Blogger Widgets

శనివారం, డిసెంబర్ 18, 2010

తిరుప్పావై 2 వ పాశురం -వ్రత నియామాలు

శనివారం, డిసెంబర్ 18, 2010


మరి మొదటి పాటలో తామేమి పొందదలచి ఈ వ్రతం చేయడలచుకున్నారో , ఈ వ్రతమునకు సాయపడు వారు ఎవరో, ఆ వ్రతమును జేయుటకు తమకుగా అధికారమేమో వివరించినారు. ఈ దిన ఒక కార్యము చేయ దలచుకున్నప్పుడు ముందుగా తెలుసుకోవలసినవి ఆ మూడే. ఏ ఫలము కాంక్షించి ఈ కార్యము చేయుచున్నామో తెలిసి ఫలము తప్పక పొమ్దదగినదె అని తెలిసిన కాని కార్యమునందేవరికిని ప్రవృత్తి కలగదు. ఆ ఫలము మంచిదే అని తిలిసినా తము చేయగలమా ,చేయలేమా , మద్యలో శక్తి లేక మాని నవ్వులపాలగుదురు. దానికి కావలసిన పరికరాలు సమకుర్చుకో గలమో లేమో నిర్నయిమ్చుకోవాలి . ఆ కార్యము చేయుటకు తనకు గల అధికారాన్ని తెలుసుకోవాలి .
ఇవన్నీ సమకుర్చగలది కేవలము కృష్ణుడే అని తెలిసిన నీకు అన్ని సమకురినట్లే.
దీనికి శ్రీ కృష్ణుడే ఉపాయం , శ్రీ కృష్ణుని పోడుతయే ఫలమని విశ్వసించి వానిని కైమ్కరమునదే రుచిగాగల నియామాలుందున ? అసలు నియమాలు పాటించాలా? వారు గొల్లపిల్లలు కదా ? వారికి నియమాలు ఎలాతెలియును?
వీటన్నిటికీ ఒకటే ఉపాయమున్నది. భగవంతునిపై భక్తి , పరిసుద్దమైన మనసు కలిగిన చాలు .
కాని భక్తులు భాగాత్స మ్రుద్దికి భగవద్భాక్తులు ఆనందముగా కొన్ని నియమాలు పాటిమ్చుదురు .
వానిని ఈ పాశురములో వివరించుదురు.
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
 
తాత్పర్యము : శ్రీ కృష్ణుడు అవతరించిన కాలములో పుట్టి దుః ఖమగు ఈ ప్రపంచములో కుడా ఆనందమునే అనుభావిమ్చుచున్న వారలారా ! మేము మావ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు:-
పాలసముద్రములో ద్వానికాకుండా మెల్లగా పడుకోనివున్న ఆ పరమ పురుషుని పాదములకు మంగళము పాడదేము . ఈ వ్రతసమయములో నేతిని కాని పాలను కాని మేము ఆరగింపము . తెల్లవారు జామున స్నానము లు చేసెదము . కంటికి కాటుక పెట్టుకోము . కొప్పులో పువ్వులు ముడువము. మా పెద్దలు ఆచరించని పనులు మేము ఆచరించము . ఇతరులకు బాద కలిగించెపనులు మేము చేయము. అసత్యాలాడము. ఎచ్చటా పలుకము.ఙానులకు అధిక ధన ధాన్యాధులు తో సత్కరించుదుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షలను ఉంచుధుము. మీము ఉజ్జీవించు విధముగానీ పర్యాలోచన చేసికొనెదము. దీనిని అంతావిని మీరానదింప కోరుచున్నము.

విశెషార్ధము:- తమతో వ్రతమునకు రాబోవుచున్న గోపికలను ఉద్దెసించి తామీ వ్రతములొ చెయవలసినవి , చెయకుడనివి ఇందు వివరించుకున్నరు.

శుక్రవారం, డిసెంబర్ 17, 2010

The Geeta

శుక్రవారం, డిసెంబర్ 17, 2010

dhritarashtra uvaca
dharma-kshetre kuru-kshetre samaveta yuyutsavah

mamakah pandavas caiva kim akurvata sanjaya

ధృతరాష్ట్ర ఉవాచ:
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||
Dhritarashtra said:
O Sanjaya, assembled at the holy-field and place of pilgrimage of Kurukshetra, raring to fight, what did my sons and the sons of Pandu do?

ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులూ మరియు పాండురాజు తనయులు యుద్దము చేయగొరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
అన్న శ్లోకం తో భగవద్ గీత ప్రారంభం అయ్యింది.  మొత్తం గీతలో దృతరాష్ట్రుడు ఒక్క శ్లోకం మాత్రమె చెప్తాడు.
అప్పుడు సంజయుడు 
sanjaya uvaca

drishtva tu pandavanikam vyudham duryodhanas tadaacaryam upasangamya raja vacanam abravit
 Sanjaya said:
Dhrtarastra! After seeing the army of the Pandavas arranged in a military array, overwhelmed King Duryodhana went to  Dronacharya and spoke these words:

దృష్ట్వా తు పాణ్ణవానీకం వూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||

సంజయుడు పలికెను: ఓ రాజా! పాండవులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచి దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఇట్లు పలికెను.
అని సంజయుని మొదటి శ్లోకం.
అసలు గీత జననం శ్రీ క్రిష్నులవారు అర్జునునికి అమవాస్యరోజు చెప్పారు అది పదకొండు రోజులు తరువాత ఏకాదశి రోజు బయటికి వచ్చింది అదే మనం అందరం గీతాజయంతిగా జరుపుకుంటున్నాం.
మహా భారతం లో భీష్మ పర్వంలో గీత సంపూర్తి అయిన పిదప గీతా శ్లోక సంక్య ను గురించి వివరించారు.
శ్లోకం: షట్సాతాని సవింశాని శ్లోకానాం ప్రాహ కేశవః
అర్జునః  సప్తపంచాసత్ సప్తషష్టిం చ సంజయః
దృతరాష్ట్రః శ్లోకం మేకం గీతాయా మానముచ్యతే
తాత్పర్యం: గీతయందు శ్రీ కృష్ణముర్తి 620 శ్లోకంలను, అర్జునుడు 57 శ్లోకాలను, సంజయుడు 67  శ్లోకాలను,  
ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పిరి.  మొత్తం మీద ౭౪౫ శ్లోకాలు అని తెలుస్తోంది.

మనం కృతజ్ఞ్యతలు తెలుపుకోవాలి ఎవరెవరికి అంటే 
గీత ను భోధించిన కృష్ణులవారికి 
గీత కు నిమితమాత్రుడైన అర్జునుడికి 
గీత ను చందోబద్దంగా మనకు అందించిన వ్యాసునికి
గీత  ను రాసిన శ్రీ విఘ్నేసునకు 
గీత ను ఓమ్ ప్రధంగా ప్రచారం చేసిన సంజయునికి
గీత యొక్క తాళ పత్రాలను కాలగర్భములో కలవకుండా కాపాడిన పుణ్యాత్ములకు 
గీత యొక్క చిన్న చిన్న భావాలను మనకు అర్ధం అయ్యేలా చెప్పిన భాష్యకారులకు
గీత ని ఇంటి ఇంటికి ప్రచారం చేసిన, మరియు చేస్తున్న గీతా ప్రచారులకు 
మన లోకం అంతా కృతజ్నతలుతో వుండాలి .
The Gita is the most beautiful and the only truly philosophical song. It contains sublime lessons on wisdom and philosophy. It is the “Song Celestial”. It is the universal gospel. It contains the message of life that appeals to all, irrespective of race, creed, age or religion.

గురువారం, డిసెంబర్ 16, 2010

ముక్కోటి ఏకాదశి /గీతాజయంతి

గురువారం, డిసెంబర్ 16, 2010

సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి  సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు   ఈరోజునే వైకుంఠ ద్వారాలు తెరుచుకువుంటాయని. వైష్ణవ గుళ్ళుదగ్గర ఉత్తరంవైపు వున్నద్వారం వైపునుండి భక్తులు భగవంతుని దర్శిస్తారు.  ఈరోజున ముక్కోటి దేవతలు భూమికి వచ్చి ఉత్తరద్వారం వైపునుండి స్వామిని ధర్శిస్తారు. అందుకే ముక్కోటి ఏకాదశి అంటారుట. 


