శుక్రవారం, డిసెంబర్ 07, 2012
అంబరిషుని ద్వాదశి వ్రతము
అత్రి మహాముని మరల అగస్త్యునితో " ఓ కుంభసంభవా! కార్తీక వ్రత ప్రభావము నెంతివిచారించిననూ, యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును. అలకింపుము. " గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసిన౦దు వలన ను, సూర్యచంద్రగ్రహణ సమయములందు స్నానాదులోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తి శ్రద్దలతో దనధర్మములుచేయు వారికీని అంతఫలమే కలుగును. ఆద్వాదశి నాడు చేసిన సత్కార్యఫలము యితర దినములలో చేసిన ఫలము కంటె వేయిరెట్లు అధికముకా గలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను. వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున, పగటి పూట మాత్రమే భుజించి ఆమరునాడు అనగా యెకాదశి రోజున వ్రతమూ చేయక శుష్కో పవాస ముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింప వలయును. దీనికొక యితిహాసము కాలదు. దానిని కూడా వివరించెదను. సావదనుడవై అలకింపుము"మని యిట్లు చెప్పుచున్నాడు.
పూర్వము అంబరీషుడనురాజు కాలదు. అతడు పరమ భగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశినాడు, ద్వాదశి ఘడియలు స్వల్ప ముగా నుండెను. అందుచే ఆ రోజు పెందల కడనె వ్రతమును ముగించి బ్రాహ్మణా సమారాధన చేయదలచి సిద్దముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణము చేయవలయునుగాన, తొందరగా స్నానమునకై రమ్మనమని కోరెను. దుర్వాసుడ౦దుల క౦గీకరించి సమీపమున గల నదికి స్నానమున కైవెడలెను. అంబరీషుడు యెంతసేపు వేచి యున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవు చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లునుకొనెను. " ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనము నాకు రమ్మంటిని . ఆముని నదికి స్నానముకు వెళ్లి యింతవరకు రాలేదు. బ్రాహ్మణునకతిధ్యమిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టక పోవుట మహాపాపము. అది గృహస్తునకు ధర్మముగాదు. అయన వచ్చు వరకు ఆగితినా ద్వాదశి ఘడియలు దాటిపొవూ. వ్రతభంగమగును. ఈ ముని మహాకోప స్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్నుశపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణా భోజనమతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటి పోయిన పిదప భుజించిన యెడల, హరిభక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు, భోజనము చేసిన ద్వార్వసునకు కోపము వచ్చును. అదియుగాక, యీ నియమమునునెను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసినా పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు.
" అని అలోచించి " బ్రాహ్మణా శాపమునకు భయములేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువేబోగట్ట గలదు. కావుననెను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే వుత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుటమంచి"దని, సర్వ జ్ఞులైన కొందరు పండితులను గాంచి వారితో యిట్లుచెప్పెను. ఓపండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున యేకాదశియగుటం జేసి నేను కటిక వుపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘదియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసి యున్నది. ఇంతలో నాయింటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. అమహామునిని నేను భోజనమునకు ఆహ్వాని౦చితిని. అంధులకాయన అంగీకరించి నదికి స్నానర్ధ మై వెళ్లి ఇంత వరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశిఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశిఘడియలలో భుజింపవచ్చునా? లేక, వ్రతభ౦గమును సమ్మతించి ముని వెచ్చే వరకూ వేచి యుండవలెనా? ఈ రెండిటిలోయేది ముఖ్య మైనదో తెలుపవలసిన"దాని కోరెను. అంతట యా ధర్మజ్ఞులైన పండితులు, ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శప్రతి విమర్శలు చేసికొని, దిర్ఘముగా అలోచించి " మహారాజా! సమస్త ప్రాణి కోటి గర్భకుహరములందు జటరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహే౦ద్రియలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణ వాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ- దప్పిక కలుగును. అ తపము చల్లార్చ వలెనన్న అన్నము, నిరు పుచ్చుకొని శాంత పరచవలెను. శరీరమునకు శక్తకలుగ చేయువాడు అగ్నిదేవుడు, దేవతలందరి కంటే అధికుడై దేవ పుజ్యు డైనాడు. ఆయగ్ని దేవునందరు సదా పూజింపవలెను. గృహస్తు, యింటికి వచ్చిన అతిధి కడ జాతి వాడైనాను 'భోజనమిడుదు' నని చెప్పి వనికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేద వేదాంగ విద్యవిశారదుడును, మహతపశ్శలియు, సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపమూ కలుగును. అందువలన ఆయుక్షిణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్త మగను" అని విషాదపరచిరి.
