Blogger Widgets

శుక్రవారం, అక్టోబర్ 02, 2015

"జై జవాన్ - జై కిసాన్ - జై భారత్"

శుక్రవారం, అక్టోబర్ 02, 2015

ఈ రోజు గాంధి గారి పుట్టినరోజు అని మాత్రమే కాదు ఈ రోజు న భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు .   ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న శారదా ప్రసాద్, రామ్‌దులారీ దేవీలకు జన్మించాడు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్ బహదూర్ ను చూసుకొని ఆ తల్లిదండ్రులెంతో మురిసిపోయారు.  ఈయన నినాదం "జై జవాన్ - జై కిసాన్ - జై భారత్".  శాస్తిగారు మంచి మనసుతో దేశాభివృద్ది కోసం పోరాడిన మహామనీషి, అంతేకాదు గొప్ప స్వాతంత్ర్య సమరయోదుడు,  అస్సలు గర్వంలేకుండా అందరి మనస్శులు గెలిచిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్తిగారు. గాంధిగారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలోను , సత్యాగ్రహము లోను పాల్గొనుటకు ఉత్సాహంగా వుండెవారు . అప్పుడు జైల్లోకూడా స్వాతంత్ర్యము తర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశాడు.
స్వాతంత్ర భరత దేశానికి నెహ్రు మొదటి ప్రదాని , నెహ్రు తరువాత లాలబహదుర్ శాస్త్రిగారు రెండవ ప్రదాని గా ప్రమాణ స్వీకరము చేసారు.
ఆయన. 1965 యుద్ధంలో పాకిస్తానును కాళ్ళబేరానికి తీసుకువచ్చాడు. తాష్కెంటు లో పాకిస్తానుతో సంధి చర్చలకు వెళ్ళినపుడు 1966 జనవరి 11 న గుండెపోటుతో మరణించాడు. మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది. 
లాల్ బహదుర్ శాస్త్రి గారి జన్మదినము సందర్బముగా నివాళి అర్పిద్దాం మరి. 

అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం.

