మంగళవారం, జనవరి 17, 2012
Born January 17, 1911
Died December 1, 1991
(aged 80) Chicago, Illinois
Nationality Seattle, Washington, United States
Institution Columbia University
Brown University
University of Chicago
Field Economics
Alma mater University of Chicago (Ph.D.), University of
Washington (BA), Northwestern University (MBA)
Opposed John Maynard Keynes
Influences
Frank Knight, Jacob Viner,
Henry Simons, Milton Friedman
Influenced Jacques Drèze, Thomas Sowell, Kenneth
Lyon
Contributions Capture theory
Awards Nobel Memorial Prize
in Economic Sciences (1982)
National Medal of Science.
"Seminal studies of industrial structures, functioning of markets
and causes and effects of public regulation."
సోమవారం, జనవరి 16, 2012
Test your knowledge. Prove yourself . Let's enjoy the game.
ఆదివారం, జనవరి 15, 2012
సంక్రాంతి మరుసటి రోజయిన కనుమ పండుగను వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడు ఉన్నందుకుగాను పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు.
కొన్ని ప్రదేశాలలో ఎడ్లు పందాలు జరుపుతారు. మరికొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా పోటీలు నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను నిరవహించేటందుకు వాటిని హింసిస్తారు. అది మాత్రం బాగోలేదు. ఇలా చేయటం చట్టరీత్యా నేరం. జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. రైతులు ఈ రోజున వారి పొలంలో వనభోజనాలను కూడా నిర్వహిస్తుంటారు.
కనుమపండుగనాడు మినుము తినాలనేది సామెత. దీనికి గాను గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది. మాంసా హారులు కాని వారు, గారెలుని తింటారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు కూడా చేయరు.
కనుమరోజు కాకి కూడా ప్రయాణం చేయదు అంటారు ఇంకో సామెత కూడా వుంది కనుమ రోజు కాకి కూడా నిండా స్నానం చేస్తుందిట. ఈ కనుమరోజు ముత్తైదువలు, ఆడపిల్లలు చాలా అందంగా తయారు అవుతారు. కళ్ళనిండా కాటుక పెట్టుకుంటారు. కాళ్ళకు పసుపు పారాణి పెట్టుకుంటారు. అలా కనుమరోజు అందంగా తయారు అయితే కలకాలం అలా నిండుగా వుంటారని అంటారు.
ఈ మూడురోజులు మనము పూర్తిగా సంతోషం గా గడిపాం కదా. ఈ రోజు మన ఇంట్లో వుండే పశువులకు పూజ చేసి వాటికి కృతఙ్ఞత తెలుపుకుంటున్నారు. ఈ నెలరోజులు వాకిట అందమైన ముగ్గులు తో అలంకరిస్తాము కదా. ఈ కనుమరోజును మాత్రము రధము ముగ్గువేసి ఆరధమును వీదిచివరి వరకు లాగినట్టుగా ముగ్గు వేస్తారు. దీని అర్ధము సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తున్నది. ఈ కనుమ పండుగను బాగా జరుపుకోవాలి అని తలుస్తున్నాను. అలాగని పసుపక్షులను భాదించకండి.
శనివారం, జనవరి 14, 2012
భారత సైనిక దినోత్సవం. 1949లో ఇదేరోజున మొదటిసారి ఓ భారతీయుడు కె.ఎం.కరియప్ప ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 15ను సైనికదినోత్సవంగా జరుపుకొంటున్నాం. దేశవ్యాప్తంగా త్రివిధ దళాలు సైనిక దినోత్స వాన్ని జరుపుకోనున్నాయి. భారత నావికాదళం, భారత వైమానిక దళం, దేశ రక్షణలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్నాయి.
అసలు ఎన్నోరకాలు పోరాటాలు విప్లవాలు చేసి హింసాయుత, మరియు అహింసా పోరాటాలు కూడా చేసి ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు పోరాటం చేసి భారతదేశానికి బ్రిటిషవారి నుండి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెడితే. ఆ స్వాతంత్ర భారతదేశాన్ని మన దేశ సైనికదళం సరిహద్దుల దగ్గర మన దేశాన్ని వారి ప్రాణాన్ని అడ్డుపెట్టి మరి కాపాడుతున్నది.