గురువారం, డిసెంబర్ 06, 2012
శ్రీ రంగ క్షేత్రమున పురంజయుడు ముక్క్తి నొందుట
అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి "ఓ మునిపుంగవా! విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు" మని యడుగగా అత్రిమహాముని యిట్లుచెప్పిరి- కు౦భసంభవా! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము, శత్రుశేషము వుండకూడదని తెలిసి, తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను తన యొక్క విష్ణు భక్తీ ప్రభావమువలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షతత్పరుడు, నితాన్నదాత, భక్తి ప్రియవాది, తేజోవంతుడు, వేదవెదా౦గవేత్తయై యుండను మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన యఖ౦డ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై, విష్ణు సేవాధురంధరుడై, కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గ ములను కుడా జయించిన వాడైయుండెను. ఇన్నియేల? అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు, సదాచారసత్పు రుషులలో వుత్త ముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తిలేదు. ఏదేశమున, యేకాలమున, యేక్షేత్రమున యేవిధముగా శ్రీహరిని పూజించిన కృతార్దుడనగుదునా? యని విచారించుచుండగా ఒకానొక నాడు అశరీరవాణి" పురంజయా! కావేరీ తీరమున శ్రీ రంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీ వచటకేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము. నీవీ సంసారసాగరమున దాటి మోక్ష ప్రాప్తినొందుదువు" అని పలికెను. అంతటా పురంజయుడు యాశిరీరవాణి వాక్యములు విని, రాజ్యభారమును మంత్రులకు అప్పగించి, సపరివారముగా బయలుదేరి మార్గమద్యమున నున్న పుణ్య క్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నాన ము చేయుచు, శ్రీరంగమును జేరుకొనెను. అక్కడ కావేరీ నది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్నశ్రీ రంగ నాథాలయమున శేషశయ్య పై పవళించియున్న శ్రీ రంగనాథుని గాంచిపరవశమొంది, చేతులు జోడించి, " దామోదరా! గోవిందా! గోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా!అనంతా! అచ్యుతా! ముకుందా! పురాణపురుషా! హృషి కేశా! ద్రోపది మాన సంరక్షకా! ధీన జన భక్త పొషా ! ప్రహ్లాదవరదా! గరుడ ధ్వజా ! కరి వరదా! పాహిమాం! పాహమాం! రక్షమాం రక్షమాం! దాసోహం పరమాత్మ దాసోహం" యని విష్ణు సోత్త్ర మును పఠించి, కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గది పితదుపరి సపరివారుముగా అయోధ్యకు బయలుదేరును. పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల, మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో , పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి. అయోధ్యానగరము దృఢతర ప్రకారములు కలిగి తోరణ యంత్ర ద్వార ములు కలిగి మనో హర గృహాగో పురాదులచో చతురంగ సైన్యసంయుత మై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగర మందలి వీరులు యుద్ద నేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భదకులై, నిరంతరము విజయశిలురై, అప్రమత్తులై యుండిరి. ఆ నగర మందలి అంగనామణులు హంసగజగామినులూ, పద్మ పత్రాయతలోచనులూ నైవిపుల శోణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మద్యత్వము; సింహకుచ పినత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి.
ఆ నగరమందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదలై, ప్రాఢలై, వయోగుణ రూపలావణ్య సంపన్నలై, సదా మోహన హసాలంకృత ముఖిశోభితలై యుండిరి. ఆ పట్టణకులాంగ నలు పతిశుశ్రూషా పారాయణలై సద్గుణాలంకార భూషిత లై చిద్విలాసహసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి.పురంజయుడు శ్రీ రంగక్షాత్రమున కార్తిక మాసవ్రత మాచరించి సతీ సమేతుడై యింటికి సుఖిముగాజేరేను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్యతుర్యధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంత: పురమును ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషియైదైవ భక్తి పరాయుణుడై రాజ్యపాలన మొనర్చుచు, కొంతకాలము గడిపి వృద్దాప్యము వచ్చుటచే ఐహికవాంఛలను వాదులుకొని, తన కుమారునికి రాజ్యభారము వప్పిగించి పట్టాభిషీకూనిచేసి తను వానప్రస్థాశ్రమందు కూడా యేటేటా విధివిధానముగ కార్తీక వ్రత మాచరించుచుక మక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునుకు పోయెను. కావున, ఓ యగస్త్యా! కార్తీక వ్రతము అత్యంతఫల ప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలను. ఈ కథ చదివినవారికి, చదివినపుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును.
