Blogger Widgets

గురువారం, అక్టోబర్ 31, 2013

ఒక్కొక్క బిందువు కలిస్తేనే పెద్ద మహా సముద్రం

గురువారం, అక్టోబర్ 31, 2013

'బూంద్‌ బూంద్‌ బనేగా సముందర్‌, పైసా పైసా పైదాకరేగా' అనేది హిందీ సామెతలో ఒకటి తెలుగులో ఒక్కొక్క బిందువు కలిస్తేనే పెద్ద మహా సముద్రం తయారు అవుతుంది అని .  ఒక్క రూపాయి అంటుంది నన్ను వంద వరకు పెంచు తరువాత నిన్ను నేను పెంచుతాను అని ఇవన్నీ మీకు తెలిసినవే,  ఇవన్ని పోడుపుగురించి చెప్పటానికే పుట్టినవి. కాలు వంకర పోకుండానే, కంటిచూపు తగ్గిపోకుండానే వీలైనంత కూడబెట్టు అనేదే మన పెద్దలు మనకి వుగ్గుపాలతో నేర్పే మొట్టమొదటి ప్రాథమిక ఆర్థిక సూత్రం. 'సేవ్‌ ఫర్‌ ఎ రెయినీ డే, టు మేక్‌ ఇట్‌ ఆల్‌సో ఎ సన్ని డే' అన్న ఇంగ్లిష్‌ సామెతలో కూడా, పొదుపు యొక్క  ప్రాముఖ్యత తెలుస్తోంది .  ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే  ఈరోజు ప్రపంచ పొదుపు దినోత్సవంగా జరుపుకుంటున్నాం కదా అందుకే మరి .  ఈ పొదుపు దినోత్సవం గురించి చెప్పాలనుకుంటున్నాను.  1924, అక్టోబర్‌ 31వ తేదీన, ప్రప్రథమ ‘ఇంటర్నేషల్‌ థ్రిఫ్ట్‌ కాంగ్రెస్‌’ సమావేశం ముగి సిన వెంటనే, ప్రొఫెసర్‌ ఫిలిప్పో రవిజ్జా ఆరోజుని, ‘వరల్‌‌డ థ్రిఫ్ట్‌ డే’గా సాధికారంగా ప్రకటించారు. సామాన్య పౌరులకి ‘పొదుపు’లోని ముఖ్యత్వాన్ని వివరించడం ఈ ‘వరల్‌‌డ థ్రిఫ్ట్‌ డే’ ముఖ్యోద్దేశం. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా వున్న సేవింగ్స్‌ బ్యాంక్స్‌ అన్నీ ‘వరల్డ్ సేవింగ్స్‌ డే’ని వైభవోపేతంగా జరుపుకోవడం ఆరంభించాయి. ఇప్పుడు ప్రపంచమంతటా ‘ఇంటర్నేషనల్‌ సేవింగ్స్‌ బ్యాంక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌’ కి చెందిన 940 సేవింగ్స్‌ బ్యాంక్స్‌ క్రియాశీల కంగా,నిర్మాణాత్మకంగా పని చేస్తున్నాయి.ఏటేటా, అక్టోబర్‌ 31వ తేదీనాడు, ‘వరల్‌‌డ సే వింగ్స్‌ డే’ / ‘వరల్డ్‌ థ్రిఫ్ట్‌ డే’ జరుపుకునే సందర్భంలో, ప్రపంచమంతటా కొన్ని రిటేల్‌ బ్యాంక్స్‌ వారం రోజుల పాటు, వైభవంగా వు త్సవాలు నిర్వహిస్తూ, ‘పొదుపు’ ప్రాముఖ్య త విషయంలో, ప్రజలలో చైతన్య స్ఫూర్తి కలిగిం చడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అలా, చిన్న చిన్న మొత్తాలతో ‘పొదుపు’ చేసుకోవడ మనే అలవాటుని ప్రజలలో కలిగించాలనే సదాశయం ఈనాటికి ఒక మహోద్యమంగా రూపొంది, ప్రపంచ వ్యాప్తమైపోయింది.  అయితే పొదుపు అనేది అన్ని విషయాలకు వర్తిస్తుంది. విధ్యుత్ ను పోదుపు చేయటం, నీటిని, ఆహారాన్ని,  అనావసరంగా వృదా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. చిన్న పిల్లలకు  పొదుపు యొక్క విశిష్టత చిన్న తనము నుండే అలవారచాలి . ప్రతిమనిషి తను సంపాదించిన దానిలో పూర్తిగా 20% పొదుపు చేసుకోవాలిట.  మరి మీరుకూడా పోడుపుచేయటం మొదలుపెట్టండి మరి .  అందరికి ప్రపంచ పొదుపు దినోత్సవము సందర్భముగా శుభాకాంక్షలు

