Blogger Widgets

శుక్రవారం, ఆగస్టు 28, 2015

చంద్రసహోదరి శ్రీ వరలక్ష్మీదేవి

శుక్రవారం, ఆగస్టు 28, 2015


లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం1 శ్రీ రంగథామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం1 లోకైక దీపాంకురాం1
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవః 1 బ్రహ్మేంద్ర గంగాధం 1
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియామ్" 2
అంటూ శ్రీ వరలక్ష్మీ వ్రతం నాడు శ్రీ మహాలక్ష్మిని ధ్యానించిన వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని అందరు అంటున్నారు. ఇటువంటి మహిమాన్వితమైన "శ్రీ వరలక్ష్మీ" వ్రత పుణ్యదినాన సూర్యోదయానికి ముందే లేచి, అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్త్ర ధారణ చేయాలి.  తదనంతరం పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకుని, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని పద్మం ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్దాలి. దానిపై పసుపు రాసి ముగ్గులు బొట్లు పెట్టుకున్న పీటను ఉంచి ఆ పీటపై నూతన వస్త్రము పరచి, బియ్యము పోసి, దానిపై అలంకరించిన కలశచెంబును ఉంచాలి. ఒక కొబ్బరికాయను తీసుకుని దానికి "శ్రీ వరలక్ష్మీ" రూపు ప్రతిబింబించేటట్లు పసుపు ముద్దతో కనులు, ముక్కు, చెవులు మున్నగునవి తీర్చిదిద్దుకోవాలి. కుంకుమ, కనులకు కాటుకలను అమర్చి ఆ రూపును కలశపై ఉంచుకోవాలి.  పూజ సంతోషంగా జరుపుకోవాలి. 
ఈమెని పూజిస్తే అష్ట ఐస్వరాలు లభిస్తాయి మరి ఈ రోజున స్త్రీలు వరలక్ష్మి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం.
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
తాత్పర్యం
మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.
స్కాంద పురాణం లో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.
అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. 
 ఈ శ్రావణమాసం పూజ అందరికి సర్వసుఖ సంతోషాలు అందించాలని కోరుకుంటున్నాను. 

శుక్రవారం, ఆగస్టు 21, 2015

సౌభాగ్యలక్ష్మి రావమ్మా

శుక్రవారం, ఆగస్టు 21, 2015


సౌభాగ్యలక్ష్మి రావమ్మా... అమ్మా... 

నుదుట కుంకుమ రవిబింబముగ, కన్నులనిండుగ, 
కాటుగ వెలుగ, కాంచనహారము గళమున 
మెరయగ పీతాంబరముల శోభలు నిండగ ||సౌ|| 

నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులొలుకు 
పాదమ్ముల మువ్వలు, గల గల గలమని సవ్వడి 
జేయగ సౌభాగ్యవతుల సేవలనందగ ||సౌ|| 

నిత్య సుమంగళి, నిత్య కళ్యాణి భక్త జనుల 
మా కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండ 
గా కనకవృష్టి కురిపించే తల్లి ||సౌ|| 

రమణీ మణివై, సాధు సజ్జనుల పూజలందుకొని 
శుభములనిచ్చెడి దీవనలీయగ ||సౌ|| 

కుంకుమ శోభిత, పంకజలోచని, వెంకట 
రమణుని పట్టపురాణి, పుష్కలముగ 
సౌభాగ్యములిచ్చె పుణ్యమూర్తి మాఇంటవెలసిన ||సౌ|| 

సౌభాగ్యమ్ముల బంగారు తల్లి పురంధర విఠలుని 
పట్టపురాణి, శుక్రవారము పూజలనందగ 
సాయంకాలము శుభ ఘడియలలో ||సౌ||

