Blogger Widgets

శనివారం, డిసెంబర్ 31, 2011

తిరుప్పావై సప్తదసమ పాశురము

శనివారం, డిసెంబర్ 31, 2011

గోపికలు , పదిమంది గోపికలను మేల్కొలిపికొని నందగోపభావనమును చేరినారు. భావనపాలకుని ద్వారపాలకుని. ప్రార్ధించి వారి యనుమతిని పొందినారు. ద్వారపాలకుడు తలుపు తెరచి వాడలేను. గోపికలందరూ ను నందగోపభావనములోకి ప్రవేశించినారు.నందగోపుడు , యశోద, శ్రీ కృష్ణుడు, బలరాముడు వరసగా మంచాలపై సయనించినారు. వారిని ఈ రోజు మేలుకోల్పుతున్నారు. రాక్షసులు వచ్చి కృష్ణునికి ఏమి కీడు చెయునో అని ! లేక గోపికలు ఎత్తుకుపొతారెమో ! అని భయముతో జాగరుడై ముందు మంచము మీద నందుడు శయనించియుండెను. లేక లేక లభించిన కృష్ణుని వీడ లేక ఒక ప్రక్క కృష్ణుని మరో పక్క బలరాముని మద్యలొ యశొద శయనించి యుండెను. వారిని ఒక్కొక్కరిని ఇందులొ మెలుకొల్పుతున్నారు.  మరి ఎలా లేపుచున్నారో చూడండి.
పాశురం :
  అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం 
అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్

శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్




తాత్పర్యము
వస్త్రములు కావలసినవారికి వస్త్రములు, మంచి నీరు , అన్నము కావసినవారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మ బుద్ధితో దానము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము , ప్రబ్బలి చెట్ల వంటి సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురువంటిదానా! మా వంశమునకు మంగలదీపము వంటిదానా! మా స్వామినీ ! యశోదా! మేలుకొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చు కొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా ! నిత్యసురులకు నాయకుడా! నిద్ర పోకూడదు. మేల్కొనుము. స్వచ్ఛమైన ఎర్రని బంగారుముతో చేయబడిన కడియము కాలిని దాల్చిన బలరామా! నీవును, నీ తమ్ముడును మేల్కొనవలెను.
అని గోపికలు ప్రార్ధించిరి.

