Blogger Widgets

సోమవారం, అక్టోబర్ 16, 2017

గోవత్స ద్వాదశి పూజ

సోమవారం, అక్టోబర్ 16, 2017


ఈరోజు మహారాష్ట్రలో గోవత్స ద్వాదశి పండుగను జరుపుకుంటారు.  ఇది ధన్తేరాస్ కు  ఒకరోజు ముందు జరుపుకుంటారు. గోవత్స ద్వాదశి పూజ హిందువులు జరుపుకునే పండుగ . 
మనం ఆవులను ఆరాధించటానికి గుర్తుగా జరుపుకుంటారు.  మానవ జీవితాన్ని కాపాడుకోవటానికి అవి చేస్తున్న  సహాయంకు  కృతజ్ఞతలు చెప్పటమే  .  ఈ సంప్రదాయము 'ద్వాదశి ' రోజు జరుపుకుంటున్నాం . దీనిని 'నందిని వ్రతము ' అని కూడా  పిలుస్తారు.  గోవత్సా ద్వాదాషి హిందూ భక్తులు దైవ ఆవు అయిన నందినిని పూజిస్తారు. ఈ పూజ వల్ల  వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పండుగను  దేశంలో  అన్ని ప్రాంతాలలో అపారమైన ఉత్సాహంతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ రోజును  'వాసు బరస్' గా గుర్తించి పూజ చేస్తారు  మరియు దీనితోనే దీపావళి సంబరాలలో మొదటి రోజుగా పూజలు  మొదలుపెడతారు . గోవత్సా ద్వాదశి రోజునే , 'శ్రీపద వల్లభ ఆరాధన ఉత్సవ్' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం దత్తా మహాసాంధన్లో జరుగుతుంది, గుజరాత్లో 'వాగ్ బరాస్' గా జరుపుతారు.

గోవత్సా ద్వాదశి  సమయంలో ఆచారాలు:

గౌవ్సా ద్వాదశి రోజున ఆవులు ఆరాధించబడుతున్నాయి. ఒక సంప్రదాయ స్నానం చేయించి  నుదురు మీద తిలకం దిద్ది పూజ చేస్తారు. ఆవులు మరియు వారి దూడలను అందంగా ప్రకాశవంతమైన వస్త్రాలు మరియు పూల పూలలతో అందంగా అలంకరిస్తారు.
గోవత్సా ద్వాదశి రోజు కొందరు  భక్తులు ఆవుల విగ్రహాలను మరియు వారి దూడలను మట్టి తో  తయారు చేస్తారు. ఈ మట్టి విగ్రహాలు కు కుంకుం మరియు పసుపుతో అలంకరించి పూజ చేస్తారు . సాయంత్రం హారతి ' ని ఇస్తారు. 
గ్రామాలలో పశువులకు వివిధ రకాల ఆహార పదార్ధాలు సమర్పిస్తారు.
భక్తులు విష్ణువు అవతారంగా ఉన్న శ్రీ కృష్ణుడికి ప్రార్ధనలు చేస్తారు. ఆవుల పట్ల  కృతజ్ఞతలు మరియు ప్రేమను కలిగి ఉంటారు.
కొన్ని ప్రాంతాల్లో, ప్రజలు గోవత్సా ద్వాదాషి రోజున ఆవు పాలను త్రాగటం మరియు నెయ్యి ని ఉపయోగించటం మానివేస్తారు.
గోవత్సా ద్వాదాషి యొక్క ప్రాముఖ్యత మరియు దాని  పురాణము 'భవిష్య పురాణం' లో ప్రస్తావించబడింది. పురాణం లో నందిని యొక్క కథ కూడా ఉంది , దైవత్వం కల  ఆవు మరియు దూడ గా  పురాణం  చెబుతుంది. హిందూ మతంలో, ఆవులు చాలా పవిత్రంగా భావిస్తారు. వారు మానవాళికి పోషణ అందించేటప్పుడు వారు కూడా పవిత్ర మాతృమూర్తి గా  పూజిస్తారు. Govatsa Dwadashi రోజు న మహిళలు తమ పిల్లలు సుదీర్ఘ జీవితం కోసం ప్రార్ధిస్తారు . పిల్లలు లేని జంట జంటగా గోవత్సా ద్వాదాషి పూజ నిర్వహిస్తారు మరియు ఉపవాసం ఉంటే, వారికి పిల్లలతో  ఆనందంగా  ఉండే ఆశీర్వదము  కలిగి ఉంటారనే నమ్మకం ఉంది . ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, గోవత్సా ద్వాదాషి కూడా 'వాగ్' అని కూడా పిలుస్తారు, వాగ్  అనగా  ఆర్థిక రుణాలను తిరిగి చెల్లించాలని సూచిస్తుంది. అందువలన ఈ  రోజున  వ్యాపారవేత్తల్లో వారి ఖాతాల పుస్తకం ను  క్లియర్ చేసి, వారి నూతన  లావాదేవీలు దీవాలి తో మొదలుపెడతారు . గోవత్సా ద్వాదశి  రోజు ఆవులు ను పూజించి న వ్యక్తి సమృద్ధిగా మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతాడు అని నమ్ముతారు. మనం పూజించే ముక్కోటి దేవతలు  గోమాతలో ఉంటారుట.  గోవును పూజిస్తే మనం ఒకసారి ముక్కోటి దేవతలను పూజించినట్టే వారి దీవెనలు మనకు అందినట్టే.  
గోవత్స ద్వాదశి పూజ గురించి బాగుంది కద . 
"గోవులను పూజించండి.  గోవధను వ్యతిరేకించండి "అదే మన హిందూ సాంప్రదాయం . 