శనివారం, మే 09, 2015

మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా

శనివారం, మే 09, 2015

కలియుగ ప్రత్యక్ష దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 32 వేల సంకీర్తన కుసుమాలతో అర్చన చేసి తరించిన పరమ భగవత్ భక్తుడు, తోలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు.   ఈయన జన్మదినము నేడే.  15 వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య తల్లితండ్రులు శ్రీమతి లక్కమాంబ, శ్రీ నారాయణ సూరి దంపతులకు వారి  తపః ఫలితంగా వేంకటేశుని దివ్య అనుగ్రహం వలన జన్మించినాడు అన్నమయ్య .  క్రీ. శ 1408 వ సంవత్సరం లో మే నెల 9 వ తారీకున జన్మించారు.  మనం తెలుసుకున్న  తెలుగులో మొట్టమొదటి పదాలు అన్నమయ్యవే.  
అదిగో తెలుగు తల్లి తన కన్నబిడ్డ గోరుముద్దలు తినిపిస్తూ పాడుతున్న పాట 
 " చందమామ రావో జాబిల్లి రావో , మంచి 
    కుందనంపు పైడికోర వెన్నపాలు తేవో"   
ఆహా ఎంత అద్బుతంగా వుందండి ఈ పాట అంతే కాదు నిదిరించే వేళ  అమ్మ పాడిన జోల పాట 
"జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా..జో జో"
ఆయన ఏ పాట రాసిన పూర్తిగా అనుభూతి పొంది రాసిన పాటలు లో ఒకటి అన్నమయ్య స్వయంగా అనుభూతి పొందిన పాటలు. చిన్ని కృష్ణుని గురించి ఆలోచిస్తూ మేలుకొలుపు పాట ఒకటి ఇదిగో 

మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా 
సన్నల నీ యోగ నిద్ర చాలు మేలుకోవయ్యా ||

ఆవులు పేయలకు గానఱచీ బిదుకవలె 
గోవిందుడయింక మేలుకొనవయ్యా 
ఆవలీవలిపడుచులాటలు మరిగి వచ్చి 
త్రోవ గాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా || 

వాడల గోపికలెల్లా వచ్చి నిన్నుముద్దాడ
గూడియున్నారిదే మేలుకొనవయ్యా 
తోడనే యశోద గిన్నెతో బెరుగు వంటకము 
ఈడకు దెచ్చి పెట్టెనిక మేలుకోవయ్యా ||

పిలిచీ నందగోపుడు పేరు కొనియదె కన్ను -
గోలుకులు విచ్చి (ఇంక) మేలుకొనవయ్య 
అలరిన శ్రీ వేంకటాద్రిమీద బాలకృష్ణ
యిల మామాటలు వింటివిక మేలుకోవయ్య || 

అన్నమయ్య పై సంకీర్తన ద్వారా యోగనిద్రలో మునిగియున్న ఆ గోపబాలుని మేలుకొలుపుతున్నారు.    

నీ ఆటలు, యోగనిద్రా కట్టిపెట్టవయ్యా ! ఆవులు దూడలకు పాలిచ్చువేళ అయినది. అవి అంబారావం చేస్తున్నవి. పాలు పితికే వేళ అయినది. నీ తోటి గోప బాలురందరూ, నీతో ఆటలాడుటకు నీ వాకిట వచ్చి చేరి యున్నారు. గోపికా మణులు నీపై వ్యామోహంతో నిన్ను ముద్దులాడు వచ్చి యున్నారు. నీవు ఆరగించుటకై, నీ తల్లి యశోదమ్మ వాత్సల్యంతో బంగారు గిన్నెలో పెరుగన్నం తెచ్చి నీ చెంత నిలచి యున్నది. మేల్కొనవయ్యా ! గోపరాజైన నీ తండ్రి, నందుడు నిన్ను చేరి పిలుస్తున్నాడు.
నందరాజునకు శ్రీకృష్ణుడంటే ఎంతో ప్రేమ. శ్రీకృష్ణునకు అసురులవలన ఎపుడు ఆపద కలుగుతుందో అన్న భయంతో, నందుడు ఎల్లపుడూ చేతిలో వేలాయుధం ధరించి రక్షకుడుగా ఉంటాడట. శేషగిరిలో నెలకొన్న ఓ బాలకృష్ణా ! విశాలమయిన నీ పద్మనయనములను తెరచి మమ్ము కృపతో ఏలుకోవయ్యా ! 

