Blogger Widgets

మంగళవారం, అక్టోబర్ 21, 2008

చందమామ రావే.................జాబిల్లి రావే..............

మంగళవారం, అక్టోబర్ 21, 2008

ఇప్పటిదాక్యా రాత్రి వేళ్ళ మనం భోజనం చెయ్యక మనం మారాం చేస్తే.............. మన అమ్మలు చందమామ రావే జాబిల్లి రావే ......... అనే పాటలు పాడుతూ మనలను మైమరిపించి మనకు భోజనం తినిపించేవారు. మీకుకూడా గుర్తు వుండేవుంటుంది. మనం ఈచంధమామ కధలు విన్నాం కదా. ఎన్నో కధలు ఎన్నెన్నో............... పూర్వం నుండి రాముని ధగ్గర నుండి చంద్రుడిగురించి వాళ్ళ అమ్మలు కధలు చెప్పడం మనకు కూడా మన అమ్మలు చెప్పారు కధండి. అయితే కధలే మనవారికి స్పూర్తి అయ్యింది. కాభోలు. ఆనాటి పిల్లలు చంద్రుడు దిగి వస్తాడు అన్కొని పెద్దయ్యాకా రాడని గ్రహించి అప్పటి చంద్రుడిని చేరాలన్న ఆశతో ప్రయత్నించి ఈనాటి కి ప్రయత్నాన్ని సఫలి కృతం చేసుకోబోతున్నాడు. ఇది నిజంగా సంతోషించవలసిన విషయం . రేపు చంద్రయ్యాన్ ప్రోయోగం చెయ్యబోతున్నారు .ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. చంధమామయ్య రాడు మనమే వెళ్ళాలి . బాగుంది కదా..

భారత దేశం చంద్రుడిపైకి ప్రయోగించనున్న తోలి మానవరహిత అంతరిక్షనౌక చంద్రయాన్ కౌంట్ డౌన్ పూర్తి కావస్తోంది . నెల్లూరు జిల్లా లోని శ్రీహరికోటలోని సతీస్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఉదయం .౨౦ గంటలకు జరిగే ప్రయోగం సర్వం సిద్దం అయ్యింది.చంద్రుడికి వంద కిలోమీటర్ల కక్షలోకి చేరుకొనేందుకు చంద్రయాన్ భూమి చుట్టూ రెండు దసలల్లో బ్రమనాలు జరుపుతుంది. వచ్చెనేల ఎనిమిది తేదీకల్లా ఇది నిర్దిష్ట కక్షలోకి చేరుతుంది .చంద్రయాన్ ప్రయోగం కోసం భారతీయ శాత్రవేత్తలే కాకుండా విదేసియులు కుడా పాలుపంచుకున్నారు. చిత్రాలుతో చంద్రుడి ఉపరితలం కళ్ళకు కన్బదేటట్టు వుండతానికి దానికి కెమెరా కుడా వుంచారు.

ప్రయోగం వెనకాల చాలాకారనాలు కనబడుతున్నాయి.
భవిషత్తులో మనిషి అవసరాలు ను భూమి తీర్చలేని పరిస్థితి వస్తే.......... చంద్రుడి పై శాస్వత నివాసాలు ఏర్పరచుకోవచ్చు.
భూమి , సౌరకుటుంబం , విశ్వం , సంబంధించిన చరిత్ర ను ఆవిర్ చంద్రుడిపై ప్రయోగాలు వుపకరిస్తాయి. మనిషి నివసించే అవకాసం ఉందని అనుకుంటున్నా అంగారకుడి తో పాటు మిగతా గ్రహాలపైనా ప్రయోగించటానికి వీలుగా వుంటుంది.

భూమి నుండి చన్ధ్రుదుఇ మద్య దూరం మూడు లక్షల ఏనాబైనాలుగు వేల నాలుగు వందల మూడు కిలోమీటర్లు.

చంద్రుడు భూమి తో పోలిస్తే నాలుగో వంతు ఉంటుంది.

భూమి నుండి చూస్తే చంద్రుడు ఒక వైపే కనిపిస్తుంది. రెండోవైపు తెలుసుకున్దురు.

ఒకే మరి రేపు జరిగే చంద్రయాన్ ప్రయోగం తో భారతీయ తివర్ణ పతాకం ను ఎగరవస్తారు. మన జెండా చంద్రుడిమీద సగర్వంగా రెపరెపలాడుతూ ఎగురుతుంది. అది తలచుకుంటేనే నా వొళ్ళు గగుర్పొడుస్తోంది. నాకు చాలా గర్వంగాకుడా వుంది.

ఐతే ఇక పై చంద్రుడి గురించి అమ్మలు కొత్త కధలు తయారు చేసుకోవాలి మరి.

ఈ చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావాలని మనస్పూర్తి గా కోరుకుంటూ.

విష్ ఆల్ ది బెస్ట్ .