బుధవారం, అక్టోబర్ 11, 2017

"ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు"

బుధవారం, అక్టోబర్ 11, 2017


ఈరోజుకొక విశేషము వుంది అది ఏమిటంటే.  మనందరికీ చీకటి నుండి తెల్లవారాక ముందే వారికి  తెల్లవారుతుంది. చకాచకా పరిగెడుతూ పరిగెడుతూ సైకిల్ మీద వార్తా పత్రికలు ప్రతి ఇంటికి ప్రతీ వీధి  వీధి కీ  వార్తాపత్రికలును వేసి తొందర తొందరగా వార్తా పత్రికలను అందిస్తూ ఉంటాడు.    పల్లెటూరులో అయితే కొక్కొరోకో అనే కోడి అరుపుతో తెల్లారుతుంది. మరి  మన ఇంటి ముందర పాల పేకట్లు తో పాటు  ప్రఫంచం అంతటా ఎమి జరిగిందో,  ఏమి జరగబోతోందో తెలపటానికి వార్తా పత్రిక కూడా వుంటుంది.  వార్తాపత్రికలు  చూస్తే  కానీ మనకు తెల్లవారిన అనుభూతి రానే రాదు.  వేడి వేడి కాఫి పట్టుకొని పేపర్ చదవటం ప్రతి ఇంట్లో జరిగే రోజు జరిగే మొదటి పని. అందరు దేవదేవుని సుప్రభాతము వింటారో వినరో కానీ పేపరు చదవకుండా వుండలేరు.   ఆ పేపర్ చేరటం ఆలస్యం అయితే మనమే అతని కోసం ఎదురు చూస్తాం.  ఈ పేపరు మన ఇంటికి చేర్చేది పేపర్ బోయ్ నే.  వాతావరణం ఎలా వున్నా.  తెల్లారేసరికి మన ఇంటికి పేపర్ అందిస్తాడు పేపర్ బోయ్.    

ఈరోజు ప్రపంచం అంతా  "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" జరుపుకుంటున్నారు.  
మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ - న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). చదువుకుంటూనే పేపర్ బాయ్ లుగా పని చేసి ఎంతో మంది సమాజంలో ఉన్నతస్థాయికి ఎదిగారు.  ఉదాహరణకు రామేశ్వరంలో పుట్టిన అబ్దుల్ కలాం పేపర్ బాయ్‌ నుండి జీవితాన్ని మొదలుపెట్టి భారత రాష్ట్రపతి వరకు ఎదిగారు. 

అలాగే పేపర్ బాయ్ గా సంపాదన మొదలు పెట్టి ఇండియాన్ ఐడల్ 2017 రేవంత్ విజేతగా నిలిచాడు.  ఇలాంటి వారిని చూసి మనం ఆదర్శంగా తీసుకోవాలి.  మనం జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే చాలా కష్టపడాలి.  అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలకు చేరగలం.  
పేపర్ బోయ్స్ అందరికి "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" శుభాకాంక్షలు.

గురువారం, అక్టోబర్ 05, 2017

మహర్షి వాల్మీకి

గురువారం, అక్టోబర్ 05, 2017

ఈ రోజు వాల్మీకి జయంతి. వాల్మీకి సుమాలి కుమారుడు. మహర్షి వాల్మీకి షుద్ర కుటుంబంలో జన్మించాడు. ఆయన పుట్టిన పేరు రత్నాకర.  వాల్మీకి సంస్కృత సాహిత్యం ఆదికవి గౌరవించబడ్డాడు. వాల్మీకిని  మహర్షి వాల్మీకి అని కూడా పిలుస్తారు మరియు ఆది కవి సంస్కృత భాషలో మొదటి కవిగా పరిగణిస్తారు.  అతను ఒక గొప్ప యోగి మరియు ఈయన రామాయణ రచయిత.
రామాయణం రాసిన సమయం గురించి విభిన్న అభిప్రాయాలున్నాయి. కొంతమంది ప్రజలు 2,500 సంవత్సరాల క్రితం వ్రాయబదినది అని  నమ్ముతారు (సుమారు 500 BC).  కొందరు 1,800 సంవత్సరాల క్రితము  వ్రాసినట్లు మరికొందరు భావిస్తున్నారు. పుస్తకం చాలా పురాతనమైనది మరియు మహాభారతకు ముందు వ్రాయబడింది అని అందరూ అంగీకరిస్తున్నారు.
వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు 7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి. 
రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. మహర్షి వాల్మీకి శ్రీ రామ జననం శకంగా తన పుట్టిన ఖచ్చితమైన సమయాలను నిర్వచించటానికి చేస్తుంది కూడా ఆధునిక చరిత్రకారుల మధ్య చాలా చర్చనీయాంశంగా ఉంది.   శ్రీ రామ ప్రవాస తన కాలంలో వాల్మీకిని  కలుసుకున్నారు.  వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు  సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది. వాల్మీకి ఈ కవలలుకు  రామాయణం బోధించాడు.
రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకి ఒక బందిపోటు దొంగ,  అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . అతను తన కుటుంబంను పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారులను చంపి, వారి సొత్తును దోచుకుని జీవితం గడిపేవాడు. 
ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ఒక ప్రశ్న అడుగుతాడు, కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ఆదిగాడు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు. నారదుడు భగవత్ భక్తిని నేర్పటానికి ప్రయత్నిస్తాడు. "రామ" అని పలకమంటే ఆ దొంగ పలకలేకపోతాడు. చాలా సేపు ప్రయత్నించినా దొంగ ఆ పదాన్ని పలకలేకపోతాడు, అప్పుడు నారదుడు "మరా" అని పదే పదే చెప్పమని, ఆ విధంగా రామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తాడు. ఉపదేశం పొందిన దొంగ, జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోతాడు. చుట్టూచీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తాడు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా తపస్సంపన్నం గురించి తెలియపరుస్తూ వాల్మీకి అనే పేరును ఆ దొంగను పిలుస్తాడు.  ఆపేరు నిలిచిపోయింది.  వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. 
వాల్మీకి తపస్సంపన్నత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు:
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥
ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి
ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం అంతా  రాసేవరకూ సాగింది.  ఈ మొదట  శ్లోక రచన చేసింది వల్మికినే. 
అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారత దేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలొ పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ. 

తమిళనాడు లోని తిరువంచియూర్ లోని మహర్షి  వాల్మీకి కి చిన్న ఆలయం  (జీవా సమాధి) ఉంది.  వాల్మీకి ఆలయం

 Lord Valmiki Chennai Lord Valmiki Chennai.jpg

శుక్రవారం, ఏప్రిల్ 08, 2016

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

శుక్రవారం, ఏప్రిల్ 08, 2016

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  

ఉగాది ప్రతీ సంవత్సరం చాంద్రమానం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వస్తుంది. ఉగాది పండగకు చారిత్రిక కధలువున్నాయి.    
దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి, ధర్మాన్ని నిలపడానికి శ్రీమహావిష్ణువు ఈ భూమి మీద తిరిగి తిరిగి అవతరిస్తూ వచ్చాడని హిందువుల నమ్మకం. 'అవ తారం' అనే మాటకు 'దిగి రావడం' అని అర్థం ఉంది. ధర్మసంస్థాపనానికి శ్రీమహావిష్ణువు ఎత్తిన అవతారాలలో ప్రధానమైనవి పది. వాటినే దశావతారాలు అంటారు.  శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో మత్స్యావతారం మొదటిది. 
ఈరోజే మత్స్యము గా అవతరించారు అంటారు.