ఎంత అద్బుతంగా రాసారండి.  అన్నమయ్య జన్మదినము రోజు ఇంత మంచి పాటను పంచుకుంటుంన్నందుకు చాలా సంతోషంగా వుంది.  అన్నమయ్య జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. 

శుక్రవారం, మే 08, 2015

రామ నామ

శుక్రవారం, మే 08, 2015


శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తు(స్తు)ల్యమ్ రామనామ వరాననే
రామనామము సకల పాపహరమనీ, మోక్షప్రదమనీ చాలామంది నమ్మకము . "రామ" నామములో పంచాక్షరీ మంత్రము "ఓం నమ: శివాయ" నుండి "మ" అనే  బీజాక్షరము, మరియు  అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి "రా" అనే  బీజాక్షరము పొందుపరచబడి ఉన్నయని ఆధ్యాత్మిక వేత్తలు  వివరణ.  ఒక్కసారి  "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించుననీ  శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.  దీనిని గూర్చి పెద్దలు  చెప్పిన వివరణ ఏమిటంటే .  రామ పదంలో మొదటి అక్షరం "రా" ఇది య,ర,ల,వల్లో "ర" రెండవ అక్షరం.  రామలో రెండవ అక్షరం "మ".  ఇది ప,ఫ,బ,భ,మ వర్గములో "మ" ఐదవ అక్షరం.  సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి రెండుచేత ఐదుని గుణిస్తే 2 x 5 = 10 అవుతుంది . అలాగే రెండవ రామ శబ్దానికి పది ని పది చేత గుణిస్తే 10 x  10 = 100 అవుతుంది. ఇప్పుడు మూడవ రామ శబ్దా న్ని పది చేత వందని గుణిస్తే 10 x 100 = 1000 అవుతుంది .  ఇలా  "శ్రీ రామ , రామ , రామ ఇతి " అన్న ఒక్క శ్లోకం చదివితే వెయ్యి నామాలు చదివిన ఫలితం వస్తుంది .  అని మహా శివుడు పార్వతి దేవికి చెప్పాడు.
ఇంకా రామ నామాన్ని జపించి "ఋక్షకుడు" అనే ఒక సాధారణ వ్యక్తి వాల్మీకిగా మారుతాడు, రామ నామం వల్ల శబరి, గుహుడు, హనుమ, సీతామాత, ఇలా ఎందరో పునీతులు అయ్యారు . ఇంకా "రా"అన్న అక్షరం పలికేటప్పుడు పెదవులు తెరుచు కొంటాయి. అంటే మనలో ఉన్న పాపాలు బైటికి పోతాయి అన్నమాట. ఇక "మా" పలికేటప్పుడు పెదవులు మూసుకొంటాయి. బైటికి పోయిన పాపాలు లోపలకిచేరకుండా చేస్తాయి. ఇలా రామ నామాన్నిగూరించి ఎంతైనా చెప్పవచ్చును . వశిష్టుడు "ఓం నమో నారాయణాయ" అన్న అష్టాక్షరి మంత్రం నుండీ " రా" అన్న అక్షరాన్ని, "నమశ్శివాయ" అన్న పంచాక్షరి మంత్రం లోంచి "మ" అన్న అక్షరాన్ని గ్రహించి "రామ" అని పేరుపెట్టేడు. కనుక రామ అని అంటే చాలు, అష్టాక్షరిమంత్రము + పంచాక్షరి మం త్రము ఒకేసారి  జపించినట్లవుతుంది .
రామ చంద్రుడు తన సైన్యముతో సీత ను చేరటానికి లంకానగరంపై దండెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు  సముద్రంపై వానరసేన రాళ్ళతో వారథిని నిర్మిస్తున్నారు.  అప్పుడు ప్రతీ రాయిపై 'రామ' అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తె అది తేలిపోతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి 'నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా, నేను రాయి వేస్తే'  అది ఏమి అవుతుంది అనే ఆలోచన కలిగింది. అప్పుడు శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసిరాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. అది చూసిన రాముడు  ఆశ్చర్యానికి లోనై పక్కనే వున్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు . అందుకు "రామ" అనే నామం రాసిన రాళ్ళే పైకితేలుతాయి. మీరు వేసిన రాయిపైన రామనామం లేదు కదా! అందుకే మునిగిపోయింది" అని హనుమంతుడు సమాధానం చెప్పాడు. అంటే రామ నామం కు ఉన్న గొప్పతనం ఎంత వుందో కదా.  శ్రీ రాముని కంటే రామనామ గొప్పదే అనిపిస్తోంది. 
రామ నామ మహిమను చెప్పటానికి ఇంకా చాలా కధలు వున్నాయి .  వాటి గురించి ఇంకోసారి పోస్ట్ చేస్తాను . 

