోదాదేవితో వచ్చినవారు మేల్కొల్పుతున్నారు.  ఎట్లానగా ఆహారము సంపాదించుకోనుటకు పక్షులు గూళ్ళనుండి లేచి ధ్వని చేయుచు పోవుచ్చున్నవి.  ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయములో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేయుచు భక్తులను రండి రండి అని ఆహ్వానించుచున్నది.  ఆ ధ్వని నీకు వినబడటంలేదా.  ఓ పిల్లా! లే ! మేము ఎలా లేచామో తెలుసునా?  పూతన ఇచ్చిన స్తన్యము త్రాగినట్టియు తనను చంపగా వచ్చిన శకటాసురునికాలుతాపు తో కాలునివద్దకు పంపినవాడను.  సముద్రజలముపై హంసతూలికా తల్పముకంటే సుఖకరమైన శేషశయ్య పై లోక రక్షణమునే ఆలోచించు యోగానిద్రననుభవించు జగత్కారణమైన పరమాత్మను తమ హృదములందు బంధించి మెల్లగా నిద్రమేల్కోను మునివర్యులు హరి హరి అని చేయు భగవన్నామ ధ్వని మా హృదయములో ప్రవేసించి మమ్ము నిద్రలేపినది.  నీవు కూడా లేచి రమ్ము.  అని నిద్రపోతున్న గోపికను గోదాదేవి చెలికత్తెలు లేపుతున్నారు.


విశేషార్ధాము:
పుళ్ళుం శిలమ్బిన కాణ్:
తెల్లవారు చున్నది అని తెలియచేయుటకు మొట్టమొదట పక్షులు కలకాలమును ఇందు చెప్పుచున్నారు. తెల్లవారుచున్నది అని తెలుసుకుని తాము ముందు లేచి ఇతరులకు మేల్కొల్పునవి పక్షులు.  తాము భగవదనుభావము ననుభవించి తమ వాక్కుచే ఇతరులకు కూడా భగవదనుగ్రము కల్గించుటకు మేల్కొల్పునట్లు చేయువారు మాహాఙ్ఞానులు .  వీరి వాక్కులచే ప్రాత:కాలము అవుచున్నది.
పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో:
పక్షిరాజగు గరుడునియోక్క ప్రభువు అగు శ్రీ మహావిష్ణువు ఆలయములో మ్రోగుచున్న - అందరినీ ఆహ్వానించు-తెల్లని శంఖము యొక్క పెద్దధ్వనియు నీవు వినలేదా! 
పక్షుల కిలకిలలును ఆమె తెల్లవారినట్టు నమ్మటంలేదు అందుకు వారు వేరొక గుర్తు చెబుతున్నారు.  పక్షులకు రాజగు గరుత్మంతుడు ఆలయములో అందరినీ రమ్మని తెల్లని శంఖమును పూరించుచున్నాడు. ఆ ధ్వని చాలా పెద్దది ఆ ధ్వని నీకు వినబడలేదా అని అడుగుతున్నారు గోపికలు.
పిళ్ళాయ్! ఎళుందిరాయ్:
ఓ పిల్లా! లెమ్ము.  అప్పుడు ఆపిల్ల  మీరు వారికంటే ముందేలేచారు కదా ! మిమ్మల్ని ఎవరు లేపారు అని అడుగగా దానికి జవాబుగా మునులు, యోగులు వారి పక్కనుండి వీడి మెల్లగా లేస్తున్నప్పుడు ఉచ్చరిస్తున్న హరి హరి హరి అను శబ్దము మాకు వినబడినది అని చెప్పారు.  ఆ యోగులు స్మరించు సర్వేశ్వరుని గుణాలు మూడిటిని చెప్పి నిరూపిస్తున్నారు.
పేయ్ములై నంజుండు:
పూతన స్తనమునందలి విషమును ఆరగించి,
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి:
కృత్రిమ శకటమును  సంధిబంధములూడినట్లు కాలుచాచి కూల్చి, 
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై:
క్షీరసాగరమున శేషశయ్యపై నిద్రపోవుచున్న కారణభూతుని,
ఉళ్ళత్తు క్కొండు:
హృదయమున పెట్టుకొని,
మునివర్గళుం యోగిగళుం మెళ్ళ వెళున్ధు:
మునులును, యోగులును మెల్లగా లేచి
అరియెన్ఱ పేరరవం ఉళ్ళం పుగుందు కుళ్ళిర్ న్ధు:
హరి హరి హరి అనిన పెద్ద శబ్ధము ఊరంతా వ్యాపించి ఆ ధ్వని మా చెవులలో ప్రవేసించి మా మనసులో పది కృష్ణవిహారము చే మా హృదయము బీటలు వాలిన హృదయ క్షేత్రమున నీరుపెట్టి పదను చేసినది.  ఆ చల్లబడి తాపముపసమింఛి మేము మీల్కొంటిమమ్మా! నీవు కూడా మేల్కొనివచ్చి మాతో కలువు.  అని మొదటి గోపికను మేల్కొల్పిరి.