ద్రవిడ దేశపు రాజైన సత్యవ్రతుడు కృత మాలిక ఒడ్డున జల తర్పణం చేయుచుండగా మత్స్య మొకటి అతని దోసిట పడెను. అది నన్ను రక్షించు రక్షించు అని రాజును వేడు కొనెను. రాజు ఆ మత్స్యాన్ని ఒక భాండం నందుచెను. మరుసటి రోజు ఆమత్స్యం పది నారంగుళములు పెరిగిను. ఈ విధంగా పెరు గుతూపోతున్న చేపను చివరికి సముద్రంలో వేస్తూ నీవేవరివి? అని అడిగెను. దానికి ఆ చేప తాను, జనార్దుడనని చెప్పెను. బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో నాలుగు వేదాలను సోమకుడు అనే ఒక రాక్షసుడు దొంగ లించా డని, అతడు కౄర స్వభావుడని చెప్పాడు. అంతేకాక, ధర్మ బద్దమైన జీవన విధానానికి రాక్ష సులు వ్యతిరేకులని కూడా చెప్పాడు.
సోమకుడు తాను దొంగిలించిన నాలుగు వేదా లతో సహాసముద్రం అడుగుభాగాన దాగి ఉన్నా డు. మహాజల ప్రళయం రానున్న కార ణంగా ముల్లోకాలు నీట మునుగుతాయి. నేను మీ కోసం ఒక నావను పంపుతాను. మీరు, సప్తఋషులు, ఔషధవృక్షజాతులతో కలిసి, ఆనావలో ఎక్కండి. వాసుకి అనే మహా సర్పంతో ఆనావను కట్టండి. మహాజల ప్రళయం ముగిసేదాకా ఆ నావ నీటిలో తేలియాడేలా నేను చూసుకుంటాను అని ఆ మత్స్యం అభ యమిచ్చింది.
చేప రూపంలో ఉన్న విష్ణువు చెప్పిన విధం గానే సత్య వ్రతుడు చేశాడు. అప్పుడు ఆ చేప సముద్రం అడుగు భాగానికి ఈదుకుంటూ వెళ్లాడు. సోమకుడు దాగి ఉన్న చోటికి చేరు కున్నాడు. ఘోర యుద్ధ అనంతరం సోమ కుడు మరణించాడు. శ్రీమహావిష్ణువు నాలుగు వేదాలు రక్షించి తెచ్చి బ్రహ్మదేవునికి అందించాడు. బ్రహ్మదేవుడు వాటిని ముందు తరాల వారికోసం భద్రపరిచాడు. ఆ విధంగా వేదాలు మనకు లభ్య మైన కారణంగా మానవులు సకల ధర్మాలను, శాస్త్రాలను, అభ్యసించే అవకాశం కలిగింది.
మనం చిన్న పిల్లలకు కధలు చెప్తాం కదా అందులో విక్రమార్క మాహారాజు కధలు కూడా చెప్తాం. ఆ విక్రమార్క మహారాజు పటాభిషేకం జరిగిన రోజు కూడా ఈరోజే.  ఇవి చరిత్రలోని కొన్ని అంశాలు.  
ఈ ఉగాది అందరికి ఎన్నో ఎన్నెన్నో ఆనందాలు ఇవ్వాలి అని కోరుకుంటూ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  

బుధవారం, మార్చి 23, 2016

వినోద సంబరాల రంగుల పండుగ "హోలీ"

బుధవారం, మార్చి 23, 2016

"హోళికా" దహనం. 
ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఆమె ప్రీతి కోస౦ అ౦దరూ కలిసి గానాలు చేయడ౦, పరిహాసాలాడడ౦ చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధి౦చే స౦ప్రదాయ౦ ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి.
శ్రీ మహా లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు.  
శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధి౦చి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్ర౦, వ౦టివి పారాయణ చేయడ౦ మ౦చిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చి౦చే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
’డోలోత్సవ౦ శుభాకాంక్షలు. 

ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధి౦చాలి. దీని ’డోలోత్సవ౦’ అని అ౦టారు. ఒరిస్సావ౦టి ప్రా౦తాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు.

నరాడోలాగత౦ దృష్ట్వా గోవి౦ద౦ పురుషోత్తమ౦!
ఫాల్గుణ్యా౦ ప్రయతో భూత్వా గోవి౦దస్య పుర౦వ్రజేత్!!

ఉయ్యాలలో అర్చి౦పబడిన పురుషోత్తముడైన గోవి౦దుని ఈరోజున దర్శి౦చిన వారికి వైకు౦ఠలోక౦ ప్రాప్తిస్తు౦దని ధర్మశాస్త్రాల వాక్య౦.
వినోద సంబరాల రంగుల పండుగ "హోలీ" శుభాకాంక్షలు. 
హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాసిస్తాయి, అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషము.  
 హిరణ్యకశ్యపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.

ప్రాథమిక పరిశోధనల ప్రకారం 7వ శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకొన్నారని తెలిసింది. వాస్తవంగా హోలీ పండుగకు సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి, మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు మరియు పొడవైన చిమ్మే గొట్టాలు లేదా చిమ్మే తుపాకుల నుండి రంగు నీటిని జల్లుకుంటారు. సంగీత కచేరీల ద్వారా అనగా పండుగకు సంబంధించిన పాటలను మరియు రాధా మరియు కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు; ముఖ్యంగా జానపద పాటలు అనగా "హోరి" పాటలను పాడేవారు. కొన్ని సంప్రదాయక జానపద పాటలు ఆజ్ బిరాజ్ మే హోలీ రే రాసియా కొన్ని తరాల నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి.
సంవత్సరాలు గడుస్తున్నకొద్ది, ప్రవాసభారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, యూరప్ మరియు దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు.
వసంత కాలంలో వాతవరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం మరియు జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం: సంప్రదాయముగా రంగులను నిమ్మ , కుంకుమ, పసుపు, బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు.
తడి రంగుల కొరకు, మోదుగ పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది.  రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది. వీటి వల్ల అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి.  అలాంటి వ్యాధులు రాకుండా వుండాలి అంటే రసాయన రంగులను ఉపయోగించకుండా వుంటే మంచిది.
ఇది వసంతోత్సవ పండుగ.  హోలీ పండుగ కృష్ణుడు కూడా జరుపుకున్నాడు అంటారు.  ఈ పండుగ గురించి నేను కొంచెమే తెలుసుకున్నాను అని నాకు అనిపిస్తోంది. 


