Blogger Widgets

బుధవారం, ఫిబ్రవరి 01, 2012

కల్పనా చావ్లా

బుధవారం, ఫిబ్రవరి 01, 2012


kalpana chawla,poem kalpana chawla,kalpana chawla poem,poetry kalpana chawla,kalpana chawla poetry
Kalpana Chawla


జాతీయత:అమెరికా మరియు భారత్
జననం: మార్చి 17, 1962 కర్నాల్, హర్యానా, భారతదేశం
మాతృదేశము                     -భారతదేశము
మరణము: ఫిభ్రవరి 1, 2003 ( 40 సంవత్సరాలు) టెక్సాస్
వృత్తి: విజ్ఞాని1994 NASA గ్రూప
Space time : 31d 14h 54m 
Selection  Missions : STS-87, STS-107 
Mission  Insignia :Sts-87-patch.png STS-107 Flight Insignia.svg
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని పెద్దలు అన్నారు. అది నిజమే అన్నట్టు కల్పనా చావ్లా జీవితమూ నిరూపిస్తుంది.  ఈమె తన చిన్నతనము నుండే అంతరిక్షములోనికి ఎలావేల్లాలి అని కలలు కనేది. తన కలలను నేరవేర్చుకున్నది.
తొలిసారి 1997లో అంతరీక్ష యాత్ర చేసిన ఈ మొట్టమొదటి ఆసియా మహిళా వ్యోమగామి కల్పన.  అమెరికా అంతరిక్షయాన సంస్థ అయిన "నాసా"లో వ్యోమగామి విధులు నిర్వహిస్తున్న కల్పన.2003లో కొలంబియా అంతరిక్ష నౌకలో రోదసిలోకి వెళ్ళి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ సంతతి మహిళగాను, రెండో భారతీయ వ్యక్తిగాను పేరు సంపాదించింది. ఇదే కొలంబియా అంతరిక్షనౌక తిరుగు ప్రయాణంలో 2003 ఫిబ్రవరి ఒకటవ తేదీన జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మొత్తం ఏడుగురు వ్యోమగాముల్లో కల్పనా చావ్లా ఒకరు కావడం విషాదకరం.
 
కొలంబియా వ్యోమనౌక తిరుగు ప్రయాణంలో భూమికి 62 కి.మీ ఎత్తున ప్రయాణిస్తూ... మరో 16 నిముషాల కాలంలో కేప్‌ కెనవరాల్‌లోని కెనడీ అంతరీక్ష కేంద్రంలో దిగాల్సి ఉన్న తరుణంలో ప్రమాదానికి గురైంది. అత్యంత దురదృష్టకరమైన ఈ సంఘటనలో కొలంబియాలో ప్రయాణిస్తున్న కల్పనా చావ్లా (మిషన్‌ స్పెషలిస్టు) సహా మరో ఆరుగురు వ్యోమగాములు హజ్‌బెండ్‌ (కమాండర్‌), ఆండర్సన్‌ (పేలోడ్‌ కమాండర్‌), మెక్‌కూల్‌ (పైలట్‌), ఇలాన్‌ రామన్‌ (పేలోడ్‌ స్పెషలిస్టు), బ్రౌన్‌, క్లార్క్‌ (మిషన్‌ స్పెషలిస్టులు) ప్రాణాలు కోల్పోయారు.
 
ప్రమాద సమయంలో గంటకు 20 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ వ్యోమనౌక విస్ఫోటనానికి గురై పేలిపోగా దాని శకలాలు టెక్సాస్‌తో పాటు మరో రెండు రాష్ట్రాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే ఆ శకలాలు విషపూరిత రసాయనాలతో కూడినవి అయి ఉన్నందున పౌరులెవరూ వాటి చాయలకూ పోరాదని నాసా హెచ్చరించింది. కాగా. 40 ఏళ్లకు పైబడిన నాసా చరిత్రలో మానవ వ్యోమనౌక భూమికి తిరిగివస్తూ ఆపదకు గురికావడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. కల్పనా చావ్లా  అనే  పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ధైర్యం. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి మహిళగా ఘనత సాధించిన ఆమె... అంతరిక్షంలో ఏవేని చిన్న పొరపాట్లు జరిగినా బూడిద కూడా మిగలదని తెలిసిన ఈ ధీశాలి మరణాన్ని సైతం చిరునవ్వుతో స్వీకరించి మళ్లీ ఆకాశంలోకే పయనమైపోయారు. భౌతికంగా ఆమె మరణించినా, కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా కల్పన పేరు ఈ భూప్రపంచంపైన మార్మోగుతూనే ఉంటుంది.                                       

 

మంగళవారం, జనవరి 31, 2012

జాతీయ పక్షి

మంగళవారం, జనవరి 31, 2012

మన భారత ప్రభుత్వం వారు 1963వ సంవత్సరం జనవరి 31 న నెమలి ని మన జాతీయ పక్షి గా గుర్తించారు.  