మంగళవారం, డిసెంబర్ 19, 2017

మన వ్రతమునకు ఆటంకములుకలుగవు.

మంగళవారం, డిసెంబర్ 19, 2017

వర్షము ఎలా కురవాలో వారు ఇంతకు ముందు పాశురములో మేఘదేవుని ప్రార్ధించారు కదా.  వర్శములేక పాడిపంటలు శూన్యమైన సమయములో సస్యసమృద్ధికి పుష్కలముగా పైరులు పండుటకు వర్షపాతము సమృద్ధిగా పెద్దల అనుమతితో ఈ వ్రతము ప్రారంభించిరి.  కావునా ఇలా ప్రార్ధించారు. మరి ఈ పాశురము లో ఏమనుకుంటున్నారో మన గోపికలు తెలుసుకుందామా.

పాశురము:
 


మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము: మనము సక్రమముగా పూర్తిచేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనము చేసిన పాపములాటంకములు కావచ్చునని భయపడనవసరము లేదు.  ఎందుచేతనంటే  శ్రీ కృష్ణుడే మన ఈ వ్రతానికి కారకుడు మరియు నాయకుడు. అతని గుణములు ఆశ్చర్యకరములైనవి.  అతని పనులు కూడా అట్టివే.  ఉత్తరమున మధురానగరమునకు నిర్వాహకుడుగా జన్మించినాడు.  నిర్మలమైన జలముగల యమునానది ఒడ్డున నివసించుచు మనకొరకు యదుకులమందున అవతరించిన మహానుభావుడు.  తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు.  అంతటి మహాత్ముడి ఉండి కూడా ఆమెచే త్రాటితో కట్టబడిన సౌలభ్య మూర్తి.  కనుక మనము సందేహములను వీడి పరిసుద్దములై అతనిని సమీపించి పరిసుద్దమైన వికసించిన హృదయకుసుమమును సమర్పించి నోరార పాడాలి.  నిర్మలమైన మనస్సుతో ద్యానిమ్చాలి. అంతటనే వెంటనే ఇంతకుముందు పాప సమూహము రాబోవు పాపముల సమూహము మంటలో పడిన దూది వలె భస్మము అయిపోతాయి.  మన వ్రతమునకు ఆటంకములుకలుగవు.