హోలీ పండుగను అందరు సంతోషము గా జరుపుకోవాలని అనుకుంటున్నాను.  
అయ్యప్ప జననదినోత్సవ శుభాకాంక్షలు.
ఈరోజు అయ్యప్ప స్వామీ వారి జయంతి కూడా.  ఒకేరోజు ఎన్ని విశేషాలు వున్నాయో కదా !
ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్తమణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమం తో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. అయ్యప్ప జననదినోత్సవ శుభాకాంక్షలు. 

మంగళవారం, మార్చి 22, 2016

ప్రపంచ జలదినము (నీరు మరియు ఉద్యోగం )

మంగళవారం, మార్చి 22, 2016

నేడు 22 వ మార్చి 2012 ప్రపంచ జలదినము గా జరుపుకుంటున్నాం.  ఈనాటి జలదినోత్సవం జలము మరియు ఉద్యోగాలు అన్న థీమ్ తో జరుపుకుంటున్నాం.  ఆరోగ్యకరమైన ప్రపంచం కొరకు నీరు శుభ్రంగా వుంచుకోవాలి. అన్న ముఖ్య ఉద్దేశముతో జలదినము జరుపుకుంటున్నాం.

మనకు నీరు చాలా విలువైనది.  నీరు మనము బ్రతకటానికి ఎంతో ఉపయోగకరమైనది.  ఇది మనకు ప్రకృతి ఇచ్చిన వరప్రసాదంగా భావించాలి అని నా అభిప్రాయం.  నిత్యావసరాలు అన్నీ నీటితోనే నిండి వుంది.  మనము దాహం వేసినప్పుడు నీరు దొరకపోతే. మన ప్రాణాలు నీటికోసము కొట్టుకుపోతాయి.  ఆ క్షణములో గ్రుక్కెడు నీళ్ళు దొరికితే మన ప్రాణాలు నిలబడినట్టు వుంటుంది.  అటువంటి నీటిని మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి కదండి.  

అంతర్జాతీయ ప్రపంచ జల దినోత్సవం మంచినీటి యొక్క ప్రాముఖ్యతపై దృష్టి సారించవచ్చు మరియు మంచినీటి వనరులకు  స్థిరమైన నిర్వహణ కోసం ఒక ఆలోచనకోసం మార్చి 22 న ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. మంచినీటి జరుపుకునేందుకు ఒక అంతర్జాతీయ రోజు ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ (UNCED) 1992 వ సంవత్సరములో యునైటెడ్ నేషన్స్ సమావేశం వద్ద సిఫార్సు జరిగినది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మొదటి ప్రపంచ జల దినోత్సవం గా మార్చి 1993 , 22  న  కేటాయించడం ద్వారా ప్రతిస్పందించారు. ప్రతి సంవత్సరం, ప్రపంచ జల దినోత్సవం మంచినీటి ఒక ప్రత్యేకముగా హైలెట్ చేసారు. 

ఈరోజు జలదినోత్సవ సందర్భముగా మనము నీటిని వృదా చేయద్దు అన్న ఉద్దేశ్యము తో ఇవిధంగా చెప్తున్నాను.  జనరల్ గా మనము నీటిని చాలా విదాలుగా వృదాచేస్తున్నాము.  ఉదాహరణకి మనలో చాలా మంది  దినచర్యలో  వారి దంతాలు బ్రష్ చేస్తూ tap విప్పి బ్రష్ కంప్లేట్ అయ్యేవరకు వదిలేస్తాము.   షవర్ ద్వారా బాత్రూమ్ లలో  ట్యాప్ ఉచితంగా నడుస్తున్న వదిలి యొక్క అలవాటు ఉంటుంది. అవివేకముగా  అనవసరముగా నీరు వ్యర్థం అవటానికి కారణమవుతుంది.  

ఆరోగ్యకరమైన ప్రపంచము కోసము పరిశుద్ధ నీరును పొదుపుగా మనము వాడుకుందాం.  దీనికోసము మనము అనవసరముగా నీటిని వృదా చేయద్దు.  మరియు పరిశుద్ధ నీటిని కలుషితము చెయ్యద్దు అని ప్రామిస్ చేద్దాం.

మంగళవారం, మార్చి 08, 2016

మహిళలూ మహారాణులు

మంగళవారం, మార్చి 08, 2016

ఈరోజు ప్రపంచం అంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మొట్టమొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు.  ఎక్కడ మహిళలు గౌరవించబడుతారో, అక్కడ దేవతలు ఆనందిస్తారు అంటారు.  ఒక్కొక్క ప్రాంతంలో వారి ప్రదేశాన్ని బట్టి వారి మహిళలకు ఇచ్చే ప్రేమ, గౌరవం, మర్యాద, ఆర్ధిక స్వాతంత్రం,  సామాజిక స్వాతంత్రం, రాజకీయ స్వాతంత్రం, వారివారి సొంత గుర్తింపు కలిగించుకోవటానికి ఒక గుర్తుగా వుంటుంది ఈ మహిళా దినోత్సవం.  ఇప్పుడైతే ప్రపంచం మొత్తం ఈరోజును గుర్తించారు.  మన భారతదేశం లో అనాదికాలం నుండి మహిళకు ప్రత్యేకత నిచ్చేవారు.  స్త్రీని ఒక దేవతా స్వరూపంగా భావించేవారు.  పర స్త్రీ అంటే మాతృమూర్తిగా భావించేవారు. 