సోమవారం, మే 04, 2015

త్యాగయ్య "నౌకా చరితం"

సోమవారం, మే 04, 2015

త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్యత్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి. ఈ రోజు త్యాగరాజ వారి 248 వ జయంతి  సందర్బంగా 

నాద బ్రహ్మ త్యాగరాజు రచించిన  ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, మరియు  తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర  పాదపద్మాలను చేరుకోవాలన్న కోరికతో దర్శన సమయం కాని వేళ  త్యాగరాజ స్వామి స్వామి దగ్గర నిలుచొని పాడిన పాట  త్యాగరాజు @ తెరతీయగరాదా … బహుళ జనాదరణ పొందిన కీర్తన. త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు.  వీటిలో చాలావరకు ఆయన మాతృభాష ఐనటువంటి తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్ననూ కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది. 'ప్రహ్లాద భక్తి విజయం', కృష్ణ లీలలే ప్రధాన ఇతివృత్తం గా తీసుకొని ’నౌకా చరితం ‘’ తెలుగు లోనే నాట్యరూపకాలను కూడా రచించాడు

పల్లవి:
ఓడను జరిపే ముచ్చట
గనరే వనితలారా నేడూ

అనుపల్లవి :
ఆడవారు యమున కాడ కృష్ణుని కూడి
ఆడుచు పాడుచునందరూజూడగ

చరణములు :
కొందరు హరికీర్తనములు పాడ
కొందరానందమున ముద్దులాడ
కొందరు యమునా దేవిని వేడ
కొందరి ముత్యపు సరులసియాడ

కొందరు తడబడ పాలిండ్లు కదల
కొందరి బంగరు వల్వలు వదల
కొందరి కుతిలాలకములు మెదల
కొందరు పల్కుచు కృష్ణుని కథల

కొందరు త్యాగరాజ సఖుడేయనగ
కొందరి కస్తూరి బొట్తు కరగగ
కొందరి కొప్పుల విరులు జరగ
కొందరి కంకణములు ఘల్లనగ

ఆదివారం, మే 03, 2015

Visible illusion (Count the Number of Animals)