The Scientific Classification 
Phylum: Chordata
Sub-phylum: Vertebrata (Vertebrates)
Class: Aves (Birds)
Order: Galliformes
Family: Phasianidae
Sub-family: Phasianinae
Genus: Pavo ¡
Species: Pavo cristatus (blues) and Pavo muticus (Java greens)
Subspecies for P. muticus: P.m. muticus  |  P.m. spicifer  |  P.m. imperator

నెమలి చాలా అందమైన ఈకలు కలిగి వుంటుంది. శ్రీ కృష్ణుడు తన శిరస్సు మీద నెమలి ఈకను అలంకరిమ్చుకునేవారు.  సుబ్రహ్మణ్య స్వామి వాహనంగా నెమలి వుంటుంది కదా నేను ఫొటోస్ లో చూసాను. మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
ఆడ నెమలి ఆకుపచ్చ, గోధుమ మరియు బూడిద రంగులలో ఉండే పించం ఉంటుంది. మగ నెమల్ల వలె ఆడనెమలికి పొడావాటి తోక లాంటి ఈకలు ఉండవు, కానీ వీటికి ఒక కొప్పూంటుంది.
నెమలి పించాలలోని ఆ అత్బుత రంగులకు కారణం, వాటి ఈకలమీద పేర్చినట్లు ఉండే సన్నని పీచు లాంటి పదార్దాలే. అక్కడ కనిపించే వివిధ రంగులకు వాటి అమరికలోని నిడివి తేడాలే కారణం. గోధుమ రంగు ఈకలకు, ఎరుపు మరియు నీలం రంగులు అవసరం - వీటిలో ఒక రంగు అమరిక వలన సృస్టింపబడగా, రెండొవది హద్దులలో ఉండే ఇంకో అమరిక వలన వచ్చే కాంతి పరావర్తనం వలన ఏర్పడుతుంది. ఇటువంటి పరావర్తనం వలనే నెమలి నాట్యమాడుతున్నప్పుడు వాటి పించాలు మనకు వివిద కోణాలలో వివిద రంగులుగా కనిపిస్తాయి.
దాదాపు 2000 సంవత్సరాల కాలం నుండి మనుషుల పోషణలో నెమలి ఉన్నదని భావిస్తున్నారు.నెమలిలో పెంపుడు జంతువులలో కనిపించే లక్షణాలు చాలా తక్కువగా వున్నాయి.వీటి నుండీ ఇతర కొత్త జాతులు సృష్టింపబడ్డాయి.
ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమల్లు మనకు కనిపిస్తాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోతగ్గవి.
మబ్బులు పట్టాగానే నెమలి తన అందాన్ని మరింత బాగా చూపి నాట్యం ఆడుతుంది.  ఇంత అందామయిన పక్షికి ఈనాడు నివాస స్తలాలేలేవు. నెమలి తుప్పలు, గడ్డి ప్రదేసాలాల్లో నివసిస్తుంది.  ఇప్పుడు ఆకు రాలే కాలం కదా గడ్డి తుప్పాలను నిప్పుపెట్టేసారు వాటికి సరి ఐన ప్రదేశం లేక కొత్త ప్రదేసాలకోసం అన్వేషిస్తున్నాయి.  ఆ ప్రయత్నంలో కొన్ని మనుషులకు దొరికిపోయి చంపబడుతున్నాయి.  మా ఇంటిదగ్గర గడ్డి కాల్చేసారు.  అప్పుడు అవి దగ్గరలో వున్నా వాటర్ ట్యాంక్ మీద ఎలా కుర్చున్నవి అప్పుడు నేను తీసిన ఫోటో చూడండి. అంత అందంగా వున్నా మన జాతీయ పక్షి అయిన నెమలి జాతి అంతరించి పోకుండా కాపాడ వలసిన బాధ్యతా మనందరికీ వుంది.   దయచేసి నెమలి ని చంపవద్దు దాని అందాన్ని చూసి ఆనందిచుదాం.  
Please Save Our National Bird 

మంగళవారం, జనవరి 24, 2012

How many squares are there?

