పావుసేరు పాలల్లో ఎన్ని పాలుం టాయి ?
సన్యాసిబైరాగి ని 5 letters లో రాయగలరా?
గ్రహం కాని గ్రహం ఏమి గ్రహం?
గాంధీ గారు ఒకరోజు train లో తూర్పు నుండి పడమర వైపుకు ప్రయాణం చేస్తున్నారు మరి ఆయన జుట్టు ఎటువైపు ఎగురుతుంది?
ప్రాణం వుండి కదలలేనిది?
రైతుకు కావలసినది?
నిద్రపోతు కళ్లు తెరిచి వుండేది?
గురువారం, మార్చి 05, 2009
బుధవారం, మార్చి 04, 2009
అమ్మమ్మ చెప్పింది ( వచ్చే నిమిషం మీది కాదు)
బుధవారం, మార్చి 04, 2009
ఈ కదా అమ్మమ్మ చెప్పింది .
అనగనగా ఒకసారి ఒక బ్రాహ్మణుడు యజ్ఞము చెయ్యాలని అనుకుని ధర్మరాజు ను సహాయం అడిగాడు.
ధర్మరాజు ఆ బ్రాహ్మణుని మరుసటి రోజు రమ్మన్ని పంపివేసాడు. ధర్మరాజు మాటలును విన్న భీముడు నగరమంతా తోరణాలు కట్టించి అలంకరించి , గొప్పగా పండుగ చెయ్యాలని తన పరివారమునకు ఆనతిని ఇచ్చాడు.
ధర్మరాజు భీమసేనునితో "భీమా ! ఈ రోజు ఏమి విశేషము ? ఈ ఏర్పాటులు అన్నీ దేని గురించి?" అని అడిగాడు.
దానికి భీముడు, " అన్నా! మీరు రేపటివరకు జీవించి ఉంఢగలననీ , మీ మాటను మీ మాటను నేరవేర్చుకోగాలరని దృఢ నమ్మకం వున్నది. మీరు ఆడిన మాటను తప్పరని నాకు తెలుసు. ఈ ప్రపంచములో రేపటివరకు జీవించి వుండగలను అన్నా ధీమాగా చెప్పగల వ్యక్తి మీరు తప్ప ఎవరు ఉండగలరు? అందుకనే ఈ పండుగ జరుపుకోదలిచాను. " అని సమాధానము ఇచ్చాడు భీముడు.
ధర్మరాజు తన తమ్ముడు ఇంత సుక్షంగా తన కర్తవ్యమును గుర్తు చేసాడని ఆనందించాడు. ఏ మంచి కార్యమును తలపెట్టిన వెంటనే చెయ్యాలి. ఆలస్యము చేయకూడదు.
గతించిన కాలము మనది కాదు. రేపు మనచేతిలో లేదు. వర్తమానంలో జీవించాలి.
అమ్మమ్మ చెప్పింది tomorrow is too late అని.
సోమవారం, మార్చి 02, 2009
మా అమ్మమ్మా తాతయ్యల పెళ్ళి రోజు
సోమవారం, మార్చి 02, 2009
గురువారం, ఫిబ్రవరి 26, 2009
భగవంతుడు -సర్వవ్యాపకత్వము
గురువారం, ఫిబ్రవరి 26, 2009
కధ చెబుతాను ఉ కొడతారా.
అనగనగా ...................................
ఉద్దాలక మహర్షి కుమారుడు శ్వేతకేతు .
ఒక రోజు కుమారుడుని ఇలా ప్రశ్నించాడు తండ్రి.
కుమారా! నీవిన్ని రోజులు పరతత్వము బ్రహ్మము . అను విషయములను గురించి అధ్యయనం చేసావు కదా.
ఈ భగవంతుడు అసలు ఎక్కడున్నాడు ? అని అడిగాడు.
వారిద్దరూ ఇలా సంభాషించు కుంటున్నారు.
శ్వేతకేతు: భగవంతుడు సర్వాంతర్యామి అని మా గురువుగారు చెప్పారు.
ఉద్దాలకుడు: కుమారా !సర్వవ్యాపకము అంటే ఏమిటి ?
శ్వేతకేతు: తెలియదు నాన్నగారు.
ఉద్దాలకుడు: కుమారా! నీవు లోపలికి వెళ్లి ఒక పాత్రలో నీరు. కొంచెం ఉప్పు తీసుకుని రా.
(శ్వేతకేతు తండ్రి చెప్పినట్లే చేసాడు)
ఉద్దాలకుడు: కుమారా! ఉప్పును ఆ నీటిలో బాగా కలుపు నోట్లో వేసుకొని చూడు.
(శ్వేతకేతు అలానే చేసాడు)
శ్వేతకేతు: ఉప్పగా వుంది నాన్నగారు.
ఉద్దాలకుడు: పాత్రలో చెయ్యి పెట్టి ఉప్పు ను బయటికి తీయ్యి.
(శ్వేతకేతు నీటిలో చెయ్యి పెట్టి చూసాడు)
శ్వేతకేతు: నీటి లో ఉప్పు కరిగి పోయింది .ఉప్పుగా చిక్కదు .
ఉద్దాలకుడు: నీ కేలా తెలిసింది?
శ్వేతకేతు : పాత్రలోని నీరు ఉప్పగా ఉంది కదా.
ఉద్దాలకుడు: మంచిది. నీవు అనుభవపూర్వకంగా ఉప్పు నీటిలో కలసి పోయిమ్దని తెలుసుకున్నావు. అదేవిధముగా భగవంతుడు ఈ సృష్టిలో లీనమైనాడు.
ఆ సత్యాన్ని అనుభవ పూర్వకంగానే తెలుసుకోవాలి .
ఇదండి కధ. దీనిని మా స్కూల్ ఫంక్షన్ లో డ్రామా కింద వేస్తున్నాము. ఎలావుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)