ప్రపంచ అహింసా దినోత్సవం (లేదా అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ఆంగ్లం: International Day of Non-Violence) గా మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబరు 2వ తేదీని పాఠిస్తారు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 21869 - జనవరి 301948) భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యముఅహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.  20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నికగన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ఈ రోజుని ప్రపంచ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి జూన్ 15, 2007న అమోదించింది. గాంధీ అహింసా మార్గాన్ని అనుసరించి అనేక ఉద్యమాలను నడిపాడు సత్యాగ్రహము పాటించాడు. గాంధీ అహింసా మార్గాన్ని అనుసరించి అనేక ఉద్యమాలను నడిపాడు సత్యాగ్రహం అంటే సత్యం కోసం జరిపే పోరాటం. అహింస మూలధర్మంగా, సహాయ నిరాకరణ మరియు ఉపవాసదీక్ష ఆయుధాలుగా చేసే ధర్మపోరాటమే ఈ సత్యాగ్రహం. గౌతమ బుద్ధుడు ప్రవచించిన "అహింసా పరమోధర్మ:" అన్న సూత్రం, యేసు క్రీస్తు అన్నట్టు, "ఒక చెంప పై కొడితే మరో చెంప చూపమన్న" ఆలోచనా ధృక్పథం దీనిలో కనిపిస్తాయి. సత్యం కోసం రాజీ లేని పోరాటమే సత్యాగ్రహం. సాంప్రదాయ పద్దతిలో జరిగే హింసాయుత లేదా అహింసాయుత పోరాటంలో ప్రత్యర్థిని ఓడించడం, లేదా ప్రత్యర్థి తన లక్ష్యాన్ని చేరుకోకుండా నిరోధించడం, లేదా ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కల్పించినా తాము కోరుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అన్నవి ముఖ్యాంశాలు. కానీ సత్యాగ్రహ విధానంలో తప్పు చేసే వారిని బలవంతంగా ఆపకుండా వారిలో మార్పును తీసుకురావడం ముఖ్య లక్షణం.
బాపూజీ చూపిన సత్యం, అహింస మార్గాలు భావితరాలకు బంగారు బాటగానిలచాయి. సత్యాగ్రహ్నా ఆయుధంగా చేసుకొని  బాపూజీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని  గడగడలాడించడంతో భారత దేశాకి స్వాతంత్య్రం లభించింది. కాగా ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే రక్తపాత రహితంగా ఒక సుదీర్ఘ పోరాటం ఫలితంగా స్వాతంత్ర్యాన్ని పొందిన ఘనత కేవలం భారతదేశాకి మాత్రమే దక్కుతుంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన గాంది  తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన స్ధానాన్ని సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. ఐక్యరాజ్య సమితి కూడా మహాత్మడి జన్మదినోత్సవ్నా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించడం భారతీయులకు ఎంతో గర్వ కారణం.  
అహింసా అంటే ఒక జీవిని చంపడం, ఒకరికి ఇష్టము లేని కార్యాన్ని బలవంతంగా చేయించి, తద్వారా దుఃఖాన్ని కలిగించడం, మనోవాక్కాయ కర్మలచేత బాధ కలిగించడం హింస. సర్వకల సర్వావస్థలలో ఇతర ప్రాణికి ఏ రకమైన కష్టాన్ని కలిగించకుండా ఉండడం అహింస. 
హింస మూడు రకాలు: మానసిక హింస, వాచిక హింస మరియు కాయిక హింస. 
పరులకు హాని తలపెట్టడం, మనో నిగ్రహం లేకపోవడం, పాపభీతి లేకుండా ప్రవర్తించడం అనేవి మానసిక హింస. అసత్యాన్ని పలకడం, అహితముగా లేదా కఠినంగా మాట్లాడడం వాచిక హింస. 
ఒక జీవిని చంపడం, గాయపరచడం, దుష్క్రియలచేత పీడించడం, పరస్త్రీ సహవాసం, పరధనాపహరణం, మాంస భక్షణ కాయిక హింస అనబడతాయి.

అహింసా పరమో ధర్మః అహింసా పరమం తపః
దయా సమం నాస్తి పుణ్యం పాపం హింసా సమం నహి.

"జీవో జీవస్య జీవనమ్" - అనగా ఒక జీవి మరొక జీవిని చంపి తనడం జంతు ప్రవృత్తి.

అహింస, సత్యం, కోపము లేకపోవడం, మృదుస్వభావం, సిగ్గు, చాపల్యం లేకపోవడం,తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం, అభిమాన రాహిత్యం దైవ గుణ సంపద, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, యశస్సు మొదలైన భావాలు దైవం వల్లనే కలుగుతాయి.ధర్మాలు అన్నింటిలో అహింస శ్రేష్ఠమైన ధర్మం. భూతదయను మించిన పుణ్యం, హింసను మించిన పాపం లేదని వేదోపనిషత్తులు చెబుతున్నాయి.
అహింస మహావిష్ణువునకు ప్రీతికరమైన ఎనిమిది పుష్పాలలో మొట్టమొదటిది. అహింస, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, సహనం, శాంతం, తపస్సు, ధ్యానం,సత్యం అనేవి ఈ ఎనిమిది పుష్పాలు.  ఈ ఎనిమిది కలిగినవారు చాలా గోప్పవారవుతారు.  ఏది అయినా సరే సాధించగలరు. అలా సాధించి చూపినవాడు మహాత్మా గాంది.  గాంధీగారి జన్మదినము సందర్బంగా ఆయనకు మనస్పూర్తిగా నివాళి అందిస్తూ.  అంతర్జాతీయ సత్యాగ్రహ మరియు అహింసాదినోత్సవ శుభాకాంక్షలు. 
జై హింద్ 

