Blogger Widgets

శనివారం, ఏప్రిల్ 04, 2015

హనుమాన్ జయంతి.

శనివారం, ఏప్రిల్ 04, 2015

యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్

భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్
 శ్రీ ఆంజనేయస్వామివారు! ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారో అచ్చోట ఆనంద భాష్పాలతో అంజలిఘటిస్తూ! చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్ష మవుతారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం.

అట్టి మూర్తీభవించిన భక్తాగ్రేశ్వరుని "హనుమజ్జయంతి"నాడు శ్రీ స్వామివారికి అష్టోత్తరంతో విశేషపూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా, వంటి పారాయణలు గావించాలి.

శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.
భారతదేశములో ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని విగ్రహరూపంతో ఆలయము లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత ఏమిటో తెలుసుకుందాం!ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షసులకు , దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. ఎల్లప్పుడూ  రామనామ సంకీర్తనా పరుడు హనుమంతడు . 
ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.  ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా! దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా! నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగాకోరెను.అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను. 
ఇక రామాయణ గాధలో సీతాన్వేషణ సమయమందు "శ్రీ ఆంజనేయస్వామి" వారి పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది. నిరంతరము శ్రీరామపాదారవిందములు కొలుస్తూ "శ్రీరామనామజప" మాధుర్యాన్నిగ్రహించి  స్వామిభక్తి పరాయణుడై   వ్యాకరణం పండితుడుగా, నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర కోవిదుడుగా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బుద్ధి పరాక్రమాలు చూపుతూ శ్రీరామ పాదసేవతో వెలుగొందసాగెను. ఈతనిని పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి అను పలు నామాలతో కీర్తిస్తూ ఉంటారు.   కారణజన్ముడైన శ్రీ హనుమంతుడు అంతటి శక్తియుక్తులు కలవాడు కాబట్టి, సీతాన్వేషణలో సఫలీకృతుడై రామ-రావణ యుద్ధసమయములో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించుటకు సంజీవని తెచ్చుటవంటి పలుకార్యక్రమములతో హనుమంతుని యొక్క ఆదర్శవంతమైన స్వామిభక్తి, త్యాగనిరతి, ధైర్య సాహసోపేత కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకుని శ్రీరామునిచే "ఆలింగనభాగ్యము" అందుకున్న భాగ్యశీలి అయినాడు. అంతటి మహత్ భాగ్యము మరి ఎవరికి దక్కుతుందో కదా !.హనుమతుని గురించి చెప్పుకుంటూ పోతే మనకు కాలం తెలియదు.    సరే ఇక మన బ్లాగ్ మిత్రులు అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

గురువారం, ఏప్రిల్ 02, 2015

పదియారువన్నెల బంగారు కాంతులతోడ

గురువారం, ఏప్రిల్ 02, 2015

పదియారువన్నెల బంగారు కాంతులతోడ
పొదలిన కలశాపుర హనుమంతుడు ||


ఎడమ చేతబట్టె నిదివో పండ్లగొల
కుడిచేత రాకాసిగుంపుల గొట్టె
తొడిబడ నూరుపులతో తూరుపు మొగమైనాడు
పొడవైన కలశాపుర హనుమంతుడు ||

తొక్కె అక్షకుమారుని తుంచి యడగాళ్ళా సంది
నిక్కించెను తోక ఎత్తి నింగి మోవను
చుక్కలు మోవపెరిగి సుతువద్ద వేదాలు
పుక్కిటబెట్టె కలశాపుర హనుమంతుడు ||

గట్టి దివ్యాంబరముతో కవచకుండలాలతో
పట్టపు శ్రీవేంకటేశు బంటు తానయె
అట్టె వాయువునకు అంజనిదేవికిని
పుట్టినాడు కలశాపుర హనుమంతుడు