 నేడు మనదేశంలో కూడా పరిస్థితులు మారిపోయాయి.  ఆధునికత అనే పేరుతో పరిస్థితులు మారిపోయాయి.  ఇది చాలా బాధాకరమైన విషయం.  అన్ని రంగాలలోను పురుషులతో సమానంగా ప్రయాణిస్తున్న మహిళ మరలా అసమర్ధురాలిగా, అభద్రతా భావంవల్ల తను నిజంగా ఆత్మన్యూన్యతా భావం కలిగి మేము అసమర్దులమని దేనికి దైర్యం లేక  ఎన్నో ఆసలు కోరికలు వున్నా మేము ఏమి చెయ్యలేము అన్న భావంతో అడుగుముందుకు వేయలేకపోతున్నారు.  ఒకవేళ దైర్యం తెచ్చుకొని అడుగుముందుకు వేస్తే దానికి అనేక అడ్డంకులు కలిగి మానసిక వత్తిడి కలిగి ప్రయాణాన్ని ఆపేస్తున్నారు.   కుటుంబాలలో కూడా వారికి శారీరక మానసిక హింస ను ఎదుర్కొంటున్నారు.  అలాంటి జీవితాన్ని కాదని బయటికి వచ్చి స్వేచ్చగా వుండాలని వున్నా వుండలేని సామాజిక పరిస్థితి.  ఇవన్ని ఎప్పుడు మారతాయో ఎవరికీ తెలియదు.  ఈ మహిళా దినోత్సవాలు లాంటివి ఎన్ని జరుపుకున్నా మార్పు వస్తుందా?    స్త్రీ పట్ల వివక్ష అసలు అమ్మ కడుపులో నుండే మొదలు అవుతుంది.  స్త్రీగా పుట్టడమే పాపం అన్నట్టు వుంటుంది ఆమె జీవితకాలం ఎదుర్కొనే పరిస్థితులతో.  ఎన్ని చట్టాలలో మార్పు తెచ్చినా విద్యాభివృద్ది సాధించినా,  భూ ఆస్తి హక్కు కలిగించిన నేటి మహిళా పరస్థితి మారలేదు అనటంలో జగమెరిగిన సత్యం.
చట్టాలలో ఎన్ని మార్పులు వచ్చినా ఎక్కడికక్కడ స్త్రీకి అన్యాయం జరుగుతూనే వుంది.  ‘ఆకాశంలో సగం.. అన్నింటా సగం’ అంటూ మహిళలను ఒకవైపు ఆకాశానికి ఎత్తేస్తున్నా. మరోవైపు రోజురోజుకూ వారిపై దాడులు పెరిగిపోతున్నాయి.  భ్రూణహత్యలు, అత్యాచారాలు, గృహహింస తదితర వేధింపులు అధికమవుతున్నాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త చట్టాలు తెస్తున్నా వీటిపై సరైన అవగాహన లేక ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోతున్నాయి. మహిళలకు సంబంధించిన ప్రతీ అంశానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. వీటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గాంధీగారు అన్నట్టు ఏనాడైతే ఒక మహిళా అర్దరాత్రి నడి రోడ్డు పై ఒంటరిగా నడవగాలదో ఆనాడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది . కాని 69 సంవత్సరాలు గడిచినా ఈ మహిళా స్వాతంత్ర్య పోరాటం చేస్తూనే వున్నారు.  అలా మారినరోజు ను నిజమైన మహిళా దినోత్సవంగా జరుపుకుందాం.  
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. 

సోమవారం, మార్చి 07, 2016

శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

సోమవారం, మార్చి 07, 2016

ఓం నమః శివాయః          హరహర మహాదేవ శంభోశంకర 
ఓం
స్థిరః స్థాణుః ప్రభుర్భానుః ప్రవరో వరదో వరః |
సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః || 1 ||

జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగః సర్వాంగః సర్వభావనః |
హరిశ్చ హరిణాక్శశ్చ సర్వభూతహరః ప్రభుః || 2 ||

ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః |
శ్మశానచారీ భగవానః ఖచరో గోచరో‌உర్దనః || 3 ||

అభివాద్యో మహాకర్మా తపస్వీ భూత భావనః |
ఉన్మత్తవేషప్రచ్ఛన్నః సర్వలోకప్రజాపతిః || 4 ||

మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః |
మహా‌உ‌உత్మా సర్వభూతశ్చ విరూపో వామనో మనుః || 5 ||

లోకపాలో‌உంతర్హితాత్మా ప్రసాదో హయగర్దభిః |
పవిత్రశ్చ మహాంశ్చైవ నియమో నియమాశ్రయః || 6 ||

సర్వకర్మా స్వయంభూశ్చాదిరాదికరో నిధిః |
సహస్రాక్శో విరూపాక్శః సోమో నక్శత్రసాధకః || 7 ||

చంద్రః సూర్యః గతిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః |
అద్రిరద్ర్యాలయః కర్తా మృగబాణార్పణో‌உనఘః || 8 ||

మహాతపా ఘోర తపా‌உదీనో దీనసాధకః |
సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః || 9 ||

యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాతపాః |
సువర్ణరేతాః సర్వఘ్యః సుబీజో వృషవాహనః || 10 ||

దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః |
విశ్వరూపః స్వయం శ్రేష్ఠో బలవీరో‌உబలోగణః || 11 ||

గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవ చ |
పవిత్రం పరమం మంత్రః సర్వభావ కరో హరః || 12 ||

కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవానః |
అశనీ శతఘ్నీ ఖడ్గీ పట్టిశీ చాయుధీ మహానః || 13 ||

స్రువహస్తః సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః |
ఉష్ణిషీ చ సువక్త్రశ్చోదగ్రో వినతస్తథా || 14 ||

దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవ చ |
సృగాల రూపః సర్వార్థో ముండః కుండీ కమండలుః || 15 ||

అజశ్చ మృగరూపశ్చ గంధధారీ కపర్ద్యపి |
ఉర్ధ్వరేతోర్ధ్వలింగ ఉర్ధ్వశాయీ నభస్తలః || 16 ||

త్రిజటైశ్చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః |
అహశ్చరో‌உథ నక్తం చ తిగ్మమన్యుః సువర్చసః || 17 ||

గజహా దైత్యహా లోకో లోకధాతా గుణాకరః |
సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః || 18 ||

కాలయోగీ మహానాదః సర్వవాసశ్చతుష్పథః |
నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః || 19 ||

బహుభూతో బహుధనః సర్వాధారో‌உమితో గతిః |
నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాసకః || 20 ||