విశేషార్ధము:
మాయనై : 
ఆశ్చర్యకరములగు గుణములు, చేష్టములు కలవానిని కీర్తించి మనము మన వ్రతమున ఉపక్రమించుదుము.
మాయ అంటే భగవద్శక్తి ఇది చాలా విచిత్రముగా వుండును.
మన్ను వడమదురై మైందనై:
ప్రతినిత్యము భాగావత్సంబంధముకల ఉత్తర మధురకు నాయకుడగు వానిని కీర్తించుచున్నారు.  పyరమపదమున వికార రహితుడగు విష్ణువు ఏకరూపుడై ఎల్లప్పుడు నిత్యసూరులకు దర్సనమిచ్చు పరమాత్మయే మధురానగరిలో అవతారములు మార్చి మార్చి దర్శనము ఇచ్చినాడు.  ఈ మదురనే సిద్దాశ్రామము.  అక్కడ వామనావతారుడుగా దర్సనం ఇచ్చారు.  ఇక్కడ శత్రుఘ్నుడు ఇక్కడ నేలవనుడను రాక్షసుడును చంపి రాజదానిగా చేసికొని పాలించాడు.  తరువాత దేవకీవసుదేవులకు శ్రీ కృష్ణుడుగా ఇచట అవతరించాడు.
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై:

పరిశుద్ధములగు అగాధములగు జలములుగల యమునానది యొక్క తీరమున విహరించువాడా! అని కీర్తించుచున్నారు.  ఇక్కడ యమునానది పవిత్రము అయినది అని అంటున్నారు.  ఈ నది శ్రీ రామావతారములో అయోద్యగా సరయునదిగా వచ్చింది.  ఇక్కడ శ్రీ కృష్ణావతారములో మదురగా యమునగా వచ్చినది.  అలా వచ్చుటచే భగవంతుని అభిప్రాయము తెలిసి కృష్ణుని ఎత్తుకు వచ్చుటకు వసుదేవునకు దారినిచ్చినది.  అలా దారి ఇవ్వటమే ఆనది ప్రత్యేకత.
 ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై:
గోపవంసమునందు ప్రకాశించిన మణిద్వీపమయిన వానిని కీర్తించుచున్నారు.    ఈ పరమపదములో సర్వేస్వరుడు ఉన్నా అక్కడ తన గుణములన్నియు ప్రకాశింప వీలుండదు.  ఆ పరమ పురుషుడే మధురలో జనించి నందవ్రజము  చేరి దీపమువలె ప్రకాసించినాడు.
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై:
తల్లి అయిన యశోద గర్బమును ప్రకాసిమపచేసిన దామోదరుని కీర్తిమ్చుచున్నారు.  ఆనాడు వన్నెల చిన్నవాడు అగు శ్రీ కృష్ణుని యశోదమ్మ తాడుతో రోటికి కట్టిన మచ్చ ఎప్పుడు కనపడుటచే అతనికి దామోదరుడు అని పేరు వచ్చింది ఆ పేరును కీర్తిస్తున్నారు.  దామోదరతత్వముచే తల్లికి కీర్తి తెచ్చినవాడు చిన్ని కృష్ణయ్యా.
తూయోమాయ్ వందు నాం :
ఇట్లు స్మరించుచు పరిశుద్దలమై వచ్చి మనము సేవించినచో  సకల పాపములు పోతాయి అని చెప్పుచున్నారు.  పరిశుద్ధము అనగా భగవద్ సంబందము తప్ప వేరొకటి లేకుండా మనసు శుద్ధముగా వుమ్చుకోనుట.
తూమలర్ తూవి త్తొళుదు:
పరిశుద్ధములయిన పుష్పములు విసిరి సేవించి.  పుష్పాలకు పారిసుద్ధము, సమర్పించు వారి భక్తియే!  ఈ పువ్వునైనా భక్తితో అర్పించినా అది పరిశుభ్రమినదే.  భగవంతుడు ఆకు అయినా, పువ్వునైనా, ఫలం అయినా, నీరు అయినా సరే భక్తితో సమర్పిస్తే వారిని కరుణిస్తాడు. భగవంతునికి ఇష్టమైన పుష్పాలు ఎనిమిది వున్నాయి.
అవి అహింసా, ఇంద్రియనిగ్రహము, సర్వభూతదయ, క్షమా, ఙ్ఞానము , తపస్సు, సత్యము, ద్యానము ఇవే ఆయన కోరుకునే పుష్పాలు.
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క:
మనము భగవంతునివద్దకు నడచి వెళ్ళుటచే అతని మనస్సున భాదకలిగించును.  అయ్యో! నేనే వారివద్దకు వెళ్ళవలసినది.  వాళ్ళు వచ్చేవరకు చేసెనే అనుకుంటాడు.  పైగా మనం మాటాడినా ఇంకా భాదపడును.  మనము అతని అనుగ్రహము కొరకు అతని వద్దకు చేరి కీర్తించూదాం.
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం తీయనిల్ తూశాగుం:
ముందు చేసిన పాపములు, తరువాత రాబోవు పాపములు కూడా అగ్నిలో పడిన దూది వలె అవుతుంది.  భగవంతుని మనము అర్చించి, పాడి, చింతించిన వెంటనే మనము చేసిన పాపాలు భగవంతుడు విస్మరించును.  రాబోవు పాపాలు తెలియనట్లు వదిలివేయును.
శెప్పు:  
చెప్పుడు,  మాయావీ, మధురానాయకా, యమునాతీరా విహారి! నందవ్రజ మంగళదీపా ! యశోదాగర్భ ప్రకాశకా!  దామోదరా! అని కీర్తించుట చాలు.  అలా కీర్తించినా సర్వ పాపాలు నాశనం అవుతాయి. అని చెప్పి వ్రతమునకు అందరిని ప్రిపేర్ చేసింది.  రేపటినుండి వ్రతానింకి ఉపక్రమిస్తున్నారు గోపికలు.