ఆదివారం, మే 03, 2015


శుక్రవారం, మే 01, 2015

'మే డే' వెలుగులు

శుక్రవారం, మే 01, 2015

మే డే  అంటే మనందరికీ శలవు దినంగా తెలుసు.  కానీ అది ఎందుకు ఎలా ఏర్పడిందో తెలుసుకుందము. . విప్లవం వెల్లివిరిసిన ప్రతిచోటా నేడు శ్రమజీవుల విజయోత్సవదినంగా 'మే డే' వెలుగులు విరజిమ్ముతోంది. ఎర్రజెండా ధగధగలు మిన్నంటుతూ శ్రమజీవుల్లో ఆనందం పంచుతూ సాగుతోంది. ఆకలి మంటల ఆర్తనాదాలు, అన్యాయాన్ని ఎదిరించే గళాలు పల్లవించే రోజుగానూ మే డే విలసిల్లుతోంది.
మే దినోత్సవం లేదా మే డే  ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ఈరోజు  పబ్లిక్ శెలవు దినం.  చాలా దేశాలలో మే డే , అంతర్జాతీయ కార్మిక దినోత్సవం గా జరుపుకుంటారు. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గుర్తుచేస్తుంది.
ఈ రోజులను కార్మికులు  పండుగ రోజుగా జరుపుకుంటారు . మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు.
ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకుంటున్న దానిక వర్గానికి  ఆ సమయంలో తాముకూడా  మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం చేసి, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనంగా నిలబడ్డారు .  24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి , ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్‌ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. యంత్రాలు  రాకముందు మనిషి చాలా గంటలకొద్దీ పనిచేసేవాడు. అదొక బానిస బతుకులా వుండేది . మనిషి వైజ్ఞానిక పరిజ్ఞాన్ని ఉపయోగించి యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏవిధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే పని గంటల పోరాటం వచ్చింది. కానీ మనలాంటి దేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో 1862లో సమ్మెచేశారు. అప్పటివరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్‌ పత్రికల్లో పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్‌ చేశారు. కాగా, అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు.
1923లో మొదటిసారి మన దేశంలో ‘మే డే’ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి ‘మే డే’ను పాటించడం జరుగుతుంది. కానీ అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్‌, లిబరలైజేషన్‌, గ్లోబలైజేషన్‌ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు. మొత్తానికి ఎందరో మహనీయులు పోరాటం ఫలితంగా మే డే  ఏర్పడింది.  

గురువారం, ఏప్రిల్ 30, 2015

నిజాయతీకి ఒక రోజు

గురువారం, ఏప్రిల్ 30, 2015

ఈరోజు ప్రపంచపు నిజాయతీ రోజు ( World Honesty Day ).  ఏప్రిల్ నెలలో మొదటిరోజును ఫూల్స్ రోజు గాను చివరిరోజును హానేస్టే డే గాను జరుపుకుంటున్నారు.  ఈరోజును మొట్టమొదట ప్రతిపాదించినది   M. Hirsh Goldberg.  ఈ రోజు ఎవరైనా ఎవరినైనా ప్రశ్న అడగవచ్చు.  ఎదుటివారు ముక్కు సూటిగా జవాబు చెప్పాలి.  ఆ జవాబు ఎలా చెప్పాలి అంటే  పూర్తిగా నిజాయితిగా చెప్తున్నట్టు  సుస్పస్టముగా అర్ధంకావాలి.    Hirsh Goldberg ఒక నవలా రచయిత.  ఇతను ఎన్నో పుస్తకాలు రచించారు.  ఇతని పుస్తకాలలో కూడా నిజాయితి గురించి రచించారు.  అతని రోజువారి జీవితాలను ప్రభావితం చేసింది.  ఆ సమయంలో అసత్యాలు వాళ్ళ వచ్చే ఇబ్బందులు ప్రజలుకు అర్ధం అయ్యింది.  అందుకే ఏప్రిల్ మొదటి రోజును అసత్యాలకు రోజుగాను.  ఇదే నెలలో చివరి రోజును అసత్యాలు మాయమై Goldberg నిజాయితీ డే  గా ఏర్పడింది.  
విమర్శకులు కూడా నిజాయితీ డే గా  అధ్యక్షులు మరియు జార్జ్ వాషింగ్టన్ మరియు అబ్రహం లింకన్ కూడా గతంలో నోబెల్ బహుమతిని  నాయకుల నిజాయితీ కి  జ్ఞాపకార్ధంగా  రూపొందించబడింది.