జై శ్రీమన్నారాయణ్

శుక్రవారం, డిసెంబర్ 30, 2011

గ్రీటింగ్స గురుంచి తెలిసుకుందాం

శుక్రవారం, డిసెంబర్ 30, 2011


 ఈరోజు మనం గ్రీటింగ్స గురుంచి తెలిసుకుందాం. గ్రీటింగ్స్  అసలు ఎలా తయారు అయ్యిందో అని తెలుసుకుందాం .  మా అమ్మగారి చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ వుండేవిట న్యూ ఇయర్ వస్తోంది అంటే వారం రోజులు ముందుగా నే షాప్ కి వెళ్లి ఆ గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కొని వచ్చి వాటికి పేర్లు రాసి దూరంగా ఉండేవారికి పోస్ట్ చేసేవారుట.  స్కూల్ ఫ్రెండ్స్, టీచర్స్  కి న్యూ ఇయర్ రోజు వారి ఇంటికి వెళ్లి వారికి wish  చేసి వారికి chocolates  ఇచ్చి ఆరోజు అంతా హ్యాపీ గా గడిపేవారట.  కొన్ని రోజులు అయిన తరువాత ఎవరి కార్డులు వారే సొంతంగా తయారుచేసుకొని ఇచ్చేవారట.  అప్పట్లో వారికి cakes cut చేయంటము అవి తెలియదుట.  ఇప్పుడు మనము న్యూ ఇయర్ జరుపుకోవటం లో చాలా మార్పులు వచ్చేసాయి.  ఈ సందర్బంగా అసలు ఈ కార్డులు గొడవ ఏమిటో చూద్దాం.
పూర్వం గ్రీటింగ్ ను మొదట ఉత్తరాల ద్వారా తెలుపుకునేవారు.  ఇప్పుడు అయితే అలాంటి ఉత్తరాలే లేవులేండి.  తరువాత గ్రీటింగ్స్ ను షాప్కి వెళ్ళి ఎవరికినచ్చిన  గ్రీటింగు కార్డులు వారు కొనటం వాటిని పోస్టాఫీసుకువెళ్ళి పోస్టు చేసే ఓపికగా ,తీరికగా పంపేవారు.ఇప్పుడు మనకు అంతా నెట్ ప్రపంచంలోనే జరిగిపోతున్నాయి.  షాప్కి వెళ్లక్కరలేదు నచ్చింది ఎతుక్కోనక్కరలేదు. అన్ని నిమిషాలలో చాలామందికి పంపెయవచ్చు.  
అయినా సరే మనం చరిత్రలోకి ఒక్కసారి వేల్లివద్దాం.  మొట్టమొదటిగ్రీటింగ్ కార్డుల చరిత్రను మనం ఓ సారి చెప్పుకుందాం, వాటిని ఎవరు తయారుచేసారు అన్న డౌట్ వచ్చిందామీకు అయితే అది 1842 డిసెంబర్ 9వ తేదీన విలియం మా ఈగ్లే మొట్టమొదటి క్రిస్మస్ కార్డును తయారుచేసాడట!.
విలియం తయారుచేసిన కార్డు పై భాగాన To  అని తరువాత అడుగుబాగాన From  అని వుంచి వాటిని ప్రింట్ తీసుకొని వాటికి మద్యలో మెసేజ్ కి ఖాళీ వుంచి అడుగుని కొంత ప్లేస్ ఉంచేవారు అక్కడ అడ్రస్ రాయటానికి.  తరువాత అమెరికన్ క్రిస్మస్ కార్డు(1824-1909) లో లిధోగ్రాఫర్ లూయిస్ ప్రాంగ్ తయారిచేసాడుట.  ఆ తరువాత 1873 లో ప్రాంగ్ చార్లెస్ డికెన్స్ ఆటొగ్రాఫ్ తో గ్రీటింగ్ కార్డును దిజైన్ చేసి తన మితృలకు,కుటుంబ సభ్యులకు పంపించాడట.1900 సంవత్సరం  వరకు మత సంభందమైన విషయాలకే శుభాకాంక్క్షల కార్డులను పంపించే అలవాటు వుండేవారు తరువాత పుట్టిన రోజులు మొదలుగు  వాటికి కూడా గ్రీటింగ్స్ పంపటం మొదలయింది.
అయితే ఆ గ్రీటింగ్స్ కార్డులు పంపటంలో మెల్ల మెల్లగా చాలా మార్పులు చేర్పులుతో మరి మారి మనకు ఈ కార్డులుగా వచ్చాయి. 
Standard Greeting Cards:కార్డు షీట్ పరిమాణాలు వివిధ రకాలుగా చేతితో తయారు చేసినట్లు. కార్డులు మరియు ఆహ్వానాలను పంపేవిదంగా వుంటాయి. ఒక పెద్ద కార్డు లేదా వివిధచిన్న కార్డులు గా తయారుచేయచ్చు. ఇటువంటి కార్డు అతి తక్కువ ఖర్చు పద్ధతిలో తయారు అవుతుంది.
Photo Greeting Cards: మనకు నచ్చిన ఫోటోమీద విషెస్ తెలియచేసి. మనకు నచినవారికి ఇవ్వంటం.
Personalized Greeting Cards: ఇవి ప్రత్యేకంగా మనకు నచ్చినవిధంగా తయారుచేసి మనకునచ్చిన మెసేజ్ రాసి ఇచ్చే కార్డు.
Musical Greeting Cards: ఈ మ్యూజికల్ కార్డ్స్ కార్డ్ కే మ్యూజిక్ ఏర్పాటు చేసి పంపే కార్డు ఇది కార్డు 3d  ఎఫ్ఫెక్ట్స్ తో తయారు చేస్తారు.
తరువాత చాలా మార్పులు చేర్పులు చేసి వచ్చినవే E-Cards .  వీటిలో కూడా చాలా రకాలువున్నాయి.
Electronic Greeting Cards : E-card టెక్నాలజీ  సుమారు 1984  సంవత్సరములో వచ్చాయి.  వీటిలో కుడా చాలా రకాలు వున్నాయి.