ఘోరో మహాతపాః పాశో నిత్యో గిరి చరో నభః |
సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యనిందితః || 21 ||

అమర్షణో మర్షణాత్మా యఘ్యహా కామనాశనః |
దక్శయఘ్యాపహారీ చ సుసహో మధ్యమస్తథా || 22 ||

తేజో‌உపహారీ బలహా ముదితో‌உర్థో‌உజితో వరః |
గంభీరఘోషో గంభీరో గంభీర బలవాహనః || 23 ||

న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్శకర్ణస్థితిర్విభుః |
సుదీక్శ్ణదశనశ్చైవ మహాకాయో మహాననః || 24 ||

విష్వక్సేనో హరిర్యఘ్యః సంయుగాపీడవాహనః |
తీక్శ్ణ తాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవితః || 25 ||

విష్ణుప్రసాదితో యఘ్యః సముద్రో వడవాముఖః |
హుతాశనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః || 26 ||

ఉగ్రతేజా మహాతేజా జయో విజయకాలవితః |
జ్యోతిషామయనం సిద్ధిః సంధిర్విగ్రహ ఏవ చ || 27 ||

శిఖీ దండీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధగో బలీ |
వైణవీ పణవీ తాలీ కాలః కాలకటంకటః || 28 ||

నక్శత్రవిగ్రహ విధిర్గుణవృద్ధిర్లయో‌உగమః |
ప్రజాపతిర్దిశా బాహుర్విభాగః సర్వతోముఖః || 29 ||

విమోచనః సురగణో హిరణ్యకవచోద్భవః |
మేఢ్రజో బలచారీ చ మహాచారీ స్తుతస్తథా || 30 ||

సర్వతూర్య నినాదీ చ సర్వవాద్యపరిగ్రహః |
వ్యాలరూపో బిలావాసీ హేమమాలీ తరంగవితః || 31 ||

త్రిదశస్త్రికాలధృకః కర్మ సర్వబంధవిమోచనః |
బంధనస్త్వాసురేంద్రాణాం యుధి శత్రువినాశనః || 32 ||

సాంఖ్యప్రసాదో సుర్వాసాః సర్వసాధునిషేవితః |
ప్రస్కందనో విభాగశ్చాతుల్యో యఘ్యభాగవితః || 33 ||

సర్వావాసః సర్వచారీ దుర్వాసా వాసవో‌உమరః |
హేమో హేమకరో యఘ్యః సర్వధారీ ధరోత్తమః || 34 ||

లోహితాక్శో మహా‌உక్శశ్చ విజయాక్శో విశారదః |
సంగ్రహో నిగ్రహః కర్తా సర్పచీరనివాసనః || 35 ||

ముఖ్యో‌உముఖ్యశ్చ దేహశ్చ దేహ ఋద్ధిః సర్వకామదః |
సర్వకామప్రసాదశ్చ సుబలో బలరూపధృకః || 36 ||

సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః |
ఆకాశనిధిరూపశ్చ నిపాతీ ఉరగః ఖగః || 37 ||

రౌద్రరూపోం‌உశురాదిత్యో వసురశ్మిః సువర్చసీ |
వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః || 38 ||

సర్వావాసీ శ్రియావాసీ ఉపదేశకరో హరః |
మునిరాత్మ పతిర్లోకే సంభోజ్యశ్చ సహస్రదః || 39 ||

పక్శీ చ పక్శిరూపీ చాతిదీప్తో విశాంపతిః |
ఉన్మాదో మదనాకారో అర్థార్థకర రోమశః || 40 ||

వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్శిణశ్చ వామనః |
సిద్ధయోగాపహారీ చ సిద్ధః సర్వార్థసాధకః || 41 ||

భిక్శుశ్చ భిక్శురూపశ్చ విషాణీ మృదురవ్యయః |
మహాసేనో విశాఖశ్చ షష్టిభాగో గవాంపతిః || 42 ||

వజ్రహస్తశ్చ విష్కంభీ చమూస్తంభనైవ చ |
ఋతురృతు కరః కాలో మధుర్మధుకరో‌உచలః || 43 ||

వానస్పత్యో వాజసేనో నిత్యమాశ్రమపూజితః |
బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ సుచారవితః || 44 ||

ఈశాన ఈశ్వరః కాలో నిశాచారీ పినాకధృకః |
నిమిత్తస్థో నిమిత్తం చ నందిర్నందికరో హరిః || 45 ||

నందీశ్వరశ్చ నందీ చ నందనో నందివర్ధనః |
భగస్యాక్శి నిహంతా చ కాలో బ్రహ్మవిదాంవరః || 46 ||

చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ |
లింగాధ్యక్శః సురాధ్యక్శో లోకాధ్యక్శో యుగావహః || 47 ||

బీజాధ్యక్శో బీజకర్తా‌உధ్యాత్మానుగతో బలః |
ఇతిహాస కరః కల్పో గౌతమో‌உథ జలేశ్వరః || 48 ||

దంభో హ్యదంభో వైదంభో వైశ్యో వశ్యకరః కవిః |
లోక కర్తా పశు పతిర్మహాకర్తా మహౌషధిః || 49 ||

అక్శరం పరమం బ్రహ్మ బలవానః శక్ర ఏవ చ |
నీతిర్హ్యనీతిః శుద్ధాత్మా శుద్ధో మాన్యో మనోగతిః || 50 ||

బహుప్రసాదః స్వపనో దర్పణో‌உథ త్వమిత్రజితః |
వేదకారః సూత్రకారో విద్వానః సమరమర్దనః || 51 ||

మహామేఘనివాసీ చ మహాఘోరో వశీకరః |
అగ్నిజ్వాలో మహాజ్వాలో అతిధూమ్రో హుతో హవిః || 52 ||

వృషణః శంకరో నిత్యో వర్చస్వీ ధూమకేతనః |
నీలస్తథా‌உంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః || 53 ||

స్వస్తిదః స్వస్తిభావశ్చ భాగీ భాగకరో లఘుః |
ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భః పరో యువా || 54 ||

కృష్ణవర్ణః సువర్ణశ్చేంద్రియః సర్వదేహినామః |
మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః || 55 ||

మహామూర్ధా మహామాత్రో మహానేత్రో దిగాలయః |
మహాదంతో మహాకర్ణో మహామేఢ్రో మహాహనుః || 56 ||