నిజాయితీ డేకి  అసత్యాలుకు  దూరంగా ఉండాలని మరియు నిజమే చెప్పాలని  కోరారు . ప్రతి ఏడాది ఏప్రిల్ 30, గోల్డ్బెర్గ్ తాను ప్రజలకు నిజాయితీగా వున్నా కంపెనీలుకు , సంస్థలుకు , సమూహాలుకు , మరియు వ్యక్తులకు   వారి నిజాయితిని గుర్తించి చిత్తశుద్ధి అవార్డులు ఇస్తున్నారు . 

ప్రపంచం మొత్తం మీద సగటు మహిళ రెండు అసత్యాలు ఒక రోజు చెబుతుంది అని.  సగటు బ్రిటీష్ వ్యక్తి రోజుకి మూడు అసత్యాలు చెప్తారట . ఒక మనిషి సగటు ఒక  అబద్ధం చెప్తారని సర్వేలు చెప్తున్నాయి.

పిల్లలకు మనం మంచి అలవాట్లు నేర్పించాలి అందులో ముఖ్యముగా నిజాయితీగా వుండటం నేర్పించాలి. అసత్యాలు పలకడం వాళ్ళ వచ్చే ఇబ్బందులు.  పిల్లలకు అర్ధం అయ్యేలా చెప్పాలి.  మనం ఒక అబద్దం చెప్తే అది మనలను ప్రశాంతంగా వుండనివ్వదు.  అంతేకాదు ఒకదానికి ఒకటి అబద్దాలు చెప్పవలసి వస్తుంది.  మొదటే నిజాయితిగా సత్యాన్నే చెప్పటం వాళ్ళ కొంచెం కష్టంగా వున్నా అది హాయిగానే వుంటుంది.  నిజాయితీ గా వుండాలంటే దానికి ఎంతో దైర్యం కావాలి.  అలాంటి దైర్యం రేపటి పౌరులకు అవసరం.  అప్పుడే దేశభవిష్యత్తు భాగుంటుంది. సత్యమేవ జయతే ఇది మన భారతీయుల నినాదము. 

బుధవారం, ఏప్రిల్ 29, 2015

*దేవతలందరికీ మానవరూపం*.

బుధవారం, ఏప్రిల్ 29, 2015

దేవతలకే రూపురేఖలు దిద్దిన మహా చిత్రకారుడు రాజా రవి వర్మ.  రాజా రవివర్మ ట్రావెంకూర్ రాష్ట్రం (నేటి కేరళ) లోని కిలిమనూర్ నందు జన్మించాడు. తండ్రి గొప్ప పండితుడు, తల్లి కవయిత్రి, రచయిత్రి.
యుక్తవయసులోనే రామస్వామి నాయుడు వద్ద వాటర్ పెయింటింగ్, డచ్ జాతీయుడు తీడార్ జన్సన్ వద్ద ఆయిల్ పెయింటింగును నేర్చుకున్నాడు.వియన్నాలో 1873లో జరిగిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ నందు ఆయన పెయింటింగుకు అవార్డ్ లభించడంతో చిత్రకారుడిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచాడు. 1893లో చికాగోలో జరిగిన వరల్డ్ కొలంబియన్ ఎక్స్పోజిషన్ నందు ఆయన పెయింటింగులకు రెండుబంగారుపతకాలు లభించాయి. వస్తు పరిజ్ఞానం కొరకు భారతదేశం అంతటా పర్యటించాడు. దక్షణభారతీయ స్త్రీల సౌందర్యం ఎక్కువగా తన చిత్రకళా వస్తువుగా తీసుకుని హిందూ దేవతలకు, కావ్య మరియు పురాణ నాయికానాయకులకు రూపురేఖలు కల్పించాడు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి.ముఖ్యంగా దుష్యంతుడు శకుంతల, నలదమయంతి తైలవర్ణ చిత్రాలు ప్రత్యేక గుర్తింపును పొందాయి. భారత, రామాయణములందలి పాత్రలనేకం ఆయన ఊహాచిత్ర సృష్టే. అంటే ఆ పాత్రల రూపురేఖలు నేటికీ అలాగే స్థిరపడి పోయాయి.  మనందరికీ రాముడంటే ఇలానే  వుంటాడు.  అలాగే మిగిలిన దేవతా చిత్రాలను వేసి మనకు పరిచయం చేసాడు. మన దేవతలందరికీ మానవరూపం ఇచ్చిన మహా చిత్రకళాకారుడు.  రవివర్మ పేరుకు ముందు 'రాజా' అన్నది అతని పెయింటింగ్స్‌కి పురస్కారంగా బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు. ఆ ప్రాంతపు స్త్రీలే ఆయన పెయింటింగ్స్‌కు స్ఫూర్తిగా నిలిచారని ప్రతీతి. ఆయనకు 1873లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన వియానా ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ఆయన పెయింటింగ్‌కు ప్రధమ బహుమతి లభించింది. అప్పటి నుంచే ఆయన పేరు దశదిశలా వ్యాపించింది. ఈయన్ని భారతీయ పికాసోగా చెప్పవచ్చు.  రవివర్మకే  అందని అందాలు లేవేమో.  దేవతా చిత్రాలే కాకుండా ఎన్నో అందాలను చిత్రీకరించాడు. అక్టోబర్-2, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.
 raja ravi varma  paintingsraja ravi varma  paintingsraja ravi varma  paintings