బుధవారం, డిసెంబర్ 05, 2012
పురం జయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట, మరల అత్రి మహాముని అగస్త్యునిట్లు చెప్పదొడగెను
కార్తీక పురంజయుడు వశిష్టులవారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియైదేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి, శ్రీహరిని గానము చేసి, సాష్టాంగ నమస్కారము చేసి, సూర్యోదయము కాగానే నదికి పోయి, స్నానమాచరించి తనగృహమున కరిగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు- మెడనిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపెంచి రాజా! విచారింపకుము నువ్వు వెంటనే చెల్లాచెదురైయున్నని సైన్యము కూడా దిసుకొని, యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలెకపోయినవి. అదియునుగాక, శ్రీ మన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్నివిధములా సహాయపడెను. అంతయు శ్రీ మన్నారాయణుని మహిమయే గదా! ఆ యుద్దములో కా౦భోజాది భూపాలురు ఓడిపోయి " పురంజయారక్షింపుము. రక్షింపు" మని కేకలు వేయుచుపారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యము తిరిగి సంపాదించెను. శ్రీ మన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా! విషం త్రాగినాను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా " శ్రీ హరి" అని ప్రార్ధించి త్రాగగా అమృత మైనది గదా! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును దృవుడు చిరంజీవియే గదా! హరి నామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. ఆ ధర్మము ధర్మముగా మారును. దైవను గ్రహము లేని వారికి ధర్మమే ఆ ధర్మమగును. త్రాడు పామై కరుచును. కార్తీక మసమంతయు నది స్నాన మొనరించి దేవాలయంలో జ్యోతియిన్ వెలిగించి దీపారదానా చేసినచో సర్వ విపత్తులును పటా పంచలగును. అన్ని సౌఖ్యములు సమ కూరును. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రత మాచరించు వారికి యే జాతి వారి కైనా పుణ్యము సమానమే బ్రాహ్మణా జన్మ మెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్య మైనచో శూద్ర కులముతో సమన మగును. వేదా ద్యయన మొనరించి దైవ భక్తి కలవాడై కార్తీక వ్రతా నుష్టన తత్పరుడైన వైష్ణ వోత్తముని హృదయ పద్మమున భగవంతుడు ౦డును. సంసార సాగాల ముత్తరించుటకు దైవ భక్తి యే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణు భక్తి ప్రభావము వర్ణ నాతితము వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహా ఋషులు - మరెందరో రాజా ధి రాజులూ కూడా విష్ణు భక్తి చె ముక్తి నొందిరి. శ్రీ హరి భక్త వత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడు చుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచించ్చి యైనను మరి యొకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించ వచ్చును. శ్రీ హరి -భక్తులు అన్యోన్య సంబందికులు అందు వలన లోక పోషకుడు, భక్త రక్షకుడైన అది నారాయణుడు తన భక్తులకు సదా సంపద ల నొసంగి కాపాడుచుండెను. శ్రీ మన్నా రాయణుడు సర్వాంతర్యామి, వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యనందుడు, విరజక్షుడు, పద్నాలుగు లోకములను తన కుక్షి యంది డుకొని కాపాడు చున్న అది నారాయణుడు అటువంటి శ్రీ మహా విష్ణువునకు అతి ప్రియమైన కార్తిక మాస వ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి యింట శ్రీ మహా విష్ణువు లక్ష్మి సమేతుడై వెలయ గలడు. ఆ యిట్లు సిరి సంపదలతో కల కలలాడును. కార్తిక మాసములో శుచియై పురాణ ప టనము చేసినచో పితృ దేవతలు సంతసించెను. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.
సీ|| ఎవ్వరి గరుణి ౦ ప నిచ్ఛ యించితి వాని యఖిల విత్తంబు నే సప హరింతు
సంసార గురు మద స్తబ్ధుడై యెవ్వడు దెగడి లోకము నున్న ధిక్కరించు
నత డెల్ల కలంబు నఖిల యో నుల యందు బుట్టుచు దుర్గతి బొందు బిద ప
విత్త వ యో రూప విద్య బలై శ్వర్య కర్మ జన్మ౦బుల గర్వ ముడిగి
గీ|| యేక విధమున విమలు డై యెవ్వడుండు వాడు నాకూర్చి రక్షింప వలయు వాడు స్తంభ లోకాభి మాన సంసార విభవ మత్తుడైన చెడ నొల్లడు మత్పరుండు
మంగళవారం, డిసెంబర్ 04, 2012
రచ్చ కెక్కితివి పండరంగి విఠలా
పచ్చిదేరే వింతలోనే పండరంగివిఠలా
గుట్టుగల దొరవని కొసరి చూచినంతనె
రట్టుగా నవ్వేవు పండరంగి విఠలా
మట్టుమీరి తమకపు మాటలనె నీవలపు
బట్టబయలె సేసేవు పండరంగి విఠలా
సాగినసబలలోన సన్న సేసినంతలోనే
రాగిదేలించేవు పండరంగి విఠలా
వేగిరపు చేతలనె విరిని నీ మోహమెల్ల
బాగుగా వెళ్ళ వేసేవు పండరంగి విఠలా
సతినీవున్నచోటికి దగ్గర వచ్చినంతనె
రతి గూడితివి పండరంగి విఠలా
గతియైన శ్రీవేంకటనాథ యేలితివి
పతివై కోవిలకుంట్ల పండరంగి విఠలా
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