మహానాసో మహాకంబుర్మహాగ్రీవః శ్మశానధృకః |
మహావక్శా మహోరస్కో అంతరాత్మా మృగాలయః || 57 ||

లంబనో లంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః |
మహాదంతో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః || 58 ||

మహానఖో మహారోమా మహాకేశో మహాజటః |
అసపత్నః ప్రసాదశ్చ ప్రత్యయో గిరి సాధనః || 59 ||

స్నేహనో‌உస్నేహనశ్చైవాజితశ్చ మహామునిః |
వృక్శాకారో వృక్శ కేతురనలో వాయువాహనః || 60 ||

మండలీ మేరుధామా చ దేవదానవదర్పహా |
అథర్వశీర్షః సామాస్య ఋకఃసహస్రామితేక్శణః || 61 ||

యజుః పాద భుజో గుహ్యః ప్రకాశో జంగమస్తథా |
అమోఘార్థః ప్రసాదశ్చాభిగమ్యః సుదర్శనః || 62 ||

ఉపహారప్రియః శర్వః కనకః కాఝ్ణ్చనః స్థిరః |
నాభిర్నందికరో భావ్యః పుష్కరస్థపతిః స్థిరః || 63 ||

ద్వాదశస్త్రాసనశ్చాద్యో యఘ్యో యఘ్యసమాహితః |
నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః || 64 ||

సగణో గణ కారశ్చ భూత భావన సారథిః |
భస్మశాయీ భస్మగోప్తా భస్మభూతస్తరుర్గణః || 65 ||

అగణశ్చైవ లోపశ్చ మహా‌உ‌உత్మా సర్వపూజితః |
శంకుస్త్రిశంకుః సంపన్నః శుచిర్భూతనిషేవితః || 66 ||

ఆశ్రమస్థః కపోతస్థో విశ్వకర్మాపతిర్వరః |
శాఖో విశాఖస్తామ్రోష్ఠో హ్యముజాలః సునిశ్చయః || 67 ||

కపిలో‌உకపిలః శూరాయుశ్చైవ పరో‌உపరః |
గంధర్వో హ్యదితిస్తార్క్శ్యః సువిఘ్యేయః సుసారథిః || 68 ||

పరశ్వధాయుధో దేవార్థ కారీ సుబాంధవః |
తుంబవీణీ మహాకోపోర్ధ్వరేతా జలేశయః || 69 ||

ఉగ్రో వంశకరో వంశో వంశనాదో హ్యనిందితః |
సర్వాంగరూపో మాయావీ సుహృదో హ్యనిలో‌உనలః || 70 ||

బంధనో బంధకర్తా చ సుబంధనవిమోచనః |
సయఘ్యారిః సకామారిః మహాదంష్ట్రో మహా‌உ‌உయుధః || 71 ||

బాహుస్త్వనిందితః శర్వః శంకరః శంకరో‌உధనః |
అమరేశో మహాదేవో విశ్వదేవః సురారిహా || 72 ||

అహిర్బుధ్నో నిరృతిశ్చ చేకితానో హరిస్తథా |
అజైకపాచ్చ కాపాలీ త్రిశంకురజితః శివః || 73 ||

ధన్వంతరిర్ధూమకేతుః స్కందో వైశ్రవణస్తథా |
ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువో ధరః || 74 ||

ప్రభావః సర్వగో వాయురర్యమా సవితా రవిః |
ఉదగ్రశ్చ విధాతా చ మాంధాతా భూత భావనః || 75 ||

రతితీర్థశ్చ వాగ్మీ చ సర్వకామగుణావహః |
పద్మగర్భో మహాగర్భశ్చంద్రవక్త్రోమనోరమః || 76 ||

బలవాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచఝ్ణ్చురీ |
కురుకర్తా కాలరూపీ కురుభూతో మహేశ్వరః || 77 ||

సర్వాశయో దర్భశాయీ సర్వేషాం ప్రాణినాంపతిః |
దేవదేవః ముఖో‌உసక్తః సదసతః సర్వరత్నవితః || 78 ||

కైలాస శిఖరావాసీ హిమవదః గిరిసంశ్రయః |
కూలహారీ కూలకర్తా బహువిద్యో బహుప్రదః || 79 ||

వణిజో వర్ధనో వృక్శో నకులశ్చందనశ్ఛదః |
సారగ్రీవో మహాజత్రు రలోలశ్చ మహౌషధః || 80 ||

సిద్ధార్థకారీ సిద్ధార్థశ్చందో వ్యాకరణోత్తరః |
సింహనాదః సింహదంష్ట్రః సింహగః సింహవాహనః || 81 ||

ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః |
సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః || 82 ||

భూతాలయో భూతపతిరహోరాత్రమనిందితః || 83 ||
వాహితా సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః |
అమోఘః సంయతో హ్యశ్వో భోజనః ప్రాణధారణః || 84 ||

ధృతిమానః మతిమానః దక్శః సత్కృతశ్చ యుగాధిపః |
గోపాలిర్గోపతిర్గ్రామో గోచర్మవసనో హరః || 85 ||

హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలః ప్రవేశినామః |
ప్రతిష్ఠాయీ మహాహర్షో జితకామో జితేంద్రియః || 86 ||

గాంధారశ్చ సురాలశ్చ తపః కర్మ రతిర్ధనుః |
మహాగీతో మహానృత్తోహ్యప్సరోగణసేవితః || 87 ||

మహాకేతుర్ధనుర్ధాతుర్నైక సానుచరశ్చలః |
ఆవేదనీయ ఆవేశః సర్వగంధసుఖావహః || 88 ||

తోరణస్తారణో వాయుః పరిధావతి చైకతః |
సంయోగో వర్ధనో వృద్ధో మహావృద్ధో గణాధిపః || 89 ||

నిత్యాత్మసహాయశ్చ దేవాసురపతిః పతిః |
యుక్తశ్చ యుక్తబాహుశ్చ ద్వివిధశ్చ సుపర్వణః || 90 ||

ఆషాఢశ్చ సుషాడశ్చ ధ్రువో హరి హణో హరః |
వపురావర్తమానేభ్యో వసుశ్రేష్ఠో మహాపథః || 91 ||