ఉక్కుమనిషి పటేల్

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేడే 
ఉక్కుమనిషిగా మనకు బాగా తెలిసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875, అక్టోబరు 31న గుజరాత్ రాష్ట్రంలోని నదియాద్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి జవేరిభాయ్ పటేల్ వ్యసాయం చేసేవాడు. తల్లి లాద్ బాయ్. వారికి ఆరుగురు సంతానంలో పటేల్ నాల్గవవాడు. వారిది చాలా పేదకుటుంబం అవ్వటం వలన  పిల్లల్ని చదివించటం చాలా కష్టంగా వుండేది.  వల్లభాయ్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో స్కూల్ చదువు వరకు చదవగలిగాడు. పటేల్ స్కూలులో చదువుతున్నప్పుడు పుస్తకాలు కొనుక్కొనే పరిస్థితి  లేకపోవటం వలన తన  స్నేహితుల దగ్గర పుస్తకాలు తీసుకొని వాటిని పూర్తిగా బట్టి పట్టేవాడు.  ఒక రోజు తన ఉపాధ్యాయుడు నీ పుస్తకం ఏది?" అని అడిగినప్పుడు, ఎంతో ధైర్యంతో "నాకు పుస్తకాలు కొనుక్కొనే స్తోమత లేదు కాబట్టి నోట్సు మాత్రమే రాస్తున్నాను. కానీ టెక్స్ట్ పుస్తకాల్లో ఇంత వరకు జరిగిన పాఠాలు అన్ని నాకు అక్షరం తప్పకుండా గుర్తున్నాయి అని చెప్పాడు. ఆ సమాధానం విన్న ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయి "ఏదీ ఆహార నియమాలు పాఠం చెప్పు చూద్దాం" అని అడిగాడు. అంతే పటేల్ అక్షరం పొల్లు పోకుండా పాఠాన్ని గడగడా అప్పజేప్పేసాడు . అది విని ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు. మెట్రిక్యులేషన్ తరువాత, కాలేజీ చదువులకు స్తోమతలేకపోవటం వల్ల ప్లీడరు పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యి, గోధ్రా అనే చిన్న పట్టణంలో ప్రాక్టీసు ప్రారంబించాడు. ప్రారంభించిన కొద్దిరోజులకే పటేల్ ప్రతిభను అందరూ గుర్తించసాగారు. అతను పట్టిన కేసులు ఓడిపోవటం అంటూ ఎప్పుడూ జరగలేదు. చివరకు ఆంగ్లేయులైన జడ్జీలు కూడా అతని వాదనను విని ముచ్చట పడేవారు.  ఇంగ్లాండులో బారిష్టరు పరీక్ష చదివేనిమిత్తం తనకు ప్రయాణంలో సహాయం చేయమని అర్ధిస్తూ వల్లభాయ్ పటేల్ ఒక ట్రావెల్ ఏజన్సీకి లేఖ రాశాడు. అది చదివిన ఏజన్సీవారు వెంటనే సహాయం చేయటానికి అంగీకరించి లేఖరాశారు. 1913లో బారిష్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై భారతదేశం తిరిగి వచ్చి తన ప్రాక్టీసును మరింత వృద్ది చేసుకున్నాడు. ఆ సమయంలో బొంబాయి చీఫ్ జస్టిస్, సర్ బాసిన్ స్కాట్ పటేల్ ని ప్రభుత్వ సర్వీసులో చేరమని ఆహ్వానించాడు. అయితే దేశాభిమానం మెండుగాగల పటేల్ ఆ ఉద్యోగాన్ని తిరస్కరించి క్రిమినల్ లాయరుగా పేరు ప్రఖ్యాతలు పొందసాగాడు. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోధ్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగామహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. 1917లో మొదటిసారిగా పటేల్ కు గాంధీలోని నిర్మలత్వం, నిరాడంబరత్వం, స్వార్ధరహిత ప్రేమ, దేశాభిమానం పటేల్ ను విశేషంగా ఆకర్షించాయి. భారతదేశంలో వ్యాపారం చేయటానికి వచ్చి, విభజించిపాలిస్తున్న ఆంగ్లేయులను తరిమి కొట్టాలనే ధృఢ నిశ్చయం ఆక్షణంలోనే తీసుకున్నాడు. ప్రజలలోకి చొచ్చుకొనిపోయి, వారి అవసరాలను తీర్చి, సహాయ సహకారాలు అందజేసి, వారిసహాయంతోనే విదేశీయుల్ని వెళ్ళగొట్టవచ్చుననే అభిప్రాయం కలిగి అహమ్మదాబాదు మున్సిపల్ ఎన్నికలలో పోటీచేసి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అనంతరం అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. పటేల్ అధ్యక్షుడిగా నిర్వహణా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన చేసిన సేవల వర్ణనాతీతం. నగరంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించటం జరిగింది అప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలూ వ్యాపారసంస్థలూ అన్నీ మూసేసి ప్రజలు భయబ్రాంతులై ఉన్న సమయంలో పటేల్ ఆరోగ్య అధికారులతో నగరంలోని ప్రతి మారుమూల ప్రాంతంలోనూ తిరిగి ఒక్కరినీ వదలకుండా అందరికీ వైద్యం అందించాడు. రోగుల దగ్గర నిర్విరామంగా గడపటం వలన ఆయనకు కూడా దురదృష్టవశాత్తు ఆ వ్యాధి సోకింది. కొద్ది రోజుల్లోనే ఆయనకు వ్యాధి తగ్గింది.ప్లేగు వ్యాప్తి చెందినప్పుడే కాకుండా, వరదల్లోనూ, కరువుకాటకాల్లోనూ ప్రజలకు అండగానిలిచి వారి అభిమానం చూరగొన్నాడు.  ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధుడు మాత్రమే కాడు, స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సపలుడైన ప్రముఖుడు. 
గాంధీజీతో పాటు అనేక సత్యాగ్రహాలు చేసి సహాయ నిరాకరణోధ్యమాలు నిర్వహించి కారాగారాలు అనుభవించి బ్రిటీషు వారి గుండెల్లో గుబులు కలిగించాడు పటేల్. సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఉధ్యమంలోనూ పాల్గొన్నాడు.  1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్రానంతరం జవహార్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రి గాను, ఉప ప్రధానమంత్రి గాను బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేధించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్దతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది.