సోమవారం, డిసెంబర్ 18, 2017

వర్షము కురుయునట్టి ఓ మేఘదైవతమా!

సోమవారం, డిసెంబర్ 18, 2017

గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడిపంటల తో సమృద్దిగా వుండాలని కోరుకున్నారు. తన వ్రతముంకు స్నానము ప్రదానము కావున స్నానము చేయుటకు అనుగుణముగా జలమును సమృద్దిగా ఉండవలెను అని భావించినారు.  ఈ వ్రతము నకు ఫలముగా అనుకుని వేరే వాటిని ఆశ్రయించక భక్తి తో భగవంతుని వినయ విదేయత కలిగివున్నారు .  వానదేవుని ఈ పాసురములో ప్రార్ధిస్తున్నారు.  మరి ఈ పాసురము లో ఎలా అడుగుతున్నారో తెలుసుకుందాము.
పాశురము 

  

ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్



తాత్పర్యము:  గంభీరమైన స్వభావము కలవాడైన వర్షము కురుయునట్టి ఓ మేఘదైవతమా!  నీవు వర్షజలముననుగ్రహించు దాత్రుత్వములో ఏ మాత్రము సంకోచము చూపించకు.  గంభీరమైన సముద్రము మద్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాసమునంతను వ్యాపింపచేయును.  సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరమువలె దివ్యమైన నల్లని స్వరూపమును ధరించి ఆభగవంతుని సుందర విశాల దీర్గబాహువుల జంటలో కుడిచేతి యందలి చక్రాయుధమువలె మెరయుచు ఎడమచేతి యందలి శంఖము వలె మధురగంభీరముగా ఉరిమి ఆ భగవంతుని శారంగమను ధనుస్సు నుండి వెడలివచ్చు బాణములవలె వర్షదారాలు  లోకమునంతను సుఖింపజేయునట్లును.  మేము సంతోషముతో మార్ఘశీర్ష స్నానము చేయునట్లు వర్షించు. అని అండాళ్ళమ్మ ఈ పాశురములో ప్రార్దించుచున్నది.  