శిరోహారీ విమర్శశ్చ సర్వలక్శణ భూషితః |
అక్శశ్చ రథ యోగీ చ సర్వయోగీ మహాబలః || 92 ||

సమామ్నాయో‌உసమామ్నాయస్తీర్థదేవో మహారథః |
నిర్జీవో జీవనో మంత్రః శుభాక్శో బహుకర్కశః || 93 ||

రత్న ప్రభూతో రక్తాంగో మహా‌உర్ణవనిపానవితః |
మూలో విశాలో హ్యమృతో వ్యక్తావ్యక్తస్తపో నిధిః || 94 ||

ఆరోహణో నిరోహశ్చ శలహారీ మహాతపాః |
సేనాకల్పో మహాకల్పో యుగాయుగ కరో హరిః || 95 ||

యుగరూపో మహారూపో పవనో గహనో నగః |
న్యాయ నిర్వాపణః పాదః పండితో హ్యచలోపమః || 96 ||

బహుమాలో మహామాలః సుమాలో బహులోచనః |
విస్తారో లవణః కూపః కుసుమః సఫలోదయః || 97 ||

వృషభో వృషభాంకాంగో మణి బిల్వో జటాధరః |
ఇందుర్విసర్వః సుముఖః సురః సర్వాయుధః సహః || 98 ||

నివేదనః సుధాజాతః సుగంధారో మహాధనుః |
గంధమాలీ చ భగవానః ఉత్థానః సర్వకర్మణామః || 99 ||

మంథానో బహులో బాహుః సకలః సర్వలోచనః |
తరస్తాలీ కరస్తాలీ ఊర్ధ్వ సంహననో వహః || 100 ||

ఛత్రం సుచ్ఛత్రో విఖ్యాతః సర్వలోకాశ్రయో మహానః |
ముండో విరూపో వికృతో దండి ముండో వికుర్వణః || 101 ||

హర్యక్శః కకుభో వజ్రీ దీప్తజిహ్వః సహస్రపాతః |
సహస్రమూర్ధా దేవేంద్రః సర్వదేవమయో గురుః || 102 ||

సహస్రబాహుః సర్వాంగః శరణ్యః సర్వలోకకృతః |
పవిత్రం త్రిమధుర్మంత్రః కనిష్ఠః కృష్ణపింగలః || 103 ||

బ్రహ్మదండవినిర్మాతా శతఘ్నీ శతపాశధృకః |
పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవః || 104 ||

గభస్తిర్బ్రహ్మకృదః బ్రహ్మా బ్రహ్మవిదః బ్రాహ్మణో గతిః |
అనంతరూపో నైకాత్మా తిగ్మతేజాః స్వయంభువః || 105 ||

ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాతరంహా మనోజవః |
చందనీ పద్మమాలా‌உగ్{}ర్యః సురభ్యుత్తరణో నరః || 106 ||

కర్ణికార మహాస్రగ్వీ నీలమౌలిః పినాకధృకః |
ఉమాపతిరుమాకాంతో జాహ్నవీ ధృగుమాధవః || 107 ||

వరో వరాహో వరదో వరేశః సుమహాస్వనః |
మహాప్రసాదో దమనః శత్రుహా శ్వేతపింగలః || 108 ||

ప్రీతాత్మా ప్రయతాత్మా చ సంయతాత్మా ప్రధానధృకః |
సర్వపార్శ్వ సుతస్తార్క్శ్యో ధర్మసాధారణో వరః || 109 ||

చరాచరాత్మా సూక్శ్మాత్మా సువృషో గో వృషేశ్వరః |
సాధ్యర్షిర్వసురాదిత్యో వివస్వానః సవితా‌உమృతః || 110 ||

వ్యాసః సర్వస్య సంక్శేపో విస్తరః పర్యయో నయః |
ఋతుః సంవత్సరో మాసః పక్శః సంఖ్యా సమాపనః || 111 ||

కలాకాష్ఠా లవోమాత్రా ముహూర్తో‌உహః క్శపాః క్శణాః |
విశ్వక్శేత్రం ప్రజాబీజం లింగమాద్యస్త్వనిందితః || 112 ||

సదసదః వ్యక్తమవ్యక్తం పితా మాతా పితామహః |
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్శద్వారం త్రివిష్టపమః || 113 ||

నిర్వాణం హ్లాదనం చైవ బ్రహ్మలోకః పరాగతిః |
దేవాసురవినిర్మాతా దేవాసురపరాయణః || 114 ||

దేవాసురగురుర్దేవో దేవాసురనమస్కృతః |
దేవాసురమహామాత్రో దేవాసురగణాశ్రయః || 115 ||

దేవాసురగణాధ్యక్శో దేవాసురగణాగ్రణీః |
దేవాతిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః || 116 ||

దేవాసురేశ్వరోదేవో దేవాసురమహేశ్వరః |
సర్వదేవమయో‌உచింత్యో దేవతా‌உ‌உత్మా‌உ‌உత్మసంభవః || 117 ||

ఉద్భిదస్త్రిక్రమో వైద్యో విరజో విరజో‌உంబరః |
ఈడ్యో హస్తీ సురవ్యాఘ్రో దేవసింహో నరర్షభః || 118 ||

విబుధాగ్రవరః శ్రేష్ఠః సర్వదేవోత్తమోత్తమః |
ప్రయుక్తః శోభనో వర్జైశానః ప్రభురవ్యయః || 119 ||

గురుః కాంతో నిజః సర్గః పవిత్రః సర్వవాహనః |
శృంగీ శృంగప్రియో బభ్రూ రాజరాజో నిరామయః || 120 ||

అభిరామః సురగణో విరామః సర్వసాధనః |
లలాటాక్శో విశ్వదేహో హరిణో బ్రహ్మవర్చసః || 121 ||

స్థావరాణాంపతిశ్చైవ నియమేంద్రియవర్ధనః |
సిద్ధార్థః సర్వభూతార్థో‌உచింత్యః సత్యవ్రతః శుచిః || 122 ||

వ్రతాధిపః పరం బ్రహ్మ ముక్తానాం పరమాగతిః |
విముక్తో ముక్తతేజాశ్చ శ్రీమానః శ్రీవర్ధనో జగతః || 123 ||

శ్రీమానః శ్రీవర్ధనో జగతః ఓం నమ ఇతి ||
ఇతి శ్రీ మహాభారతే అనుశాసన పర్వే శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ సంపూర్ణమ్ ||

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)