బుధవారం, అక్టోబర్ 30, 2013

వారెన్ బఫ్ఫెట్ జన్మదిన శుభాకాంక్షలు.

బుధవారం, అక్టోబర్ 30, 2013

వారెన్ బఫ్ఫెట్  జన్మదిన శుభాకాంక్షలు.
వారెన్ బఫ్ఫెట్  ఒక యు.ఎస్ ముదుపరి, వ్యాపారవేత్త, మరియు లోకోపకారి.  చరిత్రలో విజయవంతమైన ముదుపరులలో ఒకరు, బెర్కషైర్ హాత్అవే కి C.E.O మరియు దానిలో అతిపెద్ద వాటాదారుడు,మరియు సుమారు $62 లక్షల కోట్ల నికర ఆదాయము కలిగి ప్రపంచములోనే అధిక ధనవంతుడిగా 2008 లో ఫోర్బ్స్ పత్రిక చేత పరిగణించబడ్డాడు.
బఫ్ఫెట్ "ఒమాహా సర్వజ్ఞుడు" గా తరుచుగ పిలవబడ్డాడు.లేదా "ఒమాహా రిషి"  గా పిలవబడ్డాడు మరియు విలువైన ముదుపు సిద్దాంతము నకు అంటిపెట్టుకొని ఉండటము మరియు అధిక సంపద ఉండి కూడా పొదుపరిగా ఉండటానికి ప్రసిద్ది చెందాడు. 