అంతర్జాతీయ నృత్య దినోత్సవం

dance
అంతర్జాతీయ నృత్య దినోత్సవం 1982 లో యునెస్కో సంస్థ అయిన ఎన్.జి.ఓ యొక్క ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ చే ప్రారంభించబడినది. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 న జరుపుకుంటారు. ఈ రోజున జరుపుకొనాలనే సూచనను ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ యిచ్చినది. 1760 లో ప్రచుచింబడిన ప్రముఖ రచన lettres sur la danse యొక్క రచయిత మరియు ఆధునిక ప్రెంచ్ నృత్యనాటికల సృష్టి కర్త అయిన  Jean Georges Noverre (1727-1810) యొక్క జన్మ దినాన్ని పురస్కరించుకొని ఆదినాన్ని అంతర్జాతీయ నృత్య దినంగా ప్రకటించారు.
ప్రతి సంవత్సరం, ఒక అద్భుతమైన నృత్య దర్శకుడు లేదా నర్తకుడు ప్రపంచవ్యాప్తంగా చెలామణి అయ్యేవారు ఒక సందేశాన్ని అందించటానికి ఆహ్వానించబడతారు. ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ యొక్క ప్రవేశ పత్రం ఆధారంగా ఈ ప్రసిద్ధ నృత్యదర్శకుడు లేదా నర్తకుని ఎంపిక చేయడం జరుతుంది.
UNESCO నిర్వహించిన అంతర్జాతీయ నృత్య దినోత్సవం లో యిప్పటివరకు పాల్గొన్న మరియు సందేశాన్ని అందించిన ప్రముఖులలో మెర్సీ కన్నింగ్‌హం, మారిస్ బెజర్త్ , అక్రం ఖాన్ మరియు అన్నె తెరెసా దె కీర్ స్మేకర్ లు.
ఈ దినం యొక్క లక్ష్యం నృత్య కళారూపం యొక్క ప్రపంచీకరణను చేధించడానికి,అన్ని రాజకీయ, సాంస్కృతిక మరియు జాతి అడ్డంకులు అధిగమించడానికి మరియు సాధారణ భాషలో గల నృత్య రీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికి కృషి చేయుట ప్రపంచ నృత్య కూటమి, మరియు దాని నృత్య కమిటీ ఈ దినాన్ని పారిస్ లోని UNESCO లోనూ మరియు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.
అసలు నృత్యం అన్నది సంగీతానికి అనుగుణంగా శరీరం కదలికలు మీద ఆదారపడి వుంటుంది. మానసిక ఉల్లాసానికి చాలా ఉపకరిస్తుంది.  ఇది సరే ప్రపంచ ప్రసిద్దమైన నృత్యాలు కొన్ని వున్నాయి.  వాటిలో
Hip-hop Dance
Tap Dance
Yangko Dance
Belly Dance
Kathak