శుక్రవారం, అక్టోబర్ 17, 2008

నొప్పించక తానొప్పక

శుక్రవారం, అక్టోబర్ 17, 2008

ఒక వూరిలో ఒక ధనవంతుడుండేవాడు. అతనిని పరీక్షించాలని శ్రీ లక్ష్మి ,దరిద్ర లక్ష్మి ఇద్దరు వచ్చారు. అతని వద్దకు వచ్చి అతనితో "మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పగలవా "? అని అడిగారు. ధనవంతుడు గొప్ప చిక్కులో పడ్డాడు. శ్రీ లక్ష్మి అందంగా ఉన్నదంటే దరిద్రదేవత తనను పట్టుకొని పీడించవచ్చు. దరిద్ర లక్ష్మి అందంగా ఉన్నదంటే శ్రీ లక్ష్మి కోపంవచ్చి వెళ్లి పోతుందేమో! అని మానసిక ఆందోల్లనపడుతూ ఆలోచించాడు.అతనికి ఒక గోప్పయుక్తి స్ఫురించింది. వారితో" అమ్మలారా..........! మీరు అటు ఇటు నడవండమ్మా ! మీలో ఎవరు అందంగా ఉంటారో చెప్తాను" అన్నాడు. మరల " ఒకరు రండి. మరొకరు పొడి . ఆవిధంగా నడవండి" అన్నాడు. వారట్లే చేసారు. ధనవంతుడు చిరునవ్వుతో గంభీరంగా "అమ్మా! లక్ష్మిదేవి ! నీవు వస్తున్నప్పుడు చాలా అందంగా వుంటావమ్మా ".
"అమ్మా ! దరిద్ర లక్ష్మీ ! నీవు పోతున్నప్పుడు చాలా అందంగా వుతావంమా ".అన్నాడు.ఈ విధంగా యుక్తిగా ఇద్దరినీ తృప్తి పరచాడు. ప్రతీవారికి యుక్తి అవసరం . యుక్తి వలన శక్తీ సంపాదించవచ్చు. ఉపాయం తో అపాయాన్నుంది తప్పించుకోవచ్చు .

గురువారం, అక్టోబర్ 16, 2008

తిట్టినవారే...........!

గురువారం, అక్టోబర్ 16, 2008

" నన్ను అనవసరంగా ప్రతీవారు తిడుతున్నారు స్వామీ"! అన్నాడు ఒక భక్తుడు. రమణమహర్షితో,
రమణమహర్షి ఏమి మాటలాడలేదు.
`అన్యాయముగా తిట్టడం వల్లనా నాకు చాలా కోపం వస్తోంది, ఏమి చేయమంటారు?' అని అడిగాడు ఆ భక్తుడు.
`ఏముంది ? నువ్వు కుడా వాళ్ళతో చేరి నిన్ను నువ్వే తిట్టేసుకో , సరిపోతుంది' అన్నారు మహర్షి.
`అదేంటి స్వామీ అలా అన్నారు ?' అని తెల్ల మొహం వేసాడు భక్తుడు.
`వాళ్లు తిట్టేది నీ శరీరాన్నే కదయ్యా !
కోపతాపాలతో నిండిన ఈ శరీరం కన్నా నీకు శత్రువెవరు ? కనుక తిట్టేవల్లంతా నీకు మేలే చేస్తూన్నారు. పోగిడేవాల్లకన్నా వాళ్ళే నీకు నిజమైన మిత్రులు' అన్నారు మహర్షి.
"శరీరమే నేను" అనుకోవద్దని రమణ మహర్షి భోధ.

మంగళవారం, అక్టోబర్ 14, 2008

ప్రశ్నకు ప్రశ్న ! ..........

మంగళవారం, అక్టోబర్ 14, 2008

మనలో చాలా మంది ప్రతీ దానికి ప్రశ్నిస్తూ వుంటారు. వాటికి సమాదానం చెప్పలేనివి కొన్ని వుంటాయి. అల్లాంటిదాని గురించే మీకు చెప్తాను. నేను అస్తమాను అందరినీ ప్రతీ దాని గురించి ప్రశ్నలు అడుగుతాను . ఐతే ఈ రోజు కూడా రోజులాగే మా అమ్మమ్మని కనిపించిన ప్రతీదాని గురించి అడుగుతున్నాను. అప్పుడు మా అమ్మమ్మ ఈ కద చెప్పింది. ఆ కద మీకు నేను అందిస్తున్నాను. ఓకే నా.

ఒక పిల్లవాడు నడచుకుంటూ వెళ్తున్నాడు . అతని చేతిలో వెలుగుతున్న క్రొవ్వొత్తి ని చూసి ఒక పెద్ద మనిషి అడిగాడు " ఓ అబ్బాయీ ఆవెలుగు ఎక్కడనుండి వస్త్తోంది "అని.
ఆ పిల్లవాడు చాలా గడుగ్గాయి వెంటనే ఆ క్రొవ్వొత్తి ఆర్పివేసి , "ముందు ఆ వెలుగు ఎక్కడకు వెళ్లిందో చెప్పండి, " ఆ తరువాత ఆ వెలుగు ఎక్కడనుండి వస్తోందో చెప్తాను అన్నాడు". ఆ పిల్లవాడు.

కొన్ని ప్రశ్నలు పైకి చిన్నవి గానే కనిపస్తాయి . సమాదానం వెతకబోయినప్పుడు తెలుస్తుంది అవి ఎంత కష్టమైనవో అని .
మా అమ్మమ్మ ఇంకా చెప్పిందీ ........... ఏదైనా ప్రశ్నలు అడిగేముందు దాని గురించి ఆలోచించి , పరిశిలించి , పరిశోధించి అడగాలని చెప్పింది. దాని వల్ల మనకు మంచి ఆలోచనాశక్తి వస్తుందని చెప్పింది. అంతేకాకుండా తెలివితేటలు పెరుగుతుందని చెప్పింది. అమ్మమ్మ బాగా చెప్పింది కదండీ.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)