బుధవారం, ఏప్రిల్ 01, 2015

1st ఏప్రిల్ ఫూల్

బుధవారం, ఏప్రిల్ 01, 2015


ఏప్రిల్ 1 ని మనం ఏప్రిల్ ఫూల్ రోజు గా జరుపుకుంటాం.  దీనికి ఒక కధ వుంది.  అది ఏమిటంటే  పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్ లో కూడ సంవత్సరాది మార్చి నెల మధ్యలోనే జరుపుకునేవారు. యూరప్ లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు మరియు వసంత కాలపు ఉత్సవాలు కలిపి ఓ పది రోజుల పాటు వరసగా జరుపుకునేవారు. ఏప్రిల్ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు బహుమానాలు ఇచ్చి పుచ్చుకునేవారు. ఇలా ఎప్పుడూ ఘనంగా జరుపుకునేవారు.  అలావుండగా అప్పటి ఫ్రాంసు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తారీఖుకి మార్చుతూ ఒక నోటీసు జారీ చేసాడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టీవీలు, కంప్యూటర్స్ లేవు. వారు అప్పట్లో దండోరా వేయించి వుంటారు.   కాని రాజు గారి నోటీసు అందరికీ చేరలేదు. అందిన వాళ్ళు కూడ పాత అలవాట్లని వారు మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా కానీ  దేశపు మూలల్లో మాత్రము ఏప్రిల్ 1 న బహుమానాలు ఇచ్చుకోవటంమానలేదు. అందుకని వాళ్ళని ఎగతాళిగా ఏప్రిల్ ఫూల్స్ అనేవారు. పాత అలవాట్లు మనలేక వారు జరుపుకుంటున్నారు కదా. అందుకని ఇప్పటికీ అల్లరిగా బహుమానాలు ఇచ్చుకోవటం, మరియు ఒకరిని ఒకరు ఫూల్స్ చేసుకుంటున్నారు.  అందుకే ఏప్రిల్ 1  ని ఫూల్స్ డే గా జరుపుకుంటున్నారు.  చాలా సరదాకా వుంటుంది.  ఫూల్స్ అయ్యినవారు బాధపడకుండా సరదాగా తీసుకొని ఎంజాయ్ చేయచ్చు.  ఫూల్స్ డే బాగుంది కదండి. 

మంగళవారం, మార్చి 31, 2015

అద్భుతమైన నిర్మాణం ఈఫిల్.

మంగళవారం, మార్చి 31, 2015

The Eiffel Tower on March 31, 1889, the day of its inauguration. (Getty)
విధ్యుత్ కాంతిలో బంగారువర్ణం లో మెరిసిపోతున్న ఈఫిల్ 
పారిస్ అనగానే మనకు టక్ అని గుర్తువచ్చేది ఈఫిల్ టవర్.   ఇది ఒక అద్భుతమైన నిర్మాణం.  దీనిని ఒక కాంట్రాక్టర్, engineer, ఆర్కిటెక్ట్ మరియు గుస్టేవే ఈఫిల్ పేరు షోమ్యాన్లోనూ ఒక అత్యంత ప్రభావవంతమైన ప్రజలు పేరు పెట్టారు.  ఈఫిల్ టవర్ ను  మార్చి 31,1889 న పూర్తి చేసారు.  ఈఫిల్ టవర్ ను  మొదటి 1884 లో యోచించారు. ఈ టవర్ ను నిర్మించడానికి  రెండు సంవత్సరాల రెండు నెలల టైం పట్టింది. ఇది 1887-1889కాలంలో నిర్మించడము జరిగింది.  ఈ ఈఫిల్ టవర్ పైనుండి 59 కిలోమీటర్ల లేదా 37 మైళ్ల చుట్టూ దూరం చూడవచ్చు.  ఈఫిల్ టవర్ 2012 నాటికి 124 సంవత్సరాల నాటిది.  ఈఫిల్ టవర్ annually electricity యొక్క 7.5 కిలోవాట్ గంటలు ఉపయోగిస్తుంది. చాలావరకు ఈ విద్యుత్ బంగారు కాంతి తో పారిస్ ను  విశదపరుస్తుంది.  ఇది ఒక రేడియో ప్రసార టవర్గా మరియు పరిశీలన టవర్గా  ఉపయోగిస్తారు.  