బుధవారం, సెప్టెంబర్ 30, 2015

చాలు చాలు నీ జాజర

బుధవారం, సెప్టెంబర్ 30, 2015


చాలు చాలు నీ జాజర నన్ను జాలి బరచేనీ జాజర

వలపు వేదనల వాడెమ యీ తలనొప్పుల చే దలకేను
పులకల మేనితో బొరలేను కడు జలిగొని చల్లకు జాజర

ఒల్లని నినుగొని వుడికేను నీ చిల్లర చేతుల జిమిడేను
కల్లగంద వొడిగా గేనుపై జల్లకు చల్లకు జాజర

తివిరి వేంకటాధిప నేను నీ కవుగిట కబ్బితిగడు నేను
రవరవ చమట గరగినేడు యిదె చవులాయెను నీ జాజర

మంగళవారం, సెప్టెంబర్ 22, 2015

'గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా '

మంగళవారం, సెప్టెంబర్ 22, 2015

మనలో దాదాపు అందరికి తెలుసు  గ్రేట్ వాల్ ఆఫ్  చైనా, కానీ మన భారతదేశం కూడా ఒక  'గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ', ఉంది అని ఎంతమందికి తెలుసు.   చాలా తక్కువమందికే తెలుసు అనుకుంటున్నా.  ఇది ఒక కోట చుట్టూ రక్షణ కోసం కట్టబడింది.  దీనిపేరు కుంభాల్ ఘర్ ప్రాంతం వెలుపల గోడగా వుంది.  ఈ గోడ 36 kms విస్తరించింది, మరియు
ఛాయాచిత్రాలను ద్వారా వీక్షించవచ్చు .  దీనిని అందరు  గ్రేట్ వాల్ ఆఫ్ చైనాగా  పొరబడుతుంటారు. అయితే, Kukbhalgarh లో స్థానాలు మరియు సంస్కృతులను బట్టి అనేక శతాబ్దాల తరువాత  రెండు వేరు వేరు అని  1443 లో తెలుసుకున్నారు .  రాణా కుంభ రాజస్థాన్ ఆప్రాంతపు  మహారాజు మహారాణా వారి రాజ్యం చుట్టూ మరియు కొండ మీద తన కోటను ఎక్కువగా  రక్షించడానికి ఉద్దేశించి ఈ గోడ కట్టమని ఆదేశించింది, సముద్ర మట్టానికి సుమారు 1000 మీటర్ల ఎత్తులో నిర్మించారు.
 ఇది 19వ శతాబ్దంలో విస్తరింపబడిఉంది మరియు ఆ స్థానం ఇప్పుడు మ్యూజియంగా కొనసాగుతోంది.   ఆ గోడకు  ఏడు ముఖద్వారాలు కలిగివున్నాయి.  కొన్ని ప్రదేశాల్లో పదిహేను అడుగుల వెడల్పు కలిగివుంది.  Kubhalgarh నివాసులు, సారవంతమైన భూమిని కలిగివున్నారు. 
ఈ గోడల వెనుక పై భాగాన  360 దేవాలయాలు కలిగివున్నాయి.  హిందూమతం, బౌద్ధమతం మరియు జైనమతం కు చెందిన  దేవాలయాలు కలిగివున్నాయి. ఇవి కూడా వారికి రక్షణగా వున్నాయి.
  ఆరాజు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, గోడ ఒక కారణం వలన పూర్తి కాలేదు. రాజు స్వచ్చందముగా మరణించటం తో గోడలో కొంత ప్రదేశం కూలిపోయింది.





దానినిర్మాణము  నిలిపివేయబడింది,  అయితే ఈ ప్రదేశం ను పర్యాటకులు సందర్శించడం కోసము మ్యుజియంలా వుంచారు.   చరిత్రకు ఈ అందమైన స్మారక కట్టడంగా వుండిపోయింది. అయితే ఇప్పటికీ  ఇది ఒక రహస్యముగా వుండిపోయింది.  ఆ గోడ ఎందుకు కట్టడం ఆగిపోయిందో?

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)