Printed e-Cards : ఈ కార్డు మనకు నచ్చినది సెలెక్ట్ చేసుకొని ప్రింట్ చేసి పంపేవి.

Postcards and Greeting Cards : ఈ కార్డ్స్ పోస్ట్ కార్డ్స్ లానే వుంటాయి online లో ఈమెయిలు ద్వారా పంపేవి. 

Flash animation: ఈ కార్డ్స్ మ్యూజిక్ తో కూడి ప్లే చేస్తే మంచి గా movements తో వుంటాయి.  

Video E-Cards : ఈ కార్డ్స్ వీడియో తరహాలో విషెస్ చెప్పేవిధంగా వుంటాయి.

Mobile E-Cards: ఈ కార్డ్స్ యూజర్లు ఒక వెబ్సైట్ ఆన్లైన్ వెళ్లి చేయవచ్చు, ఒక కార్డ్ గ్రహీత యొక్క మొబైల్ సంఖ్యను టైప్ఎంచుకుని,  కార్డు ఒక ఎంఎంఎస్ గా గ్రహీత యొక్క మొబైల్ ఫోన్ పంపబడుతుంది.
Web based multi-media E-Cards :ఈ కార్డ్స్ slide show  లాగ వుంటాయి. ఇవిమనకు నచ్చినవి అన్ని slide చేసి కావాలంటే మ్యూజిక్ పెట్టి పంపేవి.
Face Upload E-Cards :  ఈ కార్డ్స్ లో మనకు నచ్చిన ఫస్ ఫోటోను అప్లోడ్ చేసి పంపే కార్డు ఇది. ఇది funny  గా కూడా తయారు చేయాచ్చు.
E-cards games:  ఈ కార్డులో మంచి సరదా అయిన ఆటలును కార్డు రూపంలో పంపచ్చు.
Pop up Cards: పాప్ అప్ లేదా యాంత్రిక గ్రీటింగ్లు కార్డులు బాగా ప్రాచుర్యం పొందాయి. కింది షీట్లను మాములుగా అనిపించేవి. ఓపెన్ చెసాగా చాలా బాగుంటాయి. ఇవి మాలాంటి పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు.  
ఇది గ్రీటింగ్ కార్డ్స్ గురించి.  ఇవి మంచిగా మనకు మన ఫ్రెండ్స్ మద్య మరియు కుటుంబసబ్యుల మద్య మంచి relationship  ను పెంచుతాయి అంతమలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు అంటే నమ్మండి.
మీరు కూడా మీకు నచ్చినవారికి నచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ పంపి విషెస్ చెప్పేయండి ఇంకెందుకు ఆలస్యం.
ok  మరి ఇక.  నా తరపున విషెస్ అందుకోండి.
Wish You Happy New Year 2012

తిరుప్పావై షష్టాదస పాశురము

గోపికలు నిద్ర పోతున్న పదిమంది గోపికలను మేల్కొల్పి న తరువాత నంద గోప భవనమునకు చేరినారు. పదిమంది గోపికలును మాత్రమే కాదు . ఆనందముతో శ్రీ కృష్ణుని పొందే యోగ్యత కల గోపికలను అందరను మేలు కొలిపి నంద గోప భావనమునకు వచ్చిరి. నందగోపుని ద్వారమునకు వచ్చి ద్వార పాలకుని అర్ధించి లోనికి  ప్రవేశింతురు .
పాశురము:
  నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ 
నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ 
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై 
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్

వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము:
అందరకు నాయకునాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భావనపాలకా లోనికివిడువుము . తోరనములతో శోభిస్తున్న ద్వారమును కాపాడుతున్న ద్వారపాలకా మణులచేఅందముగా వున్నా గడియలను తెరువుము . గోపబాలికలగు మాకు మాయావి అయినమణివర్ణుడగు శ్రీ కృష్ణ పరమాత్మ ద్వని చేయ "పఱ " అను వాయిద్యము ను ఇచ్చెదనని నిన్న నేనుమాట ఇచ్చాను . మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదు. పవిత్రమైన భావముతో వచ్చాము. శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చినాము . స్వామీ ముందుగానే నీవు కాదనకు. దగ్గరగా ప్రేమతో ఒకదానినిఒకటి చేరి బిగువుగా పట్టుకొని వున్న తలుపులను నీవే తెరచిమమ్ములను లోనకు పోనిమ్ము . అని భావనద్వార పాలకులను గోపికలు వేడుకొన్నారు.  

విక్రం సారాభాయ్

విక్రం అంబాలాల్ సారాభాయి
ఈ రోజు విక్రమ్ సారాభాయ్ మరణించిన రోజు డిసెంబర్ 31న ఈయన గురించి కొంచెము తెలుసుకుందాం. 
విక్రం అంబాలాల్ సారాభాయి (ఆగస్టు 12, 1919 – డిసెంబరు 31, 1971) భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ కు ఆద్యుడు.
​విక్రం సారాభాయ్ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో జన్మించాడు. వారి కుటుంబం ధనవంతులైన వ్యాపారస్తుల కుటుంబం. ఆయన తండ్రి అంబాలాల్ సారాభాయ్ అక్కడ పేరు పొందిన పారిశ్రామికవేత్త. ఆయనకు అక్కడ ఎన్నో మిల్లులు ఉండేవి. అంబాలాల్ , సరళా దేవి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతానంలో విక్రం సారాభాయ్ ఒకడు.  తన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి విక్రం సారాభాయి తల్లి మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది.
వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, మరియు జవహర్‌లాల్ నెహ్రూ మొదలైన ఎంతో మంది ప్రముఖులు తరచూ వస్తూ ఉండేవారు. వీరు విక్రం సారాభాయ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. 
అహ్మదాబాదులోని గుజరాత్ కళాశాల నుంచి మెట్రిక్ పాసయ్యాడు. తరువాతి చదువుల కోసం ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. 1940లో అక్కడ నుంచి నాచురల్ సైన్సెస్ లో ట్రిపోస్ లో ఉత్తీర్ణుడయ్యాడు. 
ఎప్పుడు ఐతే రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యిందో అప్పుడు అతను ఇంటికి తిరిగి వచ్చారు మరియు ఈఈశ్c, బెంగుళూర్వద్ద సర్ సీ .వ్ .  రామన్ కింద ఒక పరిశోధన పండితుడు గా చేరాడు. అతను విశ్వ (కాస్‌మిక్ రేస్ ) కిరణాల లపై తను చేసిన కృషి పనిచేసింది. అతను బెంగుళూర్, పూనా మరియు హిమాలయాలు వద్ద కొలతలు కొలిచే అవసరమైన పరికరాలు నిర్మించారు. అతను తిరిగి 1945 లో కేంబ్రిడ్జ్  వచ్చాడు. 1947 లో అతను పీయెచ్ .డ్ పట్టా లభించింది. ​
ఇతని భార్య మృణాలిని సారాభాయ్. అప్పట్లో వీరి పెళ్ళి చెన్నై లో జరిగింది. అయితే వీరి పెళ్ళికి విక్రం సారాభాయ్ తరపు బంధువులు అందరూ క్విట్ ఇండియా ఉద్యమంలో బిజీగా ఉండటంతో ఎవరూ హాజరుకాలేకపోయారు.   విక్రమ్ సారాబాయ్ గురించి చెప్పాలంటె చాలా ఉంది.  మనము వీలు చూసుకొని చెప్పుకుందాం.

జై హింద్

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)