Stephen Sauvestre ఈఫిల్ టవర్ విభాగ ప్రధాన ఆర్కిటెక్ట్ ఉంది. ఈఫిల్ టవర్ నిర్మాణం పని చుట్టూ50 మంది ఇంజనీర్లు, 100 ఇనుము కార్మికులు మరియు 121 నిర్మాణ కార్మికులు పనిచేసారు.    ఈ టవర్ లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు ఏడు సంవత్సరాల కొకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ ను వాడుతారు. భూమి మీద నుంచి చూసే వీక్షకుడికి ఇది సమదృష్టి కోసం మూడు రకాలైన రంగులను ఉపయోగిస్తారు, బాగా ముదురుగా ఉన్న రంగు క్రింద భాగంలోనూ, లేత రంగు టవర్ పైభాగం లోనూ వేస్తారు. ఈఫిల్ టవర్ యొక్క ప్రధాన భాగం ఇనుముఒక వ్యక్తి ఈఫిల్ టవర్ నిర్మాణంలో మరణించాడు.  ఈఫిల్ టవర్కు  ముదురు గోధుమ రంగు పెయింట్  చేస్తున్నారు.  ఈఫిల్ టవర్ ఎత్తు సుమారు 984-990 అడుగుల పొడవు / ఎక్కువ (ఉష్ణోగ్రత మీద ఆధారపడి) లేదా 324 మీటర్ల పొడవైన / ఎక్కువ ఉంది.  ఈఫిల్ టవర్ మెటల్ ఉండటం సుమారు 10,000 టన్నుల, వాటిలో 7.3 వేల బరువుఈఫిల్ టవర్ పెయింట్ కలిగి చేస్తుంది. ఇది ప్రతి 7 సంవత్సరాల కు మళ్ళి పైంట్ వెయ్యాలని ఉంది. 2008 చివరలో,ఈఫిల్ టవర్ 19 సార్లు చిత్రించబడ్డాయి ఉంటుంది.  సుమారు 6.8 మిలియన్ల మంది ప్రతి సంవత్సరం ఈఫిల్ టవర్ సందర్శించుతూ వుంటారు అని ఒక అంచన . ఇది ఒక బిలియన్ ప్రజల క్వార్టర్ మీద దాని సుదీర్ఘ చరిత్ర లో ఈఫిల్ టవర్ వీక్షించేందుకు కలిగి అంచనా.  ఈఫిల్ టవర్ లో 1665 మెట్లు దశలను ఉన్నాయి.  పారిస్ నగరం ప్రస్తుతం ఈఫిల్ టవర్ కలిగి ఉంది.  యాంటెన్నా దీర్ఘ 24 మీటర్లు ఉంటుంది.  ఈఫిల్ టవర్ 108 కథలు ఉండేవి. మరి చరిత్ర చూస్తే ...... ఈ నిర్మాణం 1887 మరియు 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ ద్వారంగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈఫిల్ 1888వ సంవత్సరంలో బార్సిలోనా లో ఈ టవర్ ను నిర్మించాలనుకున్నాడు. కానీ బార్సిలోనా లోని దీనికి సంబంధించిన అధికారులు ఈ నిర్మాణం కొత్తగానూ, ఖర్చుతో కూడుకొన్న పని అనీ నగరం యొక్క డిజైన్ లో సరిపడదని చెప్పారు. తరువాత ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్ లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. తరువాత అక్కడే 1889 లో దీన్ని నిర్మించడం జరిగింది.
మొదట్లో ఈఫిల్ టవర్ ను 20 సంవత్సరాల వరకే ఉండేటట్లుగా ఒప్పందం కుదిరింది.  దీన్ని ప్రకారం 1909లో కూల్చివేయాలి. కానీ అది కమ్యూనికేషన్ అవసరాలకు, మరియు మిలిటరీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుండడంతో అనుమతి ఒప్పందం అయిపోయిన తరువాత కూడా విజయ చిహ్నంగా అలాగే ఉంచారు.  ఈ నిర్మాణం యొక్క నమూనా మన ఆంద్ర ప్రదేశ్ లో యానం లో వుంది.



శుక్రవారం, మార్చి 27, 2015

శ్రీ సీతారాముల కళ్యాణం

శుక్రవారం, మార్చి 27, 2015

శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.  ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.  
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తు(స్తు)ల్యమ్ రామనామ వరాననే
రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రథమనీ పలువురి నమ్మిక. "రామ" నామము లో పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'రా' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.  
రామాయణంలో ధర్మనిరతి, ఉత్తమమైన వ్యక్తులు పాటించవలసిన నీతి ప్రధానంగా కనిపిస్తాయి. సేవకుడు ఎలా ప్రవర్తించాలి, కొడుకు ఎలా నడుచుకోవాలి, తమ్ముడు ఎలా నడచుకోవాలి, రాజు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి - వంటి నియమాలు రామాయణంలో కధాపరంగా వివరింపబడినాయి. మనకు రమాయణం ద్వారా మంచివిషయాలు తెలుస్తాయి. రామాయణము మనకు ఆధర్శంగావుంటుంది కదా.
శ్రీ సీతారాముల కళ్యాణం శుభాకాంక్షలు. 

