అమ్మమ్మతో నేను
నాకు ఇప్పటికీ గుర్తువుంది ఊరిలో మా అమ్మమ్మగారి ఇంటి వాతావరణం ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. వేసవి సెలవుల్లో చల్లటి సాయంత్రం వేళ అమ్మమ్మ తాత మావయ్య అంతా మేడమీద చల్లాగావుండేది. అక్కడ అమ్మమ్మ అందరికీ పక్కవెసి అందరికీ బొజనం కలిపి ఒక్కొక్కరికీ తన చేతితో గొరుముద్దలు తినిపించేది . ఆచల్లగాలికి నెను అమ్మమ్మ ఒళ్ళో తలపెట్టుకొని పడుకొనేదాన్ని అమ్మమ్మ తన చెయ్యితో సున్నితంగా నిమురుతూ కదలు మంచి విషయాలు చెప్పేది.
కానీ నాకు మాత్రం, అమ్మమ్మతో గడిపిన ప్రతి క్షణం చాలా ప్రత్యేకం.
ఒక్క రోజు, గడ్డిమీద కూర్చుని, నెయ్యి వేసిన పెసరట్టు తింటూ అమ్మమ్మకి చెప్పాను :
"అమ్మమ్మా! నీ కథలు చాలా మిస్ అయ్యా!"
ఆమె నవ్వుతూ నన్ను ఒడిలోకి తీసుకొని మళ్లీ ఓ పాత కథ ప్రారంభించింది — అరిష్టబుద్ధి అనే గుడ్లగూబ కథ చెప్పింది నాకు తెలియని ప్రతీ పదానికి అర్థం చెబుతూ, ఓసారి కథ ముగిసిన తరువాత, "ఇందులో నీవు ఏం నేర్చుకున్నావు?" అని అడిగేది.
నా చిన్నప్పటినుండి అలా ఆమెతో ఉన్నాను.పగలు, సాయంకాలాలు, బంగారు రంగుల పచ్చడీ వాసనలతో నిండిన ఆమె వంటగది — అమ్మమ్మ చేతుల గాజుల సవ్వడి ఇవన్నీ ఇప్పటికీ నా మనసులో మెరిసిపోతున్నాయి.
సమయం గడిచిపోయింది. కానీ ఇప్పుడు అమ్మమ్మ లేరు. కానీ ఆమె ప్రేమ, ఆమె మాటలు, ఆమె కథలు మాత్రం నాకు మార్గదర్శకంగా ఉన్నాయి.
ప్రతి సారి కష్టపడి పాఠాలు చదివినప్పుడు, లేదా ఎవరికైనా సహాయం చేసినప్పుడు — "నీవు మా అమ్మమ్మలా ఉన్నావు!" అని నాలో నేనే భావిస్తాను. థేంక్యు అమ్మ్మమ్మ