Gangnam Style
Break Dance or B-boying
Ballet Dancers
Ballet
Line Dance
Salsa Dance

శుక్రవారం, ఏప్రిల్ 24, 2015

షోడసకళానిధికి షోడశోపచారములు

శుక్రవారం, ఏప్రిల్ 24, 2015


షోడసకళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి

అలరు విశ్వాత్మకున కావాహన మిదె సర్వ
నిలయున కాసనము నెమ్మి నిదే
అలగంగా జనకున కర్ఘ్యపాద్యాచమనాలు
జలధి శాయికిని మజ్జనమిదే

వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె
సరి శ్రీమంతునకు భూషణము లివే
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు
తిర మిదె కోటిసూర్యతేజునకు దీపము

అమృతమథనునకు నదివో నైవేద్యము
గమి(రవి)జంద్రునేత్రునకు కప్పురవిడెము
అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి
తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో

మంగళవారం, ఏప్రిల్ 21, 2015

అదే అక్షయ తృతీయ

మంగళవారం, ఏప్రిల్ 21, 2015

ఈ రోజు హిందువులకు మరియు జైనులకు ప్రత్యకమైన రోజు,  అదే అక్షయ తృతీయ .  వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ గా పిలుస్తారు. సంస్కృతం లో ' అక్షయ ' అనగా క్షయం కానిది , తరిగి పోనిది అని అర్థం. హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభ కరమైన ముహూర్త కాలంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే సంపద అక్షయమవుతుందని భారతీయుల నమ్మకము.  ఈ రోజు నాడే రైతులు విత్తనాలుకు పూజ చేసి నాటుతారు.  ఎందుకంటే విత్తులు మంచిగా వ్యవసాయం వృద్ది చెందుతుంది.  ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు. భగీరధుడు తపస్సు ఫలితంగా గంగానది భూమి తరలి వచ్చిన రోజు. యజ్ఞ యాగాదులు చేయటానికి మంచి కాలం. శ్రీ కృష్ణులవారి బాల్య స్నేహితుడు కటిక దరిద్రుడైన సుదాముడు కృష్ణుని దగ్గరకు వెళ్లి అటుకులు సమర్పించి అత్యంత దనవంతుడైనాడు. ధర్మరాజు సూర్యనారాయణ మూర్తి నుండి అక్షయ పాత్రను పొందినాడు. వ్యాసుడు మహాభారతాన్ని చెప్తున్నప్పుడు విఘ్ననాయకుడు అయిన గణపతి భారతాన్ని రాయటం మొదలు పెట్టినరోజు.  శంకరాచార్యులు వారు కనకదరా స్తోత్రాన్ని పాడితే కనకం వర్షంలాగ పడిన రోజు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది కి వస్త్రాపహరణ చేసి అవమానించదలిచారు , అప్పుడు  ఆమెకి శ్రీ కృష్ణులు వస్త్రాలు ఇచ్చి ద్రౌపదిని కాపాడిన రోజు.  అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి.  కుబేరుడు, దేవతల కోశాధికారి, ధనానికి దేవత అనీ. లక్ష్మీ దేవి మరియు కుబేరుడు అక్షయ్ తృతీయ నాడు పూజిస్తే, సంపద కలగ చేస్తుంది.  అంతే కాదు ఈరోజు నాడే  అన్నపూర్ణాదేవి జన్మించినది.  ఈరోజు కి ఇన్ని విశేషాలు వున్నాయి కాబట్టే అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.   ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)