సోమవారం, మార్చి 23, 2015

ముగ్గురు హీరోలకు వందనం.

సోమవారం, మార్చి 23, 2015

 
నిజమైన ఈ ముగ్గురు హీరోలకు (భగత్ సింగ్, సుఖ్ దేవ్ థాపర్హరి శివరాం రాజ్ గురు) వందనం 
భగత్ సింగ్  (సెప్టెంబరు 281907 –మార్చి 231931స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు.భారత స్వాతంత్ర్యోద్యమమునకు పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులల్లో ఆయన ఒకరు. ఈ కారణంగానే 'షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు'. చరిత్రకారుడు కె.ఎన్. పనిక్కర్ ప్రకారం భగత్ సింగ్,భారతదేశంలో ఆరంభ మార్కిస్టు గా పేరుపొందాడు.
సుఖ్ దేవ్ థాపర్ (15 మే 1907 - మార్చి 23, 1931) భారత స్వాతంత్ర్య సమర, ఉద్యమకారుడు. ఇతను భగత్ సింగ్ మరియు రాజ్‌గురు ల సహచరునిగా ప్రసిధ్ధి.  
హరి శివరాం రాజ్ గురు (ఆగష్టు 241908 - మార్చి 231931) భారత స్వాతంత్ర ఉద్యమ, ఉద్యమకారుడు. మహారాష్ట్ర లోని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతను భగత్ సింగ్ మరియు సుఖ్ దేవ్ ల సహచరునిగా ప్రసిధ్ధి. 
జె. పి. సండర్ 
1928లో భారత్‌లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సభ్యుడిగా ఒక్క భారతీయుడిని కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 30 అక్టోబరు 1928న కమిషన్ లాహోర్‌‌ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలా లజ్‌పత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు.1 సెప్టెం, 2011 - 1929లో లాహోర్‌లో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న 64 ఏళ్ల వృద్ధుడు లాలా లజపతిరాయ్‌పై సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి పాశవికంగా లాఠీచార్జి  చేసారు  దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు అధికారి స్కాట్‌ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్ మరియ సుఖ్‌దేవ్ థాపర్‌లతో ఆయన చేతులు కలిపాడు. స్కాట్‌ను గుర్తించిన జై పాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్‌కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా డీఎస్పీ J. P. సాండర్స్కనిపించినప్పుడు సింగ్‌కు జై పాల్ సంకేతమిచ్చాడు. ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్ హతమయ్యాడు. దాంతో పోలీసుల కంట పడకుండా ఉండటానికి భగత్ లాహోర్‌ పారిపోయాడు. గుర్తు పట్టకుండా ఉండటానికి గడ్డాన్ని గీసుకోవడం, వెండ్రుకలు కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు సింగ్ పాల్పడ్డాడు. 
1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చినందులకు గాను భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన ఈ ముగ్గురు విప్లవకారులు (భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్) లను 1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో సాయంకాలం 7.33 సమయానికి ఉరి తీశారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరి శిక్ష అమలు జరపడం జరిగేది కాదు. వారి మృత దేహాలను రహస్యంగా, జైలు వెనుక గోడలు పగులగొట్టి తీసికొని వెళ్ళిసట్లెజ్ నది తీరాన హుస్సేన్‌వాలా అనే ఊరిలో దహనం చేశారు. మృత దేహాను చూసిన ప్రజలలో అలజడిని ఎదుర్కోకుండా ఇలా చేశారు.

