Blogger Widgets

శుక్రవారం, ఆగస్టు 02, 2013

భారతదేశానికొక జాతీయ జెండా

శుక్రవారం, ఆగస్టు 02, 2013

శ్రీ  పింగళి వెంకయ్య గారు  మన జాతి మొత్తం గుర్తుచేసుకొని గర్వించగల మహామనిషి అందులోను ఈయన మన ఆంద్రుడు. ఈయన జన్మ్దదినము ఆగష్టు 2వ తారీకున.వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా మచిలీపట్నము సమీపమున ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు  గ్రామములో హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు.  ఈయన గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాక రూపకర్త .

1916 సంవత్సరం లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు.  లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ, వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం- ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు.  మహాత్ముని సూచనపై కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్యన రాట్నం చిహ్నం గల జాతీయ జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం కోత్త ఆలోచన మీద, సత్య- అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగును కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి అందించారు. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం చిహ్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్పురింప చేస్తుందన్నారు. అంటే కార్మిక కర్షకులపై ఆధారపడిన మన దేశం, సత్యాహింసలపై ఆధారపడటంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.1947జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ , మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నం మాత్రం వదిలి, దాని బదులు అశోకుని ధర్మచక్రం చిహ్నంగా యిమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే శ్రీ పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం. శ్రీ  పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నాడు. వందేమాతరం, హోంరూల్ ఉద్యమం, ఆంధ్రోద్యంలాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రాధాన పాత్రధారిగా ఉన్నాడు.  గాంధీజీ ప్రోద్భలంతో త్రివర్ణపతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. మన జాతికొక పతాకం కావాలని, అదీ ఒక ఆంధ్రుని ద్వారా రూపొందిచడటం , ఆంధ్రులందరికీ గర్వకారణమైన విషయం. .జాతీయ పతాకం రెప రెప ఎగిరినంతకాలం వరకు స్మరించుకోదగిన ధన్యజీవి శ్రీ పింగళి వెంకయ్య . ఆయన జన్మదినము నాడు ఆయన గురించి తెలుసుకొని వివరిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. 
జైహింద్ 

గురువారం, ఆగస్టు 01, 2013

జీన్ బాప్టిస్ట్ లామార్క్

గురువారం, ఆగస్టు 01, 2013

ఫ్రెంచి జీవశాస్త్రవేత్త జీన్ బాప్టిస్ట్ లామార్క్ 1744 ఆగస్టు 1 న జన్మించాడు.
జీవ పరిణామవాదాన్ని మొట్ట మొదట ప్రతి పాదించింది. ఈయనే, ఈయన సిద్దాంతం ప్రకారం మొక్కలు జంతువులు పరిసరాలకు తగినట్లు తమ ఆకారాలు మార్చుకుంటాయని, ఆ మార్పులు వాటి తర్వాత తరాలకు సంక్రమిస్తాయని వివరించాడు. ఆయన సిద్దాంతంలోని 2 ముఖ్య సూత్రాలు ఏమిటంటె
1. ఉపయుక్త, నిరుపయుక్త సూత్రం ఉదాః ఎత్తయిన చెట్ల ఆకులు అందుకోవడాని జిరాఫీ మెడసాచి, సాచి అలా పొడవు పెరిగింది.
2. ఆర్జిత గుణాల అనువంశికతః జీవులు తాము పొందిన లక్షణాలనే తర్వాత తరాలకు అందిస్తాయనేది ఈ సిద్దాంత సారాంశం.

ఉదాః మెడపొడవైన జిరాఫీలు ఆ లక్షణాన్ని తమ తర్వాత తరాలకు అందిస్తాయి.
ఈయన సిద్ధాంతాలు తిరస్కరించబడినా, ఆ తర్వాత డార్విన్ లాంటి జీవపరిణామ సిద్దాంత వేత్తల్లో ఆలోచనలను తండ్రి ఒక మతపరమైన స్కూలులో చేర్పించాడు. లామార్క్ మతసంబంధ విషయాలేమీ రుచించలేదు. మత పాఠశాలను వదిలి, మెలిటరీలో చేరి ఫ్రెంటి సరిహద్దు దళంలో అనేక స్థావరాలలో పనిచేశాడు. ఆ సమయంలోనే ఫ్రాన్స్ లో గల సకల వృక్షజాతుల గురించి, పూర్తిగా అధ్యయనం చేసే అవకాశం లామార్క్ కు లభించింది. లామార్క్ కు చిన్నప్పటి నుండి శాస్త్రం అంటే చాలా ఇష్టం.

