Blogger Widgets

గురువారం, జులై 19, 2012

మంగళ్ పాండే జయంతి

గురువారం, జులై 19, 2012

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంలో తిరుగుబాటు పతాకమును ఎగురవేసిన మంగళ్ పాండే జయంతి నేడు 1827, జూలై19న ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లా నాగ్వ గ్రామంలో మంగళ్ పాండే జన్మించారు.
బెంగాల్ నేటివ్ ఇన్ ఫాంట్రీలో ఒక సాధారణ సిపాయిగా పనిచేసిన మంగళ్ పాండే 1857ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటాని నాంది పలికాడు. మంగళ్ పాండే 34 వ బ్రిటిష్ బెటాలియన్ లో పనిచేసిన అతిచిన్న వయస్సు గల బ్రాహ్మణ యువకుడు .   మంచి సాహసవంతుడు అయిన  పాండే తన 22వ ఏట ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం బి.ఎన్.ఐలో చేరాడు. 1857, మార్చి 29న కలకత్తాలో బ్రిటీష్ సార్జెంట్ పై మంగళ్ పాండే దాడిచేయడంతో సిపాయిల తిరుగుబాటు మొదలైంది.అప్పట్లో బ్రిటిష్ వారు  పి.53 రైఫిల్ తూటాలో ఆవుకొవ్వు నింపుతున్నారన్న వదంతి మంగళ్ పాండేలో బ్రిటీష్ వారిపై ద్వేషానికి కారణమైంది.   సార్జెంట్ పై దాడిచేసిన మంగళ్ పాండే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అది కాస్త విఫలమవ్వడంతో బ్రిటీష్ సేనలు అదుపులోకి తీసుకున్నాయి. మంగళ్ పాండే చర్యతో పోరాటం మీరట్ కు పాకింది. 1857, ఏప్రిల్8న పాండేను ఆయనకు సహకరించాడన్న ఆరోపణపై సహచర సిపాయిని బ్రిటీష్ ప్రభుత్వం ఉరితీసింది. పాండేపై చర్య తీసుకోమని హేవ్సన్ అనే సైనిక అధికారి ఆదేశించినా సాటి సిపాయిలు వ్యతిరేకించారు. అప్పట్లో ఝాన్సీలక్ష్మి బాయిగారికి కూడా సహకారం అందించారు పాండే గారు.  దీంతో అప్పటినుండి ఉద్యమం మరింత ఎక్కువగా  భారతమంతటా వ్యాపించింది. కాకతాళీయంగా పాండే హీరో అయ్యాడని, భంగు ను సేవించిన మత్తులో బ్రిటీష్ అధికారిపై దాడి చేశాడన్న వాదనలూ ఉన్నాయి. ఏదేమైనా కాలం విసిరిన సవాలును స్వీకరించిన మంగళ్ పాండే ఒక గొప్ప ఉద్యమకారుడు. భారతదేశ  స్వతంత్ర్య చరిత్రలో చిరస్మరణీయుడుగా నిలిచిపోయాడు .  ఇలాంటి వారిని మనం గుర్తు చేసుకోవటం ప్రతీ భారతీయుని కర్తవ్యం.  ఈయన జయంతి సందర్బముగా మంగళ్ పాండే గారికి నివాళ్ళు అర్పిద్దాం మరి.

సోమవారం, జులై 16, 2012

హరి నీ మయమే అంతాను

సోమవారం, జులై 16, 2012

హరి నీ మయమే అంతాను
అరసి నీకు శరణనియెద నేను

యెదుట నెవ్వరిక నే మాటాడిన
అది నీ ఘన నామాంకితమే
అదివో సకల శబ్దాఖ్యుడవని నిన్ను
పొదలి చదువులు పొగడీగాన

యెవ్వరి పొగడాని యెక్కడ నుండిన
నివ్వటిల్లనది నీ రూపే
నెవ్వదీర నిదె నిను విశ్వరూపుడు
యెవ్వల నని శ్రుతులెంచీగాన

భావన యిది నీ బ్రహ్మాత్మకమే
శ్రీవేంకటేశ నాచింతయిదే
ఆవల నిను సర్వాంతర్యామెని
దేవ శాస్త్రములు తెలిపీగాన

ఆదివారం, జులై 08, 2012

Hey friends catch me live today

ఆదివారం, జులై 08, 2012


Hey friends catch me live today (Sunday) show

with your little RJ Sree Vaishnavi

from 9:30 am to 11:30 am

only on RadioJoshLive

Masth Maza Masth Music :) 

My show Name is Harivillu

Fun with me

If you want to talk with me plz call these numbers  

Skype idradiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594

AUS: 28003-4546

Local Number: 040-4200-2003

Stay Tune RadioJosh 

Thank You Very Much.

బుధవారం, జులై 04, 2012

త్రివర్ణపతాక రూపకర్త

బుధవారం, జులై 04, 2012

తెలుగు జాతి గౌరవం నిలబెట్టి .ప్రపంచ చరిత్రలో  మన జాతీయ జండాను  ఎగురేలా చేసాడు .  మన త్రివర్ణపతాక రూపకర్త 
జాతీయ పతాకం రెపరెపలాడే వరకు ఒక్క తెలుగు వారే కాకుండా.. జాతియావత్తూ స్మరించుకోదగిన మహాపురుషుల్లో పింగళి వెంకయ్య ఒకరు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రు గ్రామంలో హనుమంతరాయుడు-వెంకటరత్నమ్మ దంపతులకు ఆగష్టు 2, 1878 న జన్మించారు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్ధి. ఈయన ప్రాధమిక విద్య చల్లపల్లిలో మరియు మచిలీపట్నములోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగినది. దక్షిణాఫ్రికాలోనే మహాత్మా గాంధీని కలిసిన తెలుగు యువనేత. వీరిమధ్య ఏర్పడిన సాన్నిహిత్యం అర్ధ శతాబ్దం పాటు సాగింది. 1913 నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక ప్రతిష్ఠాపన గురించి చర్చలు జరిపారు. 1916లో "భారతదేశానికొక జాతీయ జెండా" అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించారు.  మన తెలుగువారు తమ వారిని గౌరవించటంలో ఏనాడూ ముందంజవేయలేదు.  జీవితాంతం దేశం కొరకు స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు ' త్రివేణి ' సంపాదకులు డా. భావరాజు నరసింహారావుగారు పేర్కొన్నారు. అంతిమదశలో విజయవాడలో డా. కె.ఎల్.రావు, డా.టి.విఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు మున్నగు పెద్దలు 15-1-1963 న వెంకయ్య గారిని సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తరువాత ఆరు నెలలకే 1963, జూలై 4న వెంకయ్య దివంగతుడయ్యాడు.
కన్నుమూసేముందు వారి చివరి కోరికను వెల్లడిస్తూ

" నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నాభౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక " అన్నారు.
ఇది నాకు తెలిసినప్పుడు నా కళ్ళు నీళ్ళు  వచ్చాయి అంటే నమ్మండి.

జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య. ఈయన వర్ధం నేడు.  ఈ మహానీయునికి నివాళు అర్పిద్దాం.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)