ఆదివారం, మార్చి 22, 2015

జల కల

ఆదివారం, మార్చి 22, 2015

ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి 22, 2014న విశ్వవ్యాప్తంగా పాటించారు. మంచి నీటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియచేసేందుకు యునైటెడ్ నేషన్స్ మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహిస్తుంది. మెరుగైన నీటి వనరుల ఉపయోగం, జల వనరుల సంరక్షణ ప్రపంచ జల దినోత్సవ ముఖ్యోద్దేశం.  భూమిపై మూడొంతుల భాగం నీరు ఆవరించబడి ఉన్నది. ఈ భువిపై ఉన్న ప్రతి ప్రాణి నీరు లేనిదే మనుగడ సాగించలేదు.
భూభాగంలో 70.9 శాతం నీటితో నిండి వుంది. అందులో 86.5 శాతం సముద్రపు నీరు, 1.7 శాతం భూగర్భ జలాలు, 1.7శాతం మంచు రూపంలో ఉంది. అయితే భూమిమీద మొత్తం 2.5 శాతం మాత్రమే మంచినీరు ఉంది. అందులో 0.3 శాతం నదుల్లో, కాలువల్లో ఉంది. 
యునైటెడ్ నేషన్స్, ప్రపంచ జల దినోత్సవాన్ని 1992 యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ (UNCED), రియో డి జెనీరియో సమావేశంలో ప్రతిపాదించింది. దీన్ని 1993వ సంవత్సరం నుంచి నిర్వహించడం ప్రారంభించారు. 
మెరుగైన మంచి నీటి వనరుల నిర్వహణ, ప్రాముఖ్యత పట్ల అవగాహనా కల్పించడంకోసం యునైటెడ్ నేషన్స్ ప్రతి సంవత్సరం మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా జరుపుతుంది.
మనము నీటిని వృదా చేస్తున్నాం , కలుషితం చేస్తున్నాం . ఒకవిధంగా చెప్పాలి అంటే నీటిని విషపూరితం చేస్తున్నాం.  భూమి మీద సమస్త జీవులు నీటిని ఆధారంగానే చేసుకొని జీవిస్తున్నాయి.  మనం నీటిని కలుషితం చేయటం వల్ల  జలచరాలు అనేకమైనవి వాటి ఉనికిని కోల్పోతున్నాయి.  దీనికి అర్ధం కొంతకాలానికి మనకు అదే పరిస్థితి ఎదురవ్వకమానదు.  మనకు నీరు చాలా అవసరం .  నీరు లేకపోతే సమస్త జీవులకు జీవించటమే సమస్య గా మారిపోతుంది . నీరు ప్రకృతి ప్రసాదించిన వరం.  ఇదే ప్రకృతి సహజమైన ఔషధం.  సహజంగానే భూమి మీద నీటి కొరత ఏర్పడింది.  అది అధికమిమచవలెను.  దానికి ఒకే ఒక మార్గం చెట్లను అదికంగా పెంచటమే.  మనం భారతీయులం కావున నీటిని గంగా మాతగా పూజిస్తాం.  హారతులు పడతాం. అలాంటి నీటిని ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.  వృదాచేయకుండా. కలుషితం చేయకుండా.  అనావసరమైన వ్యర్ధాలు నీటిలో కలపకుండా జాగ్రత్త పడాలి.  నీటిని  కాపాడుదాం అలాగే ప్రపంచాన్ని కాపాడుదాం.  ఈరోజు ప్రపంచ జల దినోత్సవాన్ని మంచి ఉద్యమంగా జరుపుకుందాం. 

శనివారం, మార్చి 21, 2015

మన్మదనామ సంవత్సర శుభాకాంక్షలు.

శనివారం, మార్చి 21, 2015

ఉగాది తెలుగు వారి పండుగ ఈ పండుగ తో తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగనే సంవత్సరాధి అని కూడా అంటారు. ఈ సంవత్సరం పేరు  మన్మదనామ సంవత్సరం.  ఉగాది పండుగరోజు ఉదయమునే లేచి, తలంటు స్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు.  ఇంటిని మామిడితోరణాలతో పూలదండలతో అలంకరిస్తారు.  పరగడుపున ఉగాది పచ్చడి తినటం ఈ పండుగ ప్రత్యేకత. ఈ పచ్చడిలో చేదు, పులుపు, ఉప్పు, తీపి , వగరు, కారం అనే ఆరు రుచులు వుంటాయి.  మరి పచ్చడి చెయడానికి  వేప పూత, మామిడి, ఉప్పు, బెల్లం, కారం, చింతపండు వేసి పచ్చడి తయారుచేస్తారు.
ఈ పచ్చడి జీవితంలో మనకు కలిగే తీపి లాంటి సుఖాలను, చేదులాంటి కష్టాలను,సమానంగా అనుభవించాలని తెలుపుతుంది.  ఈ పచ్చడి తినడం ఆరోగ్యానికి కూడా మంచిది.ఈపచ్చడి  వసంతలక్ష్మి కి నైవేద్యంపెట్టి అందరు స్వీకరించి కొత్త సంవత్సరానికి సంతోషంగా ఆహ్వానిస్తారు.ఉగాది రోజు సాయంత్రం గుడి ఆవరణలో పురోహితుడు పంచాంగం వినిపిస్తారు.  రాబోయే సంవత్సర్ ఫలితాలు , పాడి ఫంటలు ఎలా వుంటాయో చెబుతారు. మనకు జరగబోయే మంచి చెడులు చెపుతారు.  దీన్నే పంచాగశ్రవణం అని అంటారు.  ఇది చాలా ఆసక్తికరంగావుంటుంది. ఈ పండుగ ను అందరు ఆనందోత్సాహాలతో  జరుపుకోవాలని కోరుకుంటూ, అందరికి  మన్మదనామ సంవత్సర శుభాకాంక్షలు.                                  