మడమ తిప్పని యోధుడి చేతిలో మంటలు విరజిమ్మే ఆయుధం తో మంచి వజ్రమువంటి మనస్సుతో ఎటువంటి వృద్దాప్యము దగ్గరకురాని సంకల్పబలంతో, వారి గుండె దైర్యముతో పోరాటపటిమను చివరవరకు పోరాటం చేయగలిగే శక్తి. ముప్పూటలా మోహరిస్తే దానిపేరే భారత సైన్యం. నిప్పులు చెరిగే ఎడారులు లోను , నెత్తురును గడ్డకట్టించే మంచు ప్రాంతాలలోను, కల్లోల సాగరాలు, గగనతలాలు, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి శత్రువునైనా ఎదిరించి ఓడించే దే మన దేశ సైనికదళం.భారతదేశ ప్రాదేశిక సమగ్రతనూ, సార్వభౌమాధికారాన్ని, కంటికి రెప్పలా కాపాడు తున్న సైనిక శక్తుల త్యాగాలు, విజయాలు. నిరుపమానాలు. వారిని ఎంత పొగిడినా చాలా తక్కువే అనిపిస్తోంది. జనవరి 15న ఆర్మీడే సందర్భంగా మన భారతదేశ త్రివిధ దళాలతో పాటు మనమందరం గొంతు కలుపుదాం. మన భారత జనానికి మోకరిల్లి ప్రణామం తెలుపుదాం. మన భారతమాత మనలను చూసి గర్వపడేలా చేద్దాం. మన భారతదేశ ఉనికిని, మన సైనికదలాల పోరాటపటిమను ప్రపంచానికి చాటిచేప్పుదాం. ఇంకెవ్వడు మనదేశము వంకచూడాలంటే భయపడేటట్టు చేద్దాం.
భారతదేశానికి స్వాతంత్య్రం లభించి పట్టుమని పదివారాలు కాకముందే 1947 అక్టోబర్ 27న విభజనకు గురైన పాకిస్తాన్ దళాలు మన దేశనికి మకుటమయిన కాశ్మీర్ను కబళించడానికి దండెత్తి రాగా మన భారత దళాలు శతృవులను తరిమి తరిమికొట్టి స్వాతంత్య్ర దేశ చరిత్రలో తొలివిజయాన్ని నమోదు చేసుకొంది. ఇది స్వాతంత్ర భారతావనికి తొలివిజయం. తరువాత 1962లో చైనా దురాక్రమణ దారులకు, 1965, 1971లో పాకిస్తాన్ మూకలను, 1999లో కార్గిల్ సైనిక చర్యలతో పాటు వివిధ ఆపరేషన్లలో శతృవులను వెనుతిరిగి చూడకుండా తరిమి వేసింది మన భారతసైన్యం. అలాగే ప్రపంచ యుద్ధాలలో సువర్ణాక్షరాలతో లిఖించబడే విధంగా బంగ్లాడేశ్ అవతరణ సమయంలో దాదాపు 98 వేలమంది శతృ సైనికులు భారతదేశ సైన్యం ముందు మోకరిల్లినది. ఇది మనం గర్వపడవలసిన విషయమే కదా.
ఎందరో మహానుబావుల త్యాగాలకు మనకు స్వాతంత్ర భారతదేశం లబించింది. మన దేశసైనికులు సరిహద్దును ప్రాణాలను అడ్డుగా పెట్టి మనదేశాన్ని కాపాడుతుంటే మనం ఏమి చేస్తున్నాము? లోపల politics చేస్తున్నాము. లోపలలోపల తన్నుకుంటున్నాం. అవినీతి అన్నదానికి దారి తీసి దేశబద్రతకు, దేశఖజానాకు చిల్లులు పెడుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని దేబ్బతీస్తున్నాం. దయచేసి అందరు దేశ భవిష్యత్తును కాపాడుకుందాం. స్వాతంత్ర భారతదేశాన్ని కాపాడుకుందాం. అలాంటప్పుడే మనదేశ సైనికులు చేసే ప్రయత్నంనాకు అర్ధం పరమార్ధం వుంటుంది.
మంచి ఆలోచన తో నూతన సాంకేతిక పరిజ్ఞానము తో వ్యక్తిగత జీవితాలు అడ్డుగా పెడుతూ దేశాన్ని అన్నివిధాలా కాపాడుతూ మనకు ఆపద కలిగే సమయంలో వెనువెంటనే మేమున్నాము అని ఆదుకునే బారత సైన్యానికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగివుండాలి. సైనికులను గౌరవిస్తూ నేడు దేశవ్యాప్తం భారత సైనిక దినోత్సవం జరుపుకోవాలి .
Heads off to the Indian Army .
I wish you happy Indian Army Day .
జై హింద్
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