మంగళవారం, జనవరి 24, 2012

 How many squares are there on a chessboard or checkerboard?


మొత్తకురే అమ్మలాల

చిన్ని కృష్ణుని అల్లరి మితిబారినది.  వాని అల్లరి వారి భరించలేక పోతున్నారు.  ఒక గోపెమ్మ చిన్ని కృష్ణుని కొట్టబోయినది. మరో గోపెమ్మ వారించెను.  రేపల్లె వెన్న దొంగ కృష్ణుడు ను యశోదమ్మ కొట్టబోయినది.  అప్పుడు అమ్మ కాలమీద పడినాడు చిన్నివాడు.   అందితే జుట్టు  అందకపోతే కాళ్ళు కృష్ణునకిది వెన్నతో బెట్టిన విద్య. ఇంకేమున్నది ? గోపెమ్మ కోపము మటు మాయమైనది. కృష్ణునకు అలుసుగా తీసుకున్నాడు. తన స్నేహితులతో ఊరిమీదికి బోయి, గొల్లల వాడలలో ఇళ్ళను కొల్లగొట్టినాడు. వెన్న ముద్దలు మాపుదాకా ముక్కున కారునట్లు బుక్కినాడు.  
గోప కృష్ణుని అల్లరి మితిమీరినది. యశోదమ్మ బాలుని దండింపదలచినది. చిన్ని కృష్ణుని రోటికి గట్టినది. అది అంత తేలికా ? అప్పుడు శ్రీ కృష్ణునికి కోపమే వచ్చినది. తన్ను రోటికి కట్టిన తల్లిపై రాళ్ళు రువ్వినాడు. తన చిన్ని చేతులకు అందినంత వరకు విసిరినాడు. చిదిమిన పాలు గారు చిన్ని బుగ్గలతో, చిలికిన నవ్వులతో, మొల చిరు మువ్వలతో గోకులమంతా కలియ దిరిగే నందకిశోరుడు బాలుడా ! పరబ్రహ్మ స్వరూపుడు. త్రిమూర్తులలో మేటియైనవాడు. 
బాలకృష్ణ కేళీవిలాసాలు చిలికి చిలికి పెద్దవైనవి. యశోదతో ఫిర్యాదు చేయుటకు వ్రజ భామలు కదలి వచ్చినారు. గోకుల మిల్లిల్లు కదలినది. అక్కడి దృశ్యమును చూచి పల్లీబిబ్బోకవతులు ఆశ్చర్యచకితలైనారు. కృష్ణుడు పసిబాలుని వలె ఒక మూలకు ఒదిగి, యశోదాదేవి యొడిలో చేరి పాలు త్రాగుతున్నాడు. ఆ తల్లి కన్నులతో వాత్సల్యాన్ని కురిపిస్తూ, తన తనయుని తల నిమురుతున్నది. ముద్దుగుమ్మలు ఆ ముద్దుల బాలుని చూచి ముసి ముసి నగవులతొ వెనుకకు మరలినారు. 
ఆ లీలామానుష విగ్రహుడే నేడు వేంకటగిరిమీద మూలభూతియై నిలచినవాడు.  అంత గొప్ప సన్నివేశానికి చూడటానికి రెండు కళ్ళు అయినా సరోపోవు కదా.  ఇదంతా కృష్ణమాయ .
మొత్తకురే అమ్మలాల -ముద్దులాడు వీడె
ముత్తెము వలె నున్నాడు - ముద్దులాడు 

చక్కని యశోద తన్ను సలిగతో మొత్త రాగా 
మొక్క బోయీ గాళ్ళకు - ముద్దులాడు 
వెక్కసాన రేపల్లె - వెన్నలెల్ల మాపుదాక 
ముక్కున వయ్యగ దిన్న - ముద్దు లాడు 

రువ్వెడి రాళ్ళ దల్లి - రోలదన్ను గట్టెనంట 
మువ్వల గంటల తోడి ముద్దు లాడు 
నవ్వెడి జెక్కులనిండ - నమ్మిక బాలుని వలె 
మువ్వురిలో - నెక్కుడైన ముద్దులాడు 

వేలసంఖ్యల సతుల - వెంటబెట్టుకొనిరాగా ! 
మూల జన్ను గుడిచీని ముద్దులాడు 
మేలిమి వెంకటగిరి మీద నున్నాడిదె వచ్చి 
మూలభూతి దానైన ముద్దులాడు 


My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)