శనివారం, మార్చి 14, 2015

"పై"

శనివారం, మార్చి 14, 2015




గణితం లో వాడే ఒక గుర్తు పేరు 'పై' (22/7). పై యొక్క విలువ 3.14159.... దానిని పురస్కరించుకకుని, గణిత మేధావులు ఈ రోజును పై డే గా జరుపుకుంటున్నారు.  
పై డే ను  ప్రపంచవ్యాప్తంగా మార్చి 14 (3/14) న జరుపుకుంటారు. ఫై (గ్రీకు అక్షరం "π") స్థిరమైన ప్రాతినిధ్యం గణితశాస్త్రంలో ఉపయోగించే గుర్తు - వ్యాసం ఒక వృత్తం యొక్క చుట్టుకొలత నిష్పత్తి - సుమారుగా 3.14159 ఉంది.  
 
పై దాని దశాంశ పాయింట్ దాటి ట్రిలియన్ కంటే ఎక్కువ అంకెలు ఉంటుందని అంచనా వేయబడింది. అనిష్ప మరియు బీజాతీత సంఖ్య, ఇది పునరావృతం లేదా నమూనా లేకుండా అనంతంగా కొనసాగుతుంది. అంకెలు మాత్రమే చూపడంతో సాధారణ లెక్కలు అవసరమైన సమయంలో పై యొక్క అనంతమైన సంక్యగా  దీన్ని గుర్తుంచుకోవలసిన, మరియు గణన మరింత అంకెలు గణించడానికి ఒక సవాలు చేస్తుంది.
 

1706 లో కొద్దిగా తెలిసిన గణిత ఉపాధ్యాయుడు విలియం జోన్స్ మొదటి pi యొక్క ప్లాటోనిక్ భావన, సంఖ్యా పరంగా చేరవచ్చు ఒక ఉత్తమ ప్రాతినిధ్యం చిహ్నంగా ఉపయోగించారు, అయితే ఎన్నడూ. ప్యాట్రిసియా రోత్మన్ జోన్స్ అతని సమకాలీనులు మధ్య ప్రాముఖ్యత మరియు ఆయన వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రత్యేకగా చర్చిస్తుంది.
ఏ సర్కిల్ యొక్క వ్యాసం చుట్టుకొలత నిరంతరం నిష్పత్తి యొక్క చరిత్ర కొలిచేందుకు మనిషి కోరిక అంత ప్రాచీనమైనది; π గుర్తించబడుతున్న ప్రస్తుత ఈ నిష్పత్తి కోసం గుర్తు అయితే (PI) 18 వ శతాబ్దం నుండి ఆరంభమయ్యింది. క్వామ్ కమ్ multiflicetur వ్యాసం, proveniet circumferencia (వ్యాసం ఇది గుణిస్తే ఉన్నప్పుడు, చుట్టుకొలత దిగుబడి ఇది పరిమాణం) లో quantitas: ఈ నిష్పత్తి మధ్యయుగ లాటిన్ లో సూచిస్తారు జరిగింది.
ఇది గొప్ప స్విస్ జన్మించిన గణిత శాస్త్రజ్ఞుడు లియొనార్డ్ ఆయిలర్ (1707-83) సాధారణ వాడుకలోకి π గుర్తును  పరిచయం చేసినట్టు నమ్ముతారు. నిజానికి ఇది మొదటి 1706 లో దాని ఆధునిక అర్థంలో print ఉపయోగించారు.  

Take a look about Albert Einstein

Today is Albert Einstein's birthday.  So take a look about Einstein
Documentary on the Life and Discoveries of Physicist Albert Einstein.


My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)