విశేషార్ధము:
ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్:
ఈ గోపికలు వర్షాధిదేవుడగు పర్జన్యుని సంభోదించుచున్నారు.  ఆళి=సముద్రము వలె గంభీర్య వైశాల్యములు కలవాడు పర్జనుడు అని భావము.
ఆళి ఉళ్ పుక్కు:
సముద్రము మద్యలోనికి ప్రవేసించి,  సముద్రములో నీరు త్రాగుటకు పైపై ఒడ్డున తాగరాదు.  చిన్నచిన్న గుంటలు, పడియలలో, చెరువులలో, నదులలో నీరు త్రాగరాదు.  సముద్రములో మధ్యకు పోయి అగాధముగా నుండు చోట లోనికి చొచ్చి నీటిని త్రాగవలె.
ముగందు కొడు:
పూర్తిగా సముద్రజలమును త్రాగీ- గోపికలు మేఘముతో సముద్రపు నడిబొడ్డున చొచ్చి జలమునంతా ఇసుకతగిలే వరకు నీటిని త్రాగామంటున్నారు.
ఆర్తు  ఏఱి:
గర్జించి మిన్నంది.  ఓ మేఘమా ! నీవు సముద్రజలమును తృప్తిగా తాగిన తరువాత ఒక్కసారిగా గర్జించాలి.  మనము బోజనము చేసినతరువాత త్రేనుపు వస్తుంది అటువంటి శబ్ధము.
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు:
కాలమునకు కారణమైన బ్రహ్మతత్వముయొక్క రూపమువలె నీ శరీరమును నల్లగా చేయవలె. 
 "బ్రహ్మవేద బ్రహ్మైవభవతి" బ్రహ్మ నెరిగినవాడు బ్రహ్మ స్వరూపమునే పాడుతాడు అని ఉపనిషత్తు చెప్పుతుంది.
జలము త్రాగిన మేఘము నీలముగా మారును అది చల్లగా వుండును.
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్ 
ఆళిపొల్ మిన్ని:
విశాలమగు సుందరమగు బాహువులుగల పద్మనాభుని చేతిలోని చక్రమువలె మెరిసి, వర్షించవలె.  ఆకాశమున అధిరోహించిన మేఘము నల్లగా వుంది వర్షించుటకు ముందు మెరయును.  ఆ మెరుపు పద్మనాబుని చేతిలోని చేక్రపు మెరపువలె ఉండాలి.  పరమాత్మ బాహువులు విశాలములు సుందరములు అనిచేప్తున్నారు.
 వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు:
దక్షణావర్త  శంఖము వలె నిలిచి గర్జించి. మేఘము మేరయుట ఘర్జించుట సహజమే.  కానీ మన గోపికలు శ్రీ మన్నారాయుణుని చేతిలోని చక్రంవలె  మెరవాలిట.   శంఖమువలె గర్జించవలెను అని వారి కోరిక.
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ :

శారంగమను విల్లు బాణములను వర్షించునట్టు వర్షము వర్షించాలి అని భావము.
నాంగళుమ్ మార్గళి నీరాడ మగిళుందేలోర్ :
ఆ వర్షానికి మేము ఆనందముగా మార్గశిర స్నానము చేయాలి అని అనుకుంటున్నారు.

ఆదివారం, డిసెంబర్ 17, 2017

మనము వ్రత నీయమాలు నిర్ణయించుకున్నాము కదా!

ఆదివారం, డిసెంబర్ 17, 2017

రెండవ పాశురములో మనము వ్రత నీయమాలు నిర్ణయించుకున్నాము కదా.  మరి వ్రతము ఒక ఫలాపేక్ష తో చేస్తున్నాము కదా మరి ఆ వ్రత ఫలము ఎలావుండాలి మరి. ఆ ఫలము ఎలావుండాలో మూడవ పాశురము లో తెలుపుతారు మన అమ్మ.  అయితే ఈ పాశురము విశేషము కలది  అయితే చక్కేరపోంగాలి నివేదించాలి స్వామికి. మరి ఆ పాశురము ఇదిగో..... 
ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి కోసం చిత్ర ఫలితం