సైన్యంలో చేరిన తొమ్మిదేళ్ళకు ఆరోగ్య క్షీణించడంతో మిలటరీకి స్వస్తి చెప్పి బ్యాంకు ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు వైద్య శాస్త్రం రసాయన శాస్త్రం అభ్యసించాడు. జీవపరిణామ సిద్దాంతానికి పునాదులు వేశాడు.
లామార్క్ వ్యక్తి గత జీవితం, పేదరికం, విషాదంతో ముగిసింది. 1829 మరణించాక ఆయన, పుస్తకాలు, సేకరించిన వస్తువులు, గవ్వలు వేలంవేసి ఆ డబ్బుతో దహనక్రియలు జరపాల్సి వచ్చింది..  అతని గురించి తెలుసుకోవటం చాలా సంతోషంగా వుంది. 

ఆదివారం, జులై 28, 2013

తల్లిదండ్రుల పూజోత్సవ శుభాకాంక్షలు

ఆదివారం, జులై 28, 2013

కుటుంబం అంటే సమాజంలోని ప్రాథమిక ప్రమాణం మరియు తల్లిదండ్రులు, పిల్లలు దానికి మూలస్తంభాలుగా వుంటారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శముగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలను గొప్పవారిగా మరియు బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుటకు మరియు  పిల్లల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారు వారి పిల్లలు సౌకర్యవంతమైన జీవితం గడుపుటకు ఎన్నో త్యాగాలు చెయ్యటానికి కూడా వెనుకాడరు.

తల్లిదండ్రులు ఒక గురువుగా, శ్రేయోభిలాషిగా, గురువుగా, అనేక పాత్ర నమూనాలుగా మరియు వారి పిల్లలకు సంరక్షకులుగా ఉంటారు. వారి ప్రేమకు మనము ఏమి చేసినా ఋణం తీర్చుకోలేము.  వారి ప్రేమకు షరతులు ఏమి వుండవు.  వారి పిల్లలు పెరిగి గొప్పవారు అయ్యి మరియు వారు ఎటువంటి కష్టాన్ని అయినా సులువుగా ఎదుర్కొనే సామర్థ్యం కలవారిలా తయారుచేస్తారు.
Parents' Day
వారి రుణం తిరిగి చెల్లించబడుట అనేది సాధ్యం కాదు. ఇంకా పిల్లలు వారి తల్లిదండ్రుల సంరక్షణ కోసం వారి తల్లి-తండ్రి గౌరవించటానికి ప్రతి సంవత్సరం "Parents Day" గా జరుపుకుంటారు. "Parents Day" ప్రతి దేశంలో ఒకే రోజు జరు   పుకొనబడుతుంది,  ప్రపంచంలోని చాలా దేశాలు ఈ  వేడుకను  జూలై నాల్గవ ఆదివారం జరుపుకుంటున్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు మంచి బహుమతులను ఇచ్చి , శుభాకాంక్షలు తెలపాలి. 
తల్లిదండ్రుల పూజోత్సవ  శుభాకాంక్షలు.  

గురువారం, జులై 25, 2013

శ్రీవాణి వీణాపాణీ

గురువారం, జులై 25, 2013


శ్రీవాణి వీణాపాణీ
జయగీర్వాణి శ్రీకల్యాణి

శ్రీవాణి వీణాపాణీ
జయసంగీత సాహిత్యవాణీ
శ్రీవాణి వీణాపాణీ
శ్రీవాణి వీణాపాణీ

రసరమ్య సరచరులోనా
నిను అభిషేకించెద తల్లీ
నీచరణాల పూజింతునమ్మా 
అమ్మ శ్రీవాణి వీణాపాణీ

సాహిత్య శాస్త్రాలలోనా 
వ్యాకరణ సుత్రాలలోనా 
నీతేజంబు కొలువాయనమ్మా 
అమ్మ శ్రీవాణి వీణాపాణీ

శ్రీవాణి వీణాపాణీ
జయసంగీత సాహిత్యవాణీ
శ్రీవాణి వీణాపాణీ
శ్రీవాణి వీణాపాణీ

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)