 ఈరోజునే పాలసముద్రం నుండి విషం మరియు అమృతం పుట్టాయి.  ఈరోజే  పరమ శివుడు విషం మింగాడు.   ఈరోజు చాలా మంది ఉపవాశం వుంటారు. 
ఈరోజునే గీతాజయంతి కూడా అందుకే చాలా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు.  
మహాభారతంలో శ్రీ కృష్ణుడు అర్జునునికి చేసిన ఉపదేశమే గీత.  గీతలో మొదటి శ్లోకం
ధృతరాష్ట్ర ఉవాచ: 
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | 

మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||
ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులూ మరియు పాండురాజు తనయులు యుద్దము చేయగొరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
అని ధృతరాష్ట్రుడు అనగా ఈ గీతను సంజయుడు ధృతరాష్ట్రుడికి  వివరించాడు ఆరోజే గీత జయంతిగా చెప్తతారు.  భగవత్ గీత భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామ భూమి లో ఉపదేశిస్తాడు.అన్ని సంధి ప్రయత్నాలూ విఫలమైన తర్వాత, యుద్ధం ప్రకటిస్తారు పాండవులు. సంగ్రామ భూమిమీద అడుగు పెట్టిన తర్వాత ఆ మహా సైన్యం చూసి, వారిలో తన తాత అయిన భీష్ముడు వంటి వారిని చూసి నేను యుద్ధం చేయలేను అని అస్త్త్రాలు విడిచి పెట్టాడు.  అప్పుడు శ్రీ కృష్ణులు వారు గీతోపదేశం చేసారు. దాని సారం శాంతి. కృష్ణుడు అర్జునుడుతో ఇలా ఇన్నారు.
మిత్రమా !ఎందుకు భాధపడుతున్నావు !అయ్యిందేదో అయిమ్ది. పోయిమ్దేదో పోయిమ్ది .
ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమి తెలేదుకదా. వట్టి చేతులతో వచ్చావు ! పోయేటప్పుడు లగేజిలతో పొవాలనుకుంటున్నావు! అందుకే నీకంత యాతన. నువ్వేమి తెచ్చావని -నువ్వు పోగొట్టుకున్తున్నావు. నీవేమి సృస్తిమ్చావని నీకు నష్టం వచ్చింది? నువ్వు ఏదైతే పోదావో అది ఇక్కడనుండే పోదావు. ఏదైతే ఇచ్చావో అదీ ఇక్కడనుండే ఇచ్చావు.
ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం , రేపు ఇంకొకరి సొంతం కాగలదు.
కావున జరిగేది జరుగక మానదు . అనవసరంగా ఆందోళన చెందకు . ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపంలేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా భగవంతుని ప్రసాదంగా స్వీకరించు.
కారు లేదని చింతించకు _ కాలువున్నందుకు సంతోషించు.
కొట్లులేవని చింతించకు _ కూటికి వున్నదికడా ! సంతోషించు . అది లేక చాలామంది భాద పడుతున్నారు .
కాలిలో ముళ్ళు కుచ్చుకున్నదని చింతించకు _ కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు .
కాలం చాలావిలువైనది _రేపు అను దానికి రుపులేదు. మంచి పనులను వాయిదావేయవద్దు.
అసూయను రుపుమాపు_ అహంకారాన్ని అనగద్రోక్కు .
హింసను విడనాడు_అహింసను పాటించు .కొపాన్న్ని దరి చేర్చకు _ఆవెశముతో ఆలోచించకు
ఉపకారం చేయకపోయినా _అపకారం తలపెట్టకు.
మతిని శుద్దము చేసేధి మతం_ మానవత్వంలెని మతం మతం కాధు.
దేవుని పూజించు_ ప్రాణికోట్లకు సహకరించు.
తద్వారా భగవదాశీర్వాధం తో శాంతి నీవెంటె వుంటుంధి అని అన్నరు. ఇదే గీతాసారం 

తిరుప్పావై మొదటి పాశురం


ఈ రోజు నుండి ధనుర్మాసం ప్ర్రారంభమము అయ్యింది కదండి. మరి మొదటి పాశురం గురించి తెలుసుకుందాం.
గోపికలు ను గోదాదేవి ఈ వ్రతం చేయుటకు చేయుటకుముందుగా వారు మార్గశిరమాసం గురించి వ్రతం చేయుటకు అనుకూలంగా వుందని కాలాన్ని వారు పొగిడారు.  తరువాత ఈ వ్రతం ఎవరు చేసారో దాని వల్ల కలుగు ఫలితం గురించి తెలుసుకున్నారు.  ఆవిషయాన్ని మొదటి పాశురంలో చెప్పదలచారు.  మొదటి పాశురం

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
 .
మరి ఈ పాశురం తాత్పర్యము ఏమిటంటే  ఒహ్హో మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజు . ఓ అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలొ సంపదలతో తులతూగు చున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్నా సంకల్పమున్నచొ రండు. ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహము నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించనిమనకే , మనమాపేక్షెంచు వ్రత సాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చీయుటను చూచి లోకులందరు సమోషించునట్లు మీరు అందరూ కూడా చేరి ఈ వ్రతము చేయండి అని భావము

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)