పాశురం: 

*ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
 నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
 తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
 ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
 పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
 తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
 వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
 నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము:   పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారము ఎత్తి బలిచక్రవర్తిని మూడు అడుగులు భూమిని దానము అడిగెను.  బలిచక్రవర్తి అలాగే అని దానము చేయగా వామనుడు మూడు పాదాలతో మూడు లోకాలను ఆక్రమించారు.  అట్టి త్రివిక్రముని దివ్యనామములను గానము చేయుచూ వ్రతనిమిత్తముగా మేము స్నానము చేయుటచే సకాలములో కావలసిన వర్షము కురిసి చక్కగా పెరిగిన వరిచేను కన్నులకానందము కలుగచేయాలి.  చేనులోని నీటిలో చేపలు యెగిరి పడుచు మనస్సును ఆకర్షించవలెను.  అన్ని పైరులును బాగుగా పెరిగి ఆనందము కలిగింపవలెను.  పాలు పితుకువారు  పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చోండి పోదుగునంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలను వర్షించవలెను.  స్థిరమైన  సంపదదేశమంతటను విస్తరింపవలేనని ఈ పాసురములోని గోదామాత కోరుచున్నది.


విశేషార్ధము:  
1 ) ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి:
పెరిగి లోకములు కొలిచిన ఉత్తముని పేరు పాడి మేము ఈ వ్రతమునకు స్నానమాచరించుతుము.  పుట్టుట-ఉండుట-పెరుగుట-మారుట-తరగుట-లేకుండుట అనునవి ఆరు ప్రకృతి వికారాలు అలాంటి వికారాలు లేని స్వామీ మనకోసం వచ్చి పెరిగాడని గోపికలు సంతోషించారు.
2 )నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్:
మేము మావ్రతమునకు అని, మిష పెట్టి స్నానము చేసినచో లోకమంతయు సుఖముగా వుండును.  మేము-మావ్రతము గొప్పవని చెప్పుకుంటున్నారు.
3 ) తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు:
ఎటువంటి బాదలు లేకుండా దేశమంతా నెలకు మూడు వానలు పాడుటను.   ఈవ్రతం వల్లన లోకములో పాడి పంట సమృద్దిగా వుండును.
4 ) ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ: 
పెరిగిన పెద్దపెద్ద వరిచేనులో చేపలు త్రుళ్ళిపడును.  చేను పెద్దగా పెరుగుట, అడుగున నీరు సమృద్దిగా ఉండుట, పంటకు విశిష్టత.  అట్టివిశిష్టత ఈ వ్రతము వాళ్ళ కలుగును అని భావం.
5 )పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప:
పూచినా కలువ పువ్వులలో లేదా సుందరమైన కలువపూలలో అందమయిన తుమ్మెదలు ఒకదానితో ఒకటి కలహించుకోనుచూ నిద్రిస్తున్నవి.   వారి చేనులో నీరు అధికముగా వుండుట వాళ్ళ కాలువలు ఎక్కువున్నాయి.  వాటిలోని మకరందము కోసం తుమ్మెదలు వస్తున్నాయి.  అంటే వారి ఊరిలో పాడియోక్క వైబోగం చెప్తున్నారు.
6 )తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ:
ఎటువంటి జంకూలేకుండా కోట్టములోకి వెళ్లి కుర్చోనిన బాగా బలసిన చనుకట్లు పట్టి పాలు పిండగా  అక్కడ ఆవులు కుండలు కుండలు పాలు ఇస్తున్నాయి.  ఆ రేపల్లేలో గోవులు సమృద్దిగా వున్నవి అని.
7 )క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్ 
    నీంగాద శెల్వం నిఱైందే:
కుండలు నిండునట్లు పాలను ఇస్తున్న ఉదారములగు పశువులు, తరగని సంపద, నిండియుండును.



My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)