ఆదివారం, అక్టోబర్ 27, 2013

సింగర్ కుట్టు మిషను

ఆదివారం, అక్టోబర్ 27, 2013


                          ఐజాక్ మెరిట్ సింగర్ (అక్టోబరు 27 , 1811 - జూలై 23 , 1875మొదటి అమెరికన్ multinational company స్థాపకుడు కుట్టు యంత్రం రూపకర్త ,  నటుడు మరియు పారిశ్రామికవేత్త. ఆయన మనం ప్రస్తుతం ధరిస్తున్న దుస్తులు కుట్టుకొనేందుకు అవసరమైన విశిష్ట ఆవిష్కరన అయిన కుట్టు మిషను ను ఆవిష్కరించాడు. ఈయన సింగర్ కుట్టుమిషన్ల కంపెనీ యొక్క స్థాపకుడు. అనేకమంది సింగర్ మిషను కన్నా ముందుగానే పేటెంట్ హక్కులు పొందారు.   అతను 1811 లో అప్ స్టేట్ న్యూయార్క్లోని జన్మించారు , మరియు యంత్రాలు , థియేటర్ , మరియు మహిళలు ఆసక్తి అభివృద్ధి చేయబడింది - బహుశా ఆ క్రమంలో . అతను , 12 ఏళ్ళ వయసులో ఇల్లు వదిలి బేసి ఉద్యోగాలు పట్టింది , మరియు నాటక నటుల ప్రయాణిస్తున్న బృందంలో ఏర్పాటు . అతను కూడా మహిళల స్ట్రింగ్ తో సంబంధాలు ప్రారంభించారు .
బోస్టన్ లో 1850 లో పెద్ద మనిషి అతనికి కొద్దిగా విజయవంతమైన Lerow మరియు Blodgett కంపెనీ చేసిన ఒక కుట్టు యంత్రం మెరుగుపరిచేందుకు, ఒక సృష్టికర్త వలె తనను తాను  సింగర్ కోరారు. బదులుగా యంత్రం మరమ్మతు , సింగర్ ఫాబ్రిక్ ఆహారంగా అద్దకం అడుగుల ఇన్స్టాల్ ద్వారా పునఃరూపకల్పన . ముఖ్యంగా , కొత్త డిజైన్ దాని చివర సూది పట్టుకొని , worktable విస్తరించి ఒక ఆర్మ్ వంటి ఉపకరణం ఆవిష్కరణతో తక్కువ పోగులు తెగిపోవటం వలన . ఇది చేతితో కుట్టు మొట్టమొదటి ఆచరణాత్మక స్థానంలో , మరియు అది , 40 కుట్లు పడ్డాయి సాధారణ పని ఒక నిమిషం యొక్క ఒక నిష్ణాత కుట్టేది యొక్క ఓవర్ రేటు నాటకీయమైన అభివృద్ధి నిమిషానికి 900 కుట్లు సూది దారం ఉపయోగించు కాలేదు .
మొదటి సింగర్ యంత్రాలు చాలా ఖరీదైన మరియు స్థూలమైన ఉన్నప్పుడు , ఆవిష్కర్త వెంటనే మార్చుకోవటానికి వీలున్న భాగాలుగా యొక్క సామూహిక ఉత్పత్తి వ్యవస్థను తీసుకుంది మరియు పరిమాణం మరియు బరువు యంత్రాలు తగ్గించేందుకు పని . ప్రారంభం నుండి , అతను గృహిణులు అమ్మే లక్ష్యంతో గృహాలు లోకి వాణిజ్య మార్కెట్ గత చూసారు . శుద్ధి తర్వాత , సింగర్ వాటిని సగటు అమెరికన్ కుటుంబం స్థితి మరియు స్వావలంబన యొక్క అందుబాటులో చిహ్నాలు మేకింగ్ , $ 10 ప్రతి తన యంత్రాలు అమ్మగలిగింది . తన భాగస్వామి , ఎడ్వర్డ్ క్లార్క్ , అమ్మకాలు పెరగడానికి దీనివల్ల , వాయిదా కొనుగోలు ప్రణాళికలు మరియు వ్యాపార ఇన్ ముందున్నారు .
సింగర్ దేశవ్యాప్తంగా సేవ నెట్వర్క్ సృష్టించడం , అందమైన దుకాణములు , మరమ్మత్తు మెకానిక్స్ , కుట్టు బోధనా సిబ్బంది, మరియు వేగవంతమైన భాగాలు పంపిణీ అమ్మకాలు మద్దతు . మరియు దాని ఉత్పత్తులను విదేశీ తయారీ విస్తరించింది . 1863 ద్వారా , ఎబెనేజేర్ Butterick అనే దర్జీ దుస్తులు నమూనాలను అమ్మడం ప్రారంభించారు ఉన్నప్పుడు , సింగర్ అమెరికా యొక్క అత్యంత ప్రజాదరణ కుట్టు యంత్రం మారింది . సింగర్ మిషను ప్రయోగాత్మకంగా విజయం సాధించింది. ఈ కుట్టు మిషను ఇంటిలోని కుట్టుకొనుటకు వాడతారు.  SINGER brand has earned the 2013 Women's Choice Award® for America's Best